13 Dec 2011

veerudu



క్రికెట్..ఇదో  మేనియా. నేడు ప్ర‌పంచ జ‌నాభాలో దాదాపు మూడొంతుల మందిని ఊర్రూత‌లూగించే ఏకైక క్రీడ‌.అన్ని ఖండాల్లోను క్ర‌మ‌క్ర‌మంగా శ‌ర‌వేగంగా ప్రాచుర్యం పొందుతోంద‌న‌డం అతిశ‌యోక్తి కాదు.ఇంగ్లండ్‌లో రూపుదిద్దుకుందీ ఆట‌.1877లోనే ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ్గా 1973లో ఈ రెండు జ‌ట్లే తొలి వ‌న్డే పోటీలోనూ త‌ల‌ప‌డ్డాయి.భార‌త జట్టు 1937లో టెస్టుల్లో,1974లో  వ‌న్డేల్లో అరంగేట్రం చేసింది.ప్ర‌స్తుతం 20-20 మ్యాచ్‌ల హ‌వా కొన‌సాగుతున్నా టెస్టులు,వ‌న్డేల ప్రాధాన్యం య‌థావిధిగా సాగుతోంది.టెస్టుల‌కు కొంత ఆద‌ర‌ణ త‌గ్గినా ఇప్ప‌టికీ రంజుగా సాగే మ్యాచ్‌ల‌కు కొద‌వ లేదు.ఆ క్ర‌మంలోనే రికార్డుల ష‌రా మామూలే.క్రికెట్ అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి.అందులో భాగ‌మే ఇటీవ‌ల డాషింగ్ రేస‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగుల రికార్డు 219ను వెస్టిండీస్‌పై నెల‌కొల్పాడు. టెస్టులో ట్రిపుల్ వ‌న్డేలో డ‌బుల్ సెంచ‌రీ సాధించిన ఏకైక ఆట‌గాడ‌య్యాడు.ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఏదైనా బౌల‌ర్ ఎవ‌రైనా అది టెస్ట‌యినా వ‌న్డే అయినా అస‌లు క్రికెట్‌లో ఏ ఫార్మాట్ అయినా `వీరు`డిది అదే దూకుడే..ఒక్క‌టే బాదుడు.అదే అత‌ని రోల్‌మోడ‌ల్ స‌చిన్ నెల‌కొల్పిన వ‌న్డేల్లో తొలి డ‌బుల్ సెంచ‌రీ రికార్డును ఏడాది తిర‌గ‌క‌ముందే అందుకునేలా చేసింది.
*టెస్టు హోదా పొందిన దేశాలు: ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, భార‌త్‌, పాకిస్థాన్‌, శ్రీ‌లంక‌, జింబాబ్వే, బంగ్లాదేశ్‌. 
ఎవ‌ర్‌గ్రీన్ రికార్డు:ఆస్ట్రేలియాకు చెందిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బ్యాట్స్‌మ‌న్ స‌ర్ డాన్ బ్రాడ్‌మ‌న్ కేవ‌లం 52 టెస్టులాడి స‌గ‌టున 99.94 ప‌రుగుల‌ను సాధించారు.
క్వాడ్ర‌పుల్ సెంచ‌రీ: టెస్టులో 400* రికార్డును సాధించిన ఏకైక ఆట‌గాడు వెస్టిండీస్‌కు చెందిన బ్రియ‌న్‌లారా.2004లో ఇంగ్లండ్‌పై న‌మోదు చేశాడు.
టెస్టుల్లో తొలి 10వేల ప‌రుగులు: సునీల్ గ‌వాస్క‌ర్‌
వ‌న్డేల్లో తొలి 10వేల ప‌రుగులు: స‌చిన్‌టెండుల్క‌ర్‌
వ‌న్డేల్లో తొలి డ‌బుల్ సెంచీరీ: స‌చిన్‌టెండుల్క‌ర్‌
టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీల హీరోలు: డాన్ బ్రాడ్‌మ‌న్‌,వీరేంద్ర సెహ్వాగ్‌,క్రిస్‌గిల్,బ్రియ‌న్‌లారా
ఓవ‌ర్‌లో ఆరు సిక్స్‌లు: 2007 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్‌మ‌న్ హెర్ష‌లీ గిబ్స్ కొట్టాడు.
ఇదే ఫీట్‌ను భార‌త్ ఆట‌గాడు యువ‌రాజ్‌సింగ్ 20-20 మ్యాచ్‌లో సాధించాడు.తొలుత కౌంటీల్లో ఈ ఘ‌న‌త‌ను వెస్టిండీస్‌కు చెందిన స‌ర్‌గ్యారీ సోబ‌ర్స్ సొంతం చేసుకున్నారు.రంజీల్లో భార‌త్‌కే చెందిన ర‌విశాస్త్రి కూడా ఓవ‌ర్లోని ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్ల‌ను కొట్టాడు.
వ‌న్డే గ్రేట్ ఇన్నింగ్స్‌: 
*వీరేంద్ర సెహ్వాగ్‌,భార‌త్‌(219)-2011(వెస్టిండీస్‌పై)
*స‌చిన్ టెండుల్క‌ర్‌,భార‌త్ (200*)-2010(ద‌క్షిణాఫ్రికాపై)
*చార్లెస్ కొవెంట్రి,జింబాబ్వే (194*)-2009(బంగ్లాదేశ్‌పై)
*స‌య్య‌ద్ అన్వ‌ర్‌,పాకిస్థాన్ (194)-1997(ఇండియాపై)
*వివ్ రిచ‌ర్డ్స్‌,వెస్టిండీస్ (189*)-1984 (ఇంగ్లండ్‌పై)
*స‌నత్ జ‌య‌సూర్య,శ్రీ‌లంక (189)-2000(ఇండియాపై)
*గ్యారీకిరిస్టెన్‌,ద‌క్షిణాఫ్రికా (188*)-1996(యూఏఈపై)
*స‌చిన్ టెండుల్క‌ర్‌,భార‌త్ (186*)-1999(న్యూజిలాండ్‌పై)
*షేన్‌వాట్స‌న్,ఆస్ట్రేలియా(185*)-2011(బంగ్లాదేశ్‌పై)
*ధోని,భార‌త్‌(183*)-2005(శ్రీ‌లంక‌పై)
వ‌న్డేల్లో తొలి గ్రేట్ ఇన్నింగ్స్ మాత్రం నిస్సందేహంగా డేర్‌డెవిల్ క‌పిల్‌దే.1983లో జింబాబ్వేపై అస‌లు సిస‌లైన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ను ఆయన ఆడాడు.ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న మూడో ప్ర‌పంచ‌(ప్రుడెన్షియ‌ల్‌)క‌ప్‌లో 17 పరుగుల‌కే భార‌త్ జ‌ట్టు  అయిదు వికెట్ల‌ను కోల్పోగా క‌పిల్‌దేవ్ విరుచుకుప‌డి 175* ప‌రుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు.అదే అప్ప‌టి వ‌ర‌కు వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగుల రికార్డు.ఫ‌లితంగా అండ‌ర్‌డాగ్ పొజిష‌న్‌లో బ‌రిలో దిగిన భార‌త్ క్రికెట్‌లో అప్ప‌టికి అమేయ‌శ‌క్తి అన‌ద‌గ్గ వెస్టిండీస్‌ను ఓడించి వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సాధించ‌గ‌ల్గింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ 28 ఏళ్ల‌కు ధోని సార‌థ్యంలో భార‌త‌జ‌ట్టు రెండోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలుచుకుంది.అంత‌కు ముందు కూడా ధోని కెప్టెన్సీలోనే భార‌త్ జ‌ట్టు తొలి 20-20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను సాధించ‌డం తెలిసిందే.
_______________________________________________________________
* ప్ర‌పంచంలో అతి ఎత్తైన శిఖ‌రం ఎవ‌రెస్టు (8848 అడుగులు)ను తొలిసారిగా అధిరోహించిన వారు:                    ఎడ్మండ్ హిల్ల‌రీ, టెన్జింగ్ నార్గే
* అంత‌రిక్షంలోకి వెళ్లిన తొలి మాన‌వుడు:యూరిగగారిన్
* చంద్రుడిపై అడుగిడిన ప్ర‌థ‌ముడు:నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌

11 Dec 2011

swan


ప్ర‌కృతిలో ప్ర‌తి ప్రాణి ఏదో ఒక శక్తిని క‌ల్గిన‌దే.అందుకే ఈ ఆధునిక కాలంలోనూ మ‌నిషి జంతువులపై ఆధార‌ప‌డుతున్నాడు.ముఖ్యంగా పాతిపెట్టిన బాంబులు ఇత‌ర పేలుడు ప‌దార్థాల‌ను క‌నుగొనేందుకు ఇప్ప‌టికీ స్నిఫ‌ర్ డాగ్‌ల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు వినియోగిస్తున్నాయి.అంతేందుకు ప్ర‌కృతి విల‌యాల్ని మ‌నుషుల కంటే ఎంతోముందుగా ప‌సిగ‌ట్టి జంతువులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి వెళ్లేందుకు ప్ర‌యత్నించ‌డం మ‌న‌కు తెలిసిందే.ముఖ్యంగా భూకంపాలు,తుపాన్లు,సునామీలు సంభ‌వించ‌నున్న‌ స‌మ‌యాల్లో ప‌క్షులు,ఇత‌ర మూగ‌జీవాల అస‌హ‌జ ప్ర‌వ‌ర్త‌న‌లు ఆ కోవ‌లోనివే.ఆ త‌ర‌హా ఆప‌ద‌లు జ‌రిగిన త‌ర్వాత ఆ జీవాల ప్ర‌వ‌ర్త‌న‌ను గుర్తు చేసుకున్నాకే మ‌న‌కు ఈ విష‌యం బోధ‌ప‌డింది.అలాగే పాల‌ను నీళ్ల‌ను వేరు చేసే హంస జాతి ప‌క్షులు ఒక‌ప్పుడు భార‌త్‌లో ఉండేవ‌ట‌.ఇప్పుడు మ‌చ్చుకు కూడా ఆ హంస‌లు ప్ర‌పంచంలో ఏమూలా లేవు.
తెల్ల హంస‌లు:ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఉన్న ఏడు ర‌కాల హంసల్లో ఆరు జాతులు తెల్ల రంగులోనే ఉంటాయి.వీటి మూల జాతి అన్టాడే ప‌క్షి కుటుంబం.ఇప్పుడున్న‌వి ఎక్కువ శాతం సిగ్నేజాతి కుటుంబానికి చెందిన‌వే.వీటిలో మ్యూట్ స్వాన్‌లే ఎక్కువ‌.వీటిని సిగ్న‌స్ ఒల‌ర్‌గాను పేర్కొంటారు.ఇవి దాదాపు 50 అంగుళాల పొడ‌వుంటాయి.వీటిలో మ‌గ వాటిని కాబ్స్‌గా ఆడ హంస‌ల్ని పెన్‌ల‌ని పిల్ల‌ల్ని సిగ్నెట్స్‌గా పిలుస్తారు.కాబ్స్ 11 నుంచి 15 కేజీల బ‌రువు వ‌ర‌కు ఉంటాయి.పెన్‌ల‌యితే 9 కేజీల బ‌రువు తూగుతాయి.ఇత‌ర ప‌క్షుల‌తో పోలిస్తే వీటి జీవిత కాలం చాలా ఎక్కువ‌నే చెప్పాలి.అడ‌వుల్లో అయితే ఇవి 25నుంచి 50ఏళ్లు కూడా జీవించ‌గ‌ల‌వు. హంస‌ల్లో వూప‌ర్‌,ట్రాంప్ట‌ర్‌,తుండ్రా,మ్యూట్‌,బ్లాక్‌నెక్డ్‌,బ్లాక్‌,బెర్విక్‌,కాస్కార్బా ర‌కాలున్నాయి.తుండ్రా,వూప‌ర్ జాతి హంస‌లు ఉత్త‌ర అమెరికా,ఉత్త‌ర ర‌ష్యా,ఆర్కిటిక్ ఐలాండ్‌ల్లో నివ‌సిస్తాయి.బ్లాక్‌నెక్డ్‌,కాస్కార్బా బ్రెజిల్‌లో బ్లాక్ స్వాన్ ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌ల్లో,మ్యూట్ స్వాన్‌లు ఎక్కువ‌గా యూర‌ప్ దేశాల్లో క‌నిపిస్తాయి. అయితే ఈ స్వాన్‌ల‌న్నీ కూడా ఎక్కువ‌గా జూ,పార్క్‌లు,బొటానిక‌ల్ గార్డెన్స్‌లో మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలుస్తోంది.హిందువులు చ‌దువుల త‌ల్లిగా స‌ర‌స్వ‌తిని కొలుస్తారు.ఆ స‌ర‌స్వ‌తీ దేవీ వాహ‌నం హంస‌.ఆ దేవి పేరిట స‌ర‌స్వ‌తి అనే న‌ది కూడా భార‌త్‌లో ప్ర‌వ‌హించేద‌ట‌.ఇప్పుడా న‌దిని ఉప‌గ్ర‌హాల స‌హాయంతోనే చూడ‌గ‌ల‌మ‌ని కొంద‌రి న‌మ్మ‌కం. ఆ న‌ది అంత‌ర్లీనంగా ప్ర‌వ‌హిస్తోంద‌ని ప‌లువురి భావ‌న‌.బాహ్య‌ప్ర‌పంచం నుంచి అంత‌ర్థాన‌మైన ఆ న‌ది మాదిరిగానే ఇప్పుడు హంస జాతి భార‌త్‌లో అదృశ్య‌మ‌యింది.
కంటి చూపుతోనే ఉప్పు-నీరు వేరు:ప్ర‌స్తుతం భూమిపై మిగిలి ఉన్న ఇత‌ర హంస జాతి ప‌క్షులు కూడా ఉప్పునీటిని,మంచి నీటిని కేవ‌లం కంటి చూపుతోనే గుర్తించే సామ‌ర్థ్యాన్ని క‌ల్గి ఉన్నాయి.అవి స‌ముద్ర‌మార్గంలో ప్ర‌యాణించేట‌ప్ప‌డు లేదా ఉప్పు నీటి స‌ర‌స్సుల్లో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ద‌ప్పిక తీర్చుకోవాల్సి వ‌చ్చినప్పుడు ఆ నీటిని తాగుతాయి.అలా తాగిన త‌ర్వాత త‌ల‌ను ఓసారి అటు ఇటు విసిరి ఆ నీటిలోని ఉప్పును ఈ హంస‌లు విస‌ర్జిస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు.ఒక్క మ్యూట్ హంస‌లు త‌ప్పితే మిగిలిన హంస జాతుల‌న్నీ శాకాహారులే.మొక్క‌లు,చెట్ల బెర‌డ్లు,కాండాలే వీటి ఆహారం.అంతేగాక కొన్ని హంస‌లు గోధుమ‌,మొక్క‌జొన్న‌,క్యేబేజీ,గ‌డ్డితోపాటు ఇత‌ర తిండి గింజ‌లను తింటాయి.అంతేనా బిస్క‌ట్లు,రొట్టెల‌ను కూడా ఇవి తింటాయ‌ట‌.మ్యూట్ హంస‌లు మాత్రం చేప‌ల్ని ఆర‌గించేస్తాయి.
శ‌త్రువు అంతు చూస్తాయి:ఈ హంస‌లు గొప్ప పోరాట పటిమ‌గ‌ల‌వి.అవి ఆగ‌కుండా రెక్క‌ల్ని ఆడించ‌డం ద్వారా మ‌న భుజాల్ని సైతం విర‌గ్గొట్టేంత‌టి శ‌క్తిగ‌ల‌వ‌ట‌.ఇవి దాదాపు 25వేల ఈక‌ల‌తో పొడ‌వాటి మెడ‌,సాలెగూడు మాదిరి వేళ్లు క‌ల్గిన పాదాల‌తో దృఢంగా శ‌త్రువును ఏ స‌మ‌యంలోన‌యినా ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉంటాయి.వీటి దాడిలో గాయ‌ప‌డ్డ మ‌నుషులూ ఎంద‌రో ఉన్నార‌ని జీవ‌శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.ప్ర‌మాదం పొంచి ఉన్నప్పుడు ఇవి త‌మను త‌మ పిల్ల‌ల్ని ర‌క్షించుకునేందుకు త్రాచుపాము మాదిరిగా బుస కొడుతూ శ‌త్రువుకు హెచ్చ‌రిక పంపుతాయి.బాతుల‌తో ద‌గ్గ‌ర పోలిక గ‌ల ఈ హంస‌లు చచ్చేవ‌ర‌కు పోరాడే గుణంగ‌ల‌వి.ఇవి వేరే జాతి హంస‌ల‌ను కూడా అంత తేలిగ్గా న‌మ్మ‌వు.ఓ మైలు దూరంలోనే గూళ్ల‌ను నిర్మించుకుంటుంటాయి.ఎక్కువ‌గా ఇవి త‌డి,నీళ్లుండే వాతావ‌ర‌ణాన్నే ఇష్ట‌ప‌డ‌తాయి.త‌డ‌వ‌కు ఇవి 5 నుంచి 10 గుడ్ల‌ను పెడ‌తాయి.వాటిని 30 రోజుల్లో పొదుగుతాయి.పిల్ల‌లు తొలుత కాల్వ‌ల్లో ఈత‌ను నేర్చుకుంటాయి.ఆ త‌ర్వాత అవి 60 నుంచి 75 రోజుల్లో గాల్లో ఎగుర‌డం నేర్చుకుంటాయి.స‌ముద్రాలు,ప‌ర్వ‌త‌,మైదాన ప్రాంతాలేవ‌యినా ఏక‌ధాటిగా ఈ హంస‌లు రెండువేల మైళ్లు ఎగురుకుంటూ వెళ్లిపోతాయి.భూమికి రెండువేల అడుగుల ఎత్తున య‌థేచ్ఛ‌గా ఎగుర‌గ‌ల‌వివి.ఎక్కువగా జులై,ఆగ‌స్ట్‌లోనే ఇవి వ‌ల‌స‌లు వెళ్తాయి.
-------------------------------------------------------------------------------------------------------------
*స‌హ‌జ‌క‌వి, బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి ఎం.ఎస్‌.రెడ్డి(87)అనారోగ్యంతో హైద‌రాబాద్‌లోని త‌న స్వ‌గృహంలో క‌(పె)న్నుమూశారు.త‌న ఇంటిపేరు మ‌ల్లెమాల‌నే క‌లం పేరుగా చేసుకుని ఆయ‌న ఎన్నో క‌విత‌ల‌ల్లారు,ప‌లు ర‌చ‌న‌లు చేశారు.సినిమాల్లో పాట‌ల‌ను రాశారు.హెచ్.ఎం.టి.వి సీఈఓ, ప్ర‌ఖ్యాత  సంపాద‌కులు కె.రామ‌చంద్ర‌మూర్తికిచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో ఎం.ఎస్‌.రెడ్డి ఏక‌ల‌వ్యుడికి విలువిద్యాభ్యాసంలో గురువులేన‌ట్లే క‌విత్వంలో త‌న‌కు గురువు ఎవ్వ‌రూ లేరని చెప్పారు.క‌విసామ్రాట్ విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ ఓ స‌భ‌లో మ‌ల్లెమాల క‌విత్వానికి ఆశ్చ‌ర్య‌పోయి `ఎక్క‌డున్నావ‌య్యా మ‌హాక‌వి ఇన్నాళ్లు` అన‌డ‌మే త‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మైన‌ ప్ర‌శంస‌ని  ఎం.ఎస్‌.రెడ్డి తెలిపారు.

5 Dec 2011

babaji

http://royalloyal007.blogspot.in/2012/09/t-hunts-down-d.html
శ‌రీరం అశాశ్వ‌తం..ఆత్మ శాశ్వ‌తం..ఇది స‌ర్వుల విశ్వాసం.జ‌న్మించిన వారికి మ‌ర‌ణం త‌ప్ప‌దు.మ‌ర‌ణించిన వారికి జ‌న‌నం త‌ప్ప‌దు అనేది గీతాసారం.అయితే చిరంజీవులు ఉండ‌రా?హ‌నుమంతుడు చిరంజీవి..హిమాల‌యాల్లో ఇంకా త‌ప‌స్సులో నిమ‌గ్న‌మై ఉన్నాడ‌న్న‌ది పురాణాల ఆధారంగా హిందువుల్లో అత్య‌ధిక సంఖ్యాకుల న‌మ్మిక‌.న‌మ్మ‌కం మ‌నిషికో ఆయుధం.ఇత‌రుల‌కు భంగ‌క‌రం కానంత‌వ‌ర‌కు,అది మూఢ న‌మ్మ‌కంగా పెడ‌దారి ప‌ట్ట‌నంత‌కాలం ఎవ‌రైనా ఆచ‌రించ‌వ‌చ్చు.ఆ కోవ‌లోనే ఇప్ప‌టికీ రెండువేల ఏళ్లగా మ‌హావ‌తార బాబాజీ స‌జీవంగా విరాజిల్లుతున్న‌ట్లు భావించేవారు ఉన్నారు.ఏ విశ్వాస‌మైనా మ‌తాసార‌మైనా ఒక్క‌టే మంచిని పెంచ‌డం,శాంతిని స్థాపించ‌డ‌మే.సృష్టి ఉన్న‌ప్ప‌టి నుంచి సైన్స్ ఉంది.సాధ‌న‌,శోధ‌న అనే క్ర‌మంలో అది కొన‌సాగుతూనే ఉంది.సూర్య‌చంద్రాదులున్నంత వ‌ర‌కు కొన‌సాగుతూనే ఉంటుంది.నిన్న‌టి సిద్ధాంతం రేప‌టిరోజున త‌ప్పుకావ‌చ్చు.నిన్న‌టి ప‌రిశోధ‌న‌లు నేటికి నిజంగా చ‌లామ‌ణి అవ్వొచ్చు.భ‌విష్య‌త్‌లో మ‌రో శోధ‌న ఇదే క‌చ్చితం అంటూ నిరూపించవ‌చ్చు.అయితే ఏదీ ప‌రిపూర్ణం కాదు.సైన్స్ ప‌రిభ్ర‌మణంలో అవ‌న్నీ ద‌శ‌లు.అందుకే ప్ర‌పంచ ప్ర‌సిద్ధ శాస్త్ర‌వేత్త‌లు,వైద్యాచార్యులు సైతం మిస్ట‌రీలను కొట్టివేయ‌డం లేదు.అద్భుతాల‌ను కాదంటూ బ‌ల్ల‌గుద్దడం లేదు.ప్ర‌పంచంలో మొత్తం మాన‌వాళి ఇంకా పాత‌,కొత్త విష‌యాల‌ను తెలుసుకొనే ప్ర‌య‌త్నంలోనే ముందుకు వెళ్తోంది.
బాబాజీ:భార‌త‌దేశానికి పెట్ట‌ని కోట‌యిన హిమాల‌యాల్లో రెండువేల ఏళ్ల‌గా జీవిస్తున్న యోగి ఈ మ‌హావ‌తార బాబాజీ.నిత్య య‌వ్వ‌నుడు.చిరంజీవి.మ‌హాకాయ బాబాజీగానూ భ‌క్తులు పిలుచుకుంటారు.`క్రియా యోగ`ప్ర‌దాత‌.మెడ‌లో రుద్రాక్ష‌లు,ఒళ్లంతా పులిమిన‌ట్లు క‌న్పించే బూడిద‌,నుదుటిన కుంకుమ‌బొట్టు..ఆక‌ర్ష‌ణీయ‌మైన ముఖ‌వ‌ర్చ‌స్సు,వెలుగులు విర‌జిమ్మే నేత్రాల‌తో ప‌ద్మాస‌న ముద్ర‌లో ద‌ర్శ‌న‌మిస్తార‌ని హిమాల‌య సాణువుల‌కు వెళ్లే సాధువులు,రుషులు,ప‌ర‌మ భ‌క్తులు విశ్వ‌సిస్తుంటారు.బ‌ద్రీనాథ్‌కు ఎగువున గ‌ల శిఖ‌రాల్లో బాబాజీని ఆర్తిగా స్మ‌రిస్తే ఆ దివ్య పురుషుడు ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌ట‌.మ‌న‌కు ద‌గ్గ‌ర్లోనే ఆ స్వామి కొలువున్న‌ట్లు అనిపిస్తుంది.ఎంత న‌డిచినా ఆ యోగి ద‌రికి మాత్రం చేర‌లేమ‌ట‌.ఇంత‌కు ముందు మ‌న‌కు క‌నిపించినంత‌టి దూరంలోనే ఉండి బాబాజీ ఆశీర్వ‌దిస్తున్న‌ట్లు భావ‌న క‌ల్లుతుంద‌ట‌.ఈ విశ్వాసం త‌ర‌త‌రాలుగా వేల ఏళ్లుగా హిమాల‌య శిఖ‌రాల్లో సంచ‌రించే సాధువులు,బాబాలు,యోగుల్లో ఉంది.ఇప్ప‌టికీ చాలామంది భ‌క్తులు న‌మ్ముతారు.సౌత్ ఇండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ బాబాజీ ఉనికిని బ‌లంగా న‌మ్మే వారిలో ఒక‌రు.ఎంత‌గానంటే ఏడాదికో రెండేళ్ల‌కోసారి ఆయ‌న దాదాపు ఆరునెల‌లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు.ఎక్క‌డుంటారంటే నెల‌ల త‌ర‌బ‌డి హిమాల‌యాల్లోనే బాబాజీ ధ్యానంలోనే గ‌డుపుతారు.ఆ బాబాజీ పేరు మీద ఏకంగా ఆయ‌న బాబా అనే సినిమాను కూడా చిత్రీక‌రించారు. 
యోగా-చిరంజీవి: యోగా సాధ‌న ఆరోగ్య‌దాయ‌కం.త‌ద్వారా జీవ‌న ప్ర‌మాణం పెరిగే అవ‌కాశ‌ముంది.హిమాల‌యాల్లో స్వ‌చ్ఛ‌మైన ప్ర‌కృతి ఒడిలో ఆశ్ర‌మ జీవ‌నం గ‌డ‌పడం,సంజీవిని త‌ర‌హా ఔష‌ధ మొక్క‌లు,వ‌న‌మూలిక‌లు,పండ్లు,కంద‌మూలాలతో కూడిన ఆహారం త‌మ‌ను చిరంజీవుల్ని చేస్తుందంటారు యోగులు.స్థిర‌చిత్తం,స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌లు కూడా వారి జీవ‌నానికి వ‌రాలే.అందుకే వంద‌ల ఏళ్లు జీవించే బాబాలు,యోగినుల‌కెంద‌రికో హిమాల‌యాలు వేదిక‌.ప‌ర‌మ‌హంస యోగానంద త‌న `యోగి`అనే పుస్త‌కంలో బాబాజీ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల్ని ప్ర‌స్తావించారు.క్రియా యోగాల‌యాన్ని నిర్వ‌హిస్తున్న కెన‌డాకు చెందిన మార్ష‌ల్ గోవింద‌న్ కూడా త‌ను రాసిన ప‌లు పుస్త‌కాల్లో ఎన్నో అద్భుత‌,కొత్త విష‌యాల్ని పేర్కొన్నారు.ఆరోగ్యప‌రిర‌క్ష‌ణ‌కు యోగా చ‌క్క‌ని వ‌న‌రు.ఆయుర్వేదం భార‌త్‌కు చెందిన ప్రాచీన వైద్య‌విధానం.ఎన్నో దీర్ఘ‌కాలిక వ్యాధుల నివారిణి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోగ‌పీడితులకు అమృత తుల్యంగా మ‌న్న‌న‌లు పొందుతోంది.ఇక హిమాల‌యాల్లో వ‌న‌మూలిక‌ల‌కు కొద‌వుండ‌ద‌ని అందుకే అక్క‌డ యోగులు చిరంజీవులుగా ఉండ‌డం సాధ్య‌మేన‌ని వివిధ స‌ద‌స్సుల్లో స‌ద‌స్స్యులు అభిప్రాయ‌ప‌డ్డారు.బాబాజీ ప్ర‌భావం ఆదిశంక‌రాచార్య‌,క‌బీర్‌,షిర్డీసాయిబాబా,గ‌జాన‌న మ‌హ‌రాజ్‌,స్వామి స‌మ‌ర్తా త‌దిత‌రుల‌పైన ఉంద‌ని కాలిఫోర్నియాలో జ‌రిగిన ఓ అధ్యాత్మిక స‌ద‌స్సులో కొంద‌రు త‌మ‌ భావ‌న‌గా పేర్కొన్నారు.మ‌హాత్మాగాంధీ,పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ త‌దిత‌ర ప్ర‌ముఖులెంద‌రికో వైద్యం చేసిన డాక్ట‌ర్ రామ్‌బోస్లే(బొంబాయి)బాబాజీకి ప‌ర‌మ‌భ‌క్తులు.విదేశాల్లో జ‌రిగిన 160కు పైగా స‌ద‌స్సుల్లో పాల్గొన్న ఆయ‌న బాబాజీకి సంబంధించి త‌న‌కు గ‌ల అనేక అనుభూతుల్ని వివిధ వేదిక‌ల‌పై పంచుకున్నారు.బాబాజీ అద్వితీయ‌మైన మహాపురుషుడిగా ప‌లు ప‌త్రాలు,పుస్త‌కాల్లో పేర్కొన్నారు. 
-------------------------------------------------------------------------------
* జీవ‌న ప్ర‌మాణం:భార‌త్‌లో జీవ‌న‌ప్ర‌మాణం 64 ఏళ్లు.
(మ‌నిషి నూరేళ్లు జీవిస్తాడంటారు.వందేళ్ల‌కు పైగా బ‌తికిన వాళ్లు,ప్ర‌స్తుతం బ‌తుకుతున్న వాళ్లు ప్ర‌పంచం న‌లుమూల‌లా ఇప్ప‌టికీ కొంద‌రున్నారు.అలాగే భార‌త్‌లో కూడా ఉన్నారు.)

2 Dec 2011

big frog

క‌ప్ప‌ల్ని పాములు తిన‌డం స‌హ‌జం.సృష్టిలో జీవులు మ‌రో జీవిని తిన‌డం ద్వారానో లేదా వాటిపై ఆధార‌ప‌డో జీవించ‌డం సాధార‌ణం.అందుకు భిన్నంగా సృష్టి ద‌ర్మానికి విరుద్ధంగా క‌ప్పే పామును నోట క‌రుచుకొనే దృశ్యాల్ని టి.వి,పేప‌ర్ల‌లో చూసిన‌ప్ప‌డు ఆశ్చ‌ర్య‌పోతుంటాం.నిజంగా ఆ జాతి కప్ప‌లు ఉన్నాయి.అవే బిగ్ ప్రాగ్స్‌.అమెరికా,కెన‌డాల్లో తొలుత వెలుగు చూసిన ఈ క‌ప్ప‌లే బుల్‌ప్రాగ్స్‌.వీటి శాస్త్రీయ‌నామం రెన‌క‌ట్స్‌బ‌య‌న్‌.ఇప్పుడు అరుద‌యిపోతున్న ఈజాతి క‌ప్ప‌లు ఒక్కో దేశంలో ఒక్కో రంగులో అక్క‌డ‌క్క‌డ ఇంకా ఉన్నాయి.సాధార‌ణ క‌ప్ప‌ల‌తో పోలిస్తే ఇవి చాలా భిన్నంగా ఉంటాయి.శ‌త్రువు నుంచి తప్పించుకోవ‌డానికో ఆహారాన్ని సేక‌రించే నిమిత్త‌మో ఇవి అచ్చు ఊస‌ర‌వెల్లిలా రంగుల్ని మారుస్తాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న ప‌త్రాల్లో శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.
నిద్ర పోని జీవి:బుల్‌ప్రాగ్ అస్స‌లు నిద్రే పోదు.ఇలాంటి జీవి భూమ్మీద బ‌హు అరుదేన‌ని చెప్పాలి.చేప‌లు క‌ళ్లు తెరుచుకొనే నిద్ర‌పోతాయి.వాటికి క‌నుపాప‌లు కూడా ఉండ‌వు.కేవ‌లం ఒక్క‌రోజే జీవించే కొన్ని కీట‌కాలకు కూడా నిద్ర‌,విశ్రాంతి త‌దిత‌రాల అవ‌సరం ఎలాగూ లేదు.వేల్స్‌,డాల్ఫిన్స్‌ల్లోని మెద‌డులో స‌గ‌భాగం మాత్ర‌మే నిద్ర‌పోతుంది.మిగిలిన స‌గ‌భాగం ఊపిరి తీసుకొనే క్ర‌మంలో నిమ‌గ్న‌మ‌వుతుంది.ఇక రోజులో ఏక‌ధాటిగా 20మైళ్లు ఈద‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న ఏనుగుల నిద్రా స‌మ‌యం కేవ‌లం నాలుగ్గంట‌లే.అదీ ద‌ఫ‌ద‌ఫాలుగానే నిద్ర‌పోతాయి.న‌త్త‌ల‌యితే ఒక‌సారి నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తే నాల్గేళ్ల వ‌ర‌కు కూడా అదే విశ్రాంతి ద‌శ‌లో ఉండిపోగ‌ల‌వు.స‌ల్మ‌న్‌,పైక్,గోల్డ్‌ఫిష్‌,యాంగ‌ర్ ఫిష్ త‌దిత‌ర చేప‌లకు కూడా నిద్రంట‌నే తెలీద‌ట‌.ఆ కోవ‌లోకే వ‌స్తుంది ఈ బుల్‌ఫ్రాగ్‌.ఇవి ప‌రిమాణంలోనూ చాలా పెద్ద‌వి.జీవిత‌కాలం కూడా ఎక్కువే.అలాగే వీటి బ‌రువును కూడా మ‌నం ఊహించ‌లేం.ఆఫ్రిక‌న్ బుల్‌ఫ్రాగ్ అయితే ఏకంగా 45 ఏళ్లు జీవించ‌గ‌ల‌ద‌ట‌.మిగిలిన ప్ర‌పంచ దేశాల్లోని ఈ జాతి క‌ప్ప‌లు 8నుంచి10ఏళ్లు కొన్న‌యితే 16ఏళ్ల వ‌ర‌కు బ‌తుకుతాయి.వీటి బ‌రువు కూడా రెండు కేజీల పైమాటే.ఈ క‌ప్ప‌ల్లో త‌ల భాగం చాలా పెద్ద‌గా ఉంటుంది.ఇవి 4నుంచి6 అంగుళాల సైజులో ఉంటాయి.ఆడ‌క‌ప్ప‌ల‌యితే మ‌గ‌వాటిక‌న్నా సైజులో ఇంకా పెద్ద‌గా ఉంటాయి.ఇవి 8నుంచి10 అంగుళాల వ‌ర‌కు కూడా పెరుగుతాయి.ఎక్కువ‌గా నీటి మ‌డుగుల్లో నివ‌సించే ఈ క‌ప్ప‌లు ఒడ్డున గుడ్లు పెడ‌తాయి.అదీ వేస‌వి ఆరంభానికి కాస్త ముందు.వేడి వాతావ‌ర‌ణాన్ని అంటే 25నుంచి28 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిని ఇష్ట‌ప‌డ‌తాయి.వీటి క‌ద‌లిక చాలా నెమ్మ‌దిగా ఉంటుంది.వ‌ర్షాకాలంలో రాత్రి వేళ‌ల్లో ఒక‌చోటు నుంచి మ‌రోచోటుకి సంచ‌రిస్తాయి.అమెరికా,కెన‌డాల్లో ఇవి లేత ఆకుప‌చ్చ‌,లేత బూడిద రంగుల్లో క‌నిపిస్తాయి.ఆఫ్రికాలో అయితే ఇవి ఆలివ్‌గ్రీన్ రంగులో ఉంటాయి.మ‌గ‌వి లేత ప‌సుపురంగు,నారింజ‌ రంగుతో మ‌రీ సొగ‌స‌రిగా ఆక‌ర్షిస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.
పాములూ ఆహార‌మే: ఎలుక‌లు,పిచ్చుక‌లు,పాము పిల్ల‌లు,చేప‌లు వంటివి దొరికితే ఈ బుల్‌ఫ్రాగ్‌లు వ‌దిలిపెట్ట‌వు.ఇక‌ మిడ‌త‌లు,వాన‌పాములు,తొండ‌లు,కీచురాళ్లు,పేడ‌పురుగులు,ఇత‌ర కీట‌కాల్ని ఆబ‌గా లాగించేస్తాయివి.అందుకే ఈ క‌ప్ప‌ల్ని తినే మ‌నుషుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.వీటి కాళ్ల‌కు భ‌లేగిరాకీ.ఆ రుచే వేరంటారు మాంసాహార ప్రియులు.ఎక్కువ‌గా చైనా,జ‌పాన్‌ల్లో క‌ప్ప‌ల మాంసాహార ప్రియులు అత్య‌ధికంగా ఉన్నారు.యూర‌ప్‌,ఇత‌ర పాశ్చాత్య దేశాల్లో ఏటా నాలుగు ట‌న్నుల మేర క‌ప్ప‌ల‌ను భోంచేసేస్తున్నార‌ట‌.ఎగుమ‌తి చేసే దేశాల్లో ఇండోనేసియాది ప్ర‌థ‌మ స్థానం.అమెరికా,కెన‌డాల్లో ఊపిరిపోసుకున్న ఈ బుల్‌ఫ్రాగ్స్ జాతిని ఆ దేశాలు ద‌క్షిణ‌కొరియా,వెస్ట్ర‌న్ యూర‌ప్‌,బ్రెజిల్‌,కొలంబియా,ఆస్ట్రేలియాలకు ప‌రిచ‌యం చేసి వృద్ధి చేశాయి.కానీ వీటిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ పాఠ‌శాల‌లు,క‌ళాశాల‌ల్లో ప్ర‌యోగాల‌కు వినియోగిస్తుండ‌డం,శాస్త్ర‌వేత్త‌లూ ఇంకా వీటిపై అనేక ప‌రిశోధ‌న‌లు సాగిస్తుండ‌డం, మ‌రోప‌క్క వీటి మాంసం రుచికి ప‌రిత‌పించే జ‌నం పెరిగిపోవ‌డంతో ఈ బుల్‌ఫ్రాగ్ జాతి ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డింది.మందుల తయారీకి ముఖ్యంగా యాంటీబ‌యోటిక్స్ ఉత్ప‌త్తికి వీటిని వినియోగిస్తుంటారు.
-------------------------------------------------------------------------------------------------------------
INDIA

*National animal:టైగ‌ర్‌
*National bird:నెమ‌లి
*National reptile:త్రాచుపాము
*National icon:కోతి
*National marine animal:డాల్ఫిన్స్‌
*National heritage animal:ఏనుగు



---------------------------------------------------------------------------

Popular Posts

Wisdomrays