20 Feb 2012

smooth siva lingam


మంచిని నమ్మి చెడిన‌వారు లేరంటారు.ఓ సూప‌ర్ ప‌వ‌ర్ ఉంద‌ని న‌మ్మ‌డ‌మే భ‌క్తి.అది స‌న్మార్గానికే దిక్సూచి అవుతుంది గానీ ఏ చెడుపు చేయ‌దు.అయితే మేలే గానీ ఎంత‌మాత్రం కీడు జ‌ర‌గ‌ద‌నేది స‌నాతన ధ‌ర్మంగా ఇప్ప‌టికీ భాసిల్లుతోంది.అందుకే అనాదిగా హిందువుల్లో అనేకానేక విశ్వాసాలు ఇంకా చ‌లామ‌ణిలో ఉన్నాయి.వాటిల్లో ఒక‌టి ఈ శ్రీ‌శైలం  మ‌ల్లికార్జున‌స్వామి ఆల‌యం.ఈ ఆల‌యంలోని శివ‌లింగాన్ని న‌మ్మిన భ‌క్తులు త‌మ నుదుటితో తాకితే అదో మెత్త‌టి దూది పింజెను స్పృశించిన అనుభూతి క‌ల్గ‌డం విశేషం.దేశంలో గ‌ల 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీశైలం రెండో అతి పురాత‌న విశిష్ట‌క్షేత్రం.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌ర్నూల్ జిల్లాలోని న‌ల్ల‌మ‌ల గిరుల్లో సాక్షాత్తూ ప‌ర‌మ‌శివుడు కొలువుదీరాడ‌ని అత్య‌ధిక హిందువుల విశ్వాసం.అందువల్ల‌నే రాష్ట్రంలో తిరుమ‌ల త‌ర్వాత అంత‌టి పుణ్య‌క్షేత్రంగా భ‌క్తుల మ‌న్న‌న‌ల్ని ఈ శ్రీ‌శైలం క్షేత్రం పొందుతోంది.కృష్ణాన‌ది ప‌రీవాహ‌క ప్రాంతంలో ఉందీ పుణ్య‌స్థ‌లం.హైద‌రాబాద్‌కు ద‌క్షిణం వైపు 230 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించి శ్రీ‌శైలం చేరుకోవ‌చ్చు.ఆదిశంక‌రాచార్యులు ఇక్క‌డ మ‌ల్లికార్జునుణ్ని ద‌ర్శించాకే శివానంద‌ల‌హ‌రిని ర‌చించారు.ఈ ఆల‌యంలో కొలువైన మ‌ల్లికార్జునుడు శివుని ప్ర‌తిరూపం కాగా భ్ర‌మ‌రాంబ సాక్షాత్తూ పార్వ‌తీదేవి స్వ‌రూపం.
అల‌రించే దివ్య‌స్థ‌లి: 12వ శ‌తాబ్దం నుంచి ప్రాచుర్యంలో ఉన్న అక్కమ‌హాదేవి గుహ‌ల్ని తిల‌కించే సంద‌ర్శ‌కుల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ త‌గిన ఏర్పాట్లు చేసింది. ఇక్క‌డ నిర్మిత‌మైన 512 మీట‌ర్ల పొడ‌వైన డ్యాం,విద్యుత్ కేంద్రం కూడా సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు క‌ల్గిస్తుంటాయి. 3,568 ‌
చ‌..మీ విస్తీర్ణంలో గ‌ల శ్రీ‌శైలం అభ‌యార‌ణ్యం పులులు, చిరుత‌లు, ఎలుగు, హైనా, లేళ్లు, అడ‌వి పిల్లులు త‌దిత‌ర వ‌న్య‌ప్రాణుల‌తో అలరారుతోంది.ఈ డ్యాం జ‌లాల్లో వివిధ ర‌కాల మొస‌ళ్లు మ‌నుగ‌డ సాగిస్తుంటాయ‌ట‌.గుంటూరు,హైద‌రాబాద్‌ల నుంచి విస్తారంగా బ‌స్సులు న‌డుస్తుంటాయి. మార్కాపూర్‌, క‌ర్నూల్‌, గుంటూరుల నుంచి అనేక రైళ్లు తిరుగుతున్నాయి. హైద‌రాబాద్‌ నుంచి శ్రీ‌శైలానికి విమాన సౌక‌ర్యం కూడా ఉంది.
జ్యోతిర్లింగ క్షేత్రాలు:భార‌త్‌లో 12 జ్యోతిర్లింగ క్షేత్రాల జాబితా... 1)సోమనాథ్‌- ... ప్ర‌భాస్ ప‌ఠాన్‌, సౌరాష్ట్ర‌(  (గుజ‌రాత్‌), 2)మ‌ల్లికార్జున‌-శ్రీ‌శైలం (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌), 3)మ‌హా కాళేశ్వ‌ర్‌-మ‌హాక‌ల్‌,ఉజ్జ‌యిని(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌), 4)ఓంకారేశ్వ‌ర్‌-న‌ర్మ‌ద ఐలాండ్‌,ఓంకారేశ్వ‌ర్‌(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌),5)కేదార్‌నాథ్‌-కేదార్‌నాథ్‌(ఉత్త‌రాఖండ్‌),6)భీమ‌శంక‌ర్‌-భీమ‌శంక‌ర్‌(మ‌హారాష్ట్ర‌),7)కాశీ విశ్వ‌నాథ్‌-వార‌ణాసి(ఉత్త‌రప్ర‌దేశ్‌),8)త్ర‌యంబ‌కేశ్వ‌ర్‌-త్ర‌యంబ‌కేశ్వ‌ర్‌, నాసిక్‌(మ‌హారాష్ట్ర‌), 9)వైద్య‌నాథ్‌- వైద్య‌నాథ్‌(జార్ఖండ్‌),10) నాగేశ్వ‌ర్‌-(మ‌హారాష్ట్ర‌,ఉత్త‌రాఖండ్‌), 11) రామేశ్వ‌ర్‌- రామేశ్వ‌ర్‌( త‌మిళ‌నాడు),12) గ్రిష్ణేశ్వ‌ర్‌- ఎల్లోరా, ఔరంగాబాద్‌( మ‌హారాష్ట్ర‌)..

17 Feb 2012

cable car hotel


 కేబుల్ కార్ రెస్టారెంట్ల‌కు శానిఫ్రాన్సిస్కో పేరొందింది. వాటిని త‌ల‌పించేలా దేశంలోనే తొలిసారిగా ఈ త‌ర‌హా రెస్టారెంట్లకు బెంగ‌ళూర్ వేదిక కావ‌డం గ్రీన్‌సిటీ వాసుల‌కు గ‌ర్వ‌కార‌ణ‌మే.జ‌య‌న‌గ‌ర్‌,.జె.పి.న‌గ‌ర్‌ల్లోగ‌ల ఈ ఫేమ‌స్ రెస్టారెంట్ల‌కు ఓసారి వెళ్లొస్తే పోలా!
ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా,గ్రీన్ సిటీ,ఐటీ హ‌బ్‌,ఉద్యాన‌న‌గ‌రి ఇలా ప‌లు పేర్లు గ‌ల ప‌చ్చంధ‌నాల న‌గ‌రం బెంగ‌ళూర్‌.భార‌త‌దేశంలోని ఈ ద‌క్షిణాది నగ‌రంలో ఆక‌ర్ష‌ణ‌లు కోకొల్ల‌లు.క‌బ్బ‌న్‌పార్క్‌,ఉల్సుర్ లేక్‌, విధాన‌సౌధ‌తోపాటు వివిధ ప్ర‌కృతి అందాల‌కు నెల‌వు ఈ న‌గ‌రం.శాస్త్రీయ సంగీతం,నృత్యాల‌కూ ప్ర‌సిద్ధి.అలాగే బోటింగ్ స‌హా అనేక ఆధునిక పోక‌డ‌ల‌కు బెంగ‌ళూరు కేంద్రం.వాటిల్లో ఒక‌టి కేబుల్ కార్ రెస్టారెంట్‌.స‌రికొత్త ఊహాలోకంలో స్వ‌దేశీ,విదేశీ రుచుల‌తో సంద‌ర్శ‌కుల్ని అల‌రించే ఈ త‌ర‌హా రెస్టారెంట్లు అంద‌రికీ అందుబాటు ధ‌ర‌ల్లో లేక‌పోవ‌డం లోటేన‌న‌వ‌చ్చు.అయితే రుచుల‌కు మాత్రం కొద‌వ‌లేద‌ని కేబుల్‌కారు రెస్టారెంట్ ఖాతాదారులు న‌మ్మ‌కంగా చెబుతుంటారు.ముఖ్యంగా ఇటాలియ‌న్‌,ఇండియ‌న్ రుచులు నోరూరిస్తాయి.తండూరి దింగ్రి(మ‌ష్రూమ్స్‌),బేబీ కార్న్ తండూరి వంట‌కాలు వావ్ అనిపిస్తాయంటారు.అలాగే తండూరి ఫూల్(కాలిఫ్ల‌వ‌ర్‌)ను లొట్ట‌లేసుకుంటూ బాగా తింటామ‌ని ప‌లువురు పేర్కొన్నారు.చల్ల‌టి మ్యాంగో ల‌స్సీ కూడా కేబుల్ కార్ విందు హైలెట్టేన‌ట‌.స్విన‌క్‌,చీజ్ ర‌వొలి,దాల్ బుఖారాల‌ను సంద‌ర్శ‌కులు ఇష్టంగా ఆర‌గిస్తుంటారు.ఇక ఆలూ బిర్యానికున్న డిమాండ్ గురించి చెప్ప‌న‌క్క‌ర‌లేదు.అయితే ఈ కేబుల్ కార్ రెస్టారెంట్లు అన్నింట్లోను కేవ‌లం శాకాహారం మాత్ర‌మే ల‌భిస్తుంది.ఇటాలియ‌న్ డిషెస్‌లో గౌల‌ష్ గ్నొఖి, షిజోచెరి,పిజా నెపొలెత్న‌,సూప్ త‌దిత‌రాలంటే ఖాతాదారుల‌కెంతో క్రేజ్‌.ఉత్తార‌ది రుచుల్లో ప‌న్నిర్ బ‌ట‌ర్ మ‌సాలా,ఆలూ మ‌ట‌ర్‌,తండూరి రోటీ,నాన్‌, సొయాబిన్ చాప్‌,ప‌న్నీర్ మ‌సాలా,దాల్ ఫ్రై,దాల్ మ‌క్ని,మిక్స్‌డ్ వెజిట‌బుల్ ఆర్డ‌ర్ ఇచ్చేందుకు భోజ‌న‌ప్రియులు ఉవ్విళ్లూరుతుంటారు.

13 Feb 2012

flying saucers

విశ్వం వింత‌ల స‌మాహారం. త‌ర‌చి చూసేకొద్దీ ఎన్నో అంతు చిక్క‌ని ర‌హ‌స్యాల పుట్ట‌. శోధించే క్ర‌మంలో చిక్కుముడి వీడ‌ని సంగ‌తులెన్నో.అటువంటివే వినీలాకాశంలో అప్పుడ‌ప్పుడు క‌నిపించి మాయ‌మ‌య్యే ఫ్ల‌యింగ్ సాస‌ర్లు. అమెరికాలోనే తొలుత వీటి ఉనికిని గురించి క‌థ‌లుగా ఎన్నో వార్త‌లు 90వ ద‌శ‌కం వ‌ర‌కు అనేక‌సార్లు వెలువ‌డ్డాయి. భూమిపైనే కాక విశ్వంలోని మ‌రికొన్ని గ్ర‌హ‌ల్లోనూ మ‌న‌బోటి మ‌నుషులున్నార‌నే న‌మ్మ‌కం ఇప్ప‌టికీ ఉంది. వారు మ‌న‌క‌న్నా చాలా తెలివైన వాళ్ల‌ని, వాళ్లు నివ‌సిస్తున్న గ్ర‌హం నుంచే భూమిపైనున్న మ‌న సంగ‌తుల‌న్నింటిని ఎప్ప‌టిక‌ప్పుడు గ్ర‌హిస్తున్నార‌ని భావించే వారికి కొద‌వ‌లేదు. ఆ గ్ర‌హాంత‌ర వాసుల వ‌ల్ల ఏదైనా హాని ఎప్ప‌టికైనా మ‌న‌కు త‌ప్ప‌దా? భూగ్ర‌హంపై వివ‌రాల సేక‌ర‌ణ‌కు ఆ గ్ర‌హాల‌వాసులు ఫ్ల‌యింగ్ సాస‌ర్ల‌లో భూమిపై తిరుగాడిపోతున్నారా?ఈ ఉహా మ‌న శాస్త్ర‌వేత్త‌ల మ‌దిని శ‌తాబ్దాలుగా తొలుస్తూనే ఉంది. ఆ క్ర‌మంలోనే అస‌లు భూమిపై మాదిరిగా ఇత‌ర గ్ర‌హాల‌పై ప్రాణులు ఉనికి ఉందా లేదా అనే కోణంలో విస్తృత ప‌రిశోధ‌న‌లు ఇప్ప‌టికే అభివృద్ధి చెందిన దేశాలు నిరంత‌రాయంగా కొన‌సాగిస్తూనే ఉన్నాయి. ఈ ప‌రిశోధ‌న‌ల ప‌రంప‌ర‌లో ఎప్పుడూ అమెరికాది ముందంజే.
వండ‌ర్ ఫ్ల‌యింగ్ సాస‌ర్‌: :వాషింగ్ట‌న్‌లో 1940 ద‌శ‌కంలో తొలిసారిగా ఫ్ల‌యింగ్ సాస‌ర్ దిగింద‌నే వార్త‌లు తామ‌ర‌తంప‌ర‌గా వెలువ‌డ్డాయి.ఇక అప్ప‌టి నుంచి 1990ల వ‌ర‌కు ఈ వార్త‌లు అడ‌పాద‌డ‌పా సంద‌డి చేస్తూనే వ‌చ్చాయి.అమెరికా ప్ర‌భుత్వం,సి.ఐ.ఏ,ఎఫ్.బి.ఐ.లు ఆయా సంద‌ర్భాల్లో ఈ వార్త‌ల నిగ్గు తేల్చేందుకు న‌డుం బిగించాయి.అయితే ఆ ద‌ర్యాప్తుల మాటెలా ఉన్నా ఫ్ల‌యింగ్ సాస‌ర్లు భూమిపైకి చేరుకుంటుండ‌డం వాస్త‌వ‌మేన‌నే వారి శాతం ఇప్ప‌టికీ చాలా ఎక్కువ‌గానే ఉంద‌ని చెప్పాలి.అన్ ఐడెంటిటీ ఫ్ల‌యిడ్ ఆబ్జెక్ట్‌(యూఎఫ్ఓస్‌)గా అమెరిక‌న్లు పిలుచుకునే ఈ ఫ్ల‌యింగ్ సాస‌ర్లు వార్త‌ల‌పై త‌మ ప‌ద‌వి కాలాల్లో కార్ట‌ర్,రీగ‌న్ త‌దిత‌ర అమెరికా అధ్య‌క్షులు కూడా ఎంతో మ‌క్కువ క‌న‌బ‌ర‌చ‌డం గ‌మ‌నార్హం.ఓ ప్ర‌యివేట్ ఫ్ల‌యిట్ పైలట్ కెన్నెత్ అర్నాల్డ్‌,వ్యాపారవేత్త 1947 జూన్ 24న తాము ప్ర‌యాణిస్తున్న విమానం నుంచి వాషింగ్ట‌న్ గ‌గ‌న‌త‌లంలో దాదాపు తొమ్మిది ఫ్ల‌యింగ్ సాస‌ర్ల‌ను చూశామ‌ని అప్ప‌ట్లో అమెరికా వార్తా సంస్థ‌ల‌కు వెల్ల‌డించారు.అవి గంట‌కు వెయ్యి మైళ్ల వేగంతో దూసుకుపోతుండ‌డాన్ని చూసి తాము ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌మ‌యిన‌ట్లు వారిద్ద‌రూ పేర్కొన‌డం యావ‌త్ ప్ర‌పంచంలో సంచ‌ల‌నాన్ని రేపింది.దాంతో 1948లో అమెరికా ఎయిర్‌ఫోర్స్ జ‌న‌ర‌ల్ ట్వినింగ్ ఆధ్వ‌ర్యంలో ఎస్‌.ఐ.జి.ఎన్‌(ప్రాజెక్టు సాస‌ర్‌)పేరిట ఫ్ల‌యింగ్ సాస‌ర్ల‌పై ప‌రిశోధ‌న‌లు ప్రారంభ‌మ‌య్యాయి.ఇంత‌కీ వీటికి ఫ్ల‌యింగ్ సాస‌ర్ల‌నే పేరు ప్ర‌త్య‌క్ష‌సాక్షులు అందించిన వివ‌రాల ఆధారంగానే వ‌చ్చింది.అర్నాల్డే కాకుండా ఈ త‌ర‌హా ఎగిరే ప‌ళ్లాల‌ను ఆయా దేశాల్లో చాలామంది చూశార‌నే వార్త‌లు అనేకం 1950 ద‌శ‌కం త‌ర్వాతే బోలెడు వెలువ‌డ్డాయి.వారంద‌రూ చెప్పిన‌దాన్నిబ‌ట్టే ఈ ఎగిరే ప‌ళ్లాల‌కు ఫ్ల‌యింగ్ సాస‌ర్‌,ఫ్ల‌యింగ్ డిస్క్‌,పైప్లేట్ అనే పేర్లు స్థిర‌ప‌డ్డాయి.ఇటీవ‌ల 2006లో షికాగో ఒహ‌రె ఎయిర్‌పోర్టు స‌మీపంలోనూ ఓ ఎగిరే ప‌ళ్లెం వార్త హ‌ల్‌చ‌ల్ చేసింది.అలా మెరిసి ఇలా అదృశ్య‌మ‌య్యే ఎగిరే ప‌ళ్లాల వార్త‌లే గానీ అందులో నుంచి ఏవో జీవులు భూమిపై అడుగిడ‌డాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన వారెవ‌రూ ఇంత‌వ‌ర‌కు వార్త‌ల‌కెక్క‌లేదు.అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ‌కాకుళంలో మాత్రం ఈ ఏడాది ఆరంభంలో ఓ భారీ మ‌నిషి పాద‌ముద్ర‌ల గురించి వార్త‌లు గుప్పుమ‌న్నాయి.కొంద‌రు స్థానికుల‌యితే ఏకంగా తాము గ్ర‌హాంత‌ర వాసిని అతి స‌మీపం నుంచి చూశామ‌ని టి.వి.చాన‌ళ్ల‌కు తెలిపారు.తెల్ల‌టి పొగ‌మంచు తెర‌లా ఆ మాన‌వాకార గ్రహాంత‌ర వాసి త‌మ క‌ళ్ల ముందు నుంచి వేగంగా క‌దిలి వెళ్లిపోవ‌డంతో భ‌య‌భ్రాంతుల‌కు లోన‌య్యామ‌ని వారు త‌మ అనుభ‌వాన్ని పంచుకున్నారు.ఈ వార్త‌ల్లో నిజానిజాల సంగ‌తెలా ఉన్నాఎగిరే ప‌ళ్లాలు,గ్ర‌హాంత‌ర‌వాసులు,ఇత‌ర సైన్స్ ఫిక్ష‌న్ సినిమాలు ఎప్పుడు విడుద‌ల‌యినా ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌న‌రంజ‌కంగా ప్ర‌ద‌ర్శిత‌మవుతున్నాయి.
వ‌ర‌ల్డ్ టాప్ టెన్ యూఎఫ్ఓ సినిమాలు:1. Earth vs. the Flying Saucers(1956),2. War of the Worlds(1953),3. Independence Day(1996),4. Episode..20(Destruction) from the British TV series: UFO(1970),5. The Battle in Outer Space(1959),6. Close Encounters of the Third Kind(1977),7. This Island Earth(1955),8. Mars Attacks!(1996),9. Invaders from Mars(1953, 1986),10. The Day the Earth Stood Still(1951).

12 Feb 2012

rama sethu



ప్రేమ అదో అద్వితీయ మ‌ధుర భావ‌న‌.ప్రేమ విశ్వ‌వ్యాప్తం..
అనంతం..ప్రేమే ప్ర‌కృతి..సృష్టి..ప్ర‌తిసృష్టి.. అన్నీ..అదే 
నిత్యం.ప‌ర‌మ స‌త్యం..  ప్రేమ‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం శ్రీ‌రాముడు.
సీతా స్వ‌యంవ‌రంలో శివ ధ‌న‌స్సును విరిచి
ఆమెను గెలుచుకున్న‌ అప్ప‌టి   నుంచి రాముడు
ఆ ప్రేమ‌కే బ‌ద్ధుడు.  ఏక‌ప‌త్నీవ్ర‌తునిగాను 
ఆద‌ర్శ‌ప్రాయుడ‌య్యాడు. త‌న‌పై ప‌గ‌తో అర్ధాంగి
మ‌హాసాధ్వి సీత‌మ్మ‌ను రావ‌ణుడు అపహ‌రించుకు పోగా
శ్రీ‌రామ‌చంద్రుడు ఆ రాక్ష‌స రాజ్యంపైకి దండెత్తాల్సి 
వ‌చ్చింది. అలా లంక‌ను చేరేందుకు వాన‌ర‌సేన స‌హాయంతో నిర్మించిందే రామ‌సేతు.ఇది  పురాణం.. నిజ‌మేన‌నేందుకు ల‌భించిన ఆధారాలే స‌సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
శ్రీ‌రామ సేతు: భార‌త్‌,శ్రీ‌లంక‌ల మ‌ధ్య ఉన్న హిందూ 
మ‌హాస‌ముద్రంపై మాన‌వ నిర్మిత వార‌ధే ఈ రామ‌సేతు.
ఇప్ప‌టి త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రం నుంచి శ్రీ‌లంక‌కు 
మ‌ధ్య‌గ‌ల స‌ముద్రంపై సుమారు 18 ల‌క్ష‌ల ఏళ్ల క్రితం 
ఈ సేతు నిర్మిత‌మైంద‌ట‌. నాసా ధ్రువ‌ప‌రిచిన ఉప‌గ్ర‌హ 
ఛాయాచిత్ర‌మే అందుకు ప్ర‌బ‌ల ఉదాహ‌ర‌ణ అనేది
 ప్ర‌పంచం న‌లుమూల‌లా గ‌ల మెజార్టీ హిందువుల అభిప్రాయం.
అయితే ఈ రామ‌సేతు నిర్మాణం ఓ అబ్బుర‌మ‌న‌డం మాత్రం 
అంద‌రూ అంగీక‌రించద‌గ్గ‌ విష‌యం.ఎందుకంటే ఇప్ప‌టి 
ఏ ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోలేని 
ఆ కాలంలోనే ఏకంగా స‌ముద్రంపైనే వంతెన క‌ట్ట‌డం అంటే 
మాట‌లా మ‌రి.పోటెత్తే సాగ‌ర జ‌లాల‌పై ఓ స‌ర‌ళ‌రేఖ‌ను గీసిన మాదిరిగా ఈ వార‌ధి నిర్మిత‌మ‌యిందంటున్నారు.పెద్ద పెద్ద బండ రాళ్లు,వెదురు,గ‌డ్డి,త‌దిత‌ర సామ‌గ్రితోనే రామ‌సేతును వాన‌ర సైన్యం నిర్మించింది.అదీ కేవలం అయిదే రోజుల్లో ఇంత పెద్ద వంతెన నిర్మాణం పూర్త‌యిందంటే ఆశ్చ‌ర‌మే.సౌతీస్ట్ ఏషియాలోని అతిపెద్ద పురాత‌న హిందూ దేవాల‌యంగా చ‌రిత్ర‌కెక్కిన ప్రంబాన‌న్ శివాల‌యం(జావా-ఇండోనేసియా)లోఈ రామ‌సేతు నిర్మాణానికి సంబంధించిన శిల్పాలు ఇప్ప‌టికీ క‌నిపిస్తున్నాయి.850 ఎ.డి.కి చెందిన ఈ ఆల‌యం వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తింపును పొందింది.త్రేతాయుగ కాలంనాటి ఈ రామ‌సేతు గురించి వాల్మీకి రామాయ‌ణం,మ‌హాభార‌త‌గాథ‌తో స‌హా ప్రాచీన త‌మిళ సాహిత్యంలోనూ ప్ర‌స్తావ‌న ఉండ‌డం గ‌మ‌నార్హం.సేతు అనే మాట‌కు త‌మిళంలో డ్యాం అని అర్థం. ప్ర‌ఖ్యాత త‌మిళ‌క‌వి తిరున‌వుక్ర‌స‌ర్ మొద‌లు ప‌లువురు నాటి నుంచి నేటి వ‌ర‌కు రామ‌సేతు య‌థార్థ‌త‌ను ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు.
ఒక‌దేశం నుంచి మ‌రోదేశానికి జ‌ల‌ర‌వాణా సుల‌భ‌మౌతుంద‌నో,నౌక‌ల‌కు ఇంధ‌న వ్య‌యం ఆదా అవుతుంద‌నో లెక్క‌ల‌తో ముడిపెట్టి చూడ‌ద‌గ్గ అంశం కింద‌కు రామ‌సేతు రాద‌ని మాత్రం మ‌నం అంద‌రం క‌చ్చితంగా పేర్కొన‌వ‌చ్చు.
-------------------------------------------------------------------------------------------------------------
ఆడిలైడ్‌::ముక్కోణ‌పు వ‌న్డే సీరిస్‌లో భార‌త్ రెండో విజ‌యాన్ని అందుకొని పాయింట్ల ప‌ట్టిక‌లో ముందు వ‌రుస‌లో ఉంది.ఆదివారం మ్యాచ్‌లో భార‌త్ 4 వికెట్ల తేడాతో మ‌రో రెండు బంతులుండ‌గానే ఆస్ట్రేలియాను ఓడించింది. ఉత్కంఠ పోరులో తొలుత గంబీర్‌, చివ‌ర్లో కెప్టెన్ ధోని భార‌త్‌కు ఈ స‌గ‌ర్వ‌మైన విజ‌యాన్ని అందించారు.

Popular Posts

Wisdomrays