31 Dec 2011

wishes



 

navayuva

Pageviews by Countries


India
1,567
United States
562
Russia
153
Latvia
16
Germany
15
Malaysia
5
Indonesia
3
Brazil
1
Chile
1
Sweden                                                                                                                         1
Saudi Arabia
1
New Caledonia                                                                                                            1
      
Malta
1
Thailand
1
Italy
1
Iraq
1
  

28 Dec 2011

coober pedy


 (you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome)
మ‌నిషి గాల్లో,నీటిలో,అంత‌రిక్షంలోనూ నేడు విహ‌రిస్తున్నాడు.కానీ శాశ్వ‌త నివాసం మాత్రం భూమి పైనే.మ‌రి భూమి లోప‌ల ఇళ్లు క‌ట్టుకొని జీవించ‌డం సాధ్య‌మేనా?ఈ ప్ర‌శ్న‌కు క‌చ్చితంగా అవున‌నే స‌మాధాన‌మిస్తున్నారు కూబ‌ర్‌పెడి భూగ‌ర్భ ప‌ట్ట‌ణ వాసులు.నార్త‌ర‌న్ సౌత్ ఆస్ట్రేలియాలో ఏకంగా ఓ ప‌ట్ట‌ణ‌మే భూమి అడుగున నిర్మిత‌మ‌యింది.బ‌హుశా ప్ర‌పంచంలోనే ప్ర‌స్తుతం ఇలా భూగ‌ర్భంలోగ‌ల ఏకైక ప‌ట్ట‌ణం ఇదేనేమో.ఇది ఆస్ట్రేలియాలోని ప్ర‌ఖ్యాత టూరిజం స్పాట్‌గా కూడా చ‌రిత్ర సృష్టిస్తోంది.
ప్ర‌ఖ్యాత రాతి గ‌ని: వాస్త‌వానికి కూబ‌ర్‌పెడి ప్ర‌పంచ ప్ర‌సిద్ధ రాతి గ‌నుల ప్రాంతం.1858లోనే ఇది వెలుగులోకి వ‌చ్చింది.అయితే 1916 నుంచే ఇక్క‌డ జ‌నావాసాల ఆలోచ‌న‌కు అంకురార్ప‌ణ జ‌రిగింది.ఆడిలైడ్‌కు ఉత్త‌రం నుంచి ఈ ప్రాంతం 846 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.ఇక్క‌డ ఒప‌ల్ గ‌నులు దాదాపు 5వేల చ‌ద‌ర‌పు మైళ్ల మేర విస్త‌రించి ఉన్నాయి.కూబ‌ర్‌పెడికి వెళ్లేందుకు స్టౌర్ట్ హైవే నుంచి రోడ్డు మార్గం ఉంది.ఈ భూగ‌ర్భ ప‌ట్ట‌ణంలో 2006 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం సుమారు రెండువేల మంది శాశ్వ‌త నివాసితులున్నారు.వీరి ఇళ్ల‌ను డ‌గౌట్స్ అంటారు.కూబ‌ర్‌పెడి భూగ‌ర్భ ప‌ట్ట‌ణంపైనున్న భూఉప‌రిత‌లంపై మూడు భ‌వంతులున్నాయి.అందులో ఒక‌టి హాస్పిట్ భ‌వ‌నం.ఈ భూగ‌ర్భ ప‌ట్ట‌ణంలో ఇళ్లే కాక మ్యూజియాలు,షాపులు,ఆర్ట్ గ్యాల‌రీలు,చ‌ర్చ్‌లు,హోట‌ళ్లు భూఉప‌రిత‌ల న‌గ‌రాల్లో ఉన్న స‌క‌ల సౌక‌ర్యాల‌ను త‌ల‌ద‌న్నెలా నిర్మిత‌మ‌య్యాయి.అందుకే ఏటా ఈ ప‌ట్ట‌ణ సంద‌ర్శ‌న‌కు దాదాపు ల‌క్ష‌మంది వ‌చ్చి సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌తో తిరిగి వెళ్తుంటారు.
స‌మాచార ప్ర‌వాహం: కూబ‌ర్‌పెడి వాసుల‌కు రేడియో, టి.వి, పేప‌ర్ సౌక‌ర్యాలు న్నాయి. ఎబిసి నేష‌న‌ల్ రేడియో, డ‌స్ట్ రేడియో, ఫ్లో ఎఫ్‌.ఎం, కామా రేడియో స‌మాచార సేవ‌లతో పాటు ఇంప‌ర్జా టీవీ, సెవెన్ సెంట్ర‌ల్‌, ఎబిసి, ఎస్‌బిఎస్ చాన‌ళ్లు అందుబాటులో ఉన్నాయి.ఇవే కాకుండా వీక్లీగా వెలువ‌డే కూబ‌ర్‌పెడి న్యూస్ పేప‌ర్ ల‌భ్య‌మౌతోంది. 2013లోగా డిజిట‌ల్ టీవీ చాన‌ల్‌ భాగ్యాన్ని క‌ల్గించాల‌ని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. కూబ‌ర్‌పెడికి 42కిలోమీట‌ర్ల దూరాన ఉన్న మంగురి సైడింగ్ వ‌ర‌కు ఆడిలైడ్ నుంచి రైళ్లు న‌డుస్తుంటాయి. అయితే ఈ ప‌ట్ట‌ణానికి రాక‌పోక‌లు సాగించేందుకు ప‌గ‌టి వేళ‌ల్లోనే ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నారు. రాత్రి వేళ‌ల్లో ఈ ప్రాంతంలో చోటుచేసుకునే అతిశీత‌ల వాతావ‌ర‌ణ‌మే అందుకు కార‌ణ‌మట‌.
ఉల్లాసాల వాతావ‌ర‌ణం: కూబ‌ర్‌పెడిలో ఏడాది పొడ‌వునా వాతావ‌ర‌ణం ఆహ్లాదంగానే ఉంటుంది. అది వేస‌వి కాల‌మైనా అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త 32 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించ‌దు. ఇక శీతాకాల‌మైనా క‌నిష్ట ఉష్ణోగ్ర‌త 8 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు దిగ‌దు. అయితే ఈ భూగ‌ర్భ ప‌ట్ట‌ణంలో ఓసారి అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త 45 డిగ్రీలుగా, అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త -2 డిగ్రీలగా న‌మోద‌యిన‌ట్లు అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఏడాది మొత్తం తేమ శాతం కూడా స‌మ‌తూకంతోనే ఉంటుంద‌ట‌. ఈ ప‌ట్ట‌ణంలో ఒక్క గ‌డ్డిపోచ సైతం క‌నిపించ‌దు.ఒక చెట్టు మాత్రం ఉంది. అది దుక్క ఇనుముతో త‌యారైనది,ఓ కొండ కొన‌పై ఇక్క‌డ కూబ‌ర్‌పెడి ప‌ట్ట‌ణం ఉంద‌న్న సంకేత సూచిక‌గా అది నిలిచి ఉంది.
వ‌ర‌ల్డ్ అండ‌ర్‌గ్రౌండ్ చ‌ర్చ్‌లు:బ్లెస్డ్ కింగ్ చాపెల్‌(క్రాకౌ,పోలెండ్‌);కెట‌కోంబ్ అండ‌ర్‌గ్రౌండ్ చ‌ర్చ్‌(రోమ్‌,ఇట‌లీ);సెయింట్ కింగ్స్‌ చాపెల్‌;జిపాక్విర్‌(కొలంబియా,యూఎస్‌);చ‌ర్ఛ్ ఆఫ్ సెయింట్ జాన్‌(పిక్చ‌రెస్క్యూ,ఫ్రాన్స్‌).
  

27 Dec 2011

kangaroo



కంగారూ..ఇదో విభిన్న‌మైన జంతువు.దీని పేరు చెప్ప‌గానే గుర్తొచ్చే దేశం ఆస్ట్రేలియా.ఇది ఆ దేశ‌పు జాతీయ జంతువు కూడా.ఎందుకంటే భూమిపై సంచ‌రించే ర‌క‌ర‌కాల జంతువులు,ప‌క్షులు త‌దిత‌రాలు ఓ దేశంలో క‌నిపించేవే ప్ర‌పంచంలోని మ‌రో ప్రాంతంలో కూడా మ‌చ్చుకైనా అక్క‌డ‌క్క‌డ అగుపిస్తుంటాయి.కానీ కంగారూలు అందుకు భిన్నం.ఇవి ఆస్ట్రేలియాలో త‌ప్పా మ‌రెక్క‌డ మ‌న‌గ‌ల్గ‌లేవు.ఆడ కంగారూలు త‌మకు పుట్టిన‌ పిల్ల‌ల్ని స‌హ‌జ‌సిద్ధంగా శ‌రీరంలోనే అమ‌రిన సంచి(మార్సుపియ‌మ్‌)వంటి భాగంలో ఉంచుకొనే సాక‌డం క‌చ్చితంగా వీటికే సొంత‌మైన‌ మ‌రో ప్ర‌త్యేక‌త‌.ఈ విధంగా ఏకంగా తొమ్మిది నెల‌ల‌పాటు పిల్ల‌ల్ని సంచిలోనే పెట్టుకొని పోషిస్తాయి.మ‌నుషుల్లో స్త్రీలు త‌మ గ‌ర్భంలో శిశువుల్ని మోసిన‌ట్లన్న మాట‌.
ఆస్ట్రేలియా నేష‌న‌ల్ యానిమ‌ల్‌:.. కోట్ల ఏళ్ల నాడు విశ్వ విస్ఫోట‌నంలో నుంచి భూమండ‌లం ఆవిర్భ‌వించింద‌ని బిగ్ బ్యాంగ్ థియ‌రీ చెబుతోంది.అలా ఏర్ప‌డిన యావ‌త్ భూమి అఖండంగా ఉండేద‌ని శాస్త్ర‌వేత్త‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.అంటే ఇప్ప‌ట్లోలా ఏడు ఖండాలు లేవు.భూప‌రిభ్ర‌మణ క్ర‌మంలో భూప‌ల‌క‌లు విభ‌జిత‌మై ఏర్ప‌డిన ఖండాల్లో అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా.ఆవిధంగా జీవ‌కోటి జ‌న‌నం,సంచారం,వ‌ల‌స‌లు జ‌రిగి ఒక్క అంటార్కిటికా మిన‌హా అన్ని ఖండాల‌కు విస్త‌రించింది.అయితే కంగారూలకు మాత్రం ఆస్ట్రేలియా వాతావ‌ర‌ణంలో త‌ప్పా మ‌రే దేశ శీతోష్ణ‌స్థితి,భౌగోళిక ప‌రిస్థితులు స‌రిప‌డ‌వు.దాదాపు 60కు పైగా ర‌కాల కంగారూలున్నాయి.వీటిలో ట్రీ కంగారూలు మాత్రం తొలుత ఇండోనేసియాలోని న్యూగునియా ప్రాంతంలోనే ఊపిరిపోసుకున్నాయ‌ని జంతుశాస్త్ర‌వేత్త‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.ఆ త‌ర్వాత ఆ జాతి కంగారూలు కూడా ఆస్ట్రేలియాకే ప‌రిమిత‌మ‌య్యాయి.మేక్రోపాడ్స్ కుటుంబానికి (లార్జ్ ఫుట్‌)చెందిన కంగారూలే కాకుండా డింగోస్‌(ఆస్ట్రేలియా అట‌వీ జాతి కుక్క‌లు),వొంబేట్స్‌(ఓ జాతి ఎలుగుబంటి)కూడా ఆస్ట్రేలియాకే ప్ర‌త్యేకం.కంగారూలు కేవ‌లం ఈ దేశంలో మాత్ర‌మే ఉండ‌డానికి ఆస్ట్రేలియా వాతావ‌ర‌ణం,రాతి ప‌ర్వ‌తాల‌తో కూడిన భౌగోళిక స్థితిగ‌తులు,ల‌భించే ఆహార‌మే కార‌ణ‌మ‌ట‌.ఇవి ప‌గ‌టి వేళ‌ల్లో ఎండ‌పొడ త‌గ‌ల‌ని ప్రాంతాల్లో త‌ల‌దాచుకుంటాయి.కేవ‌లం రాత్రిళ్లే ఆహారాన్ని స్వీక‌రిస్తాయి.తెల్ల‌వారుజాము,సాయంత్రం స‌మ‌యాల్లోనే ఆహారం కోసం చురుగ్గా సంచ‌రిస్తాయ‌ని తెలుస్తోంది.వీటి ఆహారం ప్ర‌ధానంగా గ‌డ్డే.కొన్ని ర‌కాల మొక్క‌ల్ని తిని జీవిస్తాయి.ప‌శువుల మాదిరిగానే ఆహారాన్ని అమాంతం తినేసి త‌ర్వాత తీరిగ్గా నెమ‌ర‌వేసుకుంటాయి.అచ్చం ఎడారి ఓడ ఒంటెల్లా ఇవి మూణ్నెల్ల పాటు అస్స‌లు నీళ్లు తాగుకుండాను ఉండ‌గ‌ల‌వు.ప‌రుగందుకుంటే గుర్రాల‌నే త‌ల‌పిస్తాయి.గంట‌కు 70 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకుంటాయ‌ట‌.కంగారూలు ఈత‌లో చేప‌ల్ని మ‌రిపించ‌గ‌ల‌వంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.వీటికి డింగోస్‌,వేట‌గాళ్ల నుంచి ముప్పు ఎదురౌతోంద‌ట‌.ఈ కంగారూలు సంపూర్ణ వ‌న్య‌ప్రాణులు.అడ‌వుల్లో అయితే 20 ఏళ్లు జీవించ‌గ‌ల‌వు.ఇత‌ర ప్రాంతాల్లో అయితే 10,12ఏళ్లు మాత్ర‌మే బ‌తుకుతాయి.రెడ్ కంగారూల‌యితే ఏకంగా 2 మీట‌ర్ల పొడ‌వు పెరుగుతాయి.తోక ఆస‌రాతో నిల‌బ‌డే ఈ జీవి సుమారు ఆర‌డుగుల ఏడు అంగుళాల పొడ‌వుతో ఆక‌ట్టుకుంటుంది.ఈ జాతి కంగారూల్లో మ‌గ‌వి 90 కేజీల బ‌రువు తూగుతాయి. 
భాష పేరే ఈ జీవి నామం:ఆస్ట్రేలియాలోని ఓ ప్రాంత భాషైన `గూగు యిమిత‌ర` పేరే కంగారూల‌కు స్థిర‌ప‌డింది.తొలుత గుంగూరు,త‌ర్వాత కంగూరూ అనంత‌రం కంగూరూ ఆపై ఇప్ప‌టి పేరు కంగారూగా వీటికి పేరు వ‌చ్చింది.ఈ ప‌దానికి  `ఐడోంట్ అండ‌ర్‌స్టాండ్ యూ` అని అర్థం అట‌.ఇవి 50వేల ఏళ్ల క్రిత‌మే అవ‌త‌రించాయ‌ట‌.డింగోస్ అయితే అయిదు వేల ఏళ్ల క్రిత‌మే జ‌న్మించిన‌ట్లు తెలుస్తోంది.కంగారూల మాంసం చాలా శ్రేష్టమైంది.కొవ్వు శాతం చాలా త‌క్కువ‌.కంగారూల మాంసం తిన‌డం ద్వారా బీపీ బాగా త‌గ్గుతుంద‌ట‌.దాంతో పాటు చ‌ర్మం కోసం కూడా వేట‌గాళ్ల వీటినే ల‌క్ష్యంగా చేసుకుని వేటాడుతుండ‌డంతో అట‌వీ అధికారులు అత్యంత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సి వ‌స్తోంది.జెన‌స్ మెక్రోప్స్‌,రెడ్ కంగారూ,అంటిలోపైన్‌,ఈస్ట్ర‌న్ గ్రే,వెస్ట్ర‌న్ గ్రే కంగారూల్లో ప్ర‌ధాన ర‌కాలు.స్మాల‌ర్ మైక్రోపాడ్స్ జాతి కంగారూలు ఆస్ట్రేలియాలోనే కాకుండా న్యూగునియాలోనూ క‌నిపిస్తాయి.
అవార్డు అందుకున్న కంగారూ:ఇవి సాధు జీవులు.కోప‌మొస్తేనే తడాఖా చూపుతాయి.రేబిస్ వ్యాధి సోకిన కంగారూలు మ‌నుషుల‌కు హాని త‌ల‌పెడ‌తాయ‌ట‌.భ‌రించ‌లేని ఆక‌లి,ద‌ప్పిక సంద‌ర్భాల్లోనూ ఇవి మ‌నుషుల్ని గాయ‌ప‌రిచే ప్ర‌మాద‌ముంద‌ని శాస్త్ర‌వేత్త‌లను ఉటంకిస్తూ ప‌లువురు ఆస్ట్రేలియ‌న్ ఫారెస్టు ఆఫీస‌ర్స్ వివిధ ఘ‌ట‌న‌ల్ని జ‌ర్న‌ల్స్‌లో పేర్కొన్నారు.మ‌రికొన్ని సంఘ‌ట‌న‌ల్లో ఇవి పెంపుడు జంతువుల్ని కూడా త‌ల‌పిస్తాయ‌ని రుజువైంది.చెట్టు కూలుతుండ‌గా గాయ‌ప‌డ్డ కంగారూ ఓ రైతు కుటుంబానికి సంకేత‌మిచ్చి కాపాడిన ఘ‌ట‌న 2003లో ఆస్ట్రేలియాలో జ‌రిగింది.దాంతో ఆ కంగారూ 2004లో ప్ర‌తిష్టాత్మ‌క `ఆస్ట్రేలియా నేష‌న‌ల్ యానిమ‌ల్ వెలార్‌`(ఆర్‌.ఎస్‌.పి.సి.ఎ)అవార్డును గెల్చుకుంది.

23 Dec 2011

vatican city


happy christmas

పాపుల‌ను క్ష‌మించి,బాధ‌ల్ని దిగ‌మింగి,శాంతికి ప్ర‌తీక‌గా నిలిచిన మ‌హ‌నీయుడే ఏసు.నాడు,నేడు,ఏనాడూ ఏసుప్ర‌భువు ఆచ‌రించిన మార్గ‌మే యావ‌త్ మాన‌వాళికి అనుస‌ర‌ణీయం.హిందువుల‌కు తిరుమ‌ల‌,ముస్లింల‌కు మ‌క్కా ఎలాగో క్రైస్త‌వుల‌కు వాటిక‌న్ సిటీ అంతే ప‌విత్రం.అందుకే ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద స్థ‌లిగా 1997లో యునెస్కో గుర్తింపున‌కు నోచుకుంది.వ‌ర‌ల్డ్‌లోనే అతి చిన్న‌దేశమ‌ని దీనికి పేరు.కేవ‌లం 0.2 చ‌ద‌ర‌పు మైళ్ల విస్తీర్ణం.వెయ్యిలోపు జ‌నాభా.ఇది ఇట‌లీ(రోమ్‌)లో అంత‌ర్భాగం అయినా స్వ‌యంపాల‌నా యుక్త ప్రాంతం.
vatican city masterpieces:సెయింట్ పీట‌ర్స్ బాసిలిక‌,సిస్టిన్ చాపెల్‌,వాటిక‌న్ మ్యూజియ‌మ్స్‌,అపోస్టోలిక్ ప్యాలెస్‌(పోప్ నివాసిత ప్రాంతం),ఇంకా వంద‌ల కొద్దీ శిల్పాలు,చిత్రరాజాలు కొలువుదీరిన వేదిక‌.
శాంతి ధామం:పోప్‌జాన్‌పాల్‌-2 26ఏళ్ల పాల‌న అనంత‌రం 2005లో బెన్డిక్ట్-16 బాధ్య‌త‌ల్ని చేప‌ట్టారు. ఆయ‌నే వాటిక‌న్ సిటీకి స‌ర్వాధికారి. ఒక్క వాటిక‌న్ల‌కే కాదు యావ‌త్ యూర‌ప్ వాసుల‌కు పోప్ మాటే మేలు బాట‌. 1929లో ముస్సోలిని నిర్ణ‌యాత్మ‌క సంత‌కం(లాటెర‌న్ ట్రీటీ)తో వాటిక‌న్ రాజ్యం అవ‌త‌రించింది. వాటిక‌న్‌లో కొలువుదీరిన పోప్పే సంపూర్ణ శాస‌న‌, కార్యనిర్వాహ‌క‌,న్యాయాధికారాల్ని క‌ల్గి ఉంటారు. ఆయ‌న ద్వారానే సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్‌,ప్రెసిడెంట్‌(పాంటిఫిక‌ల్ క‌మిష‌న్‌),గ‌వ‌ర్న‌ర్ నియ‌మితులై పాల‌నా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తారు.సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్‌గా బెర్టొనే,పాంటిఫిక‌ల్ క‌మిష‌న్ ప్రెసిడెంట్‌గా,వాటిక‌న్‌సిటీ గ‌వ‌ర్న‌ర్‌గా ల‌జొలొ ఆ విధంగానే ప‌ద‌వుల‌ను చేప‌ట్టారు.ఇక్క‌డ ఇంగ్లిష్‌,ఫ్రెంచ్‌,అర‌బిక్‌,చైనీస్‌,ర‌ష్య‌న్‌,స్పానిష్ భాష‌లు ప్రాచుర్యంలో ఉన్నాయి.రోమ‌న్ల చ‌రిత్ర‌కు 16వ శ‌తాబ్ద‌పు వైభ‌వాల‌కు సాక్షిగా నిలుస్తోందీ వాటిక‌న్ సిటీ.ఈ న‌గ‌రం 4వ శ‌తాబ్దం నుంచే త‌న ఉనికిని నిలుపుకుంటోంది.అంతేకాదు దీర్ఘ‌కాలంగా ప్ర‌పంచ ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల్లో ఒక‌టిగా భ‌క్తుల్ని అల‌రిస్తోంది.బాసిలిక్ క‌ళాత్మ‌క‌త వ‌న్నెల‌ను జూలిస్-2 అద్దారు.ఇక్క‌డ జ‌గ‌త్ ప్ర‌సిద్ధ చ‌ర్చిని కార్లో మెడెర్నో 1626లో నిర్మించారు.ప్ర‌పంచంలోనే అతి పురాత‌న‌,చిన్న సైన్యం గల దేశమిది.1506లోనే సైన్యాన్ని జూలిస్‌-2 ఏర్ప‌రిచారు.వాటిక‌న్ సైన్యం అక్ష‌రాల నూరు మాత్ర‌మే.వీరే పోప్ అంగ‌ర‌క్ష‌కులు కూడా.
క్రిస్మ‌స్ సంబ‌రాలు:క్రైస్త‌వుల పుణ్య‌క్షేత్ర‌మైన వాటిక‌న్ సిటీలో క్రిస్మ‌స్ సంబ‌రాలు అంబ‌రాన్నంటుతాయి.1982 నుంచి ఇక్క‌డ క్రిస్మ‌స్ ట్రీని నెల‌కొల్పుతున్నారు.ఈ వేడుక పోప్ జాన్‌పాల్‌-2 హ‌యాంలోనే తొలిసారిగా ప్రారంభ‌మ‌యింది.ముఖ్యంగా బుధ‌వారాల్లో ఇక్క‌డ‌కు భ‌క్తులు అధిక సంఖ్య‌లో వ‌స్తుంటారు.వారిలో కొత్త‌గా పెళ్లైన జంట‌లే ఎక్కువ‌.అయితే అన్ని రోజుల్లో పోప్ ద‌ర్శ‌న‌భాగ్యం మాత్రం ల‌భించ‌దు.క్రిస్మ‌స్ వేడుక నాడే పోప్ అభిభాష‌ణ యావ‌త్ ప్ర‌పంచ జ‌నావ‌ళికి అందుతుంది.
----------------------------------------------------------------------------------------------------------------
* తెలుగు చిత్ర రంగ ప్ర‌ముఖులు త్రిపుర‌నేని మ‌హార‌థి క‌న్నుమూశారు.
* ఏపీలో విజ‌యా డైరీ వీటా పేరిట విట‌మిన్ పాల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చింది.
* ఇరాక్‌(బాగ్దాద్‌)బాంబు పేలుళ్ల‌తో ద‌ద్ద‌రిల్లింది.60 మంది ప్రాణాలు కోల్పోయారు.
* సింగ‌పూర్‌,ఆస్ట్రేలియాల త‌ర‌హాలో భార‌త్‌లోనూ ప్లాస్టిక్ క‌రెన్సీని అమ‌ల్లోకి తెచ్చేందుకు ఆర్‌బీఐ ప్ర‌య‌త్నిస్తోంది.




19 Dec 2011

bull fight


స్పెయిన్‌లో అనాదిగా ఆచ‌రిస్తున్న సంప్ర‌దాయ క్రీడే బుల్‌ఫైట్‌. వాస్త‌వానికి ఇది మూగజీవి ర‌క్త‌పుటేరుతో సాగే రాక్ష‌స‌క్రీడ‌బ‌ల‌మైన ఎద్దును క‌ద‌నానికి క‌వ్వించి క‌ర్క‌శంగా క‌డ‌తేర్చే వికృతానంద క‌ళాకేళి. ల‌క్ష‌ల మందితో కిక్కిరిసిన స్టేడియం.. అంద‌రూ క‌ళ్లార్ప‌కుండా కేరింత‌లు కొడుతూ ఉండ‌గా..క‌సాయి క‌త్తి దూస్తూ ఉంటే ఓ మూగ‌జీవి అస‌హాయంగా నెత్తురొడుతూ బ‌లి ప‌శువుగా కుప్ప‌కూలిపోయి క‌న్నుమూస్తుంది.
స్పెయిన్ బుల్‌ఫైట్స్‌ఈ బుల్‌ఫైట్స్ 711ఎ.డి నుంచే స్పెయిన్‌లో జ‌రుగుతున్నాయి.కింగ్ అల్ఫాన్సో-8 రాజ్యాధికారిన్ని చేప‌ట్టిన సంద‌ర్భంగా తొలిసారిగా ప్రారంభ‌మ‌యిందీ క్రీడ‌.ఏడాదిలో మార్చి నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు స్పెయిన్‌లోని వివిధ రీజియ‌న్ల‌లో ప‌లుచోట్ల ఈ బుల్‌ఫైట్లు జ‌రుగుతుంటాయి.కొన్నిచోట్ల ఏడాదిలో దాదాపు 10 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు ఈ బుల్‌ఫైట్ల‌ను తిలకిస్తూ ఆనందిస్తుంటారు.దేశంలో ఏటా 20వేల‌కు పైగా ఎద్దులు సుమారు మూడు కోట్ల మంది సాక్షిగా ప్రాణాలు వ‌దులుతున్న‌ట్లు ఓ అంచ‌నా.స్పానిష్ స్ట‌యిల్ బుల్‌ఫైట్‌కు కొరిడ డిటోర్స్(ర‌న్నింగ్ ఆఫ్ బుల్స్‌)గాను లాఫీఎస్టా(ది ఫెస్టివ‌ల్‌()గా పేర్లున్నాయి.ఈ సంప్ర‌దాయ క్రీడ‌లో ముగ్గురు టోరోస్‌( (మెట‌డోర్లు)చెరో రెండు ఎద్దుల‌తో పోరాడతారు.ఒక్కో టోరో చెరో రెండు ఎద్దుల‌తో త‌ల‌ప‌డ‌తారు.ఒక్కో టోరోకు ఆరుగురు చొప్పున స‌హాయ‌కులు ఈ పోరాటంలో తోడ్ప‌డ‌తారు.350కుపైగా కేజీల బ‌రువుతో నాల్గు నుంచి ఆరేళ్ల వ‌య‌సు గ‌ల ఎద్దు క‌ద‌న‌రంగంలోకి దూకుతుంది.టోరోకు స‌హ‌క‌రించేందుకు ఇద్ద‌రు పిక‌డోర్స్‌ (అశ్వ యోధులు),ముగ్గురు బాండెరిల్లెర్స్‌,ఒక మొజోడిఎస్పాడ‌స్‌((( )(ఖ‌డ్గ‌ధారులు)బ‌రిలోకి దిగుతారు.
క‌త్తితో క‌డ‌తేరుస్తారు:ప‌్ర‌స్తుత ఆధునిక క్రీడ‌లో రింగ్‌లో ఉన్న‌ ఎద్దుపైకి గుర్రాల‌పై వ‌చ్చిన యోధులు,బుల్ ఫైట‌ర్లు,క‌త్తితో బుల్‌ను గాయ‌ప‌రిచే మ‌రో వ్య‌క్తి మూడు ద‌శ‌ల్లో ముప్పేట దాడి చేస్తారు.న‌గారా మోగ్గానే రింగ్‌లోకి ఎద్దుతో స‌హా అంద‌రూ వ‌స్తారు.పోటీ నిర్వాహ‌క అధ్య‌క్షుడికి అభివాదం చేసి ర‌క‌ర‌కాలుగా బుల్‌ను క‌వ్వించి నృత్యాలు చేసి ఆట‌ను మొద‌లు పెడ‌తారు.పోటీ ప్రారంభంలోనే ఎద్దును బాగా రెచ్చ‌గొట్టి వ్యూహాన్ని అమ‌లు చేస్తారు.అప్పుడు ప్ర‌తీకారేచ్ఛ‌తో ర‌గిలిపోయిన ఎద్దు రింగ్ అంతా పోటీదారుల‌ను ప‌రుగులు పెట్టేలా త‌రుముతుంది.ఆ స‌మ‌యంలో గుర్రాల‌ను సైతం కుమ్మేసేందుకు ఎద్దు ప్ర‌య‌త్నిస్తుంది.1930 వ‌ర‌కు ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం గుర్రాల‌పై ర‌క్ష‌కులు లేక‌పోవ‌డంతో అంత‌కుముందు వ‌ర‌కు ప‌లు పోటీల్లో వంద‌ల కొద్దీ గుర్రాలు సైతం ఎద్దు కొమ్ముల‌కు బ‌ల‌య్యేవి.ఈ క్రీడ‌లో రెచ్చిపోయిన ఎద్దులు రింగ్ లోప‌లే కాకుండా స్టేడియం గ్యాల‌రీల్లోకి దూసుకొచ్చిన‌ప్పుడు ప్రేక్ష‌కులు కూడా గాయ‌ప‌డ్డ ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి.2010 ఆగ‌స్టులో నార్త‌ర‌న్ స్పెయిన్ లొఫ‌ల్లాలో జ‌రిగిన ఇలాంటే ఘ‌ట‌న‌లోనే ప‌దేళ్ల బాలుడు స‌హా మొత్తం 40 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.
నిషేధాస్త్రం..:స్టేడియంలో ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌తో ఉల్లాసంగా గ‌డుపుతుంటే రింగ్‌లోని ఎద్దు మాత్రం రోషంతోనే రొప్పుతూ ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటుంది.అప్పుడు ఎర్ర‌టి గుడ్డ‌ను దాని క‌ళ్లెదుట ఊపుతూ మ‌ళ్లీ రెచ్చ‌గొడ‌తారు.నిజానికి బుల్స్ క‌ల‌ర్ బ్లైండెడ్‌.అవి రంగుల్ని గుర్తించ‌లేవు.బ‌రిలో ఎద్దును బాగా అల‌సిపోయే వ‌ర‌కు ఆ విధంగా ఆడించి ప‌రుగులు పెట్టించి గాయ‌ప‌రిచి అది ర‌క్త‌మోడుతూ నేల‌కూలాక ప‌దునైన పెద్ద క‌త్తితో న‌రికేస్తారు.బాగా గాయ‌ప‌డి రింగ్‌లో ర‌క్తం ధార‌క‌డుతున్నా ఇంకా క‌ద‌నానికి కాలుదువ్వే ఎద్దును నిర్వాహ‌క అధ్య‌క్షుడు విజేత‌గా ప్ర‌క‌టించే అవకాశ‌మూ ఉంది.అప్పుడు మాత్ర‌మే ఆ బుల్ మ‌ళ్లీ ప్రాణాల‌తో రింగ్ బ‌య‌ట‌కు రాగ‌ల్గుతుంది.
ఇదో ఆట‌విక క్రీడ అంటూ దీర్ఘ‌కాలంగా జంతు ప్రేమికులు గ‌గ్గోలు పెడుతూనే ఉన్నారు.ఒక్క స్పెయిన్‌లోనే కాదు ఈ వికృత క్రీడ పోర్చుగ‌ల్‌,లాటిన్ అమెరికా దేశాలైన అమెరికా,పెరూ,కొలంబియా,వెనెజువెలా,ఈక్వెడ‌ర్‌ల్లోనూ కొన్ని ప్రాంతాల్లో  కొన‌సాగుతూనే ఉంది.భార‌త్‌లోని త‌మిళ‌నాడు(మ‌దురై)లో జ‌ల్లిక‌ట్టు పేరిట‌ ఈ బుల్‌ఫైట్‌ను సంప్ర‌దాయ క్రీడ‌గా ఆచ‌రిస్తున్నారు.అయితే సంక్రాంతి సంబ‌రంగా గ్రామాల్లో జ‌రిగే ఈ బుల్‌ఫైట్‌లో ఎద్దుతో నిరాయుధులు మాత్ర‌మే త‌ల‌ప‌డ‌తారు.ఎద్దుకు ఏ హాని త‌ల‌పెట్ట‌రు,దాన్ని చంప‌రు.ప్ర‌స్తుతం ఆయా దేశాల్లో ఈ వికృత క్రీడ‌ను నిషేధించారు.1991లో స్పెయిన్‌లో ఈ బుల్‌ఫైట్‌ను తొలుత నిషేధించిన రీజియ‌న్ కెన‌రీ ఐలాండ్.2012 నుంచి కెట‌లోనియా రీజియ‌న్‌లో కూడా ఈ క్రీడ‌పై నిషేధం అమ‌ల్లోకి రానుంది. 
-------------------------------------------------------------------------------------------------------------
*భార‌తర‌త్న అవార్డుల జాబితాలోకి క‌ళ‌లు,సాహిత్యం,సేవా,ఇత‌ర రంగాల‌తోపాటు క్రీడా రంగాన్ని చేరుస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యాన్ని మొర‌దాబాద్ ప్ర‌స్తుత ఎంపీ(కాంగ్రెస్‌) ప్ర‌ముఖ క్రికెట‌ర్ అజ‌రుద్దీన్ స్వాగతించారు.భార‌తర‌త్న అవార్డును హాకీ దిగ్గ‌జం లెజెండ్ ధ్యాన్‌చంద్‌,మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ల‌కు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు.గ‌తంలోనే భార‌త‌ర‌త్న గాన‌కోకిల ల‌తామంగేష్క‌ర్ ఈ అవార్డును స‌చిన్‌కు ప్ర‌దానం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.మేజ‌ర్ ధ్యాన్‌చంద్ జ‌న్మించిన ఆగ‌స్టు 29వ తేదీనే ఆయ‌న సంస్మ‌ర‌ణార్థం భార‌త్‌లో జాతీయ‌క్రీడా దినోత్స‌వం జ‌రుగుతోంది. 
*మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో భార‌త్ త‌ర‌ఫున పాల్గొన్న వాసుకి సుంక‌వ‌ల్లి నిర్వహించిన షోలో ఎ.పి స‌మాచారశాఖ మంత్రి డి.కె.అరుణ ఓ అనాథ బాలిక‌తో క‌లిసి ర్యాంప్‌వాక్ చేశారు.2003లో రాజ‌స్థాన్ అప్ప‌టి సి.ఎం వ‌సుంధ‌ర రాజే సింధియా కూడా ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రై ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్నారు.

16 Dec 2011

eiffel tower


పారిస్‌..ఫ్రాన్స్‌కే కాదు,ఫ్యాష‌న్ ప్ర‌పంచానికీ రాజ‌ధాని.అందానికే అందం ఈ న‌గ‌రం.ఫ్రాన్స్ అన‌గానే మ‌న‌కు ఠ‌క్కున గుర్తొచ్చేది ఐఫెల్ ట‌వ‌ర్‌.మాన‌వ నిర్మిత అద్భుత క‌ట్ట‌డానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం.పారిస్‌కే మ‌కుటాయ‌మానంగా శ‌తాబ్దాల‌గా ప్ర‌త్యేక గుర్తింపునిస్తోన్న నిర్మాణ‌మిది.ఇప్ప‌టికే 50 కోట్ల మందికి పైగా ఈ ట‌వ‌ర్‌ను సంద‌ర్శించారు.పారిస్‌లోని చాంప్ డిమార్స్‌కు స‌మీపంలో సెనె న‌దీ తీరంలో దీన్ని ప్ర‌ఖ్యాత ఇంజ‌నీర్ గుస్త‌వ్ ఐఫెల్ రూపొందించారు.ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ప‌ర్యాట‌కులు సంద‌ర్శించే చిర‌స్మ‌ర‌ణీయ క‌ట్ట‌డాల్లో ఈ ఐఫెల్ ట‌వ‌ర్ ఒక‌టి.ఏటా 30ల‌క్ష‌ల మంది సంద‌ర్శ‌న‌కు నోచుకుంటోందిది.రెండేళ్ల‌కే మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న‌ ఐఫెల్ ట‌వ‌ర్ 1889 నుంచి సంద‌ర్శ‌కుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.తొలి ఏడాదే ఈ ట‌వ‌ర్‌ను రెండు కోట్ల మంది సంద‌ర్శించ‌డ‌మే క‌ట్ట‌డ‌పు విశిష్ట‌త‌కు నిలువుట‌ద్దంగా పేర్కొన‌వ‌చ్చు.
ఐర‌న్ ఐకాన్‌:ఆకాశాన్ని ముద్దాడుతున్న‌ట్లుండే 324 మీట‌ర్ల ఎత్తుగ‌ల ఈ ఐఫెల్ ట‌వ‌ర్ 20వేల పెద్ద ఇనుప దిమ్మెలు,30 ల‌క్ష‌ల రివెట్ల‌తో నిర్మిత‌మ‌యింది.ఆరేడేళ్ల‌కోసారి ఈ నిర్మాణానికి తుప్పు ప‌ట్ట‌కుండా ఉండేందుకు పెయింట్ వేస్తుంటారు.అందుకు అయిదు ట‌న్నుల‌కు పైగా పెయింట్‌ను వినియోగిస్తారు.ఈ ట‌వ‌ర్ శిఖ‌రం నుంచి చూస్తే పారిస్‌లోని ప్ర‌తి అంగుళం అందం క‌నిపిస్తుంది.సంధ్య‌వేళ మిరుమిట్లను వెద‌జ‌ల్లే దీప‌పు కాంతుల‌తో ఐఫెల్ ట‌వ‌ర్ దేదీప్య‌మానంగా వెలిగిపోతూ సంద‌ర్శ‌కుల మ‌దిని దోచుకుంటుంది.న్యూయార్క్‌లో క్రిస్లెర్ బిల్డింగ్ నిర్మిత‌మ‌య్యే వ‌ర‌కు అంటే 1930 వ‌ర‌కు ఐఫెల్ ట‌వ‌రే ప్ర‌పంచ‌పు మాన‌వ నిర్మిత క‌ట్ట‌డాల‌న్నింటిలోకెల్లా అతి ఎత్తైయిన‌ది.41 ఏళ్ల పాటు ఆ హోదాను నిలుపుకుంది.1957లో ఫ్రాన్స్‌లో మిలౌవ‌యుడ‌క్ట్ నిర్మాణ‌మ‌య్యే వ‌ర‌కు దేశంలో ఎత్తైన క‌ట్ట‌డాల్లో ప్ర‌థ‌మ స్థానంలో ఉంది.తొలుత ఈ ట‌వ‌ర్‌ను 20 ఏళ్ల అనంత‌రం తొల‌గించాల‌నుకున్నా మొద‌టి ప్ర‌పంచ యుద్ధంలో సాధించిన విజ‌యానికి సంకేతంగా దీన్ని య‌థావిధిగా కొన‌సాగించాల‌ని ఫ్రెంచ్ పాల‌కులు నిర్ణ‌యించారు.యూర‌ప్‌కొచ్చే ప‌ర్యాట‌కులు దాదాపు అంద‌రూ పారిస్‌ను సంద‌ర్శిస్తుంటారు.వారు ఐఫెల్ ట‌వ‌ర్‌ను ఎక్కితేనే త‌మ ప‌ర్య‌ట‌న ప‌రిపూర్ణ‌మ‌యిన‌ట్లుగా భావిస్తారు.ఇక్క‌డ షాపింగ్‌,సెనె న‌దిలో విహారాన్ని త‌మ జీవిత‌కాలంపాటు మ‌ధురానుభూతిగా త‌లుస్తుంటారు.

సంద‌ర్శించిన ప్ర‌ముఖులు:లియొనిడ్ బ్రెజ్‌నెవ్‌,మైఖెల్ గోర్బొచేవ్‌, ఫెడ‌ల్ కాస్ట్రో,బిల్ క్లింట‌న్‌,వాస్టాక్ హెవ‌ల్ త‌దిత‌రులు ఈ ట‌వ‌ర్‌ను సంద‌ర్శించారు.
మూడంతస్తుల‌తో మురిపిస్తుందీ ట‌వ‌ర్‌.తొలి రెండు అంత‌స్తుల వ‌ర‌కు మెట్ల దారి కూడా ఉంటుంది.ఇక మూడో అంత‌స్తు నుంచి ట‌వ‌ర్ శిఖ‌ర భాగం వ‌ర‌కు ఎల్వెట‌ర్ల ద్వారానే చేరుకోగ‌లం.మొద‌టి అంత‌స్తులో ఆల్టిట్యూడ్ అనే రెస్టారెంట్ ఉంటుంది. ఇది స‌ముద్ర మ‌ట్టానికి ఏకంగా 95 మీట‌ర్ల ఎత్తున ఉంటుంది.రెండో అంత‌స్తులో గ‌ల జుల్స్‌వెర్నె రెస్టారెంట్‌ సొంత లిఫ్ట్ సౌక‌ర్యాన్ని క‌ల్గి ఉంది. ప్ర‌చండ గాలుల‌ను సైతం త‌ట్టుకొని నిల‌బ‌డే విధంగా ఈ ట‌వ‌ర్ను తీర్చిదిద్దారు.ఇందులో స్నాక్‌బార్‌,అన్ని ర‌కాల వ‌స్తువులు ల‌భించే షాపింగ్‌మాల్‌, పోస్టాఫీస్‌,పారిస్ అందాల‌ను వీక్షించేందుకు వీలుగా అతిపెద్ద హాల్ కొలువుదీరి ఉన్నాయి.
పారిస్ సైట్ సీయింగ్ ఎట్రాక్ష‌న్స్‌:నొట‌ర్ డ్యామ్ కేథెడ్ర‌ల్‌,అర్కెడ్ ట్ర‌మ్పే,బాసిలిక్ డుస్ర్కె కొయ‌ర్‌,బాస్టిల్లె,చాంప్స్ క్లిసీస్‌,కాంక‌ర్డ్ స్క్వేర్‌,సేక్రెడ్ హార్ట్ మాంట్ మార్టె,సెయింట్ చాప్‌ల్‌,ది ఇన్వాల్డెస్‌,పాలిస్ గార్నియ‌ర్‌,క‌న్సియ‌ర్ గెరీ,చాటియ‌న్ డివొర్సెల్స్‌.


14 Dec 2011

venice


భూమిపై ప్ర‌స్తుతం మూడొంతుల భాగం నీరే.ఆ నీరే స‌క‌ల జీవ‌జాలానికి ప్రాణాధారం.కానీ మ‌నుషులు,ఎక్కువ శాతం జీవ‌జాలం భూమ్మీద‌నే జీవిస్తోంది.అయితే రొటిన్‌కు భిన్నంగా వింత అనుభూతులు,స‌రికొత్త ఆనందాల‌ను కోరుకునే మ‌నుషులు చాలా మందే ఉన్నారు.అందుకే నేటికీ నౌకా ప్ర‌యాణాల‌పై మ‌క్కువ చూపేవారు,న‌దులపై బోటు షికార్ల‌ను చేసేవారి సంఖ్య ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.యావ‌జ్జీవిత‌కాల‌మూ ఆ నీటిపైనే ఆవాసాలు ఏర్ప‌రుచుకొని నివ‌సిస్తున్న వారున్నారంటేనే ఆశ్చ‌ర్యం క‌ల్గిస్తోంది..నిజంగా అద్భుత‌మ‌నిపిస్తుంది.ఆ సంభ్ర‌మానికి వేదిక ఇట‌లీలోని వెనిస్ న‌గ‌రం.నీళ్ల‌పై తేలియాడే గొలుసుక‌ట్టు ప్రాంతాల స‌మాహారం ఈ వెనిస్‌.అందుకేనేమో ప్ర‌పంచంలోనే ఎక్కువ మంది ప‌ర్యాట‌కుల‌తో కిట‌కిట‌లాడే న‌గ‌రాల జాబితాలో చోటు ద‌క్కించుకుందిది.
నీటిపై అందాల ఇళ్లు:వెనిస్ న‌గరానికి వెనిజియా అనే పేరూ ఉంది.118 దీవుల స‌ముదాయ‌మిది.అయిదో శ‌తాబ్దంలోనే రూపుదిద్దుకున్న న‌గ‌రం.ఈ వెనిస్ ముఖ‌ద్వారం వ‌ర‌కే రోడ్డు,రైలు,విమానాశ్ర‌య సౌక‌ర్యాలు ఉంటాయి.వెనిస్ నుంచి దీవుల్లోకి ప్ర‌యాణించేందుకు వాట‌ర్ టాక్సీలే ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ఇళ్లు,హోట‌ళ్లు,షాపింగ్ మాల్స్‌,వ‌ర్త‌క‌,వాణిజ్య కార్య‌క‌లాపాల స‌ముదాయాలు త‌దిత‌రాల‌న్నీ నీళ్ల‌పై నిర్మించిన క‌ట్ట‌డాల్లోనే జ‌రుగుతాయి.అక్క‌డ‌క్క‌డ నేల క‌నిపించినా మొత్తం నీళ్లే ప‌రుచుకుని ఉంటాయి.అడ్రియాటిక్ స‌ముద్ర తీర జ‌లాలు,పొ,పేవ్ న‌దీ జ‌లాల ప్ర‌వాహంపై ఏర్పాట‌యిన అత్యంత విలాసవంత‌మైన న‌గ‌రమే వెనిస్‌.ప్ర‌కృతి అందానికే నిర్వ‌చ‌నంగా తేలుతున్న ఈ న‌గ‌రానికి రోడ్డుమార్గం మాత్రం లేదు.అయితేనేం ఎటు చూసినా క‌ళాత్మ‌క‌త ఉట్టిప‌డే క‌ట్ట‌డాలే.వ్యాపార‌,వాణిజ్యాల జోరు అనంత‌మే ఇక్క‌డ‌.మూడు ల‌క్ష‌ల జ‌నాభా ఈ క‌ద‌లాడే న‌గ‌రంపై జీవిస్తున్నారు.అయితే త‌రుచు వీరికి వ‌ర‌ద‌ల బెడ‌దే.ముఖ్యంగా 1966లో వ‌చ్చిన వ‌ర‌ద‌లు వీరికి వీడ‌ని పీడ క‌ల‌నే మిగిల్చాయి.ఆ ఏడాది నీటి మ‌ట్టం 1.94 మీట‌ర్ల మేర పెర‌గ‌డంతో ప‌లు చారిత్ర‌క క‌ట్ట‌డాలు సైతం దెబ్బ‌తిన్నాయి.గ‌డిచిన శ‌తాబ్దం నాటికే ఈ తీర న‌గ‌ర ప్రాంతం 23 సెంటీమీట‌ర్ల మేర కుంగిపోయింద‌ట‌.ఈ న‌గ‌రం నీట మున‌గ‌డానికి ఇక ఎంతో కాలం ప‌ట్ట‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు చాలాకాలంగా హెచ్చ‌రిస్తూనే ఉన్నారు.స్పందించిన ఇట‌లీ ప్ర‌ధాని సిల్వియో బెర్లుస్కోని 2003లో ఎం.ఎస్‌.ఇ ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న చేశారు.పొటెత్తే స‌ముద్ర జ‌లాలు ఈ న‌గ‌రాన్ని త‌న‌లో క‌లిపేసుకోకుండా ప‌టిష్ట‌మైన బేరియ‌ర్స్‌ను ఏర్పాటు చేయ‌డ‌మే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్టు ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది.
క‌ద‌లాడే క‌ట్ట‌డాలు:నీటిపై తేలియాడే ఇళ్లు.. అందులో జ‌నం నివాసం.. ర‌ద్దీగా సాగే వ్యాపార‌,వాణిజ్య కార్య‌క‌లాపాలు.. ప‌ర్యాట‌కుల‌తో సంద‌డి..ఎలా ఇదంతా..? అదే మరీ మాన‌వ‌మేధ సృష్టించిన సంభ్ర‌మం.మెరైన్ ఇంజ‌నీరింగ్ నైపుణ్యం మ‌న‌ముందు ఈ వాస్త‌వాన్ని అందంగా ఆవిష్క‌రించింది.నీటిలో చాలా లోతు వ‌ర‌కు తేలియాడే పైపుల‌ను అమ‌రుస్తారు. ఈ పైపుల‌ను ఒక‌దానికొక‌టి అనుసంధానించి బేస్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తారు. దానిపై క‌ట్ట‌డాల‌ను నిర్మిస్తారు. దాదాపు ఇళ్ల‌న్నింటిని క‌ల‌ప‌తోనే తీర్చిదిద్దుతారు. చూడ్డానికి ఇవి అచ్చం కాంక్రీట్ భ‌వ‌నాల‌నే త‌ల‌పిస్తాయి. మూడు మీట‌ర్ల మేర నీటి ప్ర‌వాహం పెరిగినా ఈ ఇళ్లు ఒరిగిపోవ‌డం లేదా కొట్టుకుపోవ‌డ‌మో జ‌ర‌గ‌దు. ఇళ్లు క‌ద‌లాడ‌తాయి,కానీ లోప‌ల వ‌స్తు సామ‌గ్రికి గానీ జ‌నానికి గాని ఏ మాత్రం కుదుపు ఏర్ప‌డ‌క‌పోవ‌డం విశేషం. స‌ముద్ర ఆట‌పోట్ల ప్ర‌భావం,న‌దుల వ‌ర‌ద‌లు తాకిడి లేకుండా అనేక బేరియ‌ర్ ప్రాజెక్టులను వెనిస్ పాల‌కులు శ‌తాబ్దాల నాడే నిర్మించారు.
క‌ళ‌ల‌కు పుట్టిల్లు : సంగీతంతో స‌మ్మిళిత‌మైంది..క‌ళ‌ల‌కు పుట్టినిల్లు వెనిస్ అని ఘంటాప‌థంగా చెప్పొచ్చు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత వెనిస్ ఫిలిం ఫెస్టివ‌ల్‌నే అందుకు ఉదాహ‌ర‌ణ‌.అంటానియో వివ‌ల్డి జ‌న్మించిందిక్క‌డే.యూర‌ప్‌లోనే ప్ర‌ధాన వాణిజ్య కేంద్రాల్లోను వెనిస్ ఒక‌టి.ఫ్యాష‌న్ ప్ర‌పంచంలోనూ ఈ న‌గ‌రం ఇప్పుడు ముందంజ‌లోనే ఉంది.ఏటా ఇక్క‌డ‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కులు 30 ల‌క్ష‌ల పైమాటే.వెనిస్‌,టెర‌ఫెర్మా,ఫ్రెజియని,మ‌ర్గెరా,పౌడ,ట్రెవిస్ జ‌లావాసాల్లోనే జ‌నం ఉంటున్నారు.ఈ ప్రాంతాల‌న్నీ వెనిస్ న‌గ‌ర పాలిక కింద‌కే వ‌స్తాయి.ఇట‌లీలోని ఈ న‌గ‌రం స్వ‌యంప్ర‌తిప‌త్తి గ‌ల‌ది.మేయ‌ర్ గిర్గియో ఒర్సోని 2010 డిసెంబ‌ర్‌లో అధికారానికి వ‌చ్చారు.మ‌రో 45 మంది స‌భ్యులున్నారు.వీరంద‌రూ గ్రేట్ కౌన్సిల్ కింద‌కు వ‌స్తారు.వీరంద‌రూ సెనెట్‌కు 200 నుంచి 300 మంది ప్ర‌తినిధుల్ని,ఇత‌ర అధికార గ‌ణాన్ని నియ‌మిస్తారు.ప‌ర్యాట‌కులు,స్థానికులు 117 కెనాల్స్ ద్వారా ఇక్క‌డ గ‌ల వివిధ ద్వీపాల‌కు చేరుకుంటుంటారు.330 నౌక‌లు రాక‌పోక‌లు సాగిస్తుంటాయి.3300 మంది సెయిల‌ర్లున్నారు.ఈ వాట‌ర్ సిటీలో వాట‌ర్ టాక్సీలే ప్ర‌ధాన వాహ‌నాలు.ప్ర‌తి ప్రాంతంలో కెనాల్స్‌,వంతెన‌లే ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.ఇందులో పేరొందింది రియ‌ల్టో బ్రిడ్జి.ఇది 14వ శ‌తాబ్దంలోనే నిర్మిత‌మ‌యింది.ఈ ప్రాంతం షాపింగ్‌కు,బొటెక్స్‌కు ప్ర‌సిద్ధి.వెనిస్‌లో భాష వెనెటియ‌న్‌.ప్ర‌ధాన‌మ‌తం రోమ‌న్ కేథ‌లిక్‌.హిందూ,ముస్లిం,బౌద్ధ మ‌తాల‌కు చెందిన వారు నివ‌సిస్తున్నారు.జ‌న‌వ‌రిలో ఉష్ణోగ్ర‌త 2.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది.ఆ త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతాయి.జులై నుంచి ఏడాది చివ‌ర వ‌ర‌కు 22.7 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటాయి.వెనిస్ న‌గ‌ర ముఖ‌ద్వారం వ‌ద్ద మార్కోపోలో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు ఉంది.ఇక్క‌డ నుంచి వెనిస్ ప్ర‌ధాన ద్వీపానికి మార్గం ఉంది.ట్రెవిసోలోగ‌ల విమానాశ్ర‌యం నుంచి వెనిస్‌కు 30 మైళ్ల దూరం. 

13 Dec 2011

veerudu



క్రికెట్..ఇదో  మేనియా. నేడు ప్ర‌పంచ జ‌నాభాలో దాదాపు మూడొంతుల మందిని ఊర్రూత‌లూగించే ఏకైక క్రీడ‌.అన్ని ఖండాల్లోను క్ర‌మ‌క్ర‌మంగా శ‌ర‌వేగంగా ప్రాచుర్యం పొందుతోంద‌న‌డం అతిశ‌యోక్తి కాదు.ఇంగ్లండ్‌లో రూపుదిద్దుకుందీ ఆట‌.1877లోనే ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ్గా 1973లో ఈ రెండు జ‌ట్లే తొలి వ‌న్డే పోటీలోనూ త‌ల‌ప‌డ్డాయి.భార‌త జట్టు 1937లో టెస్టుల్లో,1974లో  వ‌న్డేల్లో అరంగేట్రం చేసింది.ప్ర‌స్తుతం 20-20 మ్యాచ్‌ల హ‌వా కొన‌సాగుతున్నా టెస్టులు,వ‌న్డేల ప్రాధాన్యం య‌థావిధిగా సాగుతోంది.టెస్టుల‌కు కొంత ఆద‌ర‌ణ త‌గ్గినా ఇప్ప‌టికీ రంజుగా సాగే మ్యాచ్‌ల‌కు కొద‌వ లేదు.ఆ క్ర‌మంలోనే రికార్డుల ష‌రా మామూలే.క్రికెట్ అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి.అందులో భాగ‌మే ఇటీవ‌ల డాషింగ్ రేస‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగుల రికార్డు 219ను వెస్టిండీస్‌పై నెల‌కొల్పాడు. టెస్టులో ట్రిపుల్ వ‌న్డేలో డ‌బుల్ సెంచ‌రీ సాధించిన ఏకైక ఆట‌గాడ‌య్యాడు.ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఏదైనా బౌల‌ర్ ఎవ‌రైనా అది టెస్ట‌యినా వ‌న్డే అయినా అస‌లు క్రికెట్‌లో ఏ ఫార్మాట్ అయినా `వీరు`డిది అదే దూకుడే..ఒక్క‌టే బాదుడు.అదే అత‌ని రోల్‌మోడ‌ల్ స‌చిన్ నెల‌కొల్పిన వ‌న్డేల్లో తొలి డ‌బుల్ సెంచ‌రీ రికార్డును ఏడాది తిర‌గ‌క‌ముందే అందుకునేలా చేసింది.
*టెస్టు హోదా పొందిన దేశాలు: ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, భార‌త్‌, పాకిస్థాన్‌, శ్రీ‌లంక‌, జింబాబ్వే, బంగ్లాదేశ్‌. 
ఎవ‌ర్‌గ్రీన్ రికార్డు:ఆస్ట్రేలియాకు చెందిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బ్యాట్స్‌మ‌న్ స‌ర్ డాన్ బ్రాడ్‌మ‌న్ కేవ‌లం 52 టెస్టులాడి స‌గ‌టున 99.94 ప‌రుగుల‌ను సాధించారు.
క్వాడ్ర‌పుల్ సెంచ‌రీ: టెస్టులో 400* రికార్డును సాధించిన ఏకైక ఆట‌గాడు వెస్టిండీస్‌కు చెందిన బ్రియ‌న్‌లారా.2004లో ఇంగ్లండ్‌పై న‌మోదు చేశాడు.
టెస్టుల్లో తొలి 10వేల ప‌రుగులు: సునీల్ గ‌వాస్క‌ర్‌
వ‌న్డేల్లో తొలి 10వేల ప‌రుగులు: స‌చిన్‌టెండుల్క‌ర్‌
వ‌న్డేల్లో తొలి డ‌బుల్ సెంచీరీ: స‌చిన్‌టెండుల్క‌ర్‌
టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీల హీరోలు: డాన్ బ్రాడ్‌మ‌న్‌,వీరేంద్ర సెహ్వాగ్‌,క్రిస్‌గిల్,బ్రియ‌న్‌లారా
ఓవ‌ర్‌లో ఆరు సిక్స్‌లు: 2007 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్‌మ‌న్ హెర్ష‌లీ గిబ్స్ కొట్టాడు.
ఇదే ఫీట్‌ను భార‌త్ ఆట‌గాడు యువ‌రాజ్‌సింగ్ 20-20 మ్యాచ్‌లో సాధించాడు.తొలుత కౌంటీల్లో ఈ ఘ‌న‌త‌ను వెస్టిండీస్‌కు చెందిన స‌ర్‌గ్యారీ సోబ‌ర్స్ సొంతం చేసుకున్నారు.రంజీల్లో భార‌త్‌కే చెందిన ర‌విశాస్త్రి కూడా ఓవ‌ర్లోని ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్ల‌ను కొట్టాడు.
వ‌న్డే గ్రేట్ ఇన్నింగ్స్‌: 
*వీరేంద్ర సెహ్వాగ్‌,భార‌త్‌(219)-2011(వెస్టిండీస్‌పై)
*స‌చిన్ టెండుల్క‌ర్‌,భార‌త్ (200*)-2010(ద‌క్షిణాఫ్రికాపై)
*చార్లెస్ కొవెంట్రి,జింబాబ్వే (194*)-2009(బంగ్లాదేశ్‌పై)
*స‌య్య‌ద్ అన్వ‌ర్‌,పాకిస్థాన్ (194)-1997(ఇండియాపై)
*వివ్ రిచ‌ర్డ్స్‌,వెస్టిండీస్ (189*)-1984 (ఇంగ్లండ్‌పై)
*స‌నత్ జ‌య‌సూర్య,శ్రీ‌లంక (189)-2000(ఇండియాపై)
*గ్యారీకిరిస్టెన్‌,ద‌క్షిణాఫ్రికా (188*)-1996(యూఏఈపై)
*స‌చిన్ టెండుల్క‌ర్‌,భార‌త్ (186*)-1999(న్యూజిలాండ్‌పై)
*షేన్‌వాట్స‌న్,ఆస్ట్రేలియా(185*)-2011(బంగ్లాదేశ్‌పై)
*ధోని,భార‌త్‌(183*)-2005(శ్రీ‌లంక‌పై)
వ‌న్డేల్లో తొలి గ్రేట్ ఇన్నింగ్స్ మాత్రం నిస్సందేహంగా డేర్‌డెవిల్ క‌పిల్‌దే.1983లో జింబాబ్వేపై అస‌లు సిస‌లైన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ను ఆయన ఆడాడు.ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న మూడో ప్ర‌పంచ‌(ప్రుడెన్షియ‌ల్‌)క‌ప్‌లో 17 పరుగుల‌కే భార‌త్ జ‌ట్టు  అయిదు వికెట్ల‌ను కోల్పోగా క‌పిల్‌దేవ్ విరుచుకుప‌డి 175* ప‌రుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు.అదే అప్ప‌టి వ‌ర‌కు వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగుల రికార్డు.ఫ‌లితంగా అండ‌ర్‌డాగ్ పొజిష‌న్‌లో బ‌రిలో దిగిన భార‌త్ క్రికెట్‌లో అప్ప‌టికి అమేయ‌శ‌క్తి అన‌ద‌గ్గ వెస్టిండీస్‌ను ఓడించి వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సాధించ‌గ‌ల్గింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ 28 ఏళ్ల‌కు ధోని సార‌థ్యంలో భార‌త‌జ‌ట్టు రెండోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలుచుకుంది.అంత‌కు ముందు కూడా ధోని కెప్టెన్సీలోనే భార‌త్ జ‌ట్టు తొలి 20-20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను సాధించ‌డం తెలిసిందే.
_______________________________________________________________
* ప్ర‌పంచంలో అతి ఎత్తైన శిఖ‌రం ఎవ‌రెస్టు (8848 అడుగులు)ను తొలిసారిగా అధిరోహించిన వారు:                    ఎడ్మండ్ హిల్ల‌రీ, టెన్జింగ్ నార్గే
* అంత‌రిక్షంలోకి వెళ్లిన తొలి మాన‌వుడు:యూరిగగారిన్
* చంద్రుడిపై అడుగిడిన ప్ర‌థ‌ముడు:నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌

11 Dec 2011

swan


ప్ర‌కృతిలో ప్ర‌తి ప్రాణి ఏదో ఒక శక్తిని క‌ల్గిన‌దే.అందుకే ఈ ఆధునిక కాలంలోనూ మ‌నిషి జంతువులపై ఆధార‌ప‌డుతున్నాడు.ముఖ్యంగా పాతిపెట్టిన బాంబులు ఇత‌ర పేలుడు ప‌దార్థాల‌ను క‌నుగొనేందుకు ఇప్ప‌టికీ స్నిఫ‌ర్ డాగ్‌ల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు వినియోగిస్తున్నాయి.అంతేందుకు ప్ర‌కృతి విల‌యాల్ని మ‌నుషుల కంటే ఎంతోముందుగా ప‌సిగ‌ట్టి జంతువులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి వెళ్లేందుకు ప్ర‌యత్నించ‌డం మ‌న‌కు తెలిసిందే.ముఖ్యంగా భూకంపాలు,తుపాన్లు,సునామీలు సంభ‌వించ‌నున్న‌ స‌మ‌యాల్లో ప‌క్షులు,ఇత‌ర మూగ‌జీవాల అస‌హ‌జ ప్ర‌వ‌ర్త‌న‌లు ఆ కోవ‌లోనివే.ఆ త‌ర‌హా ఆప‌ద‌లు జ‌రిగిన త‌ర్వాత ఆ జీవాల ప్ర‌వ‌ర్త‌న‌ను గుర్తు చేసుకున్నాకే మ‌న‌కు ఈ విష‌యం బోధ‌ప‌డింది.అలాగే పాల‌ను నీళ్ల‌ను వేరు చేసే హంస జాతి ప‌క్షులు ఒక‌ప్పుడు భార‌త్‌లో ఉండేవ‌ట‌.ఇప్పుడు మ‌చ్చుకు కూడా ఆ హంస‌లు ప్ర‌పంచంలో ఏమూలా లేవు.
తెల్ల హంస‌లు:ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఉన్న ఏడు ర‌కాల హంసల్లో ఆరు జాతులు తెల్ల రంగులోనే ఉంటాయి.వీటి మూల జాతి అన్టాడే ప‌క్షి కుటుంబం.ఇప్పుడున్న‌వి ఎక్కువ శాతం సిగ్నేజాతి కుటుంబానికి చెందిన‌వే.వీటిలో మ్యూట్ స్వాన్‌లే ఎక్కువ‌.వీటిని సిగ్న‌స్ ఒల‌ర్‌గాను పేర్కొంటారు.ఇవి దాదాపు 50 అంగుళాల పొడ‌వుంటాయి.వీటిలో మ‌గ వాటిని కాబ్స్‌గా ఆడ హంస‌ల్ని పెన్‌ల‌ని పిల్ల‌ల్ని సిగ్నెట్స్‌గా పిలుస్తారు.కాబ్స్ 11 నుంచి 15 కేజీల బ‌రువు వ‌ర‌కు ఉంటాయి.పెన్‌ల‌యితే 9 కేజీల బ‌రువు తూగుతాయి.ఇత‌ర ప‌క్షుల‌తో పోలిస్తే వీటి జీవిత కాలం చాలా ఎక్కువ‌నే చెప్పాలి.అడ‌వుల్లో అయితే ఇవి 25నుంచి 50ఏళ్లు కూడా జీవించ‌గ‌ల‌వు. హంస‌ల్లో వూప‌ర్‌,ట్రాంప్ట‌ర్‌,తుండ్రా,మ్యూట్‌,బ్లాక్‌నెక్డ్‌,బ్లాక్‌,బెర్విక్‌,కాస్కార్బా ర‌కాలున్నాయి.తుండ్రా,వూప‌ర్ జాతి హంస‌లు ఉత్త‌ర అమెరికా,ఉత్త‌ర ర‌ష్యా,ఆర్కిటిక్ ఐలాండ్‌ల్లో నివ‌సిస్తాయి.బ్లాక్‌నెక్డ్‌,కాస్కార్బా బ్రెజిల్‌లో బ్లాక్ స్వాన్ ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌ల్లో,మ్యూట్ స్వాన్‌లు ఎక్కువ‌గా యూర‌ప్ దేశాల్లో క‌నిపిస్తాయి. అయితే ఈ స్వాన్‌ల‌న్నీ కూడా ఎక్కువ‌గా జూ,పార్క్‌లు,బొటానిక‌ల్ గార్డెన్స్‌లో మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలుస్తోంది.హిందువులు చ‌దువుల త‌ల్లిగా స‌ర‌స్వ‌తిని కొలుస్తారు.ఆ స‌ర‌స్వ‌తీ దేవీ వాహ‌నం హంస‌.ఆ దేవి పేరిట స‌ర‌స్వ‌తి అనే న‌ది కూడా భార‌త్‌లో ప్ర‌వ‌హించేద‌ట‌.ఇప్పుడా న‌దిని ఉప‌గ్ర‌హాల స‌హాయంతోనే చూడ‌గ‌ల‌మ‌ని కొంద‌రి న‌మ్మ‌కం. ఆ న‌ది అంత‌ర్లీనంగా ప్ర‌వ‌హిస్తోంద‌ని ప‌లువురి భావ‌న‌.బాహ్య‌ప్ర‌పంచం నుంచి అంత‌ర్థాన‌మైన ఆ న‌ది మాదిరిగానే ఇప్పుడు హంస జాతి భార‌త్‌లో అదృశ్య‌మ‌యింది.
కంటి చూపుతోనే ఉప్పు-నీరు వేరు:ప్ర‌స్తుతం భూమిపై మిగిలి ఉన్న ఇత‌ర హంస జాతి ప‌క్షులు కూడా ఉప్పునీటిని,మంచి నీటిని కేవ‌లం కంటి చూపుతోనే గుర్తించే సామ‌ర్థ్యాన్ని క‌ల్గి ఉన్నాయి.అవి స‌ముద్ర‌మార్గంలో ప్ర‌యాణించేట‌ప్ప‌డు లేదా ఉప్పు నీటి స‌ర‌స్సుల్లో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ద‌ప్పిక తీర్చుకోవాల్సి వ‌చ్చినప్పుడు ఆ నీటిని తాగుతాయి.అలా తాగిన త‌ర్వాత త‌ల‌ను ఓసారి అటు ఇటు విసిరి ఆ నీటిలోని ఉప్పును ఈ హంస‌లు విస‌ర్జిస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు.ఒక్క మ్యూట్ హంస‌లు త‌ప్పితే మిగిలిన హంస జాతుల‌న్నీ శాకాహారులే.మొక్క‌లు,చెట్ల బెర‌డ్లు,కాండాలే వీటి ఆహారం.అంతేగాక కొన్ని హంస‌లు గోధుమ‌,మొక్క‌జొన్న‌,క్యేబేజీ,గ‌డ్డితోపాటు ఇత‌ర తిండి గింజ‌లను తింటాయి.అంతేనా బిస్క‌ట్లు,రొట్టెల‌ను కూడా ఇవి తింటాయ‌ట‌.మ్యూట్ హంస‌లు మాత్రం చేప‌ల్ని ఆర‌గించేస్తాయి.
శ‌త్రువు అంతు చూస్తాయి:ఈ హంస‌లు గొప్ప పోరాట పటిమ‌గ‌ల‌వి.అవి ఆగ‌కుండా రెక్క‌ల్ని ఆడించ‌డం ద్వారా మ‌న భుజాల్ని సైతం విర‌గ్గొట్టేంత‌టి శ‌క్తిగ‌ల‌వ‌ట‌.ఇవి దాదాపు 25వేల ఈక‌ల‌తో పొడ‌వాటి మెడ‌,సాలెగూడు మాదిరి వేళ్లు క‌ల్గిన పాదాల‌తో దృఢంగా శ‌త్రువును ఏ స‌మ‌యంలోన‌యినా ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉంటాయి.వీటి దాడిలో గాయ‌ప‌డ్డ మ‌నుషులూ ఎంద‌రో ఉన్నార‌ని జీవ‌శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.ప్ర‌మాదం పొంచి ఉన్నప్పుడు ఇవి త‌మను త‌మ పిల్ల‌ల్ని ర‌క్షించుకునేందుకు త్రాచుపాము మాదిరిగా బుస కొడుతూ శ‌త్రువుకు హెచ్చ‌రిక పంపుతాయి.బాతుల‌తో ద‌గ్గ‌ర పోలిక గ‌ల ఈ హంస‌లు చచ్చేవ‌ర‌కు పోరాడే గుణంగ‌ల‌వి.ఇవి వేరే జాతి హంస‌ల‌ను కూడా అంత తేలిగ్గా న‌మ్మ‌వు.ఓ మైలు దూరంలోనే గూళ్ల‌ను నిర్మించుకుంటుంటాయి.ఎక్కువ‌గా ఇవి త‌డి,నీళ్లుండే వాతావ‌ర‌ణాన్నే ఇష్ట‌ప‌డ‌తాయి.త‌డ‌వ‌కు ఇవి 5 నుంచి 10 గుడ్ల‌ను పెడ‌తాయి.వాటిని 30 రోజుల్లో పొదుగుతాయి.పిల్ల‌లు తొలుత కాల్వ‌ల్లో ఈత‌ను నేర్చుకుంటాయి.ఆ త‌ర్వాత అవి 60 నుంచి 75 రోజుల్లో గాల్లో ఎగుర‌డం నేర్చుకుంటాయి.స‌ముద్రాలు,ప‌ర్వ‌త‌,మైదాన ప్రాంతాలేవ‌యినా ఏక‌ధాటిగా ఈ హంస‌లు రెండువేల మైళ్లు ఎగురుకుంటూ వెళ్లిపోతాయి.భూమికి రెండువేల అడుగుల ఎత్తున య‌థేచ్ఛ‌గా ఎగుర‌గ‌ల‌వివి.ఎక్కువగా జులై,ఆగ‌స్ట్‌లోనే ఇవి వ‌ల‌స‌లు వెళ్తాయి.
-------------------------------------------------------------------------------------------------------------
*స‌హ‌జ‌క‌వి, బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి ఎం.ఎస్‌.రెడ్డి(87)అనారోగ్యంతో హైద‌రాబాద్‌లోని త‌న స్వ‌గృహంలో క‌(పె)న్నుమూశారు.త‌న ఇంటిపేరు మ‌ల్లెమాల‌నే క‌లం పేరుగా చేసుకుని ఆయ‌న ఎన్నో క‌విత‌ల‌ల్లారు,ప‌లు ర‌చ‌న‌లు చేశారు.సినిమాల్లో పాట‌ల‌ను రాశారు.హెచ్.ఎం.టి.వి సీఈఓ, ప్ర‌ఖ్యాత  సంపాద‌కులు కె.రామ‌చంద్ర‌మూర్తికిచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో ఎం.ఎస్‌.రెడ్డి ఏక‌ల‌వ్యుడికి విలువిద్యాభ్యాసంలో గురువులేన‌ట్లే క‌విత్వంలో త‌న‌కు గురువు ఎవ్వ‌రూ లేరని చెప్పారు.క‌విసామ్రాట్ విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ ఓ స‌భ‌లో మ‌ల్లెమాల క‌విత్వానికి ఆశ్చ‌ర్య‌పోయి `ఎక్క‌డున్నావ‌య్యా మ‌హాక‌వి ఇన్నాళ్లు` అన‌డ‌మే త‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మైన‌ ప్ర‌శంస‌ని  ఎం.ఎస్‌.రెడ్డి తెలిపారు.

5 Dec 2011

babaji

http://royalloyal007.blogspot.in/2012/09/t-hunts-down-d.html
శ‌రీరం అశాశ్వ‌తం..ఆత్మ శాశ్వ‌తం..ఇది స‌ర్వుల విశ్వాసం.జ‌న్మించిన వారికి మ‌ర‌ణం త‌ప్ప‌దు.మ‌ర‌ణించిన వారికి జ‌న‌నం త‌ప్ప‌దు అనేది గీతాసారం.అయితే చిరంజీవులు ఉండ‌రా?హ‌నుమంతుడు చిరంజీవి..హిమాల‌యాల్లో ఇంకా త‌ప‌స్సులో నిమ‌గ్న‌మై ఉన్నాడ‌న్న‌ది పురాణాల ఆధారంగా హిందువుల్లో అత్య‌ధిక సంఖ్యాకుల న‌మ్మిక‌.న‌మ్మ‌కం మ‌నిషికో ఆయుధం.ఇత‌రుల‌కు భంగ‌క‌రం కానంత‌వ‌ర‌కు,అది మూఢ న‌మ్మ‌కంగా పెడ‌దారి ప‌ట్ట‌నంత‌కాలం ఎవ‌రైనా ఆచ‌రించ‌వ‌చ్చు.ఆ కోవ‌లోనే ఇప్ప‌టికీ రెండువేల ఏళ్లగా మ‌హావ‌తార బాబాజీ స‌జీవంగా విరాజిల్లుతున్న‌ట్లు భావించేవారు ఉన్నారు.ఏ విశ్వాస‌మైనా మ‌తాసార‌మైనా ఒక్క‌టే మంచిని పెంచ‌డం,శాంతిని స్థాపించ‌డ‌మే.సృష్టి ఉన్న‌ప్ప‌టి నుంచి సైన్స్ ఉంది.సాధ‌న‌,శోధ‌న అనే క్ర‌మంలో అది కొన‌సాగుతూనే ఉంది.సూర్య‌చంద్రాదులున్నంత వ‌ర‌కు కొన‌సాగుతూనే ఉంటుంది.నిన్న‌టి సిద్ధాంతం రేప‌టిరోజున త‌ప్పుకావ‌చ్చు.నిన్న‌టి ప‌రిశోధ‌న‌లు నేటికి నిజంగా చ‌లామ‌ణి అవ్వొచ్చు.భ‌విష్య‌త్‌లో మ‌రో శోధ‌న ఇదే క‌చ్చితం అంటూ నిరూపించవ‌చ్చు.అయితే ఏదీ ప‌రిపూర్ణం కాదు.సైన్స్ ప‌రిభ్ర‌మణంలో అవ‌న్నీ ద‌శ‌లు.అందుకే ప్ర‌పంచ ప్ర‌సిద్ధ శాస్త్ర‌వేత్త‌లు,వైద్యాచార్యులు సైతం మిస్ట‌రీలను కొట్టివేయ‌డం లేదు.అద్భుతాల‌ను కాదంటూ బ‌ల్ల‌గుద్దడం లేదు.ప్ర‌పంచంలో మొత్తం మాన‌వాళి ఇంకా పాత‌,కొత్త విష‌యాల‌ను తెలుసుకొనే ప్ర‌య‌త్నంలోనే ముందుకు వెళ్తోంది.
బాబాజీ:భార‌త‌దేశానికి పెట్ట‌ని కోట‌యిన హిమాల‌యాల్లో రెండువేల ఏళ్ల‌గా జీవిస్తున్న యోగి ఈ మ‌హావ‌తార బాబాజీ.నిత్య య‌వ్వ‌నుడు.చిరంజీవి.మ‌హాకాయ బాబాజీగానూ భ‌క్తులు పిలుచుకుంటారు.`క్రియా యోగ`ప్ర‌దాత‌.మెడ‌లో రుద్రాక్ష‌లు,ఒళ్లంతా పులిమిన‌ట్లు క‌న్పించే బూడిద‌,నుదుటిన కుంకుమ‌బొట్టు..ఆక‌ర్ష‌ణీయ‌మైన ముఖ‌వ‌ర్చ‌స్సు,వెలుగులు విర‌జిమ్మే నేత్రాల‌తో ప‌ద్మాస‌న ముద్ర‌లో ద‌ర్శ‌న‌మిస్తార‌ని హిమాల‌య సాణువుల‌కు వెళ్లే సాధువులు,రుషులు,ప‌ర‌మ భ‌క్తులు విశ్వ‌సిస్తుంటారు.బ‌ద్రీనాథ్‌కు ఎగువున గ‌ల శిఖ‌రాల్లో బాబాజీని ఆర్తిగా స్మ‌రిస్తే ఆ దివ్య పురుషుడు ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌ట‌.మ‌న‌కు ద‌గ్గ‌ర్లోనే ఆ స్వామి కొలువున్న‌ట్లు అనిపిస్తుంది.ఎంత న‌డిచినా ఆ యోగి ద‌రికి మాత్రం చేర‌లేమ‌ట‌.ఇంత‌కు ముందు మ‌న‌కు క‌నిపించినంత‌టి దూరంలోనే ఉండి బాబాజీ ఆశీర్వ‌దిస్తున్న‌ట్లు భావ‌న క‌ల్లుతుంద‌ట‌.ఈ విశ్వాసం త‌ర‌త‌రాలుగా వేల ఏళ్లుగా హిమాల‌య శిఖ‌రాల్లో సంచ‌రించే సాధువులు,బాబాలు,యోగుల్లో ఉంది.ఇప్ప‌టికీ చాలామంది భ‌క్తులు న‌మ్ముతారు.సౌత్ ఇండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ బాబాజీ ఉనికిని బ‌లంగా న‌మ్మే వారిలో ఒక‌రు.ఎంత‌గానంటే ఏడాదికో రెండేళ్ల‌కోసారి ఆయ‌న దాదాపు ఆరునెల‌లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు.ఎక్క‌డుంటారంటే నెల‌ల త‌ర‌బ‌డి హిమాల‌యాల్లోనే బాబాజీ ధ్యానంలోనే గ‌డుపుతారు.ఆ బాబాజీ పేరు మీద ఏకంగా ఆయ‌న బాబా అనే సినిమాను కూడా చిత్రీక‌రించారు. 
యోగా-చిరంజీవి: యోగా సాధ‌న ఆరోగ్య‌దాయ‌కం.త‌ద్వారా జీవ‌న ప్ర‌మాణం పెరిగే అవ‌కాశ‌ముంది.హిమాల‌యాల్లో స్వ‌చ్ఛ‌మైన ప్ర‌కృతి ఒడిలో ఆశ్ర‌మ జీవ‌నం గ‌డ‌పడం,సంజీవిని త‌ర‌హా ఔష‌ధ మొక్క‌లు,వ‌న‌మూలిక‌లు,పండ్లు,కంద‌మూలాలతో కూడిన ఆహారం త‌మ‌ను చిరంజీవుల్ని చేస్తుందంటారు యోగులు.స్థిర‌చిత్తం,స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌లు కూడా వారి జీవ‌నానికి వ‌రాలే.అందుకే వంద‌ల ఏళ్లు జీవించే బాబాలు,యోగినుల‌కెంద‌రికో హిమాల‌యాలు వేదిక‌.ప‌ర‌మ‌హంస యోగానంద త‌న `యోగి`అనే పుస్త‌కంలో బాబాజీ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల్ని ప్ర‌స్తావించారు.క్రియా యోగాల‌యాన్ని నిర్వ‌హిస్తున్న కెన‌డాకు చెందిన మార్ష‌ల్ గోవింద‌న్ కూడా త‌ను రాసిన ప‌లు పుస్త‌కాల్లో ఎన్నో అద్భుత‌,కొత్త విష‌యాల్ని పేర్కొన్నారు.ఆరోగ్యప‌రిర‌క్ష‌ణ‌కు యోగా చ‌క్క‌ని వ‌న‌రు.ఆయుర్వేదం భార‌త్‌కు చెందిన ప్రాచీన వైద్య‌విధానం.ఎన్నో దీర్ఘ‌కాలిక వ్యాధుల నివారిణి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోగ‌పీడితులకు అమృత తుల్యంగా మ‌న్న‌న‌లు పొందుతోంది.ఇక హిమాల‌యాల్లో వ‌న‌మూలిక‌ల‌కు కొద‌వుండ‌ద‌ని అందుకే అక్క‌డ యోగులు చిరంజీవులుగా ఉండ‌డం సాధ్య‌మేన‌ని వివిధ స‌ద‌స్సుల్లో స‌ద‌స్స్యులు అభిప్రాయ‌ప‌డ్డారు.బాబాజీ ప్ర‌భావం ఆదిశంక‌రాచార్య‌,క‌బీర్‌,షిర్డీసాయిబాబా,గ‌జాన‌న మ‌హ‌రాజ్‌,స్వామి స‌మ‌ర్తా త‌దిత‌రుల‌పైన ఉంద‌ని కాలిఫోర్నియాలో జ‌రిగిన ఓ అధ్యాత్మిక స‌ద‌స్సులో కొంద‌రు త‌మ‌ భావ‌న‌గా పేర్కొన్నారు.మ‌హాత్మాగాంధీ,పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ త‌దిత‌ర ప్ర‌ముఖులెంద‌రికో వైద్యం చేసిన డాక్ట‌ర్ రామ్‌బోస్లే(బొంబాయి)బాబాజీకి ప‌ర‌మ‌భ‌క్తులు.విదేశాల్లో జ‌రిగిన 160కు పైగా స‌ద‌స్సుల్లో పాల్గొన్న ఆయ‌న బాబాజీకి సంబంధించి త‌న‌కు గ‌ల అనేక అనుభూతుల్ని వివిధ వేదిక‌ల‌పై పంచుకున్నారు.బాబాజీ అద్వితీయ‌మైన మహాపురుషుడిగా ప‌లు ప‌త్రాలు,పుస్త‌కాల్లో పేర్కొన్నారు. 
-------------------------------------------------------------------------------
* జీవ‌న ప్ర‌మాణం:భార‌త్‌లో జీవ‌న‌ప్ర‌మాణం 64 ఏళ్లు.
(మ‌నిషి నూరేళ్లు జీవిస్తాడంటారు.వందేళ్ల‌కు పైగా బ‌తికిన వాళ్లు,ప్ర‌స్తుతం బ‌తుకుతున్న వాళ్లు ప్ర‌పంచం న‌లుమూల‌లా ఇప్ప‌టికీ కొంద‌రున్నారు.అలాగే భార‌త్‌లో కూడా ఉన్నారు.)

2 Dec 2011

big frog

క‌ప్ప‌ల్ని పాములు తిన‌డం స‌హ‌జం.సృష్టిలో జీవులు మ‌రో జీవిని తిన‌డం ద్వారానో లేదా వాటిపై ఆధార‌ప‌డో జీవించ‌డం సాధార‌ణం.అందుకు భిన్నంగా సృష్టి ద‌ర్మానికి విరుద్ధంగా క‌ప్పే పామును నోట క‌రుచుకొనే దృశ్యాల్ని టి.వి,పేప‌ర్ల‌లో చూసిన‌ప్ప‌డు ఆశ్చ‌ర్య‌పోతుంటాం.నిజంగా ఆ జాతి కప్ప‌లు ఉన్నాయి.అవే బిగ్ ప్రాగ్స్‌.అమెరికా,కెన‌డాల్లో తొలుత వెలుగు చూసిన ఈ క‌ప్ప‌లే బుల్‌ప్రాగ్స్‌.వీటి శాస్త్రీయ‌నామం రెన‌క‌ట్స్‌బ‌య‌న్‌.ఇప్పుడు అరుద‌యిపోతున్న ఈజాతి క‌ప్ప‌లు ఒక్కో దేశంలో ఒక్కో రంగులో అక్క‌డ‌క్క‌డ ఇంకా ఉన్నాయి.సాధార‌ణ క‌ప్ప‌ల‌తో పోలిస్తే ఇవి చాలా భిన్నంగా ఉంటాయి.శ‌త్రువు నుంచి తప్పించుకోవ‌డానికో ఆహారాన్ని సేక‌రించే నిమిత్త‌మో ఇవి అచ్చు ఊస‌ర‌వెల్లిలా రంగుల్ని మారుస్తాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న ప‌త్రాల్లో శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.
నిద్ర పోని జీవి:బుల్‌ప్రాగ్ అస్స‌లు నిద్రే పోదు.ఇలాంటి జీవి భూమ్మీద బ‌హు అరుదేన‌ని చెప్పాలి.చేప‌లు క‌ళ్లు తెరుచుకొనే నిద్ర‌పోతాయి.వాటికి క‌నుపాప‌లు కూడా ఉండ‌వు.కేవ‌లం ఒక్క‌రోజే జీవించే కొన్ని కీట‌కాలకు కూడా నిద్ర‌,విశ్రాంతి త‌దిత‌రాల అవ‌సరం ఎలాగూ లేదు.వేల్స్‌,డాల్ఫిన్స్‌ల్లోని మెద‌డులో స‌గ‌భాగం మాత్ర‌మే నిద్ర‌పోతుంది.మిగిలిన స‌గ‌భాగం ఊపిరి తీసుకొనే క్ర‌మంలో నిమ‌గ్న‌మ‌వుతుంది.ఇక రోజులో ఏక‌ధాటిగా 20మైళ్లు ఈద‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న ఏనుగుల నిద్రా స‌మ‌యం కేవ‌లం నాలుగ్గంట‌లే.అదీ ద‌ఫ‌ద‌ఫాలుగానే నిద్ర‌పోతాయి.న‌త్త‌ల‌యితే ఒక‌సారి నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తే నాల్గేళ్ల వ‌ర‌కు కూడా అదే విశ్రాంతి ద‌శ‌లో ఉండిపోగ‌ల‌వు.స‌ల్మ‌న్‌,పైక్,గోల్డ్‌ఫిష్‌,యాంగ‌ర్ ఫిష్ త‌దిత‌ర చేప‌లకు కూడా నిద్రంట‌నే తెలీద‌ట‌.ఆ కోవ‌లోకే వ‌స్తుంది ఈ బుల్‌ఫ్రాగ్‌.ఇవి ప‌రిమాణంలోనూ చాలా పెద్ద‌వి.జీవిత‌కాలం కూడా ఎక్కువే.అలాగే వీటి బ‌రువును కూడా మ‌నం ఊహించ‌లేం.ఆఫ్రిక‌న్ బుల్‌ఫ్రాగ్ అయితే ఏకంగా 45 ఏళ్లు జీవించ‌గ‌ల‌ద‌ట‌.మిగిలిన ప్ర‌పంచ దేశాల్లోని ఈ జాతి క‌ప్ప‌లు 8నుంచి10ఏళ్లు కొన్న‌యితే 16ఏళ్ల వ‌ర‌కు బ‌తుకుతాయి.వీటి బ‌రువు కూడా రెండు కేజీల పైమాటే.ఈ క‌ప్ప‌ల్లో త‌ల భాగం చాలా పెద్ద‌గా ఉంటుంది.ఇవి 4నుంచి6 అంగుళాల సైజులో ఉంటాయి.ఆడ‌క‌ప్ప‌ల‌యితే మ‌గ‌వాటిక‌న్నా సైజులో ఇంకా పెద్ద‌గా ఉంటాయి.ఇవి 8నుంచి10 అంగుళాల వ‌ర‌కు కూడా పెరుగుతాయి.ఎక్కువ‌గా నీటి మ‌డుగుల్లో నివ‌సించే ఈ క‌ప్ప‌లు ఒడ్డున గుడ్లు పెడ‌తాయి.అదీ వేస‌వి ఆరంభానికి కాస్త ముందు.వేడి వాతావ‌ర‌ణాన్ని అంటే 25నుంచి28 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిని ఇష్ట‌ప‌డ‌తాయి.వీటి క‌ద‌లిక చాలా నెమ్మ‌దిగా ఉంటుంది.వ‌ర్షాకాలంలో రాత్రి వేళ‌ల్లో ఒక‌చోటు నుంచి మ‌రోచోటుకి సంచ‌రిస్తాయి.అమెరికా,కెన‌డాల్లో ఇవి లేత ఆకుప‌చ్చ‌,లేత బూడిద రంగుల్లో క‌నిపిస్తాయి.ఆఫ్రికాలో అయితే ఇవి ఆలివ్‌గ్రీన్ రంగులో ఉంటాయి.మ‌గ‌వి లేత ప‌సుపురంగు,నారింజ‌ రంగుతో మ‌రీ సొగ‌స‌రిగా ఆక‌ర్షిస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.
పాములూ ఆహార‌మే: ఎలుక‌లు,పిచ్చుక‌లు,పాము పిల్ల‌లు,చేప‌లు వంటివి దొరికితే ఈ బుల్‌ఫ్రాగ్‌లు వ‌దిలిపెట్ట‌వు.ఇక‌ మిడ‌త‌లు,వాన‌పాములు,తొండ‌లు,కీచురాళ్లు,పేడ‌పురుగులు,ఇత‌ర కీట‌కాల్ని ఆబ‌గా లాగించేస్తాయివి.అందుకే ఈ క‌ప్ప‌ల్ని తినే మ‌నుషుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.వీటి కాళ్ల‌కు భ‌లేగిరాకీ.ఆ రుచే వేరంటారు మాంసాహార ప్రియులు.ఎక్కువ‌గా చైనా,జ‌పాన్‌ల్లో క‌ప్ప‌ల మాంసాహార ప్రియులు అత్య‌ధికంగా ఉన్నారు.యూర‌ప్‌,ఇత‌ర పాశ్చాత్య దేశాల్లో ఏటా నాలుగు ట‌న్నుల మేర క‌ప్ప‌ల‌ను భోంచేసేస్తున్నార‌ట‌.ఎగుమ‌తి చేసే దేశాల్లో ఇండోనేసియాది ప్ర‌థ‌మ స్థానం.అమెరికా,కెన‌డాల్లో ఊపిరిపోసుకున్న ఈ బుల్‌ఫ్రాగ్స్ జాతిని ఆ దేశాలు ద‌క్షిణ‌కొరియా,వెస్ట్ర‌న్ యూర‌ప్‌,బ్రెజిల్‌,కొలంబియా,ఆస్ట్రేలియాలకు ప‌రిచ‌యం చేసి వృద్ధి చేశాయి.కానీ వీటిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ పాఠ‌శాల‌లు,క‌ళాశాల‌ల్లో ప్ర‌యోగాల‌కు వినియోగిస్తుండ‌డం,శాస్త్ర‌వేత్త‌లూ ఇంకా వీటిపై అనేక ప‌రిశోధ‌న‌లు సాగిస్తుండ‌డం, మ‌రోప‌క్క వీటి మాంసం రుచికి ప‌రిత‌పించే జ‌నం పెరిగిపోవ‌డంతో ఈ బుల్‌ఫ్రాగ్ జాతి ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డింది.మందుల తయారీకి ముఖ్యంగా యాంటీబ‌యోటిక్స్ ఉత్ప‌త్తికి వీటిని వినియోగిస్తుంటారు.
-------------------------------------------------------------------------------------------------------------
INDIA

*National animal:టైగ‌ర్‌
*National bird:నెమ‌లి
*National reptile:త్రాచుపాము
*National icon:కోతి
*National marine animal:డాల్ఫిన్స్‌
*National heritage animal:ఏనుగు



---------------------------------------------------------------------------

30 Nov 2011

views













navayuva page viewer friends list


Pageviews by Countries
India
1,120
United States
414
Russia
105
Latvia
8
Germany
7
Malaysia
5
Indonesia
3
Brazil
1
Chile
1
Malta
1
Sweeden
1
New Caledonia
1
Saudi Arabia
1
 
 
 
 


Popular Posts

Wisdomrays