30 Nov 2011

views













navayuva page viewer friends list


Pageviews by Countries
India
1,120
United States
414
Russia
105
Latvia
8
Germany
7
Malaysia
5
Indonesia
3
Brazil
1
Chile
1
Malta
1
Sweeden
1
New Caledonia
1
Saudi Arabia
1
 
 
 
 


29 Nov 2011

belum caves


ప్ర‌కృతిలో భూమి కూడా ఓ అద్భుతాల స‌మాహార‌మే. కొండ‌లు, గుట్ట‌లు, న‌దులు, చెట్లు, తోట‌లు ఎన్నెన్నో. అన్నీ మ‌న‌ల్ని ఆక‌ట్టుకొనేవే. ఉల్లాస‌ప‌రిచి సేద‌తీర్చేవి. అందులో గుహ‌లు ఎంద‌రో సంద‌ర్శ‌కుల్ని ఆక‌ర్షిస్తుంటాయి. అటువంటి వాటిల్లో ఒక‌టి ఈ బెలుం గుహ‌లు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోగ‌ల క‌ర్నూల్ జిల్లాకు చెందిన ఈ గుహ‌లు భార‌త ఉప‌ఖండంలోనే విస్త‌ర‌ణ‌రీత్యా రెండో స్థానాన్ని ఆక్ర‌మించాయి. దేశంలో అతిపెద్ద గుహ‌లివి. కొలిమిగుండ్ల‌కు కేవ‌లం మూడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బెలుం గ్రామంలో నెల‌కొంది.బిలం అనే సంస్కృత ప‌దం నుంచి తెలుగులో బెలుం గుహ‌లగా పేరు స్థిర‌ప‌డింది.1884లోనే బ్రిటిష్ స‌ర్వేయ‌ర్ రాబ‌ర్ట్ బ్రూస్‌ఫుట్ వీటిని తొలుత క‌నుగొన్నారు.అయితే 1982లో జ‌ర్మ‌నీకి చెందిన డేనియ‌ల్ గెబ‌ర్ నేతృత్వంలోని గుహ‌ల ప‌రిశోధ‌న‌,అధ్య‌య‌న క‌ర్త‌ల బృందం బెలుంగుహ‌ల్ని గుర్తించి లోతైన ప‌రిశోధ‌న‌లు సాగించింది.

బెలుం గుహ‌లు భ‌ళా: 1988లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈ గుహ‌ల‌ను ప‌రిర‌క్షించి ప‌ర్యాట‌క‌క్షేత్రంగా తీర్చి‌దిద్ద‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.1999లో ఈ మేర‌కు ప‌నుల‌ను ప్రారంభించి 2002 ఫిబ్ర‌వ‌రిలో ఈ బెలుంగుహ‌ల్ని జ‌న సంద‌ర్శ‌న‌కు సిద్ధం చేసింది.ఎపీటీడీసీ ద్వారా ఈ గుహ‌ల‌ను అభివృద్ధి ప‌రిచారు.ఈ గుహ‌లు 3,229 మీట‌ర్ల దూరం విస్త‌రించాయి. వీటి ప్ర‌త్యేక‌త ఏమంటే అంత‌ర్లీన గుహ‌లివి. పైకి మైదాన‌ప్రాంతంగా పొలాలు,ర‌హ‌దారిగా క‌నిపిస్తుంది.ఈ గుహ‌ల ద్వారం వ‌ద్ద‌కు వ‌చ్చేవ‌ర‌కు ఇక్క‌డ ఇవి ఉన్న‌ట్లే తెలీదు.3.5కిలోమీట‌ర్ల గుహ‌లో 1.5 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు మాత్ర‌మే జ‌నాన్ని అనుమ‌తిస్తారు.‌గుహ‌ల లోప‌ల పొడ‌వైన బాట‌లున్నాయి.వెడ‌ల్పైన ప‌లు గదులు నెల‌కొన్నాయి.జాలువారే స్వ‌చ్ఛ‌మైన చిన్న జ‌ల‌సేల‌యేరు సంద‌ర్శ‌కుల‌కు భ‌లే క‌నువిందు.భార‌త పురావ‌స్తు ప‌రిశోధ‌న శాఖ‌(ఏఎస్ఐ)ఈ గుహ‌ల్లో క్రీస్తు పూర్వం 4500 నాటి పాత్ర‌ల‌ను క‌నుగొంది.ఇందులో బౌద్ధ స‌న్యాసుల ధ్యాన‌మందిరాన్ని వారు ఉప‌యోగించిన వ‌స్తువులు త‌దిత‌రాల్ని గుర్తించింది.గుహ‌ల లోప‌ల 2కిలోమీట‌ర్ల మేర న‌డ‌క‌దారిని ఏపీటీడీసీ అభివృద్ధిప‌రిచింది.
చూడ బు(ద్ధి)ద్ధ‌:బెలుం గుహ‌ల‌కెళ్లే మార్గంలో ధ్యాన‌ముద్ర‌లో ఉన్న నిలువెత్తు బుద్ధ‌విగ్ర‌హం సంద‌ర్శ‌కుల‌కు స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు ఉంటుంది.గుహ‌ల లోప‌ల ప‌లు వంతెన‌లు,మెట్ల వ‌రుస‌లు అనేకం ఉన్నాయి.గాలి ఆడేందుకు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేశారు.కాల్షియం కార్బొనేట్‌తో రూపుదాల్చిన వేల‌కొద్దీ శివ‌లింగాలు కోటిలింగాల ఛాంబ‌ర్ వ‌ద్ద అల‌రిస్తూ క‌నిపిస్తాయి.ఇక్క‌డ ప్ర‌వ‌హిస్తూ క‌నిపించే పాతాల గంగ‌(సెల‌యేరు)ఎటుపోతోందో మాత్రం మ‌న‌కు అంతుచిక్క‌దు.ఈ గుహాల‌కు రెండు కిలోమీట‌ర్ల దూరంలోగ‌ల ఓ బావిలోకి ఈ నీరు చేరుతోంద‌ట‌.2006 నుంచి స‌ప్త‌స్వ‌రాల‌(మ్యూజిక‌ల్ ఛాంబ‌ర్‌)సంగీతం ఈ గుహ‌ల్లో సంద‌ర్శ‌కుల‌కు వీనులవిందు క‌ల్గిస్తోంది.ఇందులో గ‌ల ధ్యాన‌మందిరం అచ్చం ఓ మంచం,దానిపై దిండు ఉన్న ఆకృతిలో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది.బెలుంగుహ‌ల లోప‌ల పైభాగాన్ని చూస్తుంటే వేల‌కొద్దీ పాములు ప‌డ‌గ‌విప్పిన‌ట్లు మ‌న‌కు అనుభూతి క‌ల్గుతుంది.ఇందులోని మ‌ర్రిచెట్టు హాల్‌ను తిల‌కిస్తే సంభ్ర‌మాశ్చ‌ర్యాలు క‌ల్గుతాయి.మండ‌పం లోగిలి కూడా జ‌నాన్ని చూపుమ‌ర‌ల్చుకోనివ్వ‌దు.బెంగుళూరు నుంచి అలాగే హైద‌రాబాద్ నుంచి కూడా ఈ బెలుం గుహలు 320 కిలోమీట‌ర్ల దూరంలోనే ఉన్నాయి. క‌ర్నూల్ నుంచి ఇక్క‌డ‌కు 106 కిలోమీట‌ర్ల దూరం కాగా అనంత‌పురం నుంచి 85 కిలోమీట‌ర్లు ఉంటుంది.తాడిప‌త్రి నుంచి బెలుంగుహ‌ల‌కు 30 కిలోమీట‌ర్ల దూరం.అదే బ‌న‌గాన‌ప‌ల్లి నుంచ‌యితే కేవ‌లం 20కిలోమీట‌ర్లే దూరం.
భార‌త్‌లో పేరొందిన గుహ‌లు: అజ‌ంతా, ఎల్లోరా (మ‌హారాష్ట్ర‌); ఎలిఫెంటా గుహ‌లు (మ‌హారాష్ట్ర‌); క‌న్హెరి గుహ‌ల (మ‌హారాష్ట్ర‌). 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బెలుం గుహ‌లు(క‌ర్నూల్);బొర్రా గుహ‌లు(విశాఖ‌ప‌ట్నం);గుత్తికొండ,యాగంటి,ఉండ‌వ‌ల్లి గుహ‌లూ(గుంటూరు) ప్ర‌సిద్ధి చెందాయి.
వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ టాప్‌-10 కేవ్స్ 
*ములు కేవ్స్‌(మ‌లేసియా)
*జ‌యిట‌గ్రొట్టో(లెబ‌నాన్‌)
*కార్ల్స్ బ‌డ్ కేవ్ర‌న్స్‌(న్యూమెక్సికో-యు.ఎస్‌)
*స్కోజ‌న్ కేవ్‌(స్లొవేనియా)
*మ‌జ్లిస్ అల్‌జిన్‌(ఒమ‌న్‌)
*వైటొమొ(న్యూజిలాండ్‌)
*ఫ్యూర్టోప్రిన్సెస్‌(ఫిలిప్పైన్స్‌)
*కేవ్ ఆఫ్ క్రిస్ట‌ల్స్‌(మెక్సికో)
*రీడ్‌ఫ్లూట్ కేవ్స్‌(చైనా)
*ఇజ్రిసెన్వెల్ట్‌(జ‌ర్మ‌నీ)

26 Nov 2011

dead sea

http://royalloyal007.blogspot.in/2011/10/legend-lenin.html
చేప‌లు నీటిలో జీవిస్తాయి. ప‌క్షులు గాల్లో ఎగురుతాయి. జంతువులు భూమిపైన మ‌న‌గ‌ల్గుతాయి. నీటిలోనూ, భూమిపైన జీవించేగ‌ల్గే ఉభ‌య‌చ‌రాలు తాబేళ్ల త‌ర‌హా జీవులూ ఉన్నాయి. మ‌నుషులు నీటిపైన‌, గాల్లోనూ ప్ర‌యాణించ‌గ‌ల‌రు. వివిధ సాధ‌నాలు,వాహ‌నాలు అందుకు అవ‌స‌రం. ఈత నేర్చి సప్త స‌ముద్రాల్లో రికార్డులు సృష్టించిన వారూ ఉన్నారు. యోగా సాధ‌న‌ను ఈత‌కు జ‌త చేసి నీటిలో తేలియాడే వ్య‌క్తుల్ని చూసిన సంద‌ర్భంలో మ‌నం ఆశ్చ‌ర్యానికి గుర‌వుతుంటాం. మ‌రి ఏ ఈత‌,యోగా,ఇత‌ర ప‌రిక‌రాలు, వాహ‌నాలు ఏవీ లేకుండా నీట్లో తేలుతూ పేప‌ర్ చ‌దివ‌డం, క‌బుర్లాడుతూ కేరింత‌లు కొట్ట‌డం య‌మా మ‌జాయే క‌దూ! ఆ య‌థార్థ‌మే ఇది. అదే..ఈ డెడ్ సీ. ఇజ్రాయిల్, జోర్డాన్ దేశాల మ‌ధ్య నెల‌కొందీ స‌ముద్రం.
డెడ్ సీ : భూమండ‌లం మొత్తం మీద అతి త‌క్కువ ప‌రిధిలో విస్త‌రించిన స‌ముద్ర‌మిది. కేవ‌లం 1300 అడుగుల(400 మీట‌ర్లు) స‌ముద్ర‌మ‌ట్టంతో 377 మీట‌ర్ల లోతు క‌ల్గినదిది. నిజానికి ఈ స‌ముద్రం ఓ స‌ర‌స్సు. జోర్డాన్ న‌దీ జ‌లాలు, జోర్డాన్, ఇజ్రాయిల్ ప‌ర్వ‌త‌శ్రేణుల నుంచి జాలువారిన వ‌ర్ష‌పు నీరే ఈ స‌ముద్ర‌పు జ‌ల‌వ‌న‌రు.దీనికి ప్రాచీన నామం అమోర స‌ర‌స్సు. ఆధునిక కాలంలో లిసాన్ స‌ర‌స్సుగా పేరు. ఈ డెడ్ సీలో 30% ఉప్పు నీరే. ప్ర‌పంచంలో ఇత‌ర స‌ముద్రాల‌తో పోలిస్తే దీంట్లోని ఉప్పుశాతం దాదాపు 9% ఎక్కువ. అందుకే ఈ జ‌లాల్లో ఏజ‌లా చ‌రాలు జీవించ‌లేవు. స‌ముద్ర‌గ‌ర్భంలో సైతం ఏ మొక్క‌లు బ‌త‌క‌వు. అందుకే దీనికి డెడ్‌సీ (మృత స‌ముద్రం)గా పేరు. షేల్‌,క్లే,శాండ్ స్టోన్‌,రాక్‌సాల్ట్‌,జిప్సంల స‌మ్మిళ‌త‌మైన జ‌లాల స‌మాహార‌మీ స‌ముద్రం. అందుకే ఏ జీవి ఇందులో బ‌త‌క‌లేదు. కానీ మ‌నుషుల‌కు మాత్రం ఈ స‌ముద్రం పెద్ద ఆహ్లాదం. ఈ స‌ముద్ర‌పు మ‌ట్టి, గాలి కూడా మ‌న‌కు ఆరోగ్య‌దాయ‌క‌మే.ఈ స‌ముద్ర‌పు గాలిలో ఆక్సిజ‌న్ శాతం మెండు.ఇక్క‌డ మ‌ట్టి కొన్ని రోగాల‌కు చ‌క్క‌టి మందు.అదే ఈ స‌ముద్ర‌తీరానికో క‌ళ తెచ్చింది. ఏటా జోర్డాన్‌, ఇజ్రాయిల్ దేశాల్లో గ‌ల ఈ స‌ముద్ర తీరం పెద్ద సంఖ్య‌లోసంద‌ర్శ‌కుల్ని ఆక‌ర్షిస్తోంది అనేక రిసార్టులు, స్పాల‌కు వేదిక‌గా నిలుస్తోంది. ఈ స‌ముద్రంలో పైకి క‌నిపిస్తోంది జ‌ల‌మే అయినా అదో ర‌సాయ‌న స‌మ్మేళ‌నం. ఈ ముడి ర‌సాయ‌నాల్ని, మ‌ట్టిని విదేశాలు దిగుమ‌తి చేసుకుంటుంటాయి. అగ్రిక‌ల్చ‌ర్,మెడిసిన్స్,కాస్మోటిక్స్ త‌యారీలో ఈ జ‌లాల్ని ఉప‌యోగిస్తుంటారు.ఇక్క‌డ మ‌ట్టిపూత‌తో సోరియాసిస్;ఆర్థ‌రైటిస్‌,రినోసినుసిల‌స్ త‌దిత‌ర బాధ‌ల నివార‌ణ‌కు బాగా ఉప‌క‌రిస్తుంది. ముదురు నీలి రంగులో ఉండే ఈ డెడ్‌సీ 1980 త‌ర్వాత నుంచి ఎర్ర‌బారింది. ల‌వ‌ణ సాంద్ర‌త అత్య‌ధికంగా ఉండ‌డం వ‌ల్ల సాల్ట్‌సీగానూ పేరొందింది. జోర్డాన్‌,ఇజ్రాయిల్ దేశాల తీరాల్లో స్పాలు కోకొల్ల‌లు. ఇవి పెద్ద సంఖ్య‌లో సంద‌ర్శ‌కుల్ని, రోగ బాధితుల్ని అల‌రిస్తూ మూడు పువ్వులు, ఆరు కాయ‌లుగా వ‌ర్ధిల్లుతున్నాయి. 
జీస‌స్ న‌డిచిన స‌ముద్రం: ఏసు సొడం,గొమార్హ్ ప‌ట్ట‌ణాల గుండా ప‌య‌నిస్తూ ఒక సంద‌ర్భంలో గెలిలీ స‌ముద్రంపై న‌డిచిన‌ట్లు క్రైస్త‌వులు విశ్వ‌సిస్తారు. ఈ ప్రాంత సంద‌ర్శ‌న‌కు అరిస్టాటిల్‌,కింగ్ సొల్మ‌న్‌, షెబారాణి,క్లియోపాత్ర త‌దిత‌రులు వ‌చ్చిన‌ట్లు ప‌లు క‌థ‌నాలున్నాయి. అయితే ఈ జ‌లాల్లోకి నేరుగా దిగి ఈత కొడితే ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌నే హెచ్చ‌రిక‌లు చేస్తుంటారు. ఇక్క‌డ ఓ సినిమా షూటింగ్‌కు వ‌చ్చిన సమ‌యంలో అప్ప‌టి హాలివుడ్ న‌టుడు సిల్వ‌ర్‌స్టెర్ స్టాలెన్ ఇందులో జ‌ల‌కాలాడిన కొన్నేళ్ల‌కు ఆసుప‌త్రి పాల‌య్యాడ‌నే ప‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.
ఓల‌లాడించే జ‌లాలు: ఊహాల్లో విహ‌రించిన‌ట్టే ఈ డెడ్‌సీకి సంబంధించి కొన్ని తీరాల్లో హాయిగా అలా అలా తేలిపోవ‌చ్చు.ప‌డుకొని పేప‌ర్ చ‌దివేయొచ్చు.కొంత దూరం వ‌ర‌కు ఎటువంటి ప్ర‌త్యేక సాధ‌నాల్లేకుండా న‌డిచిపోవ‌చ్చ‌ట‌.అత్య‌ధిక ల‌వ‌ణాల సాంద్ర‌త వ‌ల్ల ఏర్ప‌డిన ఉప్పు తెట్టుల‌పై ఇది సాధ్య‌మేన‌ట‌.అంతేకాకుండా ఈ నీటిపై మ‌నిషి ఓ కార్క్‌(బెండు) మాదిరిగా  తేలిపోతాడ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు.
.................................................................
రంగుస‌ముద్రాలు
^ రెడ్ సీ: ఈజిప్టు,సుడాన్‌,ఎర్త్రియా,సౌదీ అరేబియా,యెమ‌న్‌
^ యెల్లో సీ: చైనా,ఉత్త‌ర‌కొరియా,ద‌క్షిణ‌కొరియా
^ బ్లాక్ సీ: ట‌ర్కీ,బ‌ల్గేరియా,రొమేనియా,ఉక్రేయిన్‌,ర‌ష్యా,జార్జియా
^ వైట్ సీ: ర‌ష్యా

25 Nov 2011

killer plants


మ‌నుషుల్ని తినే మొక్క‌లు ఉన్నాయా? ఈ విష‌య‌మై ప్ర‌పంచ ప్రసిద్ధ జీవ‌శాస్త్ర‌వేత్త చార్లెస్ డార్విన్ 15ఏళ్ల‌పాటు సుదీర్ఘంగా ప‌రిశోధ‌న‌లు సాగించారు. మొక్క‌లు ప‌గ‌టిపూట గాలిలోని కార్బ‌న్‌డ‌యాక్సైడ్‌ను స్వీక‌రించి ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తాయి. అదే రాత్రి వేళ‌ల్లో అందుకు పూర్తి భిన్నంగా సృష్టిలోని ఇత‌ర జీవుల మాదిరిగానే ఆక్సిజ‌న్‌ను స్వీక‌రించి కార్బ‌న్‌డ‌యాక్సైడ్‌ను వ‌దులుతాయి. భూమిపొర‌ల్లోని నీటిని త‌మ వేర్ల ద్వారా గ్ర‌హించి బ‌తుకుతాయి. అయితే  మొక్క‌ల‌కు మిన‌ర‌ల్స్‌,న్యూట్రింట్స్ అవ‌స‌ర‌మే. కేవ‌లం మ‌ట్టిలో ల‌భించే వాటి ద్వారానే చాలా మొక్క‌లు జీవిస్తాయి. కొన్ని మొక్క‌లు రాక్ష‌స‌జాతి మొక్క‌లు. అవి మిన‌ర‌ల్స్‌,న్యూట్రింట్స్‌ను కీట‌కాలు,జంతువుల్ని భ‌క్షించ‌డం ద్వారా కూడా పొందుతాయ‌ని జీవ‌శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఈ త‌ర‌హా మొక్క‌లు కీట‌కాలు, జంతువులు త‌మ ద‌రికి చేర‌గానే ఓ జిగురులాంటి విష‌పూరిత ర‌సాల‌ను విడుద‌ల చేసి వాటిని చంపేస్తాయి. ముఖ్యంగా ఈ ర‌సాలు కీట‌కాలు, జంతువుల ఊపిరితిత్తుల‌కు చేర‌గానే అవి చ‌నిపోయి ప‌డిపోతాయి. అప్పుడు అచ్చు ఓ జంతువు, మ‌రో జంతువును వేటాడి చంపి తిన్న‌ట్టుగానే ఇవీ ఆ మృత జీవాల నుంచి కావాల్సిన ఆహారాన్ని సంగ్ర‌హిస్తాయి.
 ఇంత‌కీ వీటి పేరు ఏమిటంటే కార్నివొర‌స్‌, మీట్ ఈటింగ్ ప్లాంట్స్‌. డార్విన్ వీటిని ఫ్లోరా ఇన్సెక్టివొన్స్‌గా పేర్కొన్నారు. ఆ త‌ర్వాత కాల‌పు శాస్త్ర‌వేత్త‌లు వీటి పేరును కార్నివోర్స్‌గా స్థిర‌ప‌రిచారు. అయితే వీటి వ‌ల్ల మ‌నుషుల‌కు ఎంత‌మాత్రం హాని లేద‌ట‌. ఈ రాక్ష‌స‌ మొక్క‌లు అమొర్‌ఫొఫ‌ల్స్ జాతికి చెందిన‌వి. వీటిలో ప్ర‌ధాన‌మైంది కార్ప్స్ ఫ్ల‌వ‌ర్‌.ఇది 9 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడ‌ల్పుతో దృఢంగా ఉండే సార్థ‌క‌నామ‌ధేయురాలు. ఈ త‌ర‌హా రాక్ష‌స‌మొక్క‌ల్లో జంతువుల‌కున్న‌ట్లే కోర‌లు, వాడైన గోళ్లులాగా  కాండాల్లో ప‌దునైన ముళ్లుంటాయి. ఏదైనా జీవి చిక్కిందంటే కొండ‌చిలువ చుట్టేసిన‌ట్లే ఇవీ త‌మ‌ గుబుర్ల‌లోకి లాగేసుకొని చంపేస్తాయి. ఇక కార్ప్స్ ఫ్ల‌వ‌ర్ విష‌యానికి వ‌స్తే ఇది రోజుకు 4 అంగుళాల చొప్పున ఒక‌ద‌శ వ‌ర‌కు పెరిగిపోతూంటుంది. ప్రపంచంలో వాస‌న వెద‌జ‌ల్లే మొక్క‌ల‌న్నింట్లోనో ఈ మొక్క నుంచి వెలువ‌డే వాస‌నే ఘాట‌యిన‌దిగా రికార్డు ఉంది. ఆ వాస‌న కూడా ఓ జీవి క‌ళేబ‌రం కుళ్లిపోతే వ‌చ్చే వాస‌న‌లాగే ఉంటుంది. ఈ మొక్క ఉనికిని ఆసియా దేశాల్లోనే క‌నుగొన్నారు. ఈ మొక్క ఇక్కడే పుష్పిస్తుంది. మ‌రే ఖండంలోని దేశాల్లో నాటినా అక్క‌డ వీటి మొగ్గ‌లు పుష్పించ‌వు. ప్ర‌స్తుతం వీటి జాడ అడ‌వుల్లోనూ కరవ‌యింది.1937లో అమెరికాలోని న్యూయ‌ర్క్ బొటానిక‌ల్ గార్డెన్‌లోనే శాస్త్ర‌వేత్త‌ల విశ్వ ప్ర‌య‌త్నాల వ‌ల్ల తొలిసారిగా పుష్పించింది. అదీ ఇప్ప‌టికి ఓ డ‌జ‌న్‌సార్లు మాత్ర‌మే పుష్పించింద‌ట‌.
రాక్ష‌స‌మొక్క‌లు:వీన‌స్ ఫ్లైట్రాప్స్‌,సండ్యూస్‌,పిచ‌ర్ ప్లాంట్స్‌,బ‌ట‌ర్‌వొర్డ్స్‌,బ్లాడ‌ర్ వొర్ట్స్ త‌దిత‌రాలున్నాయి.అయితే దాదాపు 40% మొక్క‌లు మాంసాహారులేన‌నే వాద‌నా ఉంది. ఫిలిప్పీన్స్‌లో పిచ‌ర్ ప్లాంట్‌ను ఇటీవ‌లే క‌నుగొన్నారు. ఈ మొక్క ఏకంగా ఎలుక‌లు,తొండ‌లు స‌హా కుందేళ్ల‌నే ఆరగించేస్తుంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ మాంసాహార మొక్క‌ల్లో ఇదే అతి పెద్ద‌దిగా బ్రిటిష్ బ్రాడ్ కాస్ట‌ర్ డేవిడ్ ఎటెన్‌బ‌రో 2009లో పేర్కొన్నారు.
______________________________________________________________
* మావోయిస్టు అగ్ర‌నేత కిష‌న్‌జీ ప‌శ్చిమ‌బెంగాల్లో భ‌ద్ర‌తా ద‌ళాల‌తో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మ‌ర‌ణించారు.
* ఈజిప్టు ఇంకా అట్టుడుకుతోంది. కైరోలోని తెహ్రిన్‌స్క్వేర్ వ‌ద్ద  సైన్యం జ‌రిపిన కాల్పుల్లో 40 మంది ఆందోళ‌న‌కారులు అశువులు బాశారు.
* ద‌క్షిణియా కొరియా పార్లమెంట్‌లో డిప్యూటీ స్పీక‌ర్‌పై కిమ్‌సంగ్ అనే స‌భ్యుడు భాష్ప‌వాయుగోళాన్ని విసిరి క‌ల‌కలం సృష్టించాడు.
* ధ‌ర‌ల పెరుగుద‌ల‌,కుంభ‌కోణాల‌కు నిర‌స‌న‌గా కేంద్రమంత్రి శ‌ర‌ద్‌ప‌వార్‌పై హ‌రీంద‌ర్ సింగ్ అనే వ్య‌క్తి దాడి చేశాడు.


23 Nov 2011

sabari mala


‬గ్రహాలెన్ని?ఇ0కా లెక్క తేల్లేదు. అసలు అక్కడ ఏము0దో కూడా ఇ0కా ఎవరికీ తెలియదు. ఈ నేపథ్య0లో సూపర్ పవర్ ఉ0దా లేదా అన్నది అప్రస్తుతమే కదా! అ0దుకే ఈ స్పీడ్ యుగ0లోనూ ప్రప0చవ్యాప్త0గా నేటికీ కోట్లాది మ0ది తమతమ ఇష్ట దైవాలను భక్తిగా కొలుస్తున్నారు. ముఖ్య0గా భారత్ లో ఆ స0ఖ్య ఇ0కా ఎక్కువ. లౌకిక రాజ్యమైన భారత్ అనేక మతావల0భికులకు వేదిక. ఇక్కడ ముక్కోటి దేవతలను ఆరాధిస్తు0టారు. దేవాలయాలు బోలెడున్నాయి. అ0దులో కొన్ని అతి పురాతనమైనవి. వాటిలో శబరిమల అయ్యప్ప గుడి ఒకటి. 4,000 ఏళ్ల నాటిదిది. ఏటా రె0డు నెలలు మాత్రమే తెరుచుకొనే ఈ ఆలయానికి దాదాపు 4 కోట్ల మ0ది వచ్చి వెళ్తు0టారు. వీరిలో అయ్యప్ప మాలాధారులే ఎక్కువ. గుడి నవ0బర్ రె0డో వార0లో తెరుచుకోగా మ0డల దీక్షకు వచ్చే స్వాములు అయ్యప్పను దర్శి0చుకు వెళ్తు0టారు.మాలాధారులు 41 రోజుల దీక్ష చేపట్టి ఇరుముడిని ధరి0చి శబరి కొ0డకు వస్తారు. స్వాములు దీక్షాకాల0లో పరమనిష్టగా ఉ0టారు. కాళ్లకు చెప్పులు సైత0 ధరి0చక కాలినడకతోనే దట్టమైన అటవీ మార్గ0లోనే వీరు కొ0డెక్కుతారు. మకరజ్యోతి దర్శనానికి జనవరిలో ఇ0కా పెద్ద స0ఖ్యలో భక్తులు వస్తు0టారు.
కాంతిక్షేత్రం: శ‌బ‌రిమ‌ల‌కు మ‌దంగమ‌ల‌,పొటుల‌క అనే పేర్లూ ఉన్నాయి. మ‌దంగ‌స్వామి తిరుగాడిన ప్రాంత‌మైనందున `మ‌దంగ‌మ‌ల‌`అని పేరు వ‌చ్చింది.పొట్టు అంటే ప్రాచీన తమిళంలో కాంతి అని అర్థం.ఉల‌క అంటే ప్రాంత‌మ‌ని అర్థం ఉన్నందున పొటుల‌క అనే పేర్లూ ఉన్న‌ట్లు తెలుస్తోంది. రామాయ‌ణ‌కాలంలో శ‌బ‌రిని క‌లిసేందుకు ఇక్క‌డ‌కు గిరిజ‌నుడైన రామ్‌తో క‌లిసి స్వామి మ‌దంగ‌ వ‌చ్చార‌ని పురాణాలు చెబుతున్నాయి.పాండ్య రాజ వంశీకులు ఇప్ప‌టికీ ఆల‌య సంప్ర‌దాయాల్ని కాపాడ్డంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. మోహినీ అవ‌తారంలోని విష్ణువుకి, శివునికి లోక‌క‌ల్యాణార్థం క‌ల్గిన సంతాన‌మే స్వామి అయ్య‌ప్ప‌.మ‌త విశ్వాసానికి, లౌకిక‌త‌త్వానికి ప్ర‌తీక‌.అందుకే గురుస్వాముల్ని భ‌క్తులంతా ఈశ్వ‌ర స్వ‌రూపుడిగా కొలుస్తారు.శ‌బ‌రిగిరిపై 18 కొండ‌ల మ‌ధ్య గ‌ల ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో అయ్య‌ప్ప వెలిశాడు. అందుకే పంచ‌లోహాల‌తో త‌యార‌యిన 18 మెట్ల‌పైకెక్కే మాలాధారులు అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకుంటారు. ఇందులో తొలి అయిదు మెట్లు పంచేంద్రీయ క‌ర్మ‌ల‌కు సంబంధించిన‌వి. చూపు,వినికిడి,వాస‌న,రుచి,స్ప‌ర్శ‌లే అవి. 
త‌ర్వాత ఎనిమిది మెట్లు కామ‌, క్రోద, లోభ, మోహ, మ‌ధ, మ‌త్స‌ర్య, అసూయ, దూష‌ణ‌ల‌కు సంబంధించిన‌వ‌వి.ఆ త‌ర్వాత మూడు మెట్లు గుణ‌,త్రిగుణ‌లైన సాత్వ‌,రాజ‌స‌,త‌మా గుణాలు. చివ‌రి రెండు మెట్లు జ్ఞానం, అజ్ఞానాల‌కు సంబంధించిన‌వి.వీటిని దాటితేనే మాలాధారుల‌కు స్వామి అయ్య‌ప్ప ద‌ర్శ‌నం ల‌భిస్తుంది. నీలిమ‌ల కొండ‌ల్లోని అతి క్లిష్ట‌మైన‌ అట‌వీ మార్గంలో 3కిలోమీట‌ర్లు న‌డిచే స్వాములు అయ్య‌ప్ప స‌న్నిధానానికి చేరుకుంటారు.పంపా వ‌ర‌కే వాహ‌నాల‌కు ప్ర‌వేశం ఉంటుంది. కేర‌ళ‌లోని ప‌ట‌నారితెట్ట జిల్లాలోని ర‌న్నీ తాలూకాలోని పెరినాడ్ గ్రామానికి స‌మీపంలో ఉందీ పురాత‌న అయ్య‌ప్ప ఆల‌యం.సినీస్టార్లు అమితాబ్‌,ర‌జ‌నీకాంత్‌,రామ్‌చ‌ర‌ణ్‌,నిర్మాత సురేశ్‌బాబు,ప్ర‌ముఖ ఇండ‌స్ట్రిలిస్టులెంద‌రో త‌ర‌చు మాల ధ‌రిస్తూ అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకుంటుంటారు.ఉర‌కుజి తీర్థం లోని(సంక్టం సంక్టోరం)వ‌ద్ద కొలువు దీరాడు స్వామి అయ్య‌ప్ప‌.ఈ ఆల‌యం స‌ముద్ర మ‌ట్టానికి 1260 మీట‌ర్ల ఎత్తున ఉంది. మాలాధారులు ఇరుమెలి,వండి పెరియార్‌,చ‌ల్కాయం అనే మూడు వేర్వేరు మార్గాల మీదుగా కొండ‌కు వెళ్తారు. 
మ‌క‌ర‌జ్యోతి:ఈ దివ్య జ్యోతి మాన‌వ‌క‌ల్పిత‌మేన‌ని చాలామందికి తెలుసున‌ని అయితే అత్య‌ధిక సంఖ్యాకులైన హిందువులు దీన్నో ప‌విత్ర‌జ్యోతిగా భావిస్తార‌ని శ‌బ‌రిమ‌ల ఆల‌య,ట్రావెన్‌కోర్ దేవ‌స్థానం బోర్డు(టిడిబి) పేర్కొంది. పొన్నంబ‌ల‌మేడు వ‌ద్ద గిరిజ‌నులు కొంద‌రు ఈ జ్యోతిని వెలిగిస్తార‌ని త‌మ‌కూ తెలుస‌ని బోర్డు ప్రెసిడెంట్ ఎం.రాజ‌గోపాల‌న్ నాయ‌ర్ పాత్రికేయుల‌కు ఓ సంద‌ర్భంలో తెలిపారు.అయితే ఈ విష‌యానికి తాము ప్ర‌చారం క‌ల్పించ‌ద‌లుచుకోలేద‌ని ఎందుకంటే అత్య‌ధిక హిందువుల మ‌నోభావాల‌కు సంబంధించిన విష‌య‌మ‌ని ఆయ‌న గుర్తు చేశారు. జ‌న‌వ‌రి14,2011లో పులిమేడు వ‌ద్ద‌ ఏవో వ‌దంతులు రాజ్యమేల‌డంతో నెల‌కొన్న తొక్కిస‌లాట‌లో 102 మంది భ‌క్తులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఇటువంటి  ప్ర‌మాదాల నివార‌ణ‌కు ఏడాది పొడ‌వునా గుడిని తెరిస్తే ర‌ద్దీ త‌గ్గుతుంద‌న్న కేర‌ళ హైకోర్టు సూచ‌న‌ను బోర్డు సున్నితంగా తిర‌స్క‌రించింది.అనాదిగా వ‌స్తున్న సంప్ర‌దాయాల‌కు విరుద్ధంగా తామిప్పుడు వ్య‌వ‌హ‌రించ‌లేమ‌ని పూజ్య పూజార్లు,ట్రావెన్‌కోర్ అండ్ పాండ్యాలం రాజ‌వంశీకులు,అధికారుల‌తో కూడిన టిడిబి పేర్కొంది. వేల సంవ‌త్స‌రాల‌గా ఆచ‌రిస్తున్న సంస్కృతి,సంప్ర‌దాయాలు,ఆల‌య విధివిధానాల్లో భాగంగా 18 మెట్ల విస్త‌ర‌ణ కూడా సాధ్యం కాద‌ని బోర్డు సభ్యు‌లైన పూజార్లు కంద‌రామ రాజ‌వ‌రు,వాస్తు నిపుణులు క‌న్నిప‌యార్ నారాయ‌ణ‌న్ నంబూద్రి త‌దిత‌రుల బృందం కోర్టుకు విన్న‌వించింది.ఏది ఏమైనా అత్య‌ధిక సంఖ్య‌లో భ‌క్తుల‌తో అల‌రారుతున్న ఈ ఆల‌యం వ‌ద్ద ప్ర‌మాద నివార‌ణ చ‌ర్య‌ల‌కు కేర‌ళ ప్ర‌భుత్వం, బోర్డు న‌డుం బిగిస్తేనే ఆల‌య సంప్ర‌దాయాల్ని కాపాడ్డంతోపాటు స్వాముల‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.
_______________________________________________________________

భార‌త్‌కు డ‌బుల్:ప‌్ర‌పంచ క‌బ‌డ్డీలో భార‌త్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. పంజాబ్‌లో జ‌రిగిన 14 దేశాల ఈ టోర్నీ ఫైన‌ల్లో భార‌త పురుషులు, మ‌హిళా జ‌ట్లు విజ‌యం సాధించాయి. భార‌త పురుషుల జ‌ట్టు కెన‌డాపై 59-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది.పాకిస్థాన్ జ‌ట్టు మూడో స్థానం ద‌క్కించుకుంది. వ‌రుస‌గా రెండోసారి భార‌త్ ప్ర‌పంచ విజేత‌గా నిలిచింది.

22 Nov 2011

3gorjes


చైనా ది డ్రాగ‌న్‌..దాదాపు 140 కోట్ల జ‌నాభా. ప్ర‌పంచంలో అధిక జ‌నాభా గ‌ల అగ్ర‌దేశం.22 ప్రావిన్సుల గ‌ల క‌మ్యూనిస్టు దేశం. ఏదైనా త‌ల‌పెడితే సాధించాల‌నే త‌ప‌న న‌ర‌న‌రాన్న జీర్ణించుకున్న జ‌నం. అగ్ర‌రాజ్యం స్థానం పొందాల‌ని ఉవ్విళ్లూరే పాల‌కులు..పాల‌న‌యినా ప్రాజెక్ట‌యినా క‌డ‌దాకా కంక‌ణ‌బ‌ద్ధులై కొన‌సాగిస్తారు. అందుకో ఉదాహ‌ర‌ణ త్రీగోర్జెస్ డ్యాం. యాంగ్జె న‌ది..ప్ర‌తి ప‌దేళ్ల‌కు ఓసారి భారీ వ‌ర‌ద‌ల‌తో త‌న త‌డ‌ఖా చూపిస్తోంటోంది. 1954లో అయితే ఏకంగా 33 వేల మందిని త‌న‌లో క‌లిపేసుకుంది. 1998లో సైతం మ‌రోసారి బిలియ‌న్ డాల‌ర్ల ఆస్తి న‌ష్టాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు మిగిల్చింది. ఆ వ‌ర‌ద‌ల‌కు ముగింపు ప‌ల‌కాల‌నే ప్ర‌థాన ఉద్దేశంతో త్రీగోర్జెస్ డ్యాంకు అక్క‌డ ప్రభుత్వం న‌డుం బిగించింది. ఈ డ్యాం ద్వారా ఉత్ప‌త్త‌య్యే హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ఎంతంటే 22,500 మెగావాట్లు. ఓ వైపు వ‌ర‌ద‌ల న‌ష్టాన్ని నివారించ‌డ‌మే కాక దేశానికి అవ‌స‌ర‌మైన విద్యుత్‌ను చౌక‌గా త‌యారు చేయ‌డ‌మే ఈ త్రీగోర్జెస్ డ్యాం లక్ష్యం. అదే ఆ దేశానికి ప్ర‌పంచంలోనే అతి పెద్ద హైడ్రో ప్రాజెక్టు అమ‌ర‌డానికి కార‌ణ‌మైంది. త‌ద్వారా వివిధ కాల్వ‌ల ద్వారా మిగులు జ‌లాల్ని వ్య‌వ‌సాయానికి వినియోగించ‌డాన్ని ఆ దేశ పాల‌కులు చేప‌ట్టారు. దాదాపు మూడు కోట్ల మంది నిర్వాసితుల్ని 2008 నాటికే ఇత‌ర ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కు త‌ర‌లించి ఆవాసం క‌ల్పించారు. ఈ భారీ ప్రాజెక్టు వ‌ల్ల భూకంపాలు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డ‌మ‌నే ప్ర‌మాదం ఉన్నా క‌ల్గే ప్ర‌యోజ‌న‌మే మిన్న‌గా భావించి 1994లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును 2008 అక్టోబ‌ర్ 30 నాటికి పూర్తి స్థాయిలో నిర్మించి ప్రారంభించారు. ఇందుకు వాళ్లు వ్య‌యం చేసిన మొత్తం అక్ష‌రాల 26 బిలియ‌న్ అమెరికా డాల‌ర్లు. ఈ ప్రాజెక్టు ఊహ 1919 నాటిది. 1932లో మ‌రోసారి మ‌దిలో మెద‌ల‌గా పాల‌కులు 1934లో ప్రాథ‌మిక అంచానా ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టారు.
1944లో అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ రిక్ల‌మేష‌న్ చీఫ్ డిజైన్ ఇంజినీర్ జాన్ ఎల్‌.సేవెజ్ ఆధ్వ‌ర్యంలో స‌ర్వే జ‌రిగింది. 54 మంది చైనా ఇంజినీర్ల బృందం ఈ ప్రాజెక్టు కోసం శిక్ష‌ణ‌కు అమెరికా వెళ్లారు.అయితే చైనా సివిల్ వార్ వ‌ల్ల 1947లో ఈ ప్రాజెక్టుకు ఆటంకం ఏర్ప‌డింది. 1949లో క‌మ్యూనిస్ట్‌ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక మావో జెడాంగ్ కూడా త్రీగోర్జెస్ డ్యాంకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే ముందు మాత్రం గెజ్హాబా డ్యాంను ప్రారంభించారు. త‌ర్వాత గ్రేట్ లీప్‌ ఫార్వార్డ్‌, సాంస్కృతిక విప్ల‌వం, యాంగ్జె వ‌ర‌ద‌ల వ‌ల్ల 1956లో డ్యాం ప‌నులు అట‌కెక్కాయి. ఈ డ్యాం నిర్మాణాన్ని మావోజెడాంగ్ ఎంత‌గా ప్రేమించారంటే 1958లో దీనిపై ఆయ‌న ఏకంగా `స్విమింగ్‌` పేరిట ఓ ప‌ద్యాన్నే రాసేశారు. ఎట్ట‌కేల‌కు 1992లో నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదంతో మ‌ళ్లీ త్రీగోర్జెస్ ప్రాజెక్టు ప‌ట్టాల‌కెక్కింది.క‌న్‌స్ట్ర‌క్ష‌న్ 1994 డిసెంబ‌ర్ 14న మొద‌ల‌యింది. అక్క‌డ నుంచి ఒక్కో ద‌శ శ‌ర‌వేగంగా పూర్త‌వుతూ త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌చ్చింది. ఈ డ్యాంను చూడ్డానికి మావో జెడాంగ్ నోచుకోక‌పోవ‌డ‌మే చైనీయుల‌కు బాధ‌ను క‌ల్గించే విష‌యం.
త్రీగోర్జెస్-త్రీబెనిఫిట్స్:వ‌ర‌ద‌ల నివార‌ణ, చౌక‌గా విద్యుదుత్పాద‌న, వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌కు స‌మృద్ధిగా జ‌లాలు. ఈ మూడింటిని సాధించేందుకు చైనా క‌మ్యూనిస్టులు దేశ‌, విదేశాల్లో ఎదురైన వ్య‌తిరేక‌త‌కు ఎదురునిలిచి ప్రాజెక్టును పూర్తి చేశారు. ప్ర‌పంచంలో భారీ డ్యాంగా పేరొందిన త్రీగోర్జెస్ ఎత్తు 181 మీట‌ర్లు కాగా పొడ‌వు 2,335 మీట‌ర్లు. ఏటా విద్యుదుత్ప‌త్తి 80 టిడ‌బ్ల్యూహెచ్. ఈ ప్రాజెక్టుకే మ‌రో హైలైట్ షిప్‌లిఫ్ట్‌. ఈ ప‌నులు 2012 నాటికి మొత్తంగా పూర్తి కానున్నాయి. థ‌ర్మ‌ల్‌,విండ్‌,న్యూక్లియ‌ర్ త‌దిత‌ర ఏ ఇత‌ర విద్యుదుత్పాద‌న‌ల క‌న్నా హైడ్రో విద్యుదుత్పాద‌నే కారుచౌక‌. 66 దేశాల్లో 50% విద్యుత్ ఉత్ప‌త్తి హైడ్రో ప‌వ‌ర్ కావ‌డ‌మే అందుకో చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌. అస‌లు ప్ర‌పంచంలోనే అన్ని దేశాల విద్యుదుత్పాద‌న‌లో హైడ్రో వాటా 20%. పైగా కాలుష్య ర‌హితం. త్రీగోర్జెస్ రాక‌తో చైనాలోని 31 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు ఆదా అయిన‌ట్లు నేష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ రిఫార్మ్స్ క‌మిష‌న్ పేర్కొంది. అంతేకాదు 100 మిలియ‌న్ ట‌న్నుల గ్రీన్‌హౌస్ వాయువుల్ని నివారించ‌గ‌లిగార‌ట. ఇదో చారిత్ర‌క సాంకేతిక‌ నైపుణ్యాల‌కు నిలువుట‌ద్దంగా చైనా పేర్కొంటోంది. ఇంత‌కీ త్రీగోర్జెస్ చైనాలో ఎక్క‌డుందంటే హుబె ప్రావిన్స్‌లో సాండేపింగ్,యిచాంగ్ ప‌ట్ట‌ణాల మ‌ధ్య‌న ఉంది. షాంఘై న‌గరానికి ఈ ప్రాజెక్టు 1000 మైళ్ల దూరం. తొలిసారిగా హైడ్రో ప‌వ‌ర్ వెలుగులీనింది మాత్రం 1878లో నార్తంబెర్లాండ్‌(ఇంగ్లాండ్‌)లోని క్రాగ్‌స‌యిడ్ హౌస్‌లోనే. 1882లో అమెరికాలోని ఫాక్స్ రివ‌ర్ నుంచి ఉత్ప‌త్తి చేసిన హైడ్రో ప‌వ‌ర్‌ను రెండు చిన్న‌త‌ర‌హా పేప‌ర్‌మిల్స్‌లో వినియోగించారు.
హైడ్రో ప‌వ‌ర్ ఉత్ప‌త్తిలో టాప్ టెన్ దేశాలు
త‌జికిస్థాన్-5,27,700 (మెగావాట్లు); 
కెన‌డా-3,41,312(మెగావాట్లు); 
అమెరికా-3,19,484 (మెగావాట్లు); 
బ్రెజిల్-2,85,603 (మెగావాట్లు); 
చైనా-2,04,300 (మెగావాట్లు);   
ర‌ష్యా-1,60,500 (మెగావాట్లు); 
నార్వే-1,21,824(మెగావాట్లు); 
జ‌పాన్-84,500 (మెగావాట్లు); 
ఇండియా-82,237 (మెగావాట్లు); 
ఫ్రాన్స్‌-77,500 (మెగావాట్లు).
వ‌ర‌ల్డ్ టాప్-10 హైడ్రో ప‌వ‌ర్ ప్రాజెక్ట్స్‌
*త్రీగోర్జెస్ డ్యాం: 2008-22.5(జి.డ‌బ్ల్యూ)-చైనా(యాంగ్జె న‌ది)
*ఇట‌యిపు హైడ్రో ఎల‌క్ట్రిసిటీ ప‌వ‌ర్ ప్లాంట్‌:2003-14,000(ఎం.డ‌బ్ల్యూ)-బ్రెజిల్‌
*గురి డ్యాం: 10.2(జి.డ‌బ్ల్యూ)-వెనిజులా(క‌రోని న‌ది)
*టుకురాయ్ డ్యాం:1975-8.5(జి.డ‌బ్ల్యూ)-టుకురాయ్ కౌంటీ, బ్రెజిల్‌ 
*గ్రాండ్ కౌలీ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్‌-7000(ఎం.డ‌బ్ల్యూ)-అమెరికా
*స‌యానొ-షుష్నెస్క్యా-1978-6,400(ఎం.డ‌బ్ల్యూ)-ర‌ష్యా
*క్ర‌స్నోయార్స్క్ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్‌-1972-6000(ఎం.డ‌బ్ల్యూ)-ర‌ష్యా(మెనిసె న‌ది)
*రాబ‌ర్ట్ బౌర్సా హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్‌-5,600(ఎం.డ‌బ్ల్యూ)-కెన‌డా(లిగ్రాండె)
*చ‌ర్చిల్ ఫాల్స్ జ‌న‌రేటింగ్ స్టేష‌న్‌-5,400(ఎం.డ‌బ్ల్యూ)-కెన‌డా
*లాంగ్టాన్ డ్యాం-2(జి.డ‌బ్ల్యూ)-చైనా(హొమ్ష్యా న‌ది)
______________________________________________________________
వెయిటింగ్ రికార్డ్స్:ముంబాయి..వెస్టిండీస్‌-భార‌త్ సీరీస్‌లో చివ‌రిద‌యిన మూడో టెస్ట్‌..ఇందులో ఏముంది కొత్త విష‌యం..ఎందుకంటే ఇప్ప‌టికే సీరీస్‌ను ఇండియా గెలిచేసింది. మ‌రి మ‌జా ఏంటంటే మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ నూరో
శ‌త‌కం కోస‌మే ప్ర‌పంచ క్రికెట్ అభిమానుల ఆత్రం.అదీ స‌చిన్ త‌న సొంత గ్రౌండ్‌లో సాధిస్తాడ‌నే స‌గ‌టు అభిమానులంతా వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు.ఇంతేనా అంటే ఇంకా ఉంది..గ్రేట్‌వాల్ ద్ర‌విడ్ టెస్టుల్లో 13వేల ప‌రుగుల రికార్డు చెంత‌, డాషింగ్ రేస‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ 8 వేల ప‌రుగుల ముంగిట ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవ‌రిప్పుడు త‌మ‌ రికార్డును లిఖిస్తారో రేప‌టి వ‌ర‌కు వేచి చూడాలి.
  ‌

19 Nov 2011

GUYS


GUYS
V.Uma Shankar,Mechanical engineer
VIZAG STEEL PLANT (VSP)

Message from Guys column 
(Guts Utilized Youth`s Success)
The first and foremost duty of parents is they have to inculcate virtues and moral values of life in their children right from the elementary stage itself. They are to be explained clearly the prospects of various faculties of learning such as engineering,medical science, law, literature,social sciences, humanities, fine arts etc. during their secondary and higher Secondary phases. Children should be given full freedom and choice to choose a career. They are interested in after they make thorough and promoted study. If the children are so encouraged, they developed mental enlightment, grow in a healthy congenial atmosphere and build their career. Hence they can become the proud citizens of the nation by excelling in their much desirous fields and come of with flying colours.
______________________________________________________________

World Top10 engineering institutes


1. Massachusetts Institute of Technology:
If you are studying in MIT then it’s just like drinking from a fireplug. Profs are unique, strange and seems that they have just landed to attend lecture from a mysterious planet. Enough environment to keep any nerd on the edge. Apart from partying and sporting, hacking is one of the most preferable timepass for students here.
2. Stanford University:
If you have “Stanford University” on your resume then doors are open for you all along the way. If once you are trapped in the vibrancy of intellectual and driven people then it’s hard to go back into the real world. If you’re given the chance, come to Stanford. You won’t regret it.
3. University of Cambridge:
If you love challenges, love to throw yourself at whatever comes your way then you are welcome to Cambridge. An outstanding reputation for teaching, research and solving nerdiest assignments, Cambridge offers world class educational facilities as well as a platform to show yourself something different in society.
4. University of California:
Combination of talented and energetic students, a world class faculty, a beautiful campus, a spirit to look beyond and a place where students come from variety of socio-economic backgrounds. Don’t feel shocked when you are going to attend your introductory class and finds your prof a Nobel prize winner.
5. Georgia Institute of Technology:
Georgia Tech is distinguished by its commitment to improving the human condition through advance science and technology. Friends, support and extracurricular activities make your not studying time more enjoyable.
6. California Institute of Technology:
It’s a kind of place that is very rare indeed and teaches you how to innovate and think creatively. Commonly referred as Caltech, this landmark engineering institute provides you the truly superior understanding of all the basic aspects of technology.
7. University of Illinois:
Absolute blast and a perfect fit for your skills. U of I is known for its notable faculty and alumni list and also its detachment from odd craps such as – manipulating your teachers, displaying your effort and hoping that prof will give you the benefit of doubt and up your grade.
8. Imperial College London:
In 1907 three colleges were merged to create one university. It is a different world, everyone is nerd and serious about work. Hectic schedule in day with profs and books (In lecture hall) and hectic schedule in night with pretty partners and beer (In pubs or dance floor). It enables you to take part in any activity you could possibly want to.
9. University of Michigan:
Ever since it’s inception in 1854 this university has consistently formulated new standards of excellence in study and research. Go ahead and meet students from all across the world who have come to study just like you.
10. National University of Singapore:
Launched in 1968, the Faculty of Engineering (FOE) is the largest faculty of NUS. This university provides a strong foundation to students, willing to build up a society through innovation, leadership and banging out the strangest stuff.

(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome)


18 Nov 2011

siberian crane

 (you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome)
అందానికే అందం..ప‌క్షి జాతికే  మ‌కుటాయ‌ మానం.. సైబీరియా ప‌క్షులు . చాలా బ‌లిష్ట‌మైన‌వి కూడా. దాదాపు 4000 వేల మైళ్ల సుదూర తీరం నుంచి ఇవి వ‌ల‌స‌గా అలుపుసొలుపు లేకుండా ఎగురుకుంటూ రావ‌డ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. సైబీరియా వాస్త‌వానికి ర‌ష్యాలో ఓ ప్రాంతం. యూర‌ప్ ఖండ‌మే అయినా ఉత్త‌ర ఆసియా ఖండానికి స‌రిహ‌ద్దుల్లో ఉంది. సైబీరియా మొత్తం వైశాల్యం మొత్తం 10 మిలియ‌న్ చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు. సుమారు 3 వేల మైళ్ల ప‌ర్వ‌తశ్రేణుల‌తో కూడిన ప్రాంతం. శీతాకాలంలో ఇక్క‌డ ఉష్ణోగ్ర‌త -68 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటుంది. ఈ అతిశీత‌ల వాతావ‌ర‌ణానికి దూరంగా వెచ్చ‌ని ప్రాంతంగా భార‌త్‌ను ఎంచుకొని ఈ ప‌క్షులు ఇలా వ‌ల‌స వ‌చ్చేస్తాయి. వీటి వ‌ల‌స‌కు ప్ర‌ధాన కారణాలు మూడు పున‌రుత్ప‌త్తి, మంచి ఆహారం, నీరు, ఆహ్లాద‌క‌ర (వెచ్చ‌ని) వాతావ‌ర‌ణాన్ని ఆశించే సైబీరియా ప‌క్షులు పెద్ద సంఖ్య‌లో వేల మైళ్ల‌ను లెక్క‌చేయ‌కుండా వ‌ల‌స‌ వ‌స్తాయి. తెల్ల‌నైన ఈ కొంగ‌ల రూపు బ‌హు ఆక‌ర్ష‌ణీయం. వీటి క‌ళ్ల రంగు ప‌సుపు.త‌ల భాగం ఇరువైపుల‌ ఇటుక రంగుతో ఉంటుంది. ముక్కు రంగు ఎరుపు కాగా కాళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులో ఆక‌ర్షిస్తుంటాయి. చేప‌లు, కీట‌కాలే వీటి ఆహారం. 
సైబీరియా నుంచి భార‌త్‌కు వ‌ల‌స వ‌చ్చే క్ర‌మంలో ఆప్ఘ‌నిస్థాన్‌లోని అబ్‌-ఇ-ఎస్ట‌డా స‌ర‌స్సు ప్రాంతంలో సేద తీరి మ‌ళ్లీ ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తాయి. హిమాల‌యాల మార్గంలో ఇవి ప్ర‌యాణిస్తుండ‌గా పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో ఇవి పెద్ద సంఖ్య‌లో వేట‌గాళ్ల బారిన ప‌డుతున్నాయి. దాంతో మొత్తం ఈ జాతి ప‌క్షుల ఉనికికే పెనుముప్పు పొంచి ఉంది. ఈ శీతాకాలంలో ఎక్కువ దూరం ఎగ‌ర‌డం ద్వారా త‌మ సామ‌ర్థ్యాన్ని పెంచుకోజూడ్డం కూడా వీటి ప్రాథ‌మిక ల‌క్ష‌ణంగా శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. సైబీరియా కొంగ‌ల‌కు వొల్ఫ్‌,స్నో క్రేన్ల‌గాను పేరుంది. ఇవి దాదాపు 30 ఏళ్లు జీవిస్తాయ‌ట‌.ఇవి తొలుత‌ రాజ‌స్థాన్‌, పంజాబ్‌, హ‌ర్యానాల్లోనే దిగుతాయి.

భార‌త్‌లో టాప్‌-10 ప‌క్షి సంర‌క్ష‌ణ కేంద్రాలు
ప్రపంచంలో మొత్తం 8650 ప‌క్షి జాతులుండ‌గా వాటిలో 1200 ర‌కాలు భార‌త్‌లో ఉన్నాయి. భార‌త్ జాతీయ ప‌క్షి
నెమ‌లి కాగా ఇండియ‌న్ ఈగిల్ (గరుడ‌) హిందువుల‌కు ఆరాధ్య ప‌క్షి జాతి. బ‌స్ట‌ర్డ్‌, ఇండియ‌న్ హార్న్‌బిల్‌,
కింగ్‌ఫిష‌ర్స్ వంటి ఆక‌ర్ష‌ణీయమైన ప‌క్షులెన్నో దేశ‌,విదేశీ సంద‌ర్శ‌కుల్ని అల‌రించే ప‌దికిపైగా ప్ర‌పంచ ప్ర‌సిద్ధ‌ ప‌క్షి సంర‌క్ష‌ణ కేంద్రాలు భార‌త్‌లో ఉన్నాయి. 
*భ‌ర‌త్‌పూర్ బ‌ర్డ్ సాంక్చురి: రాజ‌స్థాన్‌లోగ‌ల దీనికే కియోల‌డియో ఘ‌నా నేష‌న‌ల్ పార్కుగా కూడా పేరు. ప్ర‌పంచంలోనే ప్ర‌సిద్ధి చెందిన కేంద్ర‌మిది. థార్ ఎడారి స‌మీపంలో గ‌ల ఈ పార్క్‌లో ప‌లు స‌ర‌స్సులూ సంద‌ర్శ‌కుల‌కు
క‌నువిందు చేస్తాయి. ముఖ్యంగా ఇక్క‌డ‌కు వ‌చ్చే వేల‌కొద్దీ సైబీరియా కొంగ‌లు, ఇత‌ర విదేశీ వ‌ల‌స ప‌క్షులు సంద‌ర్శ‌కుల్ని, ప‌క్షి ప్రేమికుల్ని ఆక‌ట్టుకుంటుంటాయి. 
*సుల్తాన్‌పూర్ బ‌ర్డ్ సాంక్చురి: 100 ర‌కాల ప్ర‌పంచ ప‌క్షులు ఇక్క‌డ‌కు వ‌ల‌స వ‌స్తుంటాయి. హ‌ర్యానాలోని గుర్గాన్ జిల్లాలోని ఈ కేంద్రం వివిధ అట‌వీ జంతువుల‌కు అనేక ర‌కాల రంగుల్లోని వ‌ల‌స ప‌క్షుల‌కే పెద్ద వేదిక‌. ప‌క్షుల కిల‌కిలా రావాల‌తో ఇక్క‌డ‌కు వ‌చ్చే సంద‌ర్శ‌కులు మైమ‌ర‌చిపోతుంటారు.
* స‌లీం అలీ బ‌ర్డ్ సాంక్చురి: గోవాలో గ‌ల ఈ ప‌క్షి సంర‌క్ష‌ణ కేంద్రం మందోని న‌దీ తీరంలోని చొరావ్ ఐలాండ్‌లో ఉంది. వివిధ ర‌కాల పిచ్చుక‌ల‌కు, అందాల చిలుక‌ల‌కు, పిపొర‌ల్ బ‌ర్డ్స్‌, పెలికాన్‌, ఇండియ‌న్ జెయింట్‌ స్క్విర‌ల్స్‌, ఫౌనాల‌కు పేరెన్నిక ఈ సాంక్చురి. 
*కుమ‌ర‌కోమ్ బ‌ర్డ్ సాంక్చురి: కేర‌ళ‌లోని వెంబాన‌ద్ ప‌క్షి సంర‌క్ష‌ణ క్షేత్రంగా కూడా పేరు. వెంబాన‌ద్ స‌ర‌స్సు వ‌ల్లే ఈ కేంద్రానికి ఆ పేరు కూడా ఉంది. ఫ్లైకేచ‌ర్‌, టియ‌ల్ త‌ద‌త‌ర విదేశీ ప‌క్షి జాతుల‌కు ప్ర‌సిద్ధి. ఈ రాష్ట్రంలోనే
మంగ‌ళ‌వ‌నం, త‌ల్తెక‌ద్‌ సంర‌క్ష‌ణ కేంద్రాలూ ఉన్నాయి.
*రంగంత‌ట్టు బ‌ర్డ్ సాంక్చురి: క‌ర్ణాట‌క‌లోని కావేరి తీరంలో కొలువుదీరింది. లైట్ ఇబిస్‌, ఈగ్రెట్‌, పార్ట్రిడ్జ్‌, హెరాన్‌, రివ‌ర్ తెర్న్‌, స్నేక్‌బ‌ర్డ్‌, స్టోన్ ఫ్లార్ త‌దిత‌ర ఎన్నో వ‌ల‌స ప‌క్షుల‌తో అల‌రారే కేంద్ర‌మిది. ఈ కేంద్రం మైసూర్‌లోని ప్ర‌సిద్ధ బృందావ‌న్ గార్డెన్స్‌కు కేవ‌లం 20 కిలోమీట‌ర్ల దూరంలోనే ఉంది. 
*వేదాంత‌గ‌ల్ బ‌ర్డ్ సాంక్చురి: త‌మిళ‌నాడులోని ఈ సంర‌క్ష‌ణాల‌యంలోని పింటెయిల్‌, గార్గెని, గ్రే వాగ్ట‌యిల్‌, బ్లూ వింగ్డ్ టియ‌ల్‌, కామ‌న్ సాండ్ పైపెర్ ప‌క్షుల‌కు ప్ర‌సిద్ధి చెందింది. త‌మిళ‌నాడులో ఆరో వంతు అట‌వీ ప్రాంత‌మే దాంతో వివిధ ప‌క్షి జాతుల‌కు అనువుగా భాసిల్లుతోంది. ఈ కేంద్రంతో పాటు స‌మీపంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన పులికాట్ స‌ర‌స్సు తీరంలోను ప‌లు వ‌ల‌స ప‌క్షులు సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు క‌ల్గిస్తుంటాయి.
*కౌండిన్య ప‌క్షి సంర‌క్ష‌ణ కేంద్రం: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఎత్తైన కొండ‌లు, లోతైన జ‌ల‌పాతాలు, కైగ‌ల్, కౌండిన్య అనే జ‌ల‌త‌రంగాలు ఈ కేంద్రానికే అద‌న‌పు ఆక‌ర్ష‌ణ తెచ్చేవి. ప‌లు దేశాల వ‌ల‌స‌ ప‌క్షులే కాక ప‌లు అట‌వీ జంతువుల‌తో సంద‌ర్శ‌కుల‌ను అల‌రించే కేంద్ర‌మిది. దీంతోపాటు కొల్లేరు స‌ర‌స్సు కూడా సైబీరియా ప‌క్షులు, ఇత‌ర విదేశీ ప‌క్షుల‌కు కేంద్రంగా వ‌ర్థిల్లుతోంది.
*చిల‌క్ లేక్ బ‌ర్డ్ సాంక్చురి: ఒరిస్సాలోగ‌ల ఈ కేంద్రం సంద‌ర్శ‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది. ఇక్క‌డ స‌ర‌స్సు ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందింది. ఆసియాలోనే ప్ర‌సిద్ధ‌మైన ప‌క్షిజాతుల‌తో అల‌రారుతుంది. ముత్య‌పు ఆకారంలో గ‌ల చిల‌క్‌లేక్ ఓ అద్భుత అనుభూతి. 
*మియాని బ‌ర్డ్ సాంక్చురి: మ‌హారాష్ట్ర‌లోని సతార్ జిల్లాలోగ‌ల ఈ కేంద్రం ప‌లు విదేశీ ప‌క్షి జాతుల‌కు వేదిక‌. ఈ మార్గం గుండా ప‌లు విదేశీ ప‌క్షులు భార‌త్‌కు వ‌ల‌స వ‌స్తుంటాయి. ఇక్క‌డ నుంచే దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌కు ఎగిరి వెళ్తుంటాయి. సైబీరియాకు చెందిన ఫ్లెమింగోస్ పెద్ద సంఖ్య‌లో ఇక్క‌డ‌కు త‌ర‌లి వ‌స్తుండ‌డం రివాజు.
*న‌ల్స‌రోవ‌ర్ బ‌ర్డ్ సాంక్చురి: గుజ‌రాత్‌లో గ‌ల అహ్మ‌దాబాద్ లోగ‌ల ఈ కేంద్రం ఫ్లెమిగోస్‌, పెలికాన్స్‌, స్పూన్‌బిల్ప్‌, ఎవోసిట్స్‌, పిన్‌టైల్స్‌, స్మాల్ కార్మొరెంట్స్‌, స్మాల్‌గ్రేబ్స్‌, పోన‌ల‌ర్స్ ప‌క్షుల‌కు పేరొందిన కేంద్రం. ఈ రాష్ట్రంలోనే పోర్‌బంద‌ర్ బ‌ర్డ్ సాంక్చురి కూడా ఉంది. దేశంలోనే తొలి మెరైన్ నేష‌న‌ల్ పార్కు ఇది. 

16 Nov 2011

statue of liberty

Space post you can see from this blog on october 20
IceMan post on october 21
  • సీపీఐ,సీపీఎం విడివిడిగా ఉంటేనే ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌ని ఎబిబ‌ర్ద‌న్ పేర్కొన్నారు.
  • 2030 నాటికి డ‌యాబెటిక్స్ సంఖ్య 55 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని ప‌లువురు మ‌ధుమేహంతో మ‌ర‌ణించే ప్ర‌మాద‌ముంద‌ని అంత‌ర్జాతీయ మ‌ధుమేహ స‌మాఖ్య‌(ఐడిఎఫ్‌) హెచ్చ‌రించింది.
  • కేంద్ర‌మంత్రి విలాశ్ రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు బాలివుడ్ న‌టుడు రిషి దేశ్‌ముఖ్‌ను పెళ్లాడ‌నున్న‌ టాలివుడ్ హీరోయిన్ జెనీలియా
_______________________________________________________________

అమెరికా అన‌గానే ఠ‌క్కున గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ. ప్ర‌పంచంలో మ‌రో రెండు స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీలు పారిస్‌(ఫ్రాన్స్‌), ల‌గ్జెంబ‌ర్గ్‌(ఇంగ్లాండ్‌)ల్లో ఉన్నా అంద‌రి మ‌దిలో మెదిలేది న్యూయార్క్ న‌గ‌ర‌మే. లిబ‌ర్ట‌స్ అనే రోమ‌న్ దేవ‌త పేరిట‌నే లిబ‌ర్టీ అనే ప‌దం పుట్టింది. అమెరికా స్వేచ్ఛ‌, స్వాతంత్ర్యాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌న‌మే స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ. అమెరికా 100వ పుట్టినరోజు కానుక‌గా ఫ్రెంచ్ ప్ర‌జ‌లిచ్చిన కానుకిది. 1886 అక్టోబ‌ర్ 28న‌ అమెరికా అధ్య‌క్షుడు గ్రోవ‌ర్ క్లెవ్‌లాండ్ ఈ నేష‌న‌ల్ మాన్యుమెంట్‌ను జాతికి అంకితం చేశారు. 
భూత‌ల స్వ‌ర్గంగా భాసిల్లుతున్న అమెరికాకే మ‌కుటాయ‌మానం ఈ స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యాట‌కుల్నిఅమితంగా ఆక‌ర్షించే ప‌ర్యాట‌క క్షేత్రం ఈ విగ్ర‌హం కొలువుదీరిన నేష‌న‌ల్ పార్క్‌. నార్వేలోని విస్న‌స్ గ‌నుల్లో ఉత్ప‌త్తి అయిన రాగితో దీన్ని రూపొందించారు. విగ్ర‌హ రూప‌శిల్పి ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెడ‌రిక్ అగ‌స్టే బార్ట్‌హోల్డి.
తీర్చిదిద్దింది ఎడ్వ‌ర్డ్ రెనే కాగా ఈఫిల్ ట‌వ‌ర్ సృష్టిక‌ర్త అలెగ్జాండ‌ర్ గుస్ట‌నోవ్ త‌న వంతు స‌హ‌కారాన్ని అందించారు.
1776 జులై 4 అమెరికా రివ‌ల్యూష‌న్‌కు ప్ర‌తీక‌గా స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీని ప‌రిగ‌ణిస్తారు. ఈ డేట్‌ను విగ్ర‌హంపై 23 అడుగుల మేర 2 అడుగుల మందంతో రోమ‌న్‌లిపిలో చెక్కారు. విగ్ర‌హానికి వైట్ పెయింట్‌ను లోప‌ల‌,వెలుప‌ల వేయ‌డంతో శాంతికి ప్ర‌తీక‌గా ద‌వ‌ళ వ‌ర్ణంతో శోభిల్లుతోంది. 151 అడుగుల ఈ విగ్ర‌హాన్ని ఫ్రాన్స్ సొంత ఖ‌ర్చుతో త‌యారు చేసింది. పెడ‌స్ట‌ల్‌ను అమెరికా ప్ర‌భుత్వం నిర్మించ‌గా పౌరులిచ్చిన విరాళాల‌తో బేస్‌మెంట్ త‌ద్వారా ఈ ప్రాజెక్టు పూర్త‌యింది. 22 అంత‌స్తులు గ‌ల ఈ విగ్ర‌హ స‌ముదాయంలో మొత్తం 354 వంపులు తిరిగిన మెట‌ల్ మెట్ల వ‌రుస ద్వారా స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ శిఖ‌ర భాగానికి చేరుకోవ‌చ్చు. ఇందులో192 మెట్ల‌ను ఎక్కే స‌రికే సంద‌ర్శ‌కుల‌కు ఇల్లిస్ ఐలాండ్ అందాలు క‌నువిందు చేస్తాయి. న్యూయార్క్‌ హార్బ‌ర్ సొబ‌గులు మైమర‌పిస్తాయి. బేస్‌మెంట్ నుంచి విగ్ర‌హం కుడి చేతిలోని కాగ‌డా వ‌ర‌కు మొత్తం ఎత్తు 305 అడుగులు. విగ్ర‌హం ఎత్త‌యితే 151 అడుగులు. విగ్ర‌హం క‌ళ్ల మ‌ధ్య దూరమే దాదాపు 3 అడుగులు. ముక్కు పొడ‌వు 4 అడుగులు కాగా, నోటి వెడ‌ల్పు 3 అడుగులు, న‌డుం వెడ‌ల్ప‌యితే ఏకంగా 35 అడుగులు. చూపుడు వేలు 8 అడుగుల పొడ‌వుంటుంది. రెండు చేతుల మ‌ధ్య దూర‌మ‌యితే 17 అడుగులు. విగ్ర‌హం బ‌రువ‌యితే 205 మెట్రిక్ ట‌న్నులు. కిరీటంపై గ‌ల ఏడు కోణాలు ప్ర‌పంచంలో గ‌ల ఏడు ఖండాలు, ఏడు స‌ముద్రాల‌కు చిహ్నాలుగా పేర్కొంటారు. కాగ‌డాపై బంగారు వ‌ర్ణ కాంతుల్ని 1986లోనే ఏర్పాటు చేశారు. అదే సంవ‌త్స‌రం విగ్ర‌హ స‌ముదాయం రెండో అంత‌స్తులో ఈ స్టాట్యూకు సంబంధించిన చ‌రిత్ర‌, వ‌స్తువుల‌ ఫొటోలు, వీడియోల‌తో ఎగ్జిబిష‌న్‌ను ఏర్పాటు చేశారు. పెడ‌స్టాల్ ద్వారా సంద‌ర్శ‌కులు కాగడా, కిరీటం వ‌ర‌కు వెళ్లేవారు. అయితే ట్విన్ ట‌వ‌ర్స్ విధ్వంసం త‌ర్వాత 2001 నుంచి కిరీటం పైకి సంద‌ర్శ‌కుల్ని అనుమ‌తించ‌డం లేదు. 1916 నుంచే కాగ‌డా పైకి వెళ్ల‌డాన్ని నిషేదించారు. 
నేష‌న‌ల్ పార్క్ స‌ర్వీస్ ఆధ్వ‌ర్యంలోని ఈ స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ ప్రాంగ‌ణంలోకి ఉద‌యం 9.30 నుంచి సాయంత్రం 5 వ‌ర‌కు సంద‌ర్శ‌కుల్ని అనుమ‌తిస్తారు. వేస‌విలో మ‌రికొంత స‌మ‌యం పొడిగిస్తుంటారు.
యావ‌త్ ప్ర‌పంచపు స్వేచ్ఛ‌,స్వాతంత్ర్యాల‌కు ప్ర‌తిబింబ‌మైన స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ సూర్య‌చంద్రాదులున్నంత‌ వ‌ర‌కు తిరుగులేని చైత‌న్య దీపికే.

Popular Posts

Wisdomrays