10 Jan 2012

water car


స‌క‌ల చ‌రాచ‌ర సృష్టికి నీరే మూలం.ప్ర‌కృతి వ‌ర‌ప్ర‌సాదితం నీరు.జీవులన్నింటికి ప్రాణాధారం.మ‌రి యంత్రాల‌కూ ఆ నీరే శ‌క్తిగా మారితే? అవి ఆ నీటితోనే క‌ద‌లాడితే అబ్బుర‌మే క‌దా!కాలం మారింది..వేగం పెరిగింది.ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌లు..గ‌తంలో ఆడంబ‌రాల‌నుకునేవి నేడు అవ‌స‌రాల‌య్యాయి.ఇది యాంత్రిక‌యుగం కావ‌డంతో వాహ‌నాలు సామాన్యుల‌కు సైతం త‌ప్ప‌నిస‌రిగా కావాల్సి వ‌స్తోంది.ఆ క్ర‌మంలోనే వాహ‌నాల సంఖ్య వాహ‌న వినియోగ‌దారుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.అంత‌ర్జాతీయ విప‌ణిలోకి ఎన్నోన్నో వాహ‌నాలు కొత్త ఫీచ‌ర్లు,మోడ‌ళ్ల‌తో దూసుకువ‌స్తున్నాయి.అయితే ఆ వాహ‌నాలన్నింటికీ ప్ర‌ధాన ఇంధ‌నం పెట్రోలే.అందుకే నిత్యం పెట్రో ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు.అదే సామాన్య వాహ‌న‌దారుల గుండెల్లో గుబులు రేపుతోంది.గ‌తంలో డీజిల్ వాహ‌నాలు ఆ త‌ర్వాత పెట్రోలు వాహ‌నాలు ఆపై ఎల‌క్ట్రిక్ ఇప్పుడు సి.ఎన్‌.జి(కంప్రెస్డ్ నేచుర‌ల్ గ్యాస్‌) ఆధారిత వాహ‌నాలు తెర‌పైకి వ‌చ్చాయి.ఇవ‌న్నీ వాహ‌న‌దారుల జేబు చ‌మురునే వ‌దిలిస్తున్నాయి.దీనికి ప్ర‌త్యామ్నాయం ఏమిటి?ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ దూరం ప్ర‌యాణించే ఆవిష్క‌ర‌ణ‌లు అంద‌రికీ ఆనంద‌దాయ‌క‌మే అన‌డంలో సందేహం లేదు.90వ ద‌శ‌కంలో భార‌త్‌((త‌మిళ‌నాడు)లో రామ‌న్‌పిళ్లై మూలికా ఇంధ‌నాన్ని సృష్టించాన‌న్నారు.పెట్రోల్‌కు ఇదే క‌చ్చిత‌మైన ప్ర‌త్యామ్నాయమ‌ని ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు.అయితే ఆ త‌ర్వాత పిళ్లై ప్ర‌యోగాలు విఫ‌లం కావ‌డం భార‌త్ వంటి వ‌ర్థ‌మాన‌దేశాల వాహ‌న వినియోగ‌దారుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.కానీ ప్ర‌పంచ వ్యాప్తంగా శాస్త్ర‌వేత్త‌లు త‌మ మెద‌ళ్ల‌కు పదును పెట్టి సరికొత్త ప‌రిశోధ‌న‌లను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తూనే ఉన్నారు.
డ‌బ్లూ.ఇ.ఎస్‌..:కేవ‌లం నీరు,గాలి ద్వారానే కార్ల‌ను న‌డిపిస్తే..ఆ ఆలోచ‌న ఉద‌యించే సూర్యుని దేశం జ‌పాన్‌కి రానే వ‌చ్చింది.ఆటోమొబైల్ రంగంలో ప్ర‌పంచ రారాజుగా ఆధిప‌త్యాన్ని చ‌లాయిస్తున్న మ‌న జ‌పనీయులు వాట‌ర్ ఎన‌ర్జీ సిస్ట‌మ్‌(డ‌బ్లూ.ఇ.ఎస్‌)ను ప‌రిచ‌యం చేసి మ‌రోసారి త‌మ స‌త్తాను చాటారు.ప్ర‌సిద్ధ జెనెప‌క్స్ కంపెనీ ఈ వాట‌ర్ కారును రూపొందించింది.నీళ్లలో ఉండే ఆక్సిజ‌న్‌,హైడ్రోజ‌న్‌ల‌ను విభ‌జించి ఆ హైడ్రోజ‌న్ ద్వారా శ‌క్తిని సృష్టించి యంత్రాన్ని న‌డ‌ప‌డ‌మ‌న్న‌దే ఈ స‌రికొత్త టెక్నాల‌జీ.ప్ర‌స్తుతం న‌డుస్తున్న డీజిల్‌,పెట్రోల్‌,ఎల‌క్ట్రిక్‌,సి.ఎన్‌.జి త‌దిత‌ర వాహ‌నాల్లో క‌న్వ‌ర్ట‌ర్ల‌ను మార్చి ఈ డ‌బ్లూ.ఇ.ఎస్ ప‌రిజ్ఞానంతో `కారు`చౌక ప్ర‌యాణాల ల‌బ్ధిని వాహ‌న‌దారుల‌కు అందించ‌డ‌మే దీని లక్ష్యం.ఎంత ల‌గ్జ‌రీ కారైనా,చౌక‌ర‌క‌మైన‌దైనా పెట్రోల్‌,సి.ఎన్‌.జి చార్జీల చెల్లింపు వాహ‌న‌దారులంద‌రికీ స‌మాన‌మే.వాహ‌నాల్లో వినియోగించే ఇంధ‌నం ధ‌ర‌లు అంద‌రికీ అందుబాటులో ఉండ‌డ‌మ‌న్న‌దే ప్రధానాంశం.ఆ దిశ‌గానే ఇప్పుడు అడుగులు ప‌డుతున్నాయి.ఈ సాంకేతిక ప‌రిజ్ఞానం పూర్తిగా విజ‌యవంత‌మై విశ్వ‌వ్యాప్తంగా అన్ని త‌ర‌హా వాహ‌న‌దారుల‌కు అక్క‌ర‌కు వ‌స్తేనే ప్ర‌యోజ‌న‌దాయ‌క‌మ‌వుతుంది.వాట‌ర్ ప‌వ‌ర్డ్ వెహిక‌ల్ ఒక్కో ఇంజిన్ త‌యారీకి 2 కోట్ల యెన్‌లు(18,500 అమెరికా డాల‌ర్లు)ఖ‌ర్చ‌వుతోంద‌ట‌.ఆ ధ‌ర‌ల‌ను 5 ల‌క్ష‌ల యెన్‌లు(4,600 అమెరికా డాల‌ర్ల‌) స్థాయికి తీసుకురాగ‌ల్గితేనే తాము ఆశించిన ఫ‌లితం సిద్ధిస్తుంద‌ని ఆ కంపెనీ భావిస్తోంది.
ప‌ర్యావ‌ర‌ణం-భ‌ద్రం:సిఎన్‌జి,ఎల‌క్ట్రిక్ మోడ్ వాహ‌నాల మాదిరిగా ఈ వాట‌ర్ కార్ల వ‌ల్ల ఎటువంటి వాతావ‌ర‌ణ కాలుష్యం ఉండ‌దు.ఈ డ‌బ్లూఇఎస్ ప‌రిజ్ఞానంపై నిజానికి నూరేళ్ల క్రితం నుంచే బ్రిట‌న్‌,ఆస్ట్రేలియా,అమెరికా,ర‌ష్యా త‌దిత‌ర దేశాల శాస్త్ర‌వేత్త‌లు దృష్టిని సారించారు.ర‌ష్యా శాస్త్ర‌వేత్త‌లు తొలుత ఓ నౌక‌ను నీటి ద్వారా న‌డిపించేందుకు ఈ ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.స‌ముద్ర‌పు జ‌లాల నుంచే హైడ్రోజ‌న్‌ను సేక‌రించి షిప్ న‌డిచేలా సాంకేతిక‌త‌ను రూపొందించారు.ఈ ప‌రిజ్ఞానాన్ని ఓ.ఎమ్‌. గా వారు స్థిర‌ప‌రిచారు.ఈ డ‌బ్లూ.ఇ.ఎస్ ప‌రిజ్ఞానం మ‌రింత ప్ర‌గ‌తిని సాధిస్తే ఒక్క కార్లేంటి ఏకంగా విమానాలు,రాకెట్లు,స‌బ్‌మెరైన్ల‌ను కూడా నీళ్ల‌తోనే న‌డిపించేయొచ్చంటున్నారు.

8 Jan 2012

giant crocodile


ప్ర‌కృతి కాల పరీక్ష‌ను త‌ట్టుకొని మ‌నుగ‌డ సాగిస్తున్న ఏకైక భారీ జీవి మొస‌లి. ఏదో గ్ర‌హ శ‌క‌లం భూమిని ఢీకొన‌డమో లేదా అగ్ని ప‌ర్వ‌తాలు బ‌ద్ధ‌లై లావా పెల్లుబికడం వ‌ల్ల‌నో రాక్ష‌స‌బ‌ల్లుల జాతే ఈ భూమి మీద నుంచి క‌నుమ‌రుగ‌యిపోయింది.కానీ రెండు వేల ఏళ్లుగా మొస‌ళ్లు త‌మ ఉనికిని నిలుపుకుంటున్నాయి. వీటిలో 23 ర‌కాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్నాయి.నీటిలో ఉన్న మొస‌లి గ‌జ‌రాజు క‌న్నా బ‌ల‌శాలే.ఇవి నూరేళ్ల‌కు పైబ‌డి కూడా బ‌తుకుతాయి. ఇలాగే 115 ఏళ్ల పాటు ఓ మొస‌లి ర‌ష్యాలోని జూలో 1997 వ‌రకు జీవించి రికార్డు సృష్టించింది. దాన్ని 1890లో ప‌ట్టుకొని అప్ప‌టి నుంచి ఆ జూలో పెంచారు.
సాల్ట్ వాట‌ర్ క్రోక‌డైల్‌:ఈ ర‌కం మొస‌ళ్లు బ‌హు ప్ర‌మాద‌కారులు.ఎక్కువ‌గా ఇవి ఆస్ట్రేలియాలో ఉన్నాయి.మ‌నుషులు కూడా చాలా మందే వీటి బారిన‌ప‌డి మృత్యుపాల‌య్యారు.మొస‌ళ్లు ఇత‌ర జ‌ల‌చ‌రాల‌పై స‌ముద్ర గ‌ర్భంలో ప‌రిశోధ‌న‌లు సాగించే ఆస్ట్రేలియ‌న్ టి.వి. ఎక్స్‌ప‌ర్ట్ స్టీవ్ ఇర్విన్ 2006లో విధి నిర్వ‌హ‌ణ‌లోనే స్టింగ్‌రేస్ దాడిలో చ‌నిపోయారు.మొస‌ళ్ల‌కు కోర‌ల్లాంటి ప‌దునైన ప‌ళ్లు 60 నుంచి 80 వ‌ర‌కు ఉంటాయి.అయితే వీటి బ‌ల‌మంతా ద‌వ‌డ‌ల్లోనే ఇమిడి ఉంటుంది.జిరాఫీ వంటి పొడ‌వైన జంతువుల్ని సైతం అమాంతం ప‌ట్టేసి చంపేయ‌గ‌ల‌వివి.మొస‌ళ్లు ఎక్కువ సేపు నీటిలోనే ఉండ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటాయి.వీటి మెద‌డు ప‌రిమాణం చాలా చిన్న‌ది.పొడ‌వైన తోక బ‌లిష్ట‌మైన పైచ‌ర్మంతో ఆక‌ల‌యిన‌ప్పుడు శ‌ర‌వేగంగా ఈది ఇత‌ర జంతువుల్ని చాలా తెలివిగా ఒడిసి ప‌ట్టేస్తాయి.చుట్టుప‌క్క‌ల ప్ర‌దేశాల్ని బాగా గ‌మ‌నించేందుకు వీలుగా వీటి త‌ల‌భాగంలో ఇరుప‌క్క‌ల బాగా ఎడంగా క‌ళ్లు అమ‌రి ఉంటాయి.వాస‌న‌ను బ‌ట్టీ జంతువుల జాడ‌ను ఇవి గుర్తించి మాటు వేసి మ‌ట్టుపెడ‌తాయి.ఒక్కోసారి మొస‌ళ్లు త‌మ పిల్ల‌ల్నీ తినేస్తాయి.వాడైన ప‌ళ్ల‌తో దొరికిన జంతువును ప‌ట్టి చీల్చేసి క‌డుపులో వేసేసుకుంటాయివి.ఆ త‌ర్వాత కొన్ని వారాల పాటు ఆ ఆహారాన్ని క్ర‌మ‌క్ర‌మంగా జీర్ణం చేసుకోగ‌ల‌వు.మ‌ళ్లీ కొన్ని నెల‌ల‌పాటు ఆహారం లేకుండాను జీవిస్తుంటాయి.భారీ జంతువులను వేటాడిన‌ప్పుడు మ‌గ‌మొస‌ళ్లు ఆడ మొస‌ళ్ల స‌హాయాన్ని తీసుకుంటుంటాయి.ఒక్కో మ‌గ‌మొస‌లికి 10 వ‌ర‌కు గ‌ర్ల్ ఫ్రెండ్స్ ఉంటాయ‌ట‌.
భారీ మొస‌లి: ఫిలిప్పీన్స్‌లోని అగుస‌న్‌లో 2011లోనే జ‌యింట్ క్రోక‌డైల్‌ను ప‌ట్టుకున్నారు. ఇది 2,400 పౌండ్ల బ‌రువుతో 22 అడుగుల పొడ‌వుంది. మొస‌ళ్లు ఈత‌లో పెద్ద నేర్ప‌ర్లేమి కాద‌ట‌ . అయితే 10వేల మైళ్ల‌కు పైగా జ‌లాల్లో ఇవి ఈదుకుంటూ వెళ్లి పోతుంటాయని బ్రిటిష్ జీవ‌శాస్త్రవేత్త డాక్ట‌ర్ హామిష్ కాంప్‌బెల్ తెలిపారు. ఇవి ఎస్ ఆకారంలో ఈదుతాయట‌. మొస‌ళ్లు ఎక్కువ‌గా న‌దులు,స‌ర‌స్సులు,అడ‌వుల్లోని వంక‌లు,మ‌డుగుల్లోను,కొన్ని స‌ముద్ర తీరాల్లోను జీవిస్తాయి.ఎక్కువ‌గా అమెరికా, చైనా, న్యూగునియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మ‌డ‌గ‌స్క‌ర్‌,పాకిస్థాన్‌ల్లో ఉన్నాయం టున్నారు. మొస‌ళ్లు త‌మ జీవిత‌కాలంలో అనేక‌సార్లు త‌మ ప‌ళ్ల‌ను వ‌దిలేస్తుంటాయి. మ‌ళ్లీ వాటికి కొత్త ప‌ళ్లు వ‌స్తుంటాయి. ఆడ మొస‌లి 10 నుంచి 20 గుడ్ల‌ను జ‌ల‌తీరాల్లోని ఇసుక తిన్నెల్లో ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌ల్లో పెడ‌తాయి. వాటిని 65 నుంచి 95 రోజుల్లో పొదుగుతాయి. ఇవి 32 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌ను ఇష్ట‌ప‌డ‌తాయి.
క్రోక‌డైల్ రివ‌ర్‌గా ద‌క్షిణాఫ్రికాలోని లింపొపొ న‌ది పేరొందింది. ఆ దేశంలోనే మ‌రో మొస‌ళ్ల న‌దిగా పుమ్‌లాంగ కూడా గుర్తింపు పొందింది.ఇది క్రూగ‌ర్ నేష‌న‌ల్ పార్క్‌కు స‌మీపంలో ఉంది. అలాగే మినెసొట‌లో కూడా క్రోక‌డైల్ రివ‌ర్ ఉంది.
ప్ర‌మాద‌క‌ర స‌ముద్ర జీవులు: సాల్ట్ వాట‌ర్ క్రోక‌డైల్‌, మెరెఈల్స్‌, బ‌రాక‌డ‌, సీస్నేక్స్‌,స్టోన్ ఫిష్‌,ల‌య‌న్ ఫిష్‌,స్టింగ్ రేస్‌,బ్లూరింగ్ అక్టోప‌స్‌,కోన్‌షెల్స్‌.మొస‌ళ్ల మాంసం,చ‌ర్మం కోసం వేట‌గాళ్లు ఎక్కువ‌గా వీటిని వేటాడుతుండ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీటి సంఖ్య అంత‌కంత‌కు త‌గ్గిపోతోంది.అందుకే 1972 నుంచే భార‌త్‌లో మొస‌ళ్ల వేట‌ను నిషేధించారు.

7 Jan 2012

bamboo forest







ప్ర‌కృతిని ప‌రిర‌క్షించేవి అడ‌వులు. అవి ప‌చ్చ‌గా ఉంటేనే ప‌ర్యావ‌ర‌ణ స‌మతౌల్యం సాధ్యం. అలాంటి అడ‌వుల్ని ఓసార‌యినా చూడాల‌ని వీల‌యితే అక్క‌డ గ‌డిపి రావాల‌ని కోరుకోని మ‌న‌స్సులుండ‌వు. ముఖ్యంగా నేటి యాంత్రిక యుగంలో వీకెండ్స్ ఎంజాయిమెంట్ క‌ల్చ‌ర్ అమెరికా త‌ర‌హా పాశ్చాత్య దేశీయులకే ప‌రిమితం కాలేదు. యావ‌త్ దేశాల ప్ర‌జ‌ల్లో నేడు ప్ర‌బ‌లుతోంది. అటువంటి వారిని భార‌త్‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ అడ‌వులు సేద‌తీర్చి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఏపీ విస్తీర్ణంలో ఇవి 23 శాతం ప‌రుచుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి  ఫారెస్టు అందులో భాగ‌మే. ఇక్క‌డ ఈస్ట్ర‌న్‌గాట్స్‌లోని అడ‌వుల అందాల్ని ఎంత‌చూసినా త‌నివితీర‌దు.వెదురు చెట్ల‌కు ఈ అడ‌వులు ప్ర‌సిద్ధి. తూర్పు,ప‌శ్చిమ‌,విశాఖ‌,ఖ‌మ్మం జిల్లాల స‌రిహ‌ద్దుల్లో ఈ సుందర అడ‌వులు కొలువుదీరాయి.అనేక ప‌క్షులు,జంతువులు,క్రూర‌మృగాల‌కు ఆల‌వాలం ఇవి.ఇక్క‌డ నుంచే పేరెన్నిక‌గ‌న్న రాజ‌మండ్రి పేప‌ర్‌మిల్‌కు వెదురు స‌ర‌ఫ‌రా అవుతుంటుంది.ఆ క్ర‌మంలోనే వెదురు ర‌వాణా లారీల్లో అడ‌వుల నుంచి వ‌చ్చేసిన పులి,చిరుతలు రాజ‌మండ్రి న‌గ‌రంలో హ‌ల్‌చ‌ల్ చేసిన ఘ‌ట‌న‌లూ ఉన్నాయి.
మారేడుమిల్లి అడ‌వి: రాజ‌మండ్రికి 80 కిలోమీట‌ర్ల దూరంలో భ‌ద్రాచ‌లం రోడ్డులో ఉందీ మారేడుమిల్లి ఏజెన్సీ గ్రామం.ఈ గ్రామం నుంచి కేవ‌లం 4 కిలోమీట‌ర్ల దూరం నుంచే ద‌ట్ట‌మైన అడవి మొద‌ల‌వుతుంది. ఇదో గొప్ప పిక్‌నిక్ స్పాట్‌.అక్టోబ‌ర్ నుంచి స్వదేశీ,విదేశీ సంద‌ర్శ‌కుల‌తో ఈ అడ‌వులు సంద‌డిగా మార‌తాయి.సంద‌ర్శ‌కుల్ని అల‌రించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌(ఎపిటిడిసి) త‌గిన ఏర్పాట్ల‌ను చేస్తుంటుంది.శ‌నివారం సాయంత్రానికి సంద‌ర్శ‌కులు మారేడుమిల్లికి చేరుకుంటుంటారు. రాత్రి ఈ అడ‌వుల్లోని రిసార్టుల్లోనే వారి బ‌స‌.వారికి ఫారెస్టు గార్డులు,సాయుధ గిరిజ‌నులే ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంటారు.కార్తీక‌వ‌నం,మ‌ద‌నికుంజ్‌,జ‌ల‌త‌రంగ‌ణి త‌దిత‌ర ప్రాంతాల్లో సంద‌ర్శ‌కుల తాకిడి ఎక్కువ‌గా క‌నిపిస్తూంటుంది.
వ‌ర‌ల్డ్ బ్యాంక్ చేయూత‌: ఏపీ క‌మ్యూనిటి ఫారెస్టు మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుకు వ‌ర‌ల్డ్ బ్యాంక్ చేయూత‌ నందిస్తోంది. త‌ద‌నుగుణంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందుతోంది. 250 హెక్టార్ల‌లో వాలి- సుగ్రీవ మెడిసిన‌ల్ ప్లాంట్స్ క‌న్జ‌ర్వేష‌న్ ఏరియా అలాగే ముందంజ వేస్తోంది. ఇక్క‌డ దాదాపు 203 ర‌కాల వైద్య ఉప‌యోగ‌క‌ర మొక్క‌ల్ని పెంచుతున్నారు. గోదావ‌రి న‌దిపై పాపికొండ‌ల న‌డుమ జ‌ల‌యానం చేస్తూ సంద‌ర్శ‌కులు పుల‌కించిపోతుంటారు. కొండ రెడ్ల‌నే గిరిజ‌నులే ఈ ఏజెన్సీలో అత్య‌ధిక సంఖ్యాకులు. ఈ అడవుల్లో కొండ‌ల మాటు నుంచి పొంగి పోర్లే పెద్ద ఏరు వ‌ల‌మూరు. ఇది మూడు పాయ‌లుగా చీలి కొండల నుంచి దిగువన‌కు పారుతూంటుంది. అలా ఈ ఏరు 30 మీట‌ర్ల ఎత్తు నుంచి పారే ఫాల్స్‌నే అమృత‌ధార అని 15 మీట‌ర్ల ఎత్తు నుంచి మ‌రో కొండ నుంచి జాలువారే నీటిని స్వ‌ర్ణ‌ధార అని పిలుస్తుంటారు. వీటితోపాటు నీల‌కంఠేశ్వ‌ర వాట‌ర్‌ఫాల్స్ కూడా ప్ర‌సిద్ధి చెందాయి. వ‌ల‌మూరు, సోమిరెడ్డి పాలెం, వాల్మీకి పేట‌, వ‌న‌సంర‌క్ష‌ణ స‌మితి వారు ఎపిటిడిసికి ఇతోధిక స‌హ‌కారాన్ని అందిస్తున్నారు. ఇక్క‌డి గిరిజ‌నుల కొమ్ము నృత్యం కూడా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది.
బేంబూ చికెన్‌ :  వెదురు బొంగులో ఉడికించిన కోడి మాంసం రుచి గురించి ఎంత వ‌ర్ణించినా త‌క్కువేనంటారు ఈ ప్రాంత సంద‌ర్శ‌కులు. ఉప్పు,ప‌సుపు,కారం,మాసాలాలు ద‌ట్టించిన ప‌చ్చి కోడి మాంసాన్ని మీట‌రు పొడ‌వాటి ప‌క్వానికి వ‌చ్చిన ప‌చ్చ‌టి వెదురు బొంగులో ఉంచి ఆకులు, మ‌ట్టితో అంచుల‌ను క‌ప్పేసి నిప్పుల్లో కాలుస్తారు. వెదురు బొంగు పూర్తిగా న‌ల్ల‌గా మాడిపోయే వ‌ర‌కు బాగా కాల్చాక చ‌ల్లార్చి పొగ‌లు క‌క్కుతున్న ఉడికిన ఆ కోడికూర‌ను అడ‌వి చెట్ల ఆకుల్లో పెట్టుకొని లొట్ట‌లేసుకొని తిన‌డం సంద‌ర్శ‌కులంద‌రికి నిజంగా మ‌రుపురాని మ‌ధురానుభూతే.






5 Jan 2012

niagara falls


(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome) న‌యగ‌రా..న‌య‌నానంద‌క‌ర జ‌ల హేల‌. భూత‌ల స్వ‌ర్గ‌మ‌ని మ‌నం పిలుచుకునే అమెరికా,కెన‌డా స‌రిహ‌ద్దుల‌లో ఉందీ జ‌ల‌పాతం. వ‌ర‌ల్డ్‌లో అతిపెద్ద జ‌ల‌పాత‌మైన విక్టోరియా(ద‌క్షిణాఫ్రికా)త‌ర్వాత స్థానం దీనిదే. అందుకే ఏటా కోటిన్న‌ర‌కు పైబ‌డి ప‌ర్యాట‌కుల సంద‌ర్శ‌న‌తో ఈ జ‌ల‌పాత ప్రాంతాలు కిట‌కిట‌లాడుతూ ఉంటాయి.అమెరికన్ ఫాల్స్‌((ప్రాస్పెక్ట్ పాయింట్‌-లునా ఐలాండ్‌))), బ్రిడ‌ల్ వీల్‌ఫాల్స్‌(((లునా ఐలాండ్‌- గోట్- ఐలాండ్‌),కెన‌డియ‌న్ ఫాల్స్‌(గోట్ ఐలాండ్‌--- టేబుల్ రాక్)అనే మూడు జ‌ల‌పాతాల స‌మాహార‌మే ఈ  న‌యగ‌రా  జ‌ల‌పాతం.అమెరిక‌న్ ఫాల్స్‌,బ్రిడ‌ల్ వీల్‌ఫాల్స్ 176 అడుగుల ఎత్తున ఉన్న కొండ కొన‌ల నుంచి పాల నుర‌గ‌ల్ని త‌ల‌పించే జ‌లసిరులు దిగువ‌న‌కు ఎగ‌సిప‌డుతూ ఉర‌క‌లెత్తుతుంటాయి.ఈ ప్రాంతంలో దాదాపు ల‌క్షా 50 వేల గ్యాల‌న్ల నీరు పారుతుంది.జూన్‌,జులై,ఆగ‌స్టుల్లో అధిక సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు ఇక్క‌డ‌కు విచ్చేస్తుంటారు.
కెన‌డియ‌న్(హార్స్‌షూ)ఫాల్స్ నుంచి జ‌లాలు 167 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంటాయి.ఇక్క‌డ సుమారు ఆరు ల‌క్ష‌ల గ్యాల‌న్ల నీరు ప్ర‌వ‌హిస్తూంటుంద‌ని యూఎస్ జియోలాజిక‌ల్‌ (యూఎస్‌జిఎస్‌)) పేర్కొంది.ఈ జ‌ల‌పాతానికి మూలం  న‌యగ‌రా  న‌ది.మంచు యుగం కాలం నాటిదిది.దీని వ‌య‌స్సు 18వేల ఏళ్లు.మూడు కిలోమీట‌ర్ల ఎత్తున పేరుకుపోయిన మంచుప‌ల‌క వేల ఏళ్ల క్రితం క‌ర‌గ‌డంతోనే న‌దులు,స‌ర‌స్సులు ఈ ప్రాంతాల్లో ఏర్ప‌డ్డాయి.ద‌క్షిణ అంటారియో ప్రాంతంలో నెల‌కొందీ అద్భుత జ‌ల‌పాతం. న‌యగ‌రా  పెనిన్సులాలో 12 వేల ఏళ్ల క్రిత‌మే మంచుప్రాంతం అదృశ్య‌మ‌యింది.ఈ మంచుఖండం మాయ‌మ‌య్యాకే ఎరై స‌ర‌స్సు, న‌యగ‌రా  న‌ది,అంటారియో స‌ర‌స్సు,లారెన్స్ న‌దులు ఏర్ప‌డ్డాయి.ఈ మొత్తం జ‌లాల‌న్నీ కొండ‌ల‌కోన‌ల నుంచి పారుతూ చూడచ‌క్క‌ని జ‌ల‌పాతాలై దిగువ‌న‌కు ప్ర‌వ‌హిస్తూ చివ‌ర‌కు స‌ముద్రంలో క‌లుస్తున్నాయి.
వండ‌ర్ న‌యాగ‌రా:క్వీన్‌స్ట‌న్‌-.-లూయిస్ట‌న్‌ ప్రాంతంలో  న‌యగ‌రా  జ‌ల‌పాత హోయ‌ల్ని ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చే ప‌ర్యాట‌కులు ఆనందోత్సాహాల‌తో తిల‌కించి పుల‌కించిపోతుంటారు.ఈ జ‌ల‌పాత ప్రాంత స‌మీపంలోకి చేరుకుంటుండ‌గానే మంచు బిందువులు,నీటి తుంప‌ర్లతో అతిథుల‌ను ప‌ల‌క‌రిస్తూ  న‌యగ‌రా  స్వాగ‌తం ప‌లుకుతుంది.ఇక్క‌డ బ‌ట‌ర్‌ఫ్లై క‌న్జ‌ర్వేట‌రీ,మేరీలాండ్ ఆహ్లాదాన్ని పంచుతాయి.బ‌ఫెలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి,టొరంటో(కెన‌డా)వైపు నుంచి ఈ జ‌ల‌పాత ప్రాంతానికి అర‌గంట ప్ర‌యాణించి చేరుకోవ‌చ్చు. న‌యగ‌రా  జ‌ల‌పాత మార్గంలో ఆరు అపురూప‌మైన బ్రిడ్జిలూ భ‌లే ఆక‌ట్టుకుంటుంటాయి.ఈ వంతెన‌ల‌న్నీ కెన‌డా,అమెరికా అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల‌ వెంబ‌డే  న‌యగ‌రా  న‌దిపై నిర్మిత‌మ‌య్యాయి.నాలుగు చ‌క్రాల వాహ‌న‌దారులు,పాద‌చారులు కూడా ఈ వంతెన‌ల‌పై ప్ర‌యాణిస్తుంటారు.వీటిలోనే రెండు రైలు వంతెన‌లు కూడా ఉన్నాయి.అవి..పీస్ బ్రిడ్జ్‌,రెయిన్‌బో బ్రిడ్జ్‌,వ‌ర్ల్‌పుల్ బ్రిడ్జ్‌,లూయిస్ట‌న్‌-క్వీన్‌స్ట‌న్ బ్రిడ్జ్‌,మిచిగ‌న్ సెంట్ర‌ల్ రైల్వే బ్రిడ్జ్‌,ఇంట‌ర్నేష‌న‌ల్ రైల్వే బ్రిడ్జ్‌.

జ‌ల విద్యుదుత్పాద‌న‌:అమెరికాలోని రాబ‌ర్ట్ మోజెస్‌((జిఎస్‌)24 ల‌క్ష‌ల కిలోవాట్స్‌,లూయిస్ట‌న్ పంప్‌((జిఎస్‌)3 ల‌క్ష‌ల కిలోవాట్స్ చొప్పున 27 ల‌క్ష‌ల కిలోవాట్స్ జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి అవుతోంది.కెన‌డా వైపు నుంచి స‌ర్ అడమ్ బెక్‌(1(జిఎస్‌)5ల‌క్ష‌ల కిలోవాట్స్‌,స‌ర్ అడ‌మ్ బెక్‌బ(2జిఎస్‌)ల‌క్ష‌ల కిలోవాట్స్‌,స‌ర్ అడ‌మ్ బెక్‌పీస్‌((జిఎస్‌)ల‌క్షా 75వేల కిలోవాట్స్‌,డెక్యూ(జిఎస్‌)కెథ‌రిన్ 23వేల కిలోవాట్స్‌,డెక్యూ(2జిఎస్‌)కెథ‌రిన్ ల‌క్షా44వేల కిలోవాట్స్ చొప్పున మొత్తం సుమారు 24ల‌క్ష‌ల కిలోవాట్స్ జ‌ల విద్యుదుత్పాద‌న చేస్తున్నారు.


Popular Posts

Wisdomrays