25 Jan 2012

awesome flowers


పువ్వు...అపూర్వం. ఓ అనిర్వ‌చ‌నీయ ఆనందం.. ఆ సుగంధం మైమ‌ర‌పించే సుమ‌ధురం. చూడ‌గానే పుల‌కించ‌నిదెవ‌రు? అటువంటి ప‌రిమ‌ళాన్ని ఆస్వాదించ‌ని వారుంటారా? ప్ర‌పంచంలో అతి పెద్ద‌వి..అతి చిన్న‌వి ఏవైనా మ‌న‌ల్ని సంభ్ర‌మ‌ప‌రిచేవే. ఆ కోవ‌లోనివే ర‌ఫ్లేసియా అర్నాల్డీ, అమెర్ఫాఫ‌ల‌స్ పుష్పాలు. ర‌ఫ్లేసియా అర్నాల్డీ భూమ్మీద అతిపెద్ద పువ్విది.ఇండోనేసియా జాతీయ పుష్పం కూడ‌.ఒక‌రకంగా ఇదో అడ‌వి పువ్వు.ఇండోనేసియా, మ‌ల‌య‌,బెర్నొయ్‌,సుమ‌త్రా,ఫిలిప్పీన్స్ అడ‌వుల్లో మాత్ర‌మే ఈ పువ్వులు విస్తారంగా క‌నిపిస్తాయి. ఇదో ఎండెమిక్ ఫ్ల‌వ‌ర్‌.దీనికి మ‌రో పేరు కార్ప్స్ ఫ్ల‌వ‌ర్‌.ఏకంగా 3 అడుగుల‌(90 సెంటీమీట‌ర్లు)మేర పెరుగుతుంది.బ‌రువు 11 కిలోల‌కు పైమాటే.పుష్పించాక అంతే గాఢ‌మైన సుగంధాన్ని వెద‌జ‌ల్లుతుంది.ఈ పువ్వు కొద్దీ రోజుల్లోనే భారీత‌నాన్ని సంత‌రించుకుంటుంది.పుష్పించ‌డం మొద‌ల‌య్యే ద‌శ‌లో దీని ప‌రిమాణం కేవ‌లం 0.08 అంగుళాలు మాత్ర‌మే. ఈ ముదురు ఎరుపు రంగు ర‌ఫ్లేసియాకు ఇత‌ర పూల మొక్క‌ల్లా ఆకులు,కాండం,కొమ్మ‌లు వ‌గైరాలుండ‌వు.నేల‌పై ప‌రుచుకున్న తీగ‌ల‌పైనే ఈ భారీ పువ్వులు పుష్పిస్తాయి.ఈ పువ్వు ప‌రిమ‌ళం కూడా చాలాకాల‌మే ఉంటుంది.ప్ర‌స్తుతం ఈ పువ్వుల్ని ప్ర‌పంచ ప్ర‌సిద్ధ బొటానిక‌ల్‌,నేష‌న‌ల్ పార్క్‌ల‌న్నింటిలోనూ చూడొచ్చు.
ప్ర‌కృతి అందానికి వ‌న్నెల‌ద్దే వాటిలో మొక్క‌లు,చెట్ల‌దే ప్ర‌థ‌మ‌స్థానం. స‌క‌ల జీవ‌కోటికి స్వ‌చ్ఛ‌మైన ఆక్సిజ‌న్ ఇంకా అందుతుండ‌డానికి ఇవే కార‌ణం.ముఖ్యంగా ప‌గ‌టి వేళ‌ల్లో ఇవి కార్బ‌న్‌డ‌యాక్సైడ్‌ను స్వీక‌రించి ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేయ‌డ‌మ‌నే మ‌హోప‌కారాన్ని విస్మ‌రించ‌లేం క‌దా.
అతి పొడ‌వైన పువ్వు: చెట్ల‌ను త‌ల‌పించే మొక్క‌లు వాటికి భారీ పువ్వులు,పొడ‌వైన పుష్పాలు ఇలా అనేక ర‌కాలు ప్ర‌పంచంలో చాలానే ఉన్నాయి.ర‌ఫ్లేసియా అర్నాల్డీకి పూర్తి భిన్న‌మైన‌ది అమెర్ఫాఫ‌ల‌స్(టైట‌న్ అర‌మ్‌).ఇది ప్ర‌పంచంలోనే అతి పొడ‌వైన పువ్వు.దాదాపు 10 అడుగుల ఎత్తుకు ఎదుగుతుంది.రోజుకు ఈ పువ్వు నాలుగు నుంచి 20 సెంటీమీట‌ర్ల ఎత్తు పెరుగుతుంది.ఏకంగా 50 కిలోల బ‌రువు తూగుతుంది.ఈ పువ్వులో క‌నిపించ‌ని రంగే ఉండ‌దు.ఎరుపు,తెలుపు,ఆకుప‌చ్చ‌,ప‌సుపు వ‌ర్ణాల స‌మాహారంగా భారీ ఆకారంతో వారెవ్వా అనిపిస్తుంది.అయితే ఈ పువ్వు రెండు మూడు రోజుల‌కే వాడిపోతుంది.ఈ పువ్వు వెన్నంటి ఉండే ఆకులూ చాలా పెద్ద‌గా ఉంటాయి.ఎంతంటే 20 అడుగుల మేరంటే ఆశ్చ‌ర్య‌మేగా.ఈ మొక్క ఆకులు ఏడాదికోసారి రాలిపోతాయి.మ‌ళ్లీ నాలుగు నెల‌ల్లోగా కొత్త ఆకులు మొలుస్తుంటాయి.మీజ్‌లో గ‌ల బెల్జియ‌న్ బొటానిక్ గార్డెన్స్‌కు వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌కు ఈ పువ్వు ఓ క‌నువిందే.లండ‌న్‌లోని రాయ‌ల్ బొటానిక‌ల్ గార్డెన్స్‌లో ఈ పువ్వులు 100 వ‌ర‌కు ఉండ‌డంతో జనం వీటిని చూసి పుల‌కించిపోతుంటారు.బాన్‌(జ‌ర్మ‌నీ)లోని బొటానిక‌ల్ గార్డెన్స్‌లో 2003లో ఈ పువ్వు 8అడుగుల 11 అంగుళాల ఎత్తుకెదిగి గిన్నీస్‌బుక్ రికార్డుల‌కెక్కింది.2005లో  జ‌ర్మ‌నీలోని స్ట‌ట్‌గార్ట్‌లోగ‌ల బొటానిక‌ల్ అండ్ జులాజిక‌ల్ గార్డెన్స్‌లో ఉన్న ఈ జాతి పువ్వు 9 అడుగుల 6 అంగుళాల ఎత్తుతో అంత‌కుముందు న‌మోదైన‌ రికార్డును బ‌ద్ద‌ల‌కొట్టింది.
భారీ పువ్వులు,మొక్క‌లు:కొరిఫా అంబ్ర‌కులిఫెర‌(ట‌లిపాట్ పామ్‌)-ప్ర‌పంచంలోనే అతి పెద్ద కాండం గ‌ల మొక్క‌.శ్రీ‌లంక దీని స్వ‌స్థ‌లం.స్ట‌పెలియా(స్టార్ ఫ్ల‌వ‌ర్‌),స్ట‌పెలియా లెప‌డ్‌-ద‌క్షిణాఫ్రికా),హైడ్నొర ఆఫ్రిక‌న-జాంబియా, హెలికొడై సెర‌స్ మ‌స్విర‌స్‌(డెడ్ హార్స్ అర‌మ్ లిలీ),డ్రాక‌న్‌క్యూల‌స్ వ‌ల్గ‌రిస్‌(వుడు లిలీ).

14 Jan 2012

bullet trains

http://royalloyal007.blogspot.in/2011/09/yuvottama.html
(you can see other posts from this blog, go through with mozilla firefox/google chrome)
స్పీడ్ యుగం.. విమానాల‌తో పోటీ ప‌డుతూ నేల‌పైనున్న ప‌ట్టాల‌పై వాయువేగాన్ని త‌ల‌పించేలా  రైళ్లు ఇప్పుడు ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో  దూసుకుపోతున్నాయి. రోజుకు 24 గంట‌ల స‌మ‌యం జ‌నానికి స‌రిపోవ‌డం లేదు.అంతా కాలంతో పోటీప‌డుతున్న‌ట్లుగా చ‌క‌చ‌కా ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటున్న త‌రుణ‌మిది. అందుకు అనుగుణంగా రైళ్ల‌ను తీర్చిదిద్దే ప‌నిలో సంపన్న దేశాల‌తోపాటు వ‌ర్ధ‌మాన‌ దేశాలు ప్ర‌ణాళిక‌ల‌ల్లుతున్నాయి. బుల్లెట్ ట్రైన్స్‌కు పెట్టింది పేరు జ‌పాన్‌. ఆ దేశం ప్ర‌పంచంలోనే తొలి సూప‌ర్‌ఫాస్ట్ ట్రైన్‌ను విజ‌య‌వంతంగా న‌డిపి త‌మ దేశ‌వాసుల‌కు అందుబాటులోకి తెచ్చింది. భార‌త్‌లోను 2012 నుంచి ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ఊపందుకుంటున్నాయి. దేశంలో ఆరు మార్గాల్లో వివిధ విదేశీ రైల్ క‌న్సార్టియంల స‌హ‌కారంతో బుల్లెట్ ట్రైన్స్ ప‌ట్టాల‌కెక్క‌నున్నాయి. హైద‌రాబాద్‌-చెన్నై,చెన్నై-తిరువ‌నంత‌పురం,ఢిల్లీ-పాట్నా,ఢిల్లీ-అమృత‌స‌ర్‌,అహ్మ‌ద‌బాద్‌-పూణె,హౌరా-హ‌ల్దియాల మ‌ధ్య బుల్లెట్ ట్రైన్స్ న‌డ‌పాల‌ని భార‌తీయ రైల్వేలు ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్నాయి.
వ‌ర‌ల్డ్‌లో అలుపెర‌గ‌కుండా యంత్రాల్లా ప‌నిచేసే శ్ర‌మ జీవుల గురించి ప్ర‌స్తావించాలంటే ముందుగా జ‌పానీయులనే చెప్పాలి.మేమ‌యినా త‌క్కువా అని స‌వాలు చేసే నైజం చైనీయుల‌ది.సాధ‌న శోధ‌న‌ల క్ర‌మంలో చైనా నేడు ప్ర‌పంచంలోనే అత్యంత వేగ‌వంతమైన లాంగ్ ట్రాక్‌తో సూప‌ర్‌ఫాస్ట్ ట్రైన్‌ల‌ను న‌డుపుతూ రికార్డు సృష్టించింది.
జ‌పాన్ వ‌ర్సెస్ చైనా:విశ్వ‌వ్యాప్తంగా నేడున్న జ‌నాభాలో నాల్గోవంతు వాటా చైనాది.ఇక భార‌త్‌తో క‌లుపుకుంటే మొత్తం ప్ర‌పంచ జ‌నాభాలో దాదాపు స‌గం వంతు మంది ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు.అందుకే పెరుగుతున్న జ‌నాభా వారి ప్ర‌యాణ అవ‌స‌రాల్ని తీర్చాలంటే వేగ‌వంత‌మైన రైళ్లే ఏకైక మార్గ‌మని చైనా భావించి 2007 నుంచి బుల్లెట్ రైళ్ల‌ను న‌డుపుతోంది.బీజింగ్‌,షాంఘై మ‌ధ్య ఈ రైళ్లు దూసుకుపోతున్నాయి.కేవ‌లం రెండేళ్ల‌లోనే ఆదేశంలో సుమారు 40 కోట్ల మంది వాయువేగ‌ రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డం గ‌మ‌నార్హం.ఇత‌ర రైలు ట్రాక్‌ల‌కు భిన్న‌మైన‌వి బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌లు.ఈ ట్రాక్‌ల‌పై మాగ్న‌టిక్ లెవిటేష‌న్ సాంకేతిక ప‌రిజ్ఞానంతో బుల్లెట్ ట్రైన్స్ ప్ర‌యాణిస్తుంటాయి.గంట‌కు 500కిలోమీట‌ర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్స్ న‌డ‌పాల‌న్న‌దే వారి ల‌క్ష్యం.ఈ2-1000 సీరిస్‌లో సిఆర్‌హెచ్2,700టి.ల‌ను ఆ క్ర‌మంలోనే అభివృద్ధి ప‌రిచారు.అయితే అతివేగం ఎప్పుడూ అన‌ర్థ‌దాయ‌క‌మేన‌న్నది నిజ‌మ‌న్న‌ట్లుగా చైనాలో సూప‌ర్‌ఫాస్ట్ ట్రైన్స్ ఢీకొన్న దుర్ఘ‌ట‌న‌లో 40మంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి.దాంతో మ‌రిన్ని సూప‌ర్‌ఫాస్ట్ రైళ్ల‌ను అభివృద్ధి ప‌రిచే విష‌యంలో చైనా ఇప్పుడు సందిగ్ధంలో ప‌డింది.భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని వాయువేగ‌పు రైళ్ల‌ను న‌డ‌పాల్సిన అవ‌స‌ర‌మేది త‌మ‌కు లేద‌ని సిఎస్‌ఆర్ చైర్మ‌న్ జుహ‌జియోంగ్ ఆ నేప‌థ్యంలోనే ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.
యూర‌ప్ ఛాలెంజ్‌: బుల్లెట్ ట్రైన్స్ ఒర‌వ‌డి ఉర‌వ‌డి మాకే చెల్లు అనే రీతిలో జ‌పాన్ 2003లోనే గంట‌కు దాదాపు 500 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ ట్రైన్‌ను ట్ర‌య‌ల్ ర‌న్‌గా న‌డిపి రికార్డు సృష్టించింది.టోక్యో-న‌గొయ‌-ఒసాకాల మ‌ధ్య ఈ మాగ్లివ్ ట్రైన్ లైన్ ప్రాజెక్టును 2027 నాటికి త‌మ దేశీయుల‌కు అందుబాటులోకి తేవాల‌ని జ‌పాన్ స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సుమారు 112 బిలియ‌న్ డాల‌ర్ల‌ను వెచ్చించ‌ద‌లిచింది.ఇప్ప‌టికే జ‌పాన్‌లో నిత్యం దాదాపు నాలుగు ల‌క్ష‌ల మంది బుల్లెట్ ట్రైన్ల‌లో ప్ర‌యాణిస్తున్నారు. యూర‌ప్‌,అమెరికా,ర‌ష్యాల్లోనూ బుల్లెట్ ట్రైన్స్ హ‌వా కొన‌సాగుతోంది. చైనాలో మాదిరిగానే 2007 నుంచే తైవాన్,ట‌ర్కీ స‌హా యు.కె, ఫ్రాన్స్‌, బెల్జియం, ఇట‌లీ, స్సెయిన్‌,జ‌ర్మ‌నీ ,నెద‌ర్లాండ్స్ త‌దిత‌ర బుల్లెట్ రైళ్లు విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయి.
తైవాన్‌లో కౌసిఅంగ్‌,తైపీల మ‌ధ్య బుల్లెట్ ట్రైన్ గంట‌కు దాదాపు 350 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకుపోతోంది. ట‌ర్కీ,సౌత్ కొరియాల సంయుక్త ప్రాజెక్టుగా ఈ వాయు వేగ రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ర‌ష్యాలో 2002 చివ‌రి నుంచే మాస్కో,సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌ల న‌డుమ బుల్లెట్ ట్రైన్‌ను ప్రారంభించింది. యు.కెలో అండ‌ర్‌ గ్రౌండ్‌లోనూ ఈ వాయువేగ రైళ్లు న‌డుస్తుండ‌డం విశేషం. అయితే ఈ రైళ్ల వేగంతోపాటు భ‌యంక‌ర ప్ర‌మాదాల‌ను రుచి చూపిస్తున్నాయి. జ‌ర్మ‌నీలో 2004లో హైస్పీడ్ ట్రైన్ ఇలాగే ప్ర‌మాదం బారిన‌ప‌డి 25 నిండు ప్రాణాలు బ‌ల‌య్యాయి.
టాప్‌-5 బుల్లెట్ ట్రైన్స్‌:*సిఆర్‌హెచ్‌380ఎ-చైనా-487.3 కిలోమీట‌ర్ల వేగం,*టి.ఆర్‌-09-జ‌ర్మ‌నీ-450 కి.మీ.వేగం,*షింకన్‌స‌న్‌-జ‌పాన్‌-443 కి.మీ. వేగం,*టి.జి.వి రెసెవ్‌-ఫ్రాన్స్‌-380 కి.మీ.వేగం,*కె.టి.ఎక్స్‌2-సౌత్ కొరియా-352 కి.మీ.వేగం

12 Jan 2012

Tussad Museum

కొంద‌రు వ్య‌క్తులు..వారి పేర్లు,రూపాల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నే ఉండ‌దు. వారు క‌నిపించినా, వినిపించినా జ‌న‌సామాన్యం ఉర్రూత‌లూగిపోతుంది. వారి చ‌రిత్ర,గొప్ప‌త‌నం వివ‌రాలు అనేక‌ మందిలో గిర్రున తిరిగి గుర్తొచ్చేస్తాయి. అత్యంత ప్ర‌భావ‌శీలురైన సెల‌బ్రెటిలే వారు. అటువంటి ప్ర‌త్యేక వ్య‌క్తుల్ని ముమ్మూర్తులా పోలిన మైన‌పు బొమ్మ‌ల కొలువే ప్ర‌పంచ ప్ర‌సిద్ధ ప‌ర్యాట‌క స్థ‌లం టుస్సాడ్ మ్యూజియం. లండ‌న్‌లో బెకెర్ స్ట్రీట్‌లో నెల‌కొందిది. దీన్ని రూపొందించింది ఓ స్త్రీ.రోల్‌మోడ‌ల్ వ్య‌క్తుల న‌మూనాల రూప‌క‌ల్ప‌న ఆమె హాబీ.అలా మొద‌లై 1835లో టుస్సాడ్ మ్యూజియంగా పేరొందింది. ఈ మ్యూజియానికి అంకురార్ప‌ణ చేసిన మేరి టుస్సాడ్‌(అన్నా మ‌రియా గ్రోషాల్జ్‌-ఫ‌స్ట్ నేమ్‌)1761లో స్ట్రాస్‌బ‌ర్గ్‌, ఫ్రాన్స్‌లో జ‌న్మించింది. 1777లో తొలిసారిగా వొల్టైర్ ప్ర‌తిమ‌ను తీర్చిదిద్దింది. అదే స‌మ‌యంలో జీన్‌జాక్వెస్ రొజేవ్‌, బ్రెంజిమ‌న్ ఫ్రాంక్లిన్ ప్ర‌తిమ‌ల‌కు వ‌రుస‌గా రూప‌క‌ల్ప‌న చేసింది. ఫ్రెంచ్ విప్ల‌వం సంద‌ర్భంగా ఆ చ‌రిత్ర‌కు ద‌ర్ప‌ణం ప‌ట్టేలా అనేక‌మంది యోధులు, బాధితుల బొమ్మ‌ల‌ను రూపొందించింది. ఫ్రాంకియ‌స్ టుస్సాడ్‌ను 1795లో వివాహ‌మాడిన ఆమె లండ‌న్‌లో స్థిర‌ప‌డింది.ఆ త‌ర్వాత వంద‌ల మంది ప్ర‌ముఖుల రూపాల‌ను బొమ్మ‌ల‌తో పునఃప్ర‌తిష్ట చేసింది. 1850లో ఈ లేడీ టుస్సాడ్ మ‌ర‌ణించే వ‌ర‌కు ఎంద‌రో ప్ర‌ముఖుల ప్ర‌తిమ‌లు అలాగే జీవ‌క‌ళ‌తో ఆమె చేతుల్లో ప్రాణం పోసుకున్నాయి.
స్లీపింగ్ బ్యూటీ: టుస్సాడ్‌ మ్యూజియంలో మేడ‌మ్ డుబెరి ప్ర‌తిమ ప్ర‌త్యేక‌మైన‌ది.లూయిస్‌-15 స‌తీమ‌ణి అయిన బెరి నిద్రిస్తుండ‌గా ఆమె ఎద ఊపిరి తీసుకుంటున్న‌ట్లున్న భంగిమ సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.న‌ల్ల సూరీడు నెల్స‌న్ మండేలా,అడాల్ఫ్ హిల్ట‌ర్‌,చార్లిచాప్లిన్‌,మ‌ర్లిన్ మ‌న్రో,ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్‌,ఎలిజ‌బెత్ రాణి-2,పోప్‌జాన్‌పాల్‌-2,లేడీ గ‌గా త‌దిత‌ర ప్ర‌పంచ ప్ర‌ముఖుల ప్ర‌తిమ‌ల‌న్నెంటితోనే అల‌రారుతోందీ టుస్సాడ్ మ్యూజియం.
విశ్వ‌వ్యాప్తం:టుస్సాడ్ మ్యూజియం ఒక్క లండ‌న్‌కే ప‌రిమితం కాలేదు. ప్ర‌పంచం న‌లుచెర‌గులా ఈ మ్యూజియానికి బ్రాంచ్‌లు వెలిశాయి. లాస్‌వెగాస్‌, హాలివుడ్‌( (కాలిఫోర్నియా), న్యూయార్క్ సిటీ, వాషింగ్ట‌న్ డి.సి., అమెస్ట‌ర్డమ్‌, బెర్లిన్‌, బ్లాక్‌పూల్‌, వియ‌న్నా, బ్యాంకాక్‌, హాంగ్‌కాంగ్‌,షాంఘై, సిడ్నీల్లోనూ టుస్సాడ్ మ్యూజియాలు సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు క‌ల్గిస్తున్నాయి. తాజాగా జ‌కార్తాలో మ‌రో బ్రాంచ్ జ‌న సంద‌ర్శ‌న‌కు సిద్ధ‌మౌతోంది. 2012 జులై నాటికి అంకోల్ బీచ్ సిటీలో ఈ టుస్సాడ్ మ్యూజియం 3వేల చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంలో కొలువుదీర‌నుంది. టుస్సాడ్ మ్యూజియాల్నింటిలో క‌ల్లా అతి పెద్ద‌దిగానూ ఈ బ్రాంచ్ రికార్డు నెల‌కొల్పనుండ‌డం మ‌రో విశేషం.ఇంత‌కూ టుస్సాడ్ మ్యూజియాల్లో ఒక్కో ప్ర‌తిమ‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుందంటే..అక్ష‌రాల ల‌క్షా 50వేల పౌండ్లు.నిపుణులైన శిల్పులు,ఇత‌ర శ‌రీర భాగాల త‌యారీదారులు ఒక్కో బొమ్మను తీర్చిదిద్దేందుకు దాదాపు నాలుగు నెల‌ల స‌మ‌యం తీసుకుంటారు.ఈ టుస్సాడ్‌లో ప్ర‌తిమ నెల‌కొన‌డ‌మే ఆయా వ్య‌క్తుల ఘ‌న‌త‌కు గొప్ప నిద‌ర్శ‌నం.ఇప్పుడు ఆ ఛాన్స్ బాలివుడ్ మాజీ నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌కు వ‌చ్చింది.మార్చిలో ఆమె ప్ర‌తిమ టుస్సాడ్‌లో ద‌ర్శ‌న‌మీయ‌నుంది.ఇప్ప‌టికే భార‌త్ త‌ర‌ఫున అమితాబ్‌,ఐశ్వ‌ర్య‌రాయ్‌,హృతిక్‌,స‌ల్మాన్‌,షారుఖ్‌,క‌రీనా,స‌చిన్ ప్ర‌తిమ‌లు ఈ మ్యూజియంలో త‌ళుకులీనుతున్నాయి.
ప్ర‌పంచ ప్ర‌ముఖుల ప్ర‌తిమ‌లు: రాబ‌ర్ట్ విలిన్‌స‌న్‌, మోర్గాన్‌, లియొనార్డొ డికాప్రియో, నికోల్ కిడ్‌మ‌న్‌, బ్రాడ్‌పిట్‌, ఎంజెలిన‌జోలి, స్టిఫెన్ స్పీల్‌బ‌ర్గ్‌, జిమ్‌క్యారీ, జూలియో రాబ‌ర్ట్‌, జెనిఫ‌ర్ లోపెజ్‌, అర్నాల్డ్ స్కార్జ్‌నెగ్గ‌ర్‌, టైగ‌ర్‌వుడ్స్, మహ్మ‌ద్ అలీ, విలియ‌మ్ షేక్స్‌పియ‌ర్‌, అల్బ‌ర్ట్ ఐన‌స్టీన్‌, స్టీఫెన్ హ‌కింగ్‌, పాబిలో పికాసో, చార్లెస్ డార్విన్‌,మైఖెల్ జాక్స‌న్‌, లియ‌నా లూయిస్‌, మ‌డొన్నా, క్రిస్టియ‌న అగ‌లెర‌, రొలా విలియ‌మ్స్‌, మార్గ‌రెట్ థాచ‌ర్‌,టోనీ బ్లెయిర్‌, రోనాల్డ్‌రీగ‌న్‌,విన్‌స్ట‌న్ చ‌ర్చిల్‌, బేనజీర్‌భుట్టో, మార్టిన్ లూథ‌ర్ కింగ్‌, మ‌హాత్మాగాంధీ, మ‌ద‌ర్‌థెరిస్సా.  

10 Jan 2012

water car


స‌క‌ల చ‌రాచ‌ర సృష్టికి నీరే మూలం.ప్ర‌కృతి వ‌ర‌ప్ర‌సాదితం నీరు.జీవులన్నింటికి ప్రాణాధారం.మ‌రి యంత్రాల‌కూ ఆ నీరే శ‌క్తిగా మారితే? అవి ఆ నీటితోనే క‌ద‌లాడితే అబ్బుర‌మే క‌దా!కాలం మారింది..వేగం పెరిగింది.ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌లు..గ‌తంలో ఆడంబ‌రాల‌నుకునేవి నేడు అవ‌స‌రాల‌య్యాయి.ఇది యాంత్రిక‌యుగం కావ‌డంతో వాహ‌నాలు సామాన్యుల‌కు సైతం త‌ప్ప‌నిస‌రిగా కావాల్సి వ‌స్తోంది.ఆ క్ర‌మంలోనే వాహ‌నాల సంఖ్య వాహ‌న వినియోగ‌దారుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.అంత‌ర్జాతీయ విప‌ణిలోకి ఎన్నోన్నో వాహ‌నాలు కొత్త ఫీచ‌ర్లు,మోడ‌ళ్ల‌తో దూసుకువ‌స్తున్నాయి.అయితే ఆ వాహ‌నాలన్నింటికీ ప్ర‌ధాన ఇంధ‌నం పెట్రోలే.అందుకే నిత్యం పెట్రో ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు.అదే సామాన్య వాహ‌న‌దారుల గుండెల్లో గుబులు రేపుతోంది.గ‌తంలో డీజిల్ వాహ‌నాలు ఆ త‌ర్వాత పెట్రోలు వాహ‌నాలు ఆపై ఎల‌క్ట్రిక్ ఇప్పుడు సి.ఎన్‌.జి(కంప్రెస్డ్ నేచుర‌ల్ గ్యాస్‌) ఆధారిత వాహ‌నాలు తెర‌పైకి వ‌చ్చాయి.ఇవ‌న్నీ వాహ‌న‌దారుల జేబు చ‌మురునే వ‌దిలిస్తున్నాయి.దీనికి ప్ర‌త్యామ్నాయం ఏమిటి?ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ దూరం ప్ర‌యాణించే ఆవిష్క‌ర‌ణ‌లు అంద‌రికీ ఆనంద‌దాయ‌క‌మే అన‌డంలో సందేహం లేదు.90వ ద‌శ‌కంలో భార‌త్‌((త‌మిళ‌నాడు)లో రామ‌న్‌పిళ్లై మూలికా ఇంధ‌నాన్ని సృష్టించాన‌న్నారు.పెట్రోల్‌కు ఇదే క‌చ్చిత‌మైన ప్ర‌త్యామ్నాయమ‌ని ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు.అయితే ఆ త‌ర్వాత పిళ్లై ప్ర‌యోగాలు విఫ‌లం కావ‌డం భార‌త్ వంటి వ‌ర్థ‌మాన‌దేశాల వాహ‌న వినియోగ‌దారుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.కానీ ప్ర‌పంచ వ్యాప్తంగా శాస్త్ర‌వేత్త‌లు త‌మ మెద‌ళ్ల‌కు పదును పెట్టి సరికొత్త ప‌రిశోధ‌న‌లను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తూనే ఉన్నారు.
డ‌బ్లూ.ఇ.ఎస్‌..:కేవ‌లం నీరు,గాలి ద్వారానే కార్ల‌ను న‌డిపిస్తే..ఆ ఆలోచ‌న ఉద‌యించే సూర్యుని దేశం జ‌పాన్‌కి రానే వ‌చ్చింది.ఆటోమొబైల్ రంగంలో ప్ర‌పంచ రారాజుగా ఆధిప‌త్యాన్ని చ‌లాయిస్తున్న మ‌న జ‌పనీయులు వాట‌ర్ ఎన‌ర్జీ సిస్ట‌మ్‌(డ‌బ్లూ.ఇ.ఎస్‌)ను ప‌రిచ‌యం చేసి మ‌రోసారి త‌మ స‌త్తాను చాటారు.ప్ర‌సిద్ధ జెనెప‌క్స్ కంపెనీ ఈ వాట‌ర్ కారును రూపొందించింది.నీళ్లలో ఉండే ఆక్సిజ‌న్‌,హైడ్రోజ‌న్‌ల‌ను విభ‌జించి ఆ హైడ్రోజ‌న్ ద్వారా శ‌క్తిని సృష్టించి యంత్రాన్ని న‌డ‌ప‌డ‌మ‌న్న‌దే ఈ స‌రికొత్త టెక్నాల‌జీ.ప్ర‌స్తుతం న‌డుస్తున్న డీజిల్‌,పెట్రోల్‌,ఎల‌క్ట్రిక్‌,సి.ఎన్‌.జి త‌దిత‌ర వాహ‌నాల్లో క‌న్వ‌ర్ట‌ర్ల‌ను మార్చి ఈ డ‌బ్లూ.ఇ.ఎస్ ప‌రిజ్ఞానంతో `కారు`చౌక ప్ర‌యాణాల ల‌బ్ధిని వాహ‌న‌దారుల‌కు అందించ‌డ‌మే దీని లక్ష్యం.ఎంత ల‌గ్జ‌రీ కారైనా,చౌక‌ర‌క‌మైన‌దైనా పెట్రోల్‌,సి.ఎన్‌.జి చార్జీల చెల్లింపు వాహ‌న‌దారులంద‌రికీ స‌మాన‌మే.వాహ‌నాల్లో వినియోగించే ఇంధ‌నం ధ‌ర‌లు అంద‌రికీ అందుబాటులో ఉండ‌డ‌మ‌న్న‌దే ప్రధానాంశం.ఆ దిశ‌గానే ఇప్పుడు అడుగులు ప‌డుతున్నాయి.ఈ సాంకేతిక ప‌రిజ్ఞానం పూర్తిగా విజ‌యవంత‌మై విశ్వ‌వ్యాప్తంగా అన్ని త‌ర‌హా వాహ‌న‌దారుల‌కు అక్క‌ర‌కు వ‌స్తేనే ప్ర‌యోజ‌న‌దాయ‌క‌మ‌వుతుంది.వాట‌ర్ ప‌వ‌ర్డ్ వెహిక‌ల్ ఒక్కో ఇంజిన్ త‌యారీకి 2 కోట్ల యెన్‌లు(18,500 అమెరికా డాల‌ర్లు)ఖ‌ర్చ‌వుతోంద‌ట‌.ఆ ధ‌ర‌ల‌ను 5 ల‌క్ష‌ల యెన్‌లు(4,600 అమెరికా డాల‌ర్ల‌) స్థాయికి తీసుకురాగ‌ల్గితేనే తాము ఆశించిన ఫ‌లితం సిద్ధిస్తుంద‌ని ఆ కంపెనీ భావిస్తోంది.
ప‌ర్యావ‌ర‌ణం-భ‌ద్రం:సిఎన్‌జి,ఎల‌క్ట్రిక్ మోడ్ వాహ‌నాల మాదిరిగా ఈ వాట‌ర్ కార్ల వ‌ల్ల ఎటువంటి వాతావ‌ర‌ణ కాలుష్యం ఉండ‌దు.ఈ డ‌బ్లూఇఎస్ ప‌రిజ్ఞానంపై నిజానికి నూరేళ్ల క్రితం నుంచే బ్రిట‌న్‌,ఆస్ట్రేలియా,అమెరికా,ర‌ష్యా త‌దిత‌ర దేశాల శాస్త్ర‌వేత్త‌లు దృష్టిని సారించారు.ర‌ష్యా శాస్త్ర‌వేత్త‌లు తొలుత ఓ నౌక‌ను నీటి ద్వారా న‌డిపించేందుకు ఈ ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.స‌ముద్ర‌పు జ‌లాల నుంచే హైడ్రోజ‌న్‌ను సేక‌రించి షిప్ న‌డిచేలా సాంకేతిక‌త‌ను రూపొందించారు.ఈ ప‌రిజ్ఞానాన్ని ఓ.ఎమ్‌. గా వారు స్థిర‌ప‌రిచారు.ఈ డ‌బ్లూ.ఇ.ఎస్ ప‌రిజ్ఞానం మ‌రింత ప్ర‌గ‌తిని సాధిస్తే ఒక్క కార్లేంటి ఏకంగా విమానాలు,రాకెట్లు,స‌బ్‌మెరైన్ల‌ను కూడా నీళ్ల‌తోనే న‌డిపించేయొచ్చంటున్నారు.

Popular Posts

Wisdomrays