31 Jan 2012

glance







 navayuva

Pageviews by Countries
     
India
1,849


United States
671

Russia
191

Germany
18

Latvia
16

Malaysia
6

Sweden
5

Indonesia
3

Brazil
2

Chile
1
Saudi Arabia
1
New Caledonia                                                                                                            1
 
Malta
1
Thailand
1
Italy
1
Iraq
1
France
1
    

25 Jan 2012

awesome flowers


పువ్వు...అపూర్వం. ఓ అనిర్వ‌చ‌నీయ ఆనందం.. ఆ సుగంధం మైమ‌ర‌పించే సుమ‌ధురం. చూడ‌గానే పుల‌కించ‌నిదెవ‌రు? అటువంటి ప‌రిమ‌ళాన్ని ఆస్వాదించ‌ని వారుంటారా? ప్ర‌పంచంలో అతి పెద్ద‌వి..అతి చిన్న‌వి ఏవైనా మ‌న‌ల్ని సంభ్ర‌మ‌ప‌రిచేవే. ఆ కోవ‌లోనివే ర‌ఫ్లేసియా అర్నాల్డీ, అమెర్ఫాఫ‌ల‌స్ పుష్పాలు. ర‌ఫ్లేసియా అర్నాల్డీ భూమ్మీద అతిపెద్ద పువ్విది.ఇండోనేసియా జాతీయ పుష్పం కూడ‌.ఒక‌రకంగా ఇదో అడ‌వి పువ్వు.ఇండోనేసియా, మ‌ల‌య‌,బెర్నొయ్‌,సుమ‌త్రా,ఫిలిప్పీన్స్ అడ‌వుల్లో మాత్ర‌మే ఈ పువ్వులు విస్తారంగా క‌నిపిస్తాయి. ఇదో ఎండెమిక్ ఫ్ల‌వ‌ర్‌.దీనికి మ‌రో పేరు కార్ప్స్ ఫ్ల‌వ‌ర్‌.ఏకంగా 3 అడుగుల‌(90 సెంటీమీట‌ర్లు)మేర పెరుగుతుంది.బ‌రువు 11 కిలోల‌కు పైమాటే.పుష్పించాక అంతే గాఢ‌మైన సుగంధాన్ని వెద‌జ‌ల్లుతుంది.ఈ పువ్వు కొద్దీ రోజుల్లోనే భారీత‌నాన్ని సంత‌రించుకుంటుంది.పుష్పించ‌డం మొద‌ల‌య్యే ద‌శ‌లో దీని ప‌రిమాణం కేవ‌లం 0.08 అంగుళాలు మాత్ర‌మే. ఈ ముదురు ఎరుపు రంగు ర‌ఫ్లేసియాకు ఇత‌ర పూల మొక్క‌ల్లా ఆకులు,కాండం,కొమ్మ‌లు వ‌గైరాలుండ‌వు.నేల‌పై ప‌రుచుకున్న తీగ‌ల‌పైనే ఈ భారీ పువ్వులు పుష్పిస్తాయి.ఈ పువ్వు ప‌రిమ‌ళం కూడా చాలాకాల‌మే ఉంటుంది.ప్ర‌స్తుతం ఈ పువ్వుల్ని ప్ర‌పంచ ప్ర‌సిద్ధ బొటానిక‌ల్‌,నేష‌న‌ల్ పార్క్‌ల‌న్నింటిలోనూ చూడొచ్చు.
ప్ర‌కృతి అందానికి వ‌న్నెల‌ద్దే వాటిలో మొక్క‌లు,చెట్ల‌దే ప్ర‌థ‌మ‌స్థానం. స‌క‌ల జీవ‌కోటికి స్వ‌చ్ఛ‌మైన ఆక్సిజ‌న్ ఇంకా అందుతుండ‌డానికి ఇవే కార‌ణం.ముఖ్యంగా ప‌గ‌టి వేళ‌ల్లో ఇవి కార్బ‌న్‌డ‌యాక్సైడ్‌ను స్వీక‌రించి ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేయ‌డ‌మ‌నే మ‌హోప‌కారాన్ని విస్మ‌రించ‌లేం క‌దా.
అతి పొడ‌వైన పువ్వు: చెట్ల‌ను త‌ల‌పించే మొక్క‌లు వాటికి భారీ పువ్వులు,పొడ‌వైన పుష్పాలు ఇలా అనేక ర‌కాలు ప్ర‌పంచంలో చాలానే ఉన్నాయి.ర‌ఫ్లేసియా అర్నాల్డీకి పూర్తి భిన్న‌మైన‌ది అమెర్ఫాఫ‌ల‌స్(టైట‌న్ అర‌మ్‌).ఇది ప్ర‌పంచంలోనే అతి పొడ‌వైన పువ్వు.దాదాపు 10 అడుగుల ఎత్తుకు ఎదుగుతుంది.రోజుకు ఈ పువ్వు నాలుగు నుంచి 20 సెంటీమీట‌ర్ల ఎత్తు పెరుగుతుంది.ఏకంగా 50 కిలోల బ‌రువు తూగుతుంది.ఈ పువ్వులో క‌నిపించ‌ని రంగే ఉండ‌దు.ఎరుపు,తెలుపు,ఆకుప‌చ్చ‌,ప‌సుపు వ‌ర్ణాల స‌మాహారంగా భారీ ఆకారంతో వారెవ్వా అనిపిస్తుంది.అయితే ఈ పువ్వు రెండు మూడు రోజుల‌కే వాడిపోతుంది.ఈ పువ్వు వెన్నంటి ఉండే ఆకులూ చాలా పెద్ద‌గా ఉంటాయి.ఎంతంటే 20 అడుగుల మేరంటే ఆశ్చ‌ర్య‌మేగా.ఈ మొక్క ఆకులు ఏడాదికోసారి రాలిపోతాయి.మ‌ళ్లీ నాలుగు నెల‌ల్లోగా కొత్త ఆకులు మొలుస్తుంటాయి.మీజ్‌లో గ‌ల బెల్జియ‌న్ బొటానిక్ గార్డెన్స్‌కు వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌కు ఈ పువ్వు ఓ క‌నువిందే.లండ‌న్‌లోని రాయ‌ల్ బొటానిక‌ల్ గార్డెన్స్‌లో ఈ పువ్వులు 100 వ‌ర‌కు ఉండ‌డంతో జనం వీటిని చూసి పుల‌కించిపోతుంటారు.బాన్‌(జ‌ర్మ‌నీ)లోని బొటానిక‌ల్ గార్డెన్స్‌లో 2003లో ఈ పువ్వు 8అడుగుల 11 అంగుళాల ఎత్తుకెదిగి గిన్నీస్‌బుక్ రికార్డుల‌కెక్కింది.2005లో  జ‌ర్మ‌నీలోని స్ట‌ట్‌గార్ట్‌లోగ‌ల బొటానిక‌ల్ అండ్ జులాజిక‌ల్ గార్డెన్స్‌లో ఉన్న ఈ జాతి పువ్వు 9 అడుగుల 6 అంగుళాల ఎత్తుతో అంత‌కుముందు న‌మోదైన‌ రికార్డును బ‌ద్ద‌ల‌కొట్టింది.
భారీ పువ్వులు,మొక్క‌లు:కొరిఫా అంబ్ర‌కులిఫెర‌(ట‌లిపాట్ పామ్‌)-ప్ర‌పంచంలోనే అతి పెద్ద కాండం గ‌ల మొక్క‌.శ్రీ‌లంక దీని స్వ‌స్థ‌లం.స్ట‌పెలియా(స్టార్ ఫ్ల‌వ‌ర్‌),స్ట‌పెలియా లెప‌డ్‌-ద‌క్షిణాఫ్రికా),హైడ్నొర ఆఫ్రిక‌న-జాంబియా, హెలికొడై సెర‌స్ మ‌స్విర‌స్‌(డెడ్ హార్స్ అర‌మ్ లిలీ),డ్రాక‌న్‌క్యూల‌స్ వ‌ల్గ‌రిస్‌(వుడు లిలీ).

14 Jan 2012

bullet trains

http://royalloyal007.blogspot.in/2011/09/yuvottama.html
(you can see other posts from this blog, go through with mozilla firefox/google chrome)
స్పీడ్ యుగం.. విమానాల‌తో పోటీ ప‌డుతూ నేల‌పైనున్న ప‌ట్టాల‌పై వాయువేగాన్ని త‌ల‌పించేలా  రైళ్లు ఇప్పుడు ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో  దూసుకుపోతున్నాయి. రోజుకు 24 గంట‌ల స‌మ‌యం జ‌నానికి స‌రిపోవ‌డం లేదు.అంతా కాలంతో పోటీప‌డుతున్న‌ట్లుగా చ‌క‌చ‌కా ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటున్న త‌రుణ‌మిది. అందుకు అనుగుణంగా రైళ్ల‌ను తీర్చిదిద్దే ప‌నిలో సంపన్న దేశాల‌తోపాటు వ‌ర్ధ‌మాన‌ దేశాలు ప్ర‌ణాళిక‌ల‌ల్లుతున్నాయి. బుల్లెట్ ట్రైన్స్‌కు పెట్టింది పేరు జ‌పాన్‌. ఆ దేశం ప్ర‌పంచంలోనే తొలి సూప‌ర్‌ఫాస్ట్ ట్రైన్‌ను విజ‌య‌వంతంగా న‌డిపి త‌మ దేశ‌వాసుల‌కు అందుబాటులోకి తెచ్చింది. భార‌త్‌లోను 2012 నుంచి ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ఊపందుకుంటున్నాయి. దేశంలో ఆరు మార్గాల్లో వివిధ విదేశీ రైల్ క‌న్సార్టియంల స‌హ‌కారంతో బుల్లెట్ ట్రైన్స్ ప‌ట్టాల‌కెక్క‌నున్నాయి. హైద‌రాబాద్‌-చెన్నై,చెన్నై-తిరువ‌నంత‌పురం,ఢిల్లీ-పాట్నా,ఢిల్లీ-అమృత‌స‌ర్‌,అహ్మ‌ద‌బాద్‌-పూణె,హౌరా-హ‌ల్దియాల మ‌ధ్య బుల్లెట్ ట్రైన్స్ న‌డ‌పాల‌ని భార‌తీయ రైల్వేలు ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్నాయి.
వ‌ర‌ల్డ్‌లో అలుపెర‌గ‌కుండా యంత్రాల్లా ప‌నిచేసే శ్ర‌మ జీవుల గురించి ప్ర‌స్తావించాలంటే ముందుగా జ‌పానీయులనే చెప్పాలి.మేమ‌యినా త‌క్కువా అని స‌వాలు చేసే నైజం చైనీయుల‌ది.సాధ‌న శోధ‌న‌ల క్ర‌మంలో చైనా నేడు ప్ర‌పంచంలోనే అత్యంత వేగ‌వంతమైన లాంగ్ ట్రాక్‌తో సూప‌ర్‌ఫాస్ట్ ట్రైన్‌ల‌ను న‌డుపుతూ రికార్డు సృష్టించింది.
జ‌పాన్ వ‌ర్సెస్ చైనా:విశ్వ‌వ్యాప్తంగా నేడున్న జ‌నాభాలో నాల్గోవంతు వాటా చైనాది.ఇక భార‌త్‌తో క‌లుపుకుంటే మొత్తం ప్ర‌పంచ జ‌నాభాలో దాదాపు స‌గం వంతు మంది ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు.అందుకే పెరుగుతున్న జ‌నాభా వారి ప్ర‌యాణ అవ‌స‌రాల్ని తీర్చాలంటే వేగ‌వంత‌మైన రైళ్లే ఏకైక మార్గ‌మని చైనా భావించి 2007 నుంచి బుల్లెట్ రైళ్ల‌ను న‌డుపుతోంది.బీజింగ్‌,షాంఘై మ‌ధ్య ఈ రైళ్లు దూసుకుపోతున్నాయి.కేవ‌లం రెండేళ్ల‌లోనే ఆదేశంలో సుమారు 40 కోట్ల మంది వాయువేగ‌ రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డం గ‌మ‌నార్హం.ఇత‌ర రైలు ట్రాక్‌ల‌కు భిన్న‌మైన‌వి బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌లు.ఈ ట్రాక్‌ల‌పై మాగ్న‌టిక్ లెవిటేష‌న్ సాంకేతిక ప‌రిజ్ఞానంతో బుల్లెట్ ట్రైన్స్ ప్ర‌యాణిస్తుంటాయి.గంట‌కు 500కిలోమీట‌ర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్స్ న‌డ‌పాల‌న్న‌దే వారి ల‌క్ష్యం.ఈ2-1000 సీరిస్‌లో సిఆర్‌హెచ్2,700టి.ల‌ను ఆ క్ర‌మంలోనే అభివృద్ధి ప‌రిచారు.అయితే అతివేగం ఎప్పుడూ అన‌ర్థ‌దాయ‌క‌మేన‌న్నది నిజ‌మ‌న్న‌ట్లుగా చైనాలో సూప‌ర్‌ఫాస్ట్ ట్రైన్స్ ఢీకొన్న దుర్ఘ‌ట‌న‌లో 40మంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి.దాంతో మ‌రిన్ని సూప‌ర్‌ఫాస్ట్ రైళ్ల‌ను అభివృద్ధి ప‌రిచే విష‌యంలో చైనా ఇప్పుడు సందిగ్ధంలో ప‌డింది.భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని వాయువేగ‌పు రైళ్ల‌ను న‌డ‌పాల్సిన అవ‌స‌ర‌మేది త‌మ‌కు లేద‌ని సిఎస్‌ఆర్ చైర్మ‌న్ జుహ‌జియోంగ్ ఆ నేప‌థ్యంలోనే ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.
యూర‌ప్ ఛాలెంజ్‌: బుల్లెట్ ట్రైన్స్ ఒర‌వ‌డి ఉర‌వ‌డి మాకే చెల్లు అనే రీతిలో జ‌పాన్ 2003లోనే గంట‌కు దాదాపు 500 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ ట్రైన్‌ను ట్ర‌య‌ల్ ర‌న్‌గా న‌డిపి రికార్డు సృష్టించింది.టోక్యో-న‌గొయ‌-ఒసాకాల మ‌ధ్య ఈ మాగ్లివ్ ట్రైన్ లైన్ ప్రాజెక్టును 2027 నాటికి త‌మ దేశీయుల‌కు అందుబాటులోకి తేవాల‌ని జ‌పాన్ స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సుమారు 112 బిలియ‌న్ డాల‌ర్ల‌ను వెచ్చించ‌ద‌లిచింది.ఇప్ప‌టికే జ‌పాన్‌లో నిత్యం దాదాపు నాలుగు ల‌క్ష‌ల మంది బుల్లెట్ ట్రైన్ల‌లో ప్ర‌యాణిస్తున్నారు. యూర‌ప్‌,అమెరికా,ర‌ష్యాల్లోనూ బుల్లెట్ ట్రైన్స్ హ‌వా కొన‌సాగుతోంది. చైనాలో మాదిరిగానే 2007 నుంచే తైవాన్,ట‌ర్కీ స‌హా యు.కె, ఫ్రాన్స్‌, బెల్జియం, ఇట‌లీ, స్సెయిన్‌,జ‌ర్మ‌నీ ,నెద‌ర్లాండ్స్ త‌దిత‌ర బుల్లెట్ రైళ్లు విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయి.
తైవాన్‌లో కౌసిఅంగ్‌,తైపీల మ‌ధ్య బుల్లెట్ ట్రైన్ గంట‌కు దాదాపు 350 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకుపోతోంది. ట‌ర్కీ,సౌత్ కొరియాల సంయుక్త ప్రాజెక్టుగా ఈ వాయు వేగ రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ర‌ష్యాలో 2002 చివ‌రి నుంచే మాస్కో,సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌ల న‌డుమ బుల్లెట్ ట్రైన్‌ను ప్రారంభించింది. యు.కెలో అండ‌ర్‌ గ్రౌండ్‌లోనూ ఈ వాయువేగ రైళ్లు న‌డుస్తుండ‌డం విశేషం. అయితే ఈ రైళ్ల వేగంతోపాటు భ‌యంక‌ర ప్ర‌మాదాల‌ను రుచి చూపిస్తున్నాయి. జ‌ర్మ‌నీలో 2004లో హైస్పీడ్ ట్రైన్ ఇలాగే ప్ర‌మాదం బారిన‌ప‌డి 25 నిండు ప్రాణాలు బ‌ల‌య్యాయి.
టాప్‌-5 బుల్లెట్ ట్రైన్స్‌:*సిఆర్‌హెచ్‌380ఎ-చైనా-487.3 కిలోమీట‌ర్ల వేగం,*టి.ఆర్‌-09-జ‌ర్మ‌నీ-450 కి.మీ.వేగం,*షింకన్‌స‌న్‌-జ‌పాన్‌-443 కి.మీ. వేగం,*టి.జి.వి రెసెవ్‌-ఫ్రాన్స్‌-380 కి.మీ.వేగం,*కె.టి.ఎక్స్‌2-సౌత్ కొరియా-352 కి.మీ.వేగం

12 Jan 2012

Tussad Museum

కొంద‌రు వ్య‌క్తులు..వారి పేర్లు,రూపాల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నే ఉండ‌దు. వారు క‌నిపించినా, వినిపించినా జ‌న‌సామాన్యం ఉర్రూత‌లూగిపోతుంది. వారి చ‌రిత్ర,గొప్ప‌త‌నం వివ‌రాలు అనేక‌ మందిలో గిర్రున తిరిగి గుర్తొచ్చేస్తాయి. అత్యంత ప్ర‌భావ‌శీలురైన సెల‌బ్రెటిలే వారు. అటువంటి ప్ర‌త్యేక వ్య‌క్తుల్ని ముమ్మూర్తులా పోలిన మైన‌పు బొమ్మ‌ల కొలువే ప్ర‌పంచ ప్ర‌సిద్ధ ప‌ర్యాట‌క స్థ‌లం టుస్సాడ్ మ్యూజియం. లండ‌న్‌లో బెకెర్ స్ట్రీట్‌లో నెల‌కొందిది. దీన్ని రూపొందించింది ఓ స్త్రీ.రోల్‌మోడ‌ల్ వ్య‌క్తుల న‌మూనాల రూప‌క‌ల్ప‌న ఆమె హాబీ.అలా మొద‌లై 1835లో టుస్సాడ్ మ్యూజియంగా పేరొందింది. ఈ మ్యూజియానికి అంకురార్ప‌ణ చేసిన మేరి టుస్సాడ్‌(అన్నా మ‌రియా గ్రోషాల్జ్‌-ఫ‌స్ట్ నేమ్‌)1761లో స్ట్రాస్‌బ‌ర్గ్‌, ఫ్రాన్స్‌లో జ‌న్మించింది. 1777లో తొలిసారిగా వొల్టైర్ ప్ర‌తిమ‌ను తీర్చిదిద్దింది. అదే స‌మ‌యంలో జీన్‌జాక్వెస్ రొజేవ్‌, బ్రెంజిమ‌న్ ఫ్రాంక్లిన్ ప్ర‌తిమ‌ల‌కు వ‌రుస‌గా రూప‌క‌ల్ప‌న చేసింది. ఫ్రెంచ్ విప్ల‌వం సంద‌ర్భంగా ఆ చ‌రిత్ర‌కు ద‌ర్ప‌ణం ప‌ట్టేలా అనేక‌మంది యోధులు, బాధితుల బొమ్మ‌ల‌ను రూపొందించింది. ఫ్రాంకియ‌స్ టుస్సాడ్‌ను 1795లో వివాహ‌మాడిన ఆమె లండ‌న్‌లో స్థిర‌ప‌డింది.ఆ త‌ర్వాత వంద‌ల మంది ప్ర‌ముఖుల రూపాల‌ను బొమ్మ‌ల‌తో పునఃప్ర‌తిష్ట చేసింది. 1850లో ఈ లేడీ టుస్సాడ్ మ‌ర‌ణించే వ‌ర‌కు ఎంద‌రో ప్ర‌ముఖుల ప్ర‌తిమ‌లు అలాగే జీవ‌క‌ళ‌తో ఆమె చేతుల్లో ప్రాణం పోసుకున్నాయి.
స్లీపింగ్ బ్యూటీ: టుస్సాడ్‌ మ్యూజియంలో మేడ‌మ్ డుబెరి ప్ర‌తిమ ప్ర‌త్యేక‌మైన‌ది.లూయిస్‌-15 స‌తీమ‌ణి అయిన బెరి నిద్రిస్తుండ‌గా ఆమె ఎద ఊపిరి తీసుకుంటున్న‌ట్లున్న భంగిమ సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.న‌ల్ల సూరీడు నెల్స‌న్ మండేలా,అడాల్ఫ్ హిల్ట‌ర్‌,చార్లిచాప్లిన్‌,మ‌ర్లిన్ మ‌న్రో,ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్‌,ఎలిజ‌బెత్ రాణి-2,పోప్‌జాన్‌పాల్‌-2,లేడీ గ‌గా త‌దిత‌ర ప్ర‌పంచ ప్ర‌ముఖుల ప్ర‌తిమ‌ల‌న్నెంటితోనే అల‌రారుతోందీ టుస్సాడ్ మ్యూజియం.
విశ్వ‌వ్యాప్తం:టుస్సాడ్ మ్యూజియం ఒక్క లండ‌న్‌కే ప‌రిమితం కాలేదు. ప్ర‌పంచం న‌లుచెర‌గులా ఈ మ్యూజియానికి బ్రాంచ్‌లు వెలిశాయి. లాస్‌వెగాస్‌, హాలివుడ్‌( (కాలిఫోర్నియా), న్యూయార్క్ సిటీ, వాషింగ్ట‌న్ డి.సి., అమెస్ట‌ర్డమ్‌, బెర్లిన్‌, బ్లాక్‌పూల్‌, వియ‌న్నా, బ్యాంకాక్‌, హాంగ్‌కాంగ్‌,షాంఘై, సిడ్నీల్లోనూ టుస్సాడ్ మ్యూజియాలు సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు క‌ల్గిస్తున్నాయి. తాజాగా జ‌కార్తాలో మ‌రో బ్రాంచ్ జ‌న సంద‌ర్శ‌న‌కు సిద్ధ‌మౌతోంది. 2012 జులై నాటికి అంకోల్ బీచ్ సిటీలో ఈ టుస్సాడ్ మ్యూజియం 3వేల చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంలో కొలువుదీర‌నుంది. టుస్సాడ్ మ్యూజియాల్నింటిలో క‌ల్లా అతి పెద్ద‌దిగానూ ఈ బ్రాంచ్ రికార్డు నెల‌కొల్పనుండ‌డం మ‌రో విశేషం.ఇంత‌కూ టుస్సాడ్ మ్యూజియాల్లో ఒక్కో ప్ర‌తిమ‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుందంటే..అక్ష‌రాల ల‌క్షా 50వేల పౌండ్లు.నిపుణులైన శిల్పులు,ఇత‌ర శ‌రీర భాగాల త‌యారీదారులు ఒక్కో బొమ్మను తీర్చిదిద్దేందుకు దాదాపు నాలుగు నెల‌ల స‌మ‌యం తీసుకుంటారు.ఈ టుస్సాడ్‌లో ప్ర‌తిమ నెల‌కొన‌డ‌మే ఆయా వ్య‌క్తుల ఘ‌న‌త‌కు గొప్ప నిద‌ర్శ‌నం.ఇప్పుడు ఆ ఛాన్స్ బాలివుడ్ మాజీ నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌కు వ‌చ్చింది.మార్చిలో ఆమె ప్ర‌తిమ టుస్సాడ్‌లో ద‌ర్శ‌న‌మీయ‌నుంది.ఇప్ప‌టికే భార‌త్ త‌ర‌ఫున అమితాబ్‌,ఐశ్వ‌ర్య‌రాయ్‌,హృతిక్‌,స‌ల్మాన్‌,షారుఖ్‌,క‌రీనా,స‌చిన్ ప్ర‌తిమ‌లు ఈ మ్యూజియంలో త‌ళుకులీనుతున్నాయి.
ప్ర‌పంచ ప్ర‌ముఖుల ప్ర‌తిమ‌లు: రాబ‌ర్ట్ విలిన్‌స‌న్‌, మోర్గాన్‌, లియొనార్డొ డికాప్రియో, నికోల్ కిడ్‌మ‌న్‌, బ్రాడ్‌పిట్‌, ఎంజెలిన‌జోలి, స్టిఫెన్ స్పీల్‌బ‌ర్గ్‌, జిమ్‌క్యారీ, జూలియో రాబ‌ర్ట్‌, జెనిఫ‌ర్ లోపెజ్‌, అర్నాల్డ్ స్కార్జ్‌నెగ్గ‌ర్‌, టైగ‌ర్‌వుడ్స్, మహ్మ‌ద్ అలీ, విలియ‌మ్ షేక్స్‌పియ‌ర్‌, అల్బ‌ర్ట్ ఐన‌స్టీన్‌, స్టీఫెన్ హ‌కింగ్‌, పాబిలో పికాసో, చార్లెస్ డార్విన్‌,మైఖెల్ జాక్స‌న్‌, లియ‌నా లూయిస్‌, మ‌డొన్నా, క్రిస్టియ‌న అగ‌లెర‌, రొలా విలియ‌మ్స్‌, మార్గ‌రెట్ థాచ‌ర్‌,టోనీ బ్లెయిర్‌, రోనాల్డ్‌రీగ‌న్‌,విన్‌స్ట‌న్ చ‌ర్చిల్‌, బేనజీర్‌భుట్టో, మార్టిన్ లూథ‌ర్ కింగ్‌, మ‌హాత్మాగాంధీ, మ‌ద‌ర్‌థెరిస్సా.  

10 Jan 2012

water car


స‌క‌ల చ‌రాచ‌ర సృష్టికి నీరే మూలం.ప్ర‌కృతి వ‌ర‌ప్ర‌సాదితం నీరు.జీవులన్నింటికి ప్రాణాధారం.మ‌రి యంత్రాల‌కూ ఆ నీరే శ‌క్తిగా మారితే? అవి ఆ నీటితోనే క‌ద‌లాడితే అబ్బుర‌మే క‌దా!కాలం మారింది..వేగం పెరిగింది.ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌లు..గ‌తంలో ఆడంబ‌రాల‌నుకునేవి నేడు అవ‌స‌రాల‌య్యాయి.ఇది యాంత్రిక‌యుగం కావ‌డంతో వాహ‌నాలు సామాన్యుల‌కు సైతం త‌ప్ప‌నిస‌రిగా కావాల్సి వ‌స్తోంది.ఆ క్ర‌మంలోనే వాహ‌నాల సంఖ్య వాహ‌న వినియోగ‌దారుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.అంత‌ర్జాతీయ విప‌ణిలోకి ఎన్నోన్నో వాహ‌నాలు కొత్త ఫీచ‌ర్లు,మోడ‌ళ్ల‌తో దూసుకువ‌స్తున్నాయి.అయితే ఆ వాహ‌నాలన్నింటికీ ప్ర‌ధాన ఇంధ‌నం పెట్రోలే.అందుకే నిత్యం పెట్రో ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు.అదే సామాన్య వాహ‌న‌దారుల గుండెల్లో గుబులు రేపుతోంది.గ‌తంలో డీజిల్ వాహ‌నాలు ఆ త‌ర్వాత పెట్రోలు వాహ‌నాలు ఆపై ఎల‌క్ట్రిక్ ఇప్పుడు సి.ఎన్‌.జి(కంప్రెస్డ్ నేచుర‌ల్ గ్యాస్‌) ఆధారిత వాహ‌నాలు తెర‌పైకి వ‌చ్చాయి.ఇవ‌న్నీ వాహ‌న‌దారుల జేబు చ‌మురునే వ‌దిలిస్తున్నాయి.దీనికి ప్ర‌త్యామ్నాయం ఏమిటి?ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ దూరం ప్ర‌యాణించే ఆవిష్క‌ర‌ణ‌లు అంద‌రికీ ఆనంద‌దాయ‌క‌మే అన‌డంలో సందేహం లేదు.90వ ద‌శ‌కంలో భార‌త్‌((త‌మిళ‌నాడు)లో రామ‌న్‌పిళ్లై మూలికా ఇంధ‌నాన్ని సృష్టించాన‌న్నారు.పెట్రోల్‌కు ఇదే క‌చ్చిత‌మైన ప్ర‌త్యామ్నాయమ‌ని ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు.అయితే ఆ త‌ర్వాత పిళ్లై ప్ర‌యోగాలు విఫ‌లం కావ‌డం భార‌త్ వంటి వ‌ర్థ‌మాన‌దేశాల వాహ‌న వినియోగ‌దారుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.కానీ ప్ర‌పంచ వ్యాప్తంగా శాస్త్ర‌వేత్త‌లు త‌మ మెద‌ళ్ల‌కు పదును పెట్టి సరికొత్త ప‌రిశోధ‌న‌లను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తూనే ఉన్నారు.
డ‌బ్లూ.ఇ.ఎస్‌..:కేవ‌లం నీరు,గాలి ద్వారానే కార్ల‌ను న‌డిపిస్తే..ఆ ఆలోచ‌న ఉద‌యించే సూర్యుని దేశం జ‌పాన్‌కి రానే వ‌చ్చింది.ఆటోమొబైల్ రంగంలో ప్ర‌పంచ రారాజుగా ఆధిప‌త్యాన్ని చ‌లాయిస్తున్న మ‌న జ‌పనీయులు వాట‌ర్ ఎన‌ర్జీ సిస్ట‌మ్‌(డ‌బ్లూ.ఇ.ఎస్‌)ను ప‌రిచ‌యం చేసి మ‌రోసారి త‌మ స‌త్తాను చాటారు.ప్ర‌సిద్ధ జెనెప‌క్స్ కంపెనీ ఈ వాట‌ర్ కారును రూపొందించింది.నీళ్లలో ఉండే ఆక్సిజ‌న్‌,హైడ్రోజ‌న్‌ల‌ను విభ‌జించి ఆ హైడ్రోజ‌న్ ద్వారా శ‌క్తిని సృష్టించి యంత్రాన్ని న‌డ‌ప‌డ‌మ‌న్న‌దే ఈ స‌రికొత్త టెక్నాల‌జీ.ప్ర‌స్తుతం న‌డుస్తున్న డీజిల్‌,పెట్రోల్‌,ఎల‌క్ట్రిక్‌,సి.ఎన్‌.జి త‌దిత‌ర వాహ‌నాల్లో క‌న్వ‌ర్ట‌ర్ల‌ను మార్చి ఈ డ‌బ్లూ.ఇ.ఎస్ ప‌రిజ్ఞానంతో `కారు`చౌక ప్ర‌యాణాల ల‌బ్ధిని వాహ‌న‌దారుల‌కు అందించ‌డ‌మే దీని లక్ష్యం.ఎంత ల‌గ్జ‌రీ కారైనా,చౌక‌ర‌క‌మైన‌దైనా పెట్రోల్‌,సి.ఎన్‌.జి చార్జీల చెల్లింపు వాహ‌న‌దారులంద‌రికీ స‌మాన‌మే.వాహ‌నాల్లో వినియోగించే ఇంధ‌నం ధ‌ర‌లు అంద‌రికీ అందుబాటులో ఉండ‌డ‌మ‌న్న‌దే ప్రధానాంశం.ఆ దిశ‌గానే ఇప్పుడు అడుగులు ప‌డుతున్నాయి.ఈ సాంకేతిక ప‌రిజ్ఞానం పూర్తిగా విజ‌యవంత‌మై విశ్వ‌వ్యాప్తంగా అన్ని త‌ర‌హా వాహ‌న‌దారుల‌కు అక్క‌ర‌కు వ‌స్తేనే ప్ర‌యోజ‌న‌దాయ‌క‌మ‌వుతుంది.వాట‌ర్ ప‌వ‌ర్డ్ వెహిక‌ల్ ఒక్కో ఇంజిన్ త‌యారీకి 2 కోట్ల యెన్‌లు(18,500 అమెరికా డాల‌ర్లు)ఖ‌ర్చ‌వుతోంద‌ట‌.ఆ ధ‌ర‌ల‌ను 5 ల‌క్ష‌ల యెన్‌లు(4,600 అమెరికా డాల‌ర్ల‌) స్థాయికి తీసుకురాగ‌ల్గితేనే తాము ఆశించిన ఫ‌లితం సిద్ధిస్తుంద‌ని ఆ కంపెనీ భావిస్తోంది.
ప‌ర్యావ‌ర‌ణం-భ‌ద్రం:సిఎన్‌జి,ఎల‌క్ట్రిక్ మోడ్ వాహ‌నాల మాదిరిగా ఈ వాట‌ర్ కార్ల వ‌ల్ల ఎటువంటి వాతావ‌ర‌ణ కాలుష్యం ఉండ‌దు.ఈ డ‌బ్లూఇఎస్ ప‌రిజ్ఞానంపై నిజానికి నూరేళ్ల క్రితం నుంచే బ్రిట‌న్‌,ఆస్ట్రేలియా,అమెరికా,ర‌ష్యా త‌దిత‌ర దేశాల శాస్త్ర‌వేత్త‌లు దృష్టిని సారించారు.ర‌ష్యా శాస్త్ర‌వేత్త‌లు తొలుత ఓ నౌక‌ను నీటి ద్వారా న‌డిపించేందుకు ఈ ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.స‌ముద్ర‌పు జ‌లాల నుంచే హైడ్రోజ‌న్‌ను సేక‌రించి షిప్ న‌డిచేలా సాంకేతిక‌త‌ను రూపొందించారు.ఈ ప‌రిజ్ఞానాన్ని ఓ.ఎమ్‌. గా వారు స్థిర‌ప‌రిచారు.ఈ డ‌బ్లూ.ఇ.ఎస్ ప‌రిజ్ఞానం మ‌రింత ప్ర‌గ‌తిని సాధిస్తే ఒక్క కార్లేంటి ఏకంగా విమానాలు,రాకెట్లు,స‌బ్‌మెరైన్ల‌ను కూడా నీళ్ల‌తోనే న‌డిపించేయొచ్చంటున్నారు.

8 Jan 2012

giant crocodile


ప్ర‌కృతి కాల పరీక్ష‌ను త‌ట్టుకొని మ‌నుగ‌డ సాగిస్తున్న ఏకైక భారీ జీవి మొస‌లి. ఏదో గ్ర‌హ శ‌క‌లం భూమిని ఢీకొన‌డమో లేదా అగ్ని ప‌ర్వ‌తాలు బ‌ద్ధ‌లై లావా పెల్లుబికడం వ‌ల్ల‌నో రాక్ష‌స‌బ‌ల్లుల జాతే ఈ భూమి మీద నుంచి క‌నుమ‌రుగ‌యిపోయింది.కానీ రెండు వేల ఏళ్లుగా మొస‌ళ్లు త‌మ ఉనికిని నిలుపుకుంటున్నాయి. వీటిలో 23 ర‌కాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్నాయి.నీటిలో ఉన్న మొస‌లి గ‌జ‌రాజు క‌న్నా బ‌ల‌శాలే.ఇవి నూరేళ్ల‌కు పైబ‌డి కూడా బ‌తుకుతాయి. ఇలాగే 115 ఏళ్ల పాటు ఓ మొస‌లి ర‌ష్యాలోని జూలో 1997 వ‌రకు జీవించి రికార్డు సృష్టించింది. దాన్ని 1890లో ప‌ట్టుకొని అప్ప‌టి నుంచి ఆ జూలో పెంచారు.
సాల్ట్ వాట‌ర్ క్రోక‌డైల్‌:ఈ ర‌కం మొస‌ళ్లు బ‌హు ప్ర‌మాద‌కారులు.ఎక్కువ‌గా ఇవి ఆస్ట్రేలియాలో ఉన్నాయి.మ‌నుషులు కూడా చాలా మందే వీటి బారిన‌ప‌డి మృత్యుపాల‌య్యారు.మొస‌ళ్లు ఇత‌ర జ‌ల‌చ‌రాల‌పై స‌ముద్ర గ‌ర్భంలో ప‌రిశోధ‌న‌లు సాగించే ఆస్ట్రేలియ‌న్ టి.వి. ఎక్స్‌ప‌ర్ట్ స్టీవ్ ఇర్విన్ 2006లో విధి నిర్వ‌హ‌ణ‌లోనే స్టింగ్‌రేస్ దాడిలో చ‌నిపోయారు.మొస‌ళ్ల‌కు కోర‌ల్లాంటి ప‌దునైన ప‌ళ్లు 60 నుంచి 80 వ‌ర‌కు ఉంటాయి.అయితే వీటి బ‌ల‌మంతా ద‌వ‌డ‌ల్లోనే ఇమిడి ఉంటుంది.జిరాఫీ వంటి పొడ‌వైన జంతువుల్ని సైతం అమాంతం ప‌ట్టేసి చంపేయ‌గ‌ల‌వివి.మొస‌ళ్లు ఎక్కువ సేపు నీటిలోనే ఉండ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటాయి.వీటి మెద‌డు ప‌రిమాణం చాలా చిన్న‌ది.పొడ‌వైన తోక బ‌లిష్ట‌మైన పైచ‌ర్మంతో ఆక‌ల‌యిన‌ప్పుడు శ‌ర‌వేగంగా ఈది ఇత‌ర జంతువుల్ని చాలా తెలివిగా ఒడిసి ప‌ట్టేస్తాయి.చుట్టుప‌క్క‌ల ప్ర‌దేశాల్ని బాగా గ‌మ‌నించేందుకు వీలుగా వీటి త‌ల‌భాగంలో ఇరుప‌క్క‌ల బాగా ఎడంగా క‌ళ్లు అమ‌రి ఉంటాయి.వాస‌న‌ను బ‌ట్టీ జంతువుల జాడ‌ను ఇవి గుర్తించి మాటు వేసి మ‌ట్టుపెడ‌తాయి.ఒక్కోసారి మొస‌ళ్లు త‌మ పిల్ల‌ల్నీ తినేస్తాయి.వాడైన ప‌ళ్ల‌తో దొరికిన జంతువును ప‌ట్టి చీల్చేసి క‌డుపులో వేసేసుకుంటాయివి.ఆ త‌ర్వాత కొన్ని వారాల పాటు ఆ ఆహారాన్ని క్ర‌మ‌క్ర‌మంగా జీర్ణం చేసుకోగ‌ల‌వు.మ‌ళ్లీ కొన్ని నెల‌ల‌పాటు ఆహారం లేకుండాను జీవిస్తుంటాయి.భారీ జంతువులను వేటాడిన‌ప్పుడు మ‌గ‌మొస‌ళ్లు ఆడ మొస‌ళ్ల స‌హాయాన్ని తీసుకుంటుంటాయి.ఒక్కో మ‌గ‌మొస‌లికి 10 వ‌ర‌కు గ‌ర్ల్ ఫ్రెండ్స్ ఉంటాయ‌ట‌.
భారీ మొస‌లి: ఫిలిప్పీన్స్‌లోని అగుస‌న్‌లో 2011లోనే జ‌యింట్ క్రోక‌డైల్‌ను ప‌ట్టుకున్నారు. ఇది 2,400 పౌండ్ల బ‌రువుతో 22 అడుగుల పొడ‌వుంది. మొస‌ళ్లు ఈత‌లో పెద్ద నేర్ప‌ర్లేమి కాద‌ట‌ . అయితే 10వేల మైళ్ల‌కు పైగా జ‌లాల్లో ఇవి ఈదుకుంటూ వెళ్లి పోతుంటాయని బ్రిటిష్ జీవ‌శాస్త్రవేత్త డాక్ట‌ర్ హామిష్ కాంప్‌బెల్ తెలిపారు. ఇవి ఎస్ ఆకారంలో ఈదుతాయట‌. మొస‌ళ్లు ఎక్కువ‌గా న‌దులు,స‌ర‌స్సులు,అడ‌వుల్లోని వంక‌లు,మ‌డుగుల్లోను,కొన్ని స‌ముద్ర తీరాల్లోను జీవిస్తాయి.ఎక్కువ‌గా అమెరికా, చైనా, న్యూగునియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మ‌డ‌గ‌స్క‌ర్‌,పాకిస్థాన్‌ల్లో ఉన్నాయం టున్నారు. మొస‌ళ్లు త‌మ జీవిత‌కాలంలో అనేక‌సార్లు త‌మ ప‌ళ్ల‌ను వ‌దిలేస్తుంటాయి. మ‌ళ్లీ వాటికి కొత్త ప‌ళ్లు వ‌స్తుంటాయి. ఆడ మొస‌లి 10 నుంచి 20 గుడ్ల‌ను జ‌ల‌తీరాల్లోని ఇసుక తిన్నెల్లో ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌ల్లో పెడ‌తాయి. వాటిని 65 నుంచి 95 రోజుల్లో పొదుగుతాయి. ఇవి 32 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌ను ఇష్ట‌ప‌డ‌తాయి.
క్రోక‌డైల్ రివ‌ర్‌గా ద‌క్షిణాఫ్రికాలోని లింపొపొ న‌ది పేరొందింది. ఆ దేశంలోనే మ‌రో మొస‌ళ్ల న‌దిగా పుమ్‌లాంగ కూడా గుర్తింపు పొందింది.ఇది క్రూగ‌ర్ నేష‌న‌ల్ పార్క్‌కు స‌మీపంలో ఉంది. అలాగే మినెసొట‌లో కూడా క్రోక‌డైల్ రివ‌ర్ ఉంది.
ప్ర‌మాద‌క‌ర స‌ముద్ర జీవులు: సాల్ట్ వాట‌ర్ క్రోక‌డైల్‌, మెరెఈల్స్‌, బ‌రాక‌డ‌, సీస్నేక్స్‌,స్టోన్ ఫిష్‌,ల‌య‌న్ ఫిష్‌,స్టింగ్ రేస్‌,బ్లూరింగ్ అక్టోప‌స్‌,కోన్‌షెల్స్‌.మొస‌ళ్ల మాంసం,చ‌ర్మం కోసం వేట‌గాళ్లు ఎక్కువ‌గా వీటిని వేటాడుతుండ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీటి సంఖ్య అంత‌కంత‌కు త‌గ్గిపోతోంది.అందుకే 1972 నుంచే భార‌త్‌లో మొస‌ళ్ల వేట‌ను నిషేధించారు.

7 Jan 2012

bamboo forest







ప్ర‌కృతిని ప‌రిర‌క్షించేవి అడ‌వులు. అవి ప‌చ్చ‌గా ఉంటేనే ప‌ర్యావ‌ర‌ణ స‌మతౌల్యం సాధ్యం. అలాంటి అడ‌వుల్ని ఓసార‌యినా చూడాల‌ని వీల‌యితే అక్క‌డ గ‌డిపి రావాల‌ని కోరుకోని మ‌న‌స్సులుండ‌వు. ముఖ్యంగా నేటి యాంత్రిక యుగంలో వీకెండ్స్ ఎంజాయిమెంట్ క‌ల్చ‌ర్ అమెరికా త‌ర‌హా పాశ్చాత్య దేశీయులకే ప‌రిమితం కాలేదు. యావ‌త్ దేశాల ప్ర‌జ‌ల్లో నేడు ప్ర‌బ‌లుతోంది. అటువంటి వారిని భార‌త్‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ అడ‌వులు సేద‌తీర్చి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఏపీ విస్తీర్ణంలో ఇవి 23 శాతం ప‌రుచుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి  ఫారెస్టు అందులో భాగ‌మే. ఇక్క‌డ ఈస్ట్ర‌న్‌గాట్స్‌లోని అడ‌వుల అందాల్ని ఎంత‌చూసినా త‌నివితీర‌దు.వెదురు చెట్ల‌కు ఈ అడ‌వులు ప్ర‌సిద్ధి. తూర్పు,ప‌శ్చిమ‌,విశాఖ‌,ఖ‌మ్మం జిల్లాల స‌రిహ‌ద్దుల్లో ఈ సుందర అడ‌వులు కొలువుదీరాయి.అనేక ప‌క్షులు,జంతువులు,క్రూర‌మృగాల‌కు ఆల‌వాలం ఇవి.ఇక్క‌డ నుంచే పేరెన్నిక‌గ‌న్న రాజ‌మండ్రి పేప‌ర్‌మిల్‌కు వెదురు స‌ర‌ఫ‌రా అవుతుంటుంది.ఆ క్ర‌మంలోనే వెదురు ర‌వాణా లారీల్లో అడ‌వుల నుంచి వ‌చ్చేసిన పులి,చిరుతలు రాజ‌మండ్రి న‌గ‌రంలో హ‌ల్‌చ‌ల్ చేసిన ఘ‌ట‌న‌లూ ఉన్నాయి.
మారేడుమిల్లి అడ‌వి: రాజ‌మండ్రికి 80 కిలోమీట‌ర్ల దూరంలో భ‌ద్రాచ‌లం రోడ్డులో ఉందీ మారేడుమిల్లి ఏజెన్సీ గ్రామం.ఈ గ్రామం నుంచి కేవ‌లం 4 కిలోమీట‌ర్ల దూరం నుంచే ద‌ట్ట‌మైన అడవి మొద‌ల‌వుతుంది. ఇదో గొప్ప పిక్‌నిక్ స్పాట్‌.అక్టోబ‌ర్ నుంచి స్వదేశీ,విదేశీ సంద‌ర్శ‌కుల‌తో ఈ అడ‌వులు సంద‌డిగా మార‌తాయి.సంద‌ర్శ‌కుల్ని అల‌రించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌(ఎపిటిడిసి) త‌గిన ఏర్పాట్ల‌ను చేస్తుంటుంది.శ‌నివారం సాయంత్రానికి సంద‌ర్శ‌కులు మారేడుమిల్లికి చేరుకుంటుంటారు. రాత్రి ఈ అడ‌వుల్లోని రిసార్టుల్లోనే వారి బ‌స‌.వారికి ఫారెస్టు గార్డులు,సాయుధ గిరిజ‌నులే ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంటారు.కార్తీక‌వ‌నం,మ‌ద‌నికుంజ్‌,జ‌ల‌త‌రంగ‌ణి త‌దిత‌ర ప్రాంతాల్లో సంద‌ర్శ‌కుల తాకిడి ఎక్కువ‌గా క‌నిపిస్తూంటుంది.
వ‌ర‌ల్డ్ బ్యాంక్ చేయూత‌: ఏపీ క‌మ్యూనిటి ఫారెస్టు మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుకు వ‌ర‌ల్డ్ బ్యాంక్ చేయూత‌ నందిస్తోంది. త‌ద‌నుగుణంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందుతోంది. 250 హెక్టార్ల‌లో వాలి- సుగ్రీవ మెడిసిన‌ల్ ప్లాంట్స్ క‌న్జ‌ర్వేష‌న్ ఏరియా అలాగే ముందంజ వేస్తోంది. ఇక్క‌డ దాదాపు 203 ర‌కాల వైద్య ఉప‌యోగ‌క‌ర మొక్క‌ల్ని పెంచుతున్నారు. గోదావ‌రి న‌దిపై పాపికొండ‌ల న‌డుమ జ‌ల‌యానం చేస్తూ సంద‌ర్శ‌కులు పుల‌కించిపోతుంటారు. కొండ రెడ్ల‌నే గిరిజ‌నులే ఈ ఏజెన్సీలో అత్య‌ధిక సంఖ్యాకులు. ఈ అడవుల్లో కొండ‌ల మాటు నుంచి పొంగి పోర్లే పెద్ద ఏరు వ‌ల‌మూరు. ఇది మూడు పాయ‌లుగా చీలి కొండల నుంచి దిగువన‌కు పారుతూంటుంది. అలా ఈ ఏరు 30 మీట‌ర్ల ఎత్తు నుంచి పారే ఫాల్స్‌నే అమృత‌ధార అని 15 మీట‌ర్ల ఎత్తు నుంచి మ‌రో కొండ నుంచి జాలువారే నీటిని స్వ‌ర్ణ‌ధార అని పిలుస్తుంటారు. వీటితోపాటు నీల‌కంఠేశ్వ‌ర వాట‌ర్‌ఫాల్స్ కూడా ప్ర‌సిద్ధి చెందాయి. వ‌ల‌మూరు, సోమిరెడ్డి పాలెం, వాల్మీకి పేట‌, వ‌న‌సంర‌క్ష‌ణ స‌మితి వారు ఎపిటిడిసికి ఇతోధిక స‌హ‌కారాన్ని అందిస్తున్నారు. ఇక్క‌డి గిరిజ‌నుల కొమ్ము నృత్యం కూడా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది.
బేంబూ చికెన్‌ :  వెదురు బొంగులో ఉడికించిన కోడి మాంసం రుచి గురించి ఎంత వ‌ర్ణించినా త‌క్కువేనంటారు ఈ ప్రాంత సంద‌ర్శ‌కులు. ఉప్పు,ప‌సుపు,కారం,మాసాలాలు ద‌ట్టించిన ప‌చ్చి కోడి మాంసాన్ని మీట‌రు పొడ‌వాటి ప‌క్వానికి వ‌చ్చిన ప‌చ్చ‌టి వెదురు బొంగులో ఉంచి ఆకులు, మ‌ట్టితో అంచుల‌ను క‌ప్పేసి నిప్పుల్లో కాలుస్తారు. వెదురు బొంగు పూర్తిగా న‌ల్ల‌గా మాడిపోయే వ‌ర‌కు బాగా కాల్చాక చ‌ల్లార్చి పొగ‌లు క‌క్కుతున్న ఉడికిన ఆ కోడికూర‌ను అడ‌వి చెట్ల ఆకుల్లో పెట్టుకొని లొట్ట‌లేసుకొని తిన‌డం సంద‌ర్శ‌కులంద‌రికి నిజంగా మ‌రుపురాని మ‌ధురానుభూతే.






5 Jan 2012

niagara falls


(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome) న‌యగ‌రా..న‌య‌నానంద‌క‌ర జ‌ల హేల‌. భూత‌ల స్వ‌ర్గ‌మ‌ని మ‌నం పిలుచుకునే అమెరికా,కెన‌డా స‌రిహ‌ద్దుల‌లో ఉందీ జ‌ల‌పాతం. వ‌ర‌ల్డ్‌లో అతిపెద్ద జ‌ల‌పాత‌మైన విక్టోరియా(ద‌క్షిణాఫ్రికా)త‌ర్వాత స్థానం దీనిదే. అందుకే ఏటా కోటిన్న‌ర‌కు పైబ‌డి ప‌ర్యాట‌కుల సంద‌ర్శ‌న‌తో ఈ జ‌ల‌పాత ప్రాంతాలు కిట‌కిట‌లాడుతూ ఉంటాయి.అమెరికన్ ఫాల్స్‌((ప్రాస్పెక్ట్ పాయింట్‌-లునా ఐలాండ్‌))), బ్రిడ‌ల్ వీల్‌ఫాల్స్‌(((లునా ఐలాండ్‌- గోట్- ఐలాండ్‌),కెన‌డియ‌న్ ఫాల్స్‌(గోట్ ఐలాండ్‌--- టేబుల్ రాక్)అనే మూడు జ‌ల‌పాతాల స‌మాహార‌మే ఈ  న‌యగ‌రా  జ‌ల‌పాతం.అమెరిక‌న్ ఫాల్స్‌,బ్రిడ‌ల్ వీల్‌ఫాల్స్ 176 అడుగుల ఎత్తున ఉన్న కొండ కొన‌ల నుంచి పాల నుర‌గ‌ల్ని త‌ల‌పించే జ‌లసిరులు దిగువ‌న‌కు ఎగ‌సిప‌డుతూ ఉర‌క‌లెత్తుతుంటాయి.ఈ ప్రాంతంలో దాదాపు ల‌క్షా 50 వేల గ్యాల‌న్ల నీరు పారుతుంది.జూన్‌,జులై,ఆగ‌స్టుల్లో అధిక సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు ఇక్క‌డ‌కు విచ్చేస్తుంటారు.
కెన‌డియ‌న్(హార్స్‌షూ)ఫాల్స్ నుంచి జ‌లాలు 167 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంటాయి.ఇక్క‌డ సుమారు ఆరు ల‌క్ష‌ల గ్యాల‌న్ల నీరు ప్ర‌వ‌హిస్తూంటుంద‌ని యూఎస్ జియోలాజిక‌ల్‌ (యూఎస్‌జిఎస్‌)) పేర్కొంది.ఈ జ‌ల‌పాతానికి మూలం  న‌యగ‌రా  న‌ది.మంచు యుగం కాలం నాటిదిది.దీని వ‌య‌స్సు 18వేల ఏళ్లు.మూడు కిలోమీట‌ర్ల ఎత్తున పేరుకుపోయిన మంచుప‌ల‌క వేల ఏళ్ల క్రితం క‌ర‌గ‌డంతోనే న‌దులు,స‌ర‌స్సులు ఈ ప్రాంతాల్లో ఏర్ప‌డ్డాయి.ద‌క్షిణ అంటారియో ప్రాంతంలో నెల‌కొందీ అద్భుత జ‌ల‌పాతం. న‌యగ‌రా  పెనిన్సులాలో 12 వేల ఏళ్ల క్రిత‌మే మంచుప్రాంతం అదృశ్య‌మ‌యింది.ఈ మంచుఖండం మాయ‌మ‌య్యాకే ఎరై స‌ర‌స్సు, న‌యగ‌రా  న‌ది,అంటారియో స‌ర‌స్సు,లారెన్స్ న‌దులు ఏర్ప‌డ్డాయి.ఈ మొత్తం జ‌లాల‌న్నీ కొండ‌ల‌కోన‌ల నుంచి పారుతూ చూడచ‌క్క‌ని జ‌ల‌పాతాలై దిగువ‌న‌కు ప్ర‌వ‌హిస్తూ చివ‌ర‌కు స‌ముద్రంలో క‌లుస్తున్నాయి.
వండ‌ర్ న‌యాగ‌రా:క్వీన్‌స్ట‌న్‌-.-లూయిస్ట‌న్‌ ప్రాంతంలో  న‌యగ‌రా  జ‌ల‌పాత హోయ‌ల్ని ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చే ప‌ర్యాట‌కులు ఆనందోత్సాహాల‌తో తిల‌కించి పుల‌కించిపోతుంటారు.ఈ జ‌ల‌పాత ప్రాంత స‌మీపంలోకి చేరుకుంటుండ‌గానే మంచు బిందువులు,నీటి తుంప‌ర్లతో అతిథుల‌ను ప‌ల‌క‌రిస్తూ  న‌యగ‌రా  స్వాగ‌తం ప‌లుకుతుంది.ఇక్క‌డ బ‌ట‌ర్‌ఫ్లై క‌న్జ‌ర్వేట‌రీ,మేరీలాండ్ ఆహ్లాదాన్ని పంచుతాయి.బ‌ఫెలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి,టొరంటో(కెన‌డా)వైపు నుంచి ఈ జ‌ల‌పాత ప్రాంతానికి అర‌గంట ప్ర‌యాణించి చేరుకోవ‌చ్చు. న‌యగ‌రా  జ‌ల‌పాత మార్గంలో ఆరు అపురూప‌మైన బ్రిడ్జిలూ భ‌లే ఆక‌ట్టుకుంటుంటాయి.ఈ వంతెన‌ల‌న్నీ కెన‌డా,అమెరికా అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల‌ వెంబ‌డే  న‌యగ‌రా  న‌దిపై నిర్మిత‌మ‌య్యాయి.నాలుగు చ‌క్రాల వాహ‌న‌దారులు,పాద‌చారులు కూడా ఈ వంతెన‌ల‌పై ప్ర‌యాణిస్తుంటారు.వీటిలోనే రెండు రైలు వంతెన‌లు కూడా ఉన్నాయి.అవి..పీస్ బ్రిడ్జ్‌,రెయిన్‌బో బ్రిడ్జ్‌,వ‌ర్ల్‌పుల్ బ్రిడ్జ్‌,లూయిస్ట‌న్‌-క్వీన్‌స్ట‌న్ బ్రిడ్జ్‌,మిచిగ‌న్ సెంట్ర‌ల్ రైల్వే బ్రిడ్జ్‌,ఇంట‌ర్నేష‌న‌ల్ రైల్వే బ్రిడ్జ్‌.

జ‌ల విద్యుదుత్పాద‌న‌:అమెరికాలోని రాబ‌ర్ట్ మోజెస్‌((జిఎస్‌)24 ల‌క్ష‌ల కిలోవాట్స్‌,లూయిస్ట‌న్ పంప్‌((జిఎస్‌)3 ల‌క్ష‌ల కిలోవాట్స్ చొప్పున 27 ల‌క్ష‌ల కిలోవాట్స్ జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి అవుతోంది.కెన‌డా వైపు నుంచి స‌ర్ అడమ్ బెక్‌(1(జిఎస్‌)5ల‌క్ష‌ల కిలోవాట్స్‌,స‌ర్ అడ‌మ్ బెక్‌బ(2జిఎస్‌)ల‌క్ష‌ల కిలోవాట్స్‌,స‌ర్ అడ‌మ్ బెక్‌పీస్‌((జిఎస్‌)ల‌క్షా 75వేల కిలోవాట్స్‌,డెక్యూ(జిఎస్‌)కెథ‌రిన్ 23వేల కిలోవాట్స్‌,డెక్యూ(2జిఎస్‌)కెథ‌రిన్ ల‌క్షా44వేల కిలోవాట్స్ చొప్పున మొత్తం సుమారు 24ల‌క్ష‌ల కిలోవాట్స్ జ‌ల విద్యుదుత్పాద‌న చేస్తున్నారు.


3 Jan 2012

under sea feast


(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome)
లోకో భిన్న‌రుచి!..ఆ రుచినీ ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ స్వీక‌రిస్తుంటే భ‌లే మ‌జా.అందుకు భూమి,ఆకాశం,నీటిపైనే కాదు స‌ముద్ర‌గ‌ర్భం కూడా వేదిక అయిందంటే ఆశ్చ‌ర్యంతోపాటు వింత అనుభూతినే క‌ల్గిస్తుంది.స‌రిగ్గా అలాంటి థ్రిల్‌ను మ‌న‌కు క‌ల్పించే రెస్టారెంటే ప్ర‌కృతి అందాల‌కు ప‌ర్యాయ‌ప‌ద‌మైన మాల్దీవుల్లో ఉంది.2007లో మాల్దీవుల్లోని(రంగ‌లిఐలాండ్‌)హిందూ మహాస‌ముద్ర జ‌లాల అడుగున నిర్మిత‌మైన‌ హిల్ట‌న్ మాల్దీవ్స్ రిసార్ట్ అండ్ స్పాకు చెందిన ఇథా ప్ర‌పంచంలోనే తొలి రెస్టారెంట్‌గా చ‌రిత్ర‌ను లిఖించ‌డ‌మే కాక అల‌రిస్తోంది.అల‌ల ఉధృతి లేని ప్ర‌శాంత స‌ముద్ర జ‌లాల్లో ఒదిగి ఉన్న ఈ అద్దాల‌((అక్‌రిలిక్)హోట‌ల్లో చూడ చ‌క్క‌ని చేప‌లు అసాంతం క‌ద‌లాడు‌తుండ‌గా ఊహ‌ల్లో తేలిపోతూ విందు ఆర‌గించ‌డం ఎవ‌రికైనా మ‌ర‌పురాని మ‌ధుర జ్ఞాప‌క‌మే.ఈ రెస్టారెంట్‌కు వ‌చ్చే అతిథులు 270 డిగ్రీల కోణంలో స‌ముద్ర గ‌ర్భాన నెల‌కొన్న అందాల‌ను క‌న్నుల పండ‌గ్గా తిల‌కిస్తుంటార‌ని హిల్ట‌న్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కార్‌స్ట‌న్ షైక్ పేర్కొన్నారు.న్యూజిలాండ్‌కు చెందిన ఎంజె మ‌ర్ఫీ లిమిటెడ్ ఈ హోట‌ల్‌ను రూపుదిద్దింది.సాధారణంగా అక్వెరియాల్లో తిరుగాడే రంగురంగుల చేప‌ల‌నే మ‌నం సంభ్ర‌మంగా చూస్తుంటాం.ఈ హోట‌ల్‌కెళ్తే మ‌న‌మే అక్వెరియంలో ఉండ‌గా చుట్టూ ప‌రుచుకున్న స‌ముద్ర జ‌లాల్లో సంచ‌రించే చేప‌ల మ‌ధ్య ఇష్ట‌మైన రుచుల‌ను ఆస్వాదించ‌డమ‌న్న‌ది క‌చ్చితంగా స‌రికొత్త అనుభూతే.దాదాపు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత వంట‌కాల‌న్నీ ఈ రెస్టారెంట్‌లో ల‌భ్య‌మౌతాయి.అయితే మాల్దీవుల ప్రాంత జ‌లాల్లో మాత్ర‌మే దొరికే వైట్ ఫిష్‌,ఫెన్నెల్(ఓ ర‌కం మొక్క‌)సాస్‌,కూర ఈ హిల్ట‌న్ రెస్టారెంట్ స్పెష‌ల్‌.ఈ హోట‌ల్లో నుంచి తాబేళ్లు,వివిధ ర‌కాల చేప‌లు,మొక్క‌లు,అనేక జ‌ల‌చ‌రాల స‌హా షార్క్‌ల‌ను చూడ్డం అతిథుల్లో క్ష‌ణ‌క్ష‌ణం అనంత ఉత్కంఠ‌నే కల్గిస్తూంటుంది.
జూల్స్ లాడ్జ్‌-ఫ్లోరిడా(యూ.ఎస్‌):).. స‌ముద్ర గ‌ర్భాన నిర్మిత‌మైన హోట‌ళ్ల‌కు నిఖార్స‌యిన వేదిక దుబాయ్‌.ఇక్క‌డ ఈ త‌ర‌హా ‌హోట‌ళ్లు అనేకం.అయితే అమెరికాలోని ఫ్లోరిడా(కీలార్గో)లోని జూల్స్ లాడ్జ్ స‌ముద్ర జ‌లాల అడుగున నిర్మిత‌మైన తొలి హోట‌ల్‌గా చ‌రిత్ర‌కెక్కింది.స‌ముద్ర ఉప‌రిత‌లం నుంచి 21 అడుగుల లోతున ఈ హోట‌ల్ ప్ర‌ధాన ద్వారం స్వాగ‌తం ప‌లుకుతూ క‌నిపిస్తుంది.విలాస‌వంత‌మైన విశ్రాంత గ‌దుల‌కే కాదు స్కూబా డైవింగ్ కోర్సుకు ఈ జూల్స్ పేరొందింది.అంతేనా వివిధ న‌మూనా క్రీడా ప్రాంగ‌ణాలు,పార్క్‌ల‌తో ఈ హోట‌ల్ అతిథుల్ని ఉల్లాస‌ప‌రుస్తోంది.అదేవిధంగా స్వీడ‌న్‌(వెస్టార‌స్‌)లోని అట్ట‌ర్ ఇన్ కూడా ఈ త‌ర‌హా హోట‌ళ్ల‌లో ఒక‌టిగా ఖ్యాతి గ‌డించింది.ఈ హోట‌ల్ స‌ముద్ర ఉప‌రిత‌లం నుంచి మూడు మీట‌ర్ల లోతున నిర్మిత‌మైంది.ఇక ఫిజిలోని పొజిడ‌న్ హోట‌ల్ కూడా ఇదే విధంగా స‌ముద్ర జ‌లాల్లో 40 అడుగుల లోతున నెల‌కొంది.2010లో ట‌ర్కీలో ఇస్తాంబుల్ హోట‌ల్ కొలువుదీరింది.సెవెన్ స్టార్ హోదా గ‌ల ఈ హోట‌ల్ ఏడు అంత‌స్తుల‌తో స‌ముద్ర గ‌ర్భంలో ఠీవీని ఒల‌క‌బోస్తోంది.అలాగే చైనాకు చెందిన షాంగై షిమొవ్ వండ‌ర్‌లాండ్ హోట‌ల్‌ది ఫైవ్ స్టార్ స్టేట‌స్‌.వ‌ర‌ల్డ్ అండ‌ర్ సీ టాప్ ఫైవ్ హోట‌ళ్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్న హోట‌ల్ ఇది.2009 నుంచి ఈ హోట‌ల్ అతిథుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.
______________________________________________________________
సిడ్నీ@100:వందో టెస్టుకు ఆతిథ్యం ఇస్తోన్న సిడ్నీ గ్రౌండ్‌లోనే భార‌త మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ 100@100...

Popular Posts

Wisdomrays