19 Dec 2011

bull fight


స్పెయిన్‌లో అనాదిగా ఆచ‌రిస్తున్న సంప్ర‌దాయ క్రీడే బుల్‌ఫైట్‌. వాస్త‌వానికి ఇది మూగజీవి ర‌క్త‌పుటేరుతో సాగే రాక్ష‌స‌క్రీడ‌బ‌ల‌మైన ఎద్దును క‌ద‌నానికి క‌వ్వించి క‌ర్క‌శంగా క‌డ‌తేర్చే వికృతానంద క‌ళాకేళి. ల‌క్ష‌ల మందితో కిక్కిరిసిన స్టేడియం.. అంద‌రూ క‌ళ్లార్ప‌కుండా కేరింత‌లు కొడుతూ ఉండ‌గా..క‌సాయి క‌త్తి దూస్తూ ఉంటే ఓ మూగ‌జీవి అస‌హాయంగా నెత్తురొడుతూ బ‌లి ప‌శువుగా కుప్ప‌కూలిపోయి క‌న్నుమూస్తుంది.
స్పెయిన్ బుల్‌ఫైట్స్‌ఈ బుల్‌ఫైట్స్ 711ఎ.డి నుంచే స్పెయిన్‌లో జ‌రుగుతున్నాయి.కింగ్ అల్ఫాన్సో-8 రాజ్యాధికారిన్ని చేప‌ట్టిన సంద‌ర్భంగా తొలిసారిగా ప్రారంభ‌మ‌యిందీ క్రీడ‌.ఏడాదిలో మార్చి నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు స్పెయిన్‌లోని వివిధ రీజియ‌న్ల‌లో ప‌లుచోట్ల ఈ బుల్‌ఫైట్లు జ‌రుగుతుంటాయి.కొన్నిచోట్ల ఏడాదిలో దాదాపు 10 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు ఈ బుల్‌ఫైట్ల‌ను తిలకిస్తూ ఆనందిస్తుంటారు.దేశంలో ఏటా 20వేల‌కు పైగా ఎద్దులు సుమారు మూడు కోట్ల మంది సాక్షిగా ప్రాణాలు వ‌దులుతున్న‌ట్లు ఓ అంచ‌నా.స్పానిష్ స్ట‌యిల్ బుల్‌ఫైట్‌కు కొరిడ డిటోర్స్(ర‌న్నింగ్ ఆఫ్ బుల్స్‌)గాను లాఫీఎస్టా(ది ఫెస్టివ‌ల్‌()గా పేర్లున్నాయి.ఈ సంప్ర‌దాయ క్రీడ‌లో ముగ్గురు టోరోస్‌( (మెట‌డోర్లు)చెరో రెండు ఎద్దుల‌తో పోరాడతారు.ఒక్కో టోరో చెరో రెండు ఎద్దుల‌తో త‌ల‌ప‌డ‌తారు.ఒక్కో టోరోకు ఆరుగురు చొప్పున స‌హాయ‌కులు ఈ పోరాటంలో తోడ్ప‌డ‌తారు.350కుపైగా కేజీల బ‌రువుతో నాల్గు నుంచి ఆరేళ్ల వ‌య‌సు గ‌ల ఎద్దు క‌ద‌న‌రంగంలోకి దూకుతుంది.టోరోకు స‌హ‌క‌రించేందుకు ఇద్ద‌రు పిక‌డోర్స్‌ (అశ్వ యోధులు),ముగ్గురు బాండెరిల్లెర్స్‌,ఒక మొజోడిఎస్పాడ‌స్‌((( )(ఖ‌డ్గ‌ధారులు)బ‌రిలోకి దిగుతారు.
క‌త్తితో క‌డ‌తేరుస్తారు:ప‌్ర‌స్తుత ఆధునిక క్రీడ‌లో రింగ్‌లో ఉన్న‌ ఎద్దుపైకి గుర్రాల‌పై వ‌చ్చిన యోధులు,బుల్ ఫైట‌ర్లు,క‌త్తితో బుల్‌ను గాయ‌ప‌రిచే మ‌రో వ్య‌క్తి మూడు ద‌శ‌ల్లో ముప్పేట దాడి చేస్తారు.న‌గారా మోగ్గానే రింగ్‌లోకి ఎద్దుతో స‌హా అంద‌రూ వ‌స్తారు.పోటీ నిర్వాహ‌క అధ్య‌క్షుడికి అభివాదం చేసి ర‌క‌ర‌కాలుగా బుల్‌ను క‌వ్వించి నృత్యాలు చేసి ఆట‌ను మొద‌లు పెడ‌తారు.పోటీ ప్రారంభంలోనే ఎద్దును బాగా రెచ్చ‌గొట్టి వ్యూహాన్ని అమ‌లు చేస్తారు.అప్పుడు ప్ర‌తీకారేచ్ఛ‌తో ర‌గిలిపోయిన ఎద్దు రింగ్ అంతా పోటీదారుల‌ను ప‌రుగులు పెట్టేలా త‌రుముతుంది.ఆ స‌మ‌యంలో గుర్రాల‌ను సైతం కుమ్మేసేందుకు ఎద్దు ప్ర‌య‌త్నిస్తుంది.1930 వ‌ర‌కు ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం గుర్రాల‌పై ర‌క్ష‌కులు లేక‌పోవ‌డంతో అంత‌కుముందు వ‌ర‌కు ప‌లు పోటీల్లో వంద‌ల కొద్దీ గుర్రాలు సైతం ఎద్దు కొమ్ముల‌కు బ‌ల‌య్యేవి.ఈ క్రీడ‌లో రెచ్చిపోయిన ఎద్దులు రింగ్ లోప‌లే కాకుండా స్టేడియం గ్యాల‌రీల్లోకి దూసుకొచ్చిన‌ప్పుడు ప్రేక్ష‌కులు కూడా గాయ‌ప‌డ్డ ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి.2010 ఆగ‌స్టులో నార్త‌ర‌న్ స్పెయిన్ లొఫ‌ల్లాలో జ‌రిగిన ఇలాంటే ఘ‌ట‌న‌లోనే ప‌దేళ్ల బాలుడు స‌హా మొత్తం 40 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.
నిషేధాస్త్రం..:స్టేడియంలో ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌తో ఉల్లాసంగా గ‌డుపుతుంటే రింగ్‌లోని ఎద్దు మాత్రం రోషంతోనే రొప్పుతూ ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటుంది.అప్పుడు ఎర్ర‌టి గుడ్డ‌ను దాని క‌ళ్లెదుట ఊపుతూ మ‌ళ్లీ రెచ్చ‌గొడ‌తారు.నిజానికి బుల్స్ క‌ల‌ర్ బ్లైండెడ్‌.అవి రంగుల్ని గుర్తించ‌లేవు.బ‌రిలో ఎద్దును బాగా అల‌సిపోయే వ‌ర‌కు ఆ విధంగా ఆడించి ప‌రుగులు పెట్టించి గాయ‌ప‌రిచి అది ర‌క్త‌మోడుతూ నేల‌కూలాక ప‌దునైన పెద్ద క‌త్తితో న‌రికేస్తారు.బాగా గాయ‌ప‌డి రింగ్‌లో ర‌క్తం ధార‌క‌డుతున్నా ఇంకా క‌ద‌నానికి కాలుదువ్వే ఎద్దును నిర్వాహ‌క అధ్య‌క్షుడు విజేత‌గా ప్ర‌క‌టించే అవకాశ‌మూ ఉంది.అప్పుడు మాత్ర‌మే ఆ బుల్ మ‌ళ్లీ ప్రాణాల‌తో రింగ్ బ‌య‌ట‌కు రాగ‌ల్గుతుంది.
ఇదో ఆట‌విక క్రీడ అంటూ దీర్ఘ‌కాలంగా జంతు ప్రేమికులు గ‌గ్గోలు పెడుతూనే ఉన్నారు.ఒక్క స్పెయిన్‌లోనే కాదు ఈ వికృత క్రీడ పోర్చుగ‌ల్‌,లాటిన్ అమెరికా దేశాలైన అమెరికా,పెరూ,కొలంబియా,వెనెజువెలా,ఈక్వెడ‌ర్‌ల్లోనూ కొన్ని ప్రాంతాల్లో  కొన‌సాగుతూనే ఉంది.భార‌త్‌లోని త‌మిళ‌నాడు(మ‌దురై)లో జ‌ల్లిక‌ట్టు పేరిట‌ ఈ బుల్‌ఫైట్‌ను సంప్ర‌దాయ క్రీడ‌గా ఆచ‌రిస్తున్నారు.అయితే సంక్రాంతి సంబ‌రంగా గ్రామాల్లో జ‌రిగే ఈ బుల్‌ఫైట్‌లో ఎద్దుతో నిరాయుధులు మాత్ర‌మే త‌ల‌ప‌డ‌తారు.ఎద్దుకు ఏ హాని త‌ల‌పెట్ట‌రు,దాన్ని చంప‌రు.ప్ర‌స్తుతం ఆయా దేశాల్లో ఈ వికృత క్రీడ‌ను నిషేధించారు.1991లో స్పెయిన్‌లో ఈ బుల్‌ఫైట్‌ను తొలుత నిషేధించిన రీజియ‌న్ కెన‌రీ ఐలాండ్.2012 నుంచి కెట‌లోనియా రీజియ‌న్‌లో కూడా ఈ క్రీడ‌పై నిషేధం అమ‌ల్లోకి రానుంది. 
-------------------------------------------------------------------------------------------------------------
*భార‌తర‌త్న అవార్డుల జాబితాలోకి క‌ళ‌లు,సాహిత్యం,సేవా,ఇత‌ర రంగాల‌తోపాటు క్రీడా రంగాన్ని చేరుస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యాన్ని మొర‌దాబాద్ ప్ర‌స్తుత ఎంపీ(కాంగ్రెస్‌) ప్ర‌ముఖ క్రికెట‌ర్ అజ‌రుద్దీన్ స్వాగతించారు.భార‌తర‌త్న అవార్డును హాకీ దిగ్గ‌జం లెజెండ్ ధ్యాన్‌చంద్‌,మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ల‌కు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు.గ‌తంలోనే భార‌త‌ర‌త్న గాన‌కోకిల ల‌తామంగేష్క‌ర్ ఈ అవార్డును స‌చిన్‌కు ప్ర‌దానం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.మేజ‌ర్ ధ్యాన్‌చంద్ జ‌న్మించిన ఆగ‌స్టు 29వ తేదీనే ఆయ‌న సంస్మ‌ర‌ణార్థం భార‌త్‌లో జాతీయ‌క్రీడా దినోత్స‌వం జ‌రుగుతోంది. 
*మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో భార‌త్ త‌ర‌ఫున పాల్గొన్న వాసుకి సుంక‌వ‌ల్లి నిర్వహించిన షోలో ఎ.పి స‌మాచారశాఖ మంత్రి డి.కె.అరుణ ఓ అనాథ బాలిక‌తో క‌లిసి ర్యాంప్‌వాక్ చేశారు.2003లో రాజ‌స్థాన్ అప్ప‌టి సి.ఎం వ‌సుంధ‌ర రాజే సింధియా కూడా ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రై ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్నారు.

16 Dec 2011

eiffel tower


పారిస్‌..ఫ్రాన్స్‌కే కాదు,ఫ్యాష‌న్ ప్ర‌పంచానికీ రాజ‌ధాని.అందానికే అందం ఈ న‌గ‌రం.ఫ్రాన్స్ అన‌గానే మ‌న‌కు ఠ‌క్కున గుర్తొచ్చేది ఐఫెల్ ట‌వ‌ర్‌.మాన‌వ నిర్మిత అద్భుత క‌ట్ట‌డానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం.పారిస్‌కే మ‌కుటాయ‌మానంగా శ‌తాబ్దాల‌గా ప్ర‌త్యేక గుర్తింపునిస్తోన్న నిర్మాణ‌మిది.ఇప్ప‌టికే 50 కోట్ల మందికి పైగా ఈ ట‌వ‌ర్‌ను సంద‌ర్శించారు.పారిస్‌లోని చాంప్ డిమార్స్‌కు స‌మీపంలో సెనె న‌దీ తీరంలో దీన్ని ప్ర‌ఖ్యాత ఇంజ‌నీర్ గుస్త‌వ్ ఐఫెల్ రూపొందించారు.ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ప‌ర్యాట‌కులు సంద‌ర్శించే చిర‌స్మ‌ర‌ణీయ క‌ట్ట‌డాల్లో ఈ ఐఫెల్ ట‌వ‌ర్ ఒక‌టి.ఏటా 30ల‌క్ష‌ల మంది సంద‌ర్శ‌న‌కు నోచుకుంటోందిది.రెండేళ్ల‌కే మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న‌ ఐఫెల్ ట‌వ‌ర్ 1889 నుంచి సంద‌ర్శ‌కుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.తొలి ఏడాదే ఈ ట‌వ‌ర్‌ను రెండు కోట్ల మంది సంద‌ర్శించ‌డ‌మే క‌ట్ట‌డ‌పు విశిష్ట‌త‌కు నిలువుట‌ద్దంగా పేర్కొన‌వ‌చ్చు.
ఐర‌న్ ఐకాన్‌:ఆకాశాన్ని ముద్దాడుతున్న‌ట్లుండే 324 మీట‌ర్ల ఎత్తుగ‌ల ఈ ఐఫెల్ ట‌వ‌ర్ 20వేల పెద్ద ఇనుప దిమ్మెలు,30 ల‌క్ష‌ల రివెట్ల‌తో నిర్మిత‌మ‌యింది.ఆరేడేళ్ల‌కోసారి ఈ నిర్మాణానికి తుప్పు ప‌ట్ట‌కుండా ఉండేందుకు పెయింట్ వేస్తుంటారు.అందుకు అయిదు ట‌న్నుల‌కు పైగా పెయింట్‌ను వినియోగిస్తారు.ఈ ట‌వ‌ర్ శిఖ‌రం నుంచి చూస్తే పారిస్‌లోని ప్ర‌తి అంగుళం అందం క‌నిపిస్తుంది.సంధ్య‌వేళ మిరుమిట్లను వెద‌జ‌ల్లే దీప‌పు కాంతుల‌తో ఐఫెల్ ట‌వ‌ర్ దేదీప్య‌మానంగా వెలిగిపోతూ సంద‌ర్శ‌కుల మ‌దిని దోచుకుంటుంది.న్యూయార్క్‌లో క్రిస్లెర్ బిల్డింగ్ నిర్మిత‌మ‌య్యే వ‌ర‌కు అంటే 1930 వ‌ర‌కు ఐఫెల్ ట‌వ‌రే ప్ర‌పంచ‌పు మాన‌వ నిర్మిత క‌ట్ట‌డాల‌న్నింటిలోకెల్లా అతి ఎత్తైయిన‌ది.41 ఏళ్ల పాటు ఆ హోదాను నిలుపుకుంది.1957లో ఫ్రాన్స్‌లో మిలౌవ‌యుడ‌క్ట్ నిర్మాణ‌మ‌య్యే వ‌ర‌కు దేశంలో ఎత్తైన క‌ట్ట‌డాల్లో ప్ర‌థ‌మ స్థానంలో ఉంది.తొలుత ఈ ట‌వ‌ర్‌ను 20 ఏళ్ల అనంత‌రం తొల‌గించాల‌నుకున్నా మొద‌టి ప్ర‌పంచ యుద్ధంలో సాధించిన విజ‌యానికి సంకేతంగా దీన్ని య‌థావిధిగా కొన‌సాగించాల‌ని ఫ్రెంచ్ పాల‌కులు నిర్ణ‌యించారు.యూర‌ప్‌కొచ్చే ప‌ర్యాట‌కులు దాదాపు అంద‌రూ పారిస్‌ను సంద‌ర్శిస్తుంటారు.వారు ఐఫెల్ ట‌వ‌ర్‌ను ఎక్కితేనే త‌మ ప‌ర్య‌ట‌న ప‌రిపూర్ణ‌మ‌యిన‌ట్లుగా భావిస్తారు.ఇక్క‌డ షాపింగ్‌,సెనె న‌దిలో విహారాన్ని త‌మ జీవిత‌కాలంపాటు మ‌ధురానుభూతిగా త‌లుస్తుంటారు.

సంద‌ర్శించిన ప్ర‌ముఖులు:లియొనిడ్ బ్రెజ్‌నెవ్‌,మైఖెల్ గోర్బొచేవ్‌, ఫెడ‌ల్ కాస్ట్రో,బిల్ క్లింట‌న్‌,వాస్టాక్ హెవ‌ల్ త‌దిత‌రులు ఈ ట‌వ‌ర్‌ను సంద‌ర్శించారు.
మూడంతస్తుల‌తో మురిపిస్తుందీ ట‌వ‌ర్‌.తొలి రెండు అంత‌స్తుల వ‌ర‌కు మెట్ల దారి కూడా ఉంటుంది.ఇక మూడో అంత‌స్తు నుంచి ట‌వ‌ర్ శిఖ‌ర భాగం వ‌ర‌కు ఎల్వెట‌ర్ల ద్వారానే చేరుకోగ‌లం.మొద‌టి అంత‌స్తులో ఆల్టిట్యూడ్ అనే రెస్టారెంట్ ఉంటుంది. ఇది స‌ముద్ర మ‌ట్టానికి ఏకంగా 95 మీట‌ర్ల ఎత్తున ఉంటుంది.రెండో అంత‌స్తులో గ‌ల జుల్స్‌వెర్నె రెస్టారెంట్‌ సొంత లిఫ్ట్ సౌక‌ర్యాన్ని క‌ల్గి ఉంది. ప్ర‌చండ గాలుల‌ను సైతం త‌ట్టుకొని నిల‌బ‌డే విధంగా ఈ ట‌వ‌ర్ను తీర్చిదిద్దారు.ఇందులో స్నాక్‌బార్‌,అన్ని ర‌కాల వ‌స్తువులు ల‌భించే షాపింగ్‌మాల్‌, పోస్టాఫీస్‌,పారిస్ అందాల‌ను వీక్షించేందుకు వీలుగా అతిపెద్ద హాల్ కొలువుదీరి ఉన్నాయి.
పారిస్ సైట్ సీయింగ్ ఎట్రాక్ష‌న్స్‌:నొట‌ర్ డ్యామ్ కేథెడ్ర‌ల్‌,అర్కెడ్ ట్ర‌మ్పే,బాసిలిక్ డుస్ర్కె కొయ‌ర్‌,బాస్టిల్లె,చాంప్స్ క్లిసీస్‌,కాంక‌ర్డ్ స్క్వేర్‌,సేక్రెడ్ హార్ట్ మాంట్ మార్టె,సెయింట్ చాప్‌ల్‌,ది ఇన్వాల్డెస్‌,పాలిస్ గార్నియ‌ర్‌,క‌న్సియ‌ర్ గెరీ,చాటియ‌న్ డివొర్సెల్స్‌.


14 Dec 2011

venice


భూమిపై ప్ర‌స్తుతం మూడొంతుల భాగం నీరే.ఆ నీరే స‌క‌ల జీవ‌జాలానికి ప్రాణాధారం.కానీ మ‌నుషులు,ఎక్కువ శాతం జీవ‌జాలం భూమ్మీద‌నే జీవిస్తోంది.అయితే రొటిన్‌కు భిన్నంగా వింత అనుభూతులు,స‌రికొత్త ఆనందాల‌ను కోరుకునే మ‌నుషులు చాలా మందే ఉన్నారు.అందుకే నేటికీ నౌకా ప్ర‌యాణాల‌పై మ‌క్కువ చూపేవారు,న‌దులపై బోటు షికార్ల‌ను చేసేవారి సంఖ్య ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.యావ‌జ్జీవిత‌కాల‌మూ ఆ నీటిపైనే ఆవాసాలు ఏర్ప‌రుచుకొని నివ‌సిస్తున్న వారున్నారంటేనే ఆశ్చ‌ర్యం క‌ల్గిస్తోంది..నిజంగా అద్భుత‌మ‌నిపిస్తుంది.ఆ సంభ్ర‌మానికి వేదిక ఇట‌లీలోని వెనిస్ న‌గ‌రం.నీళ్ల‌పై తేలియాడే గొలుసుక‌ట్టు ప్రాంతాల స‌మాహారం ఈ వెనిస్‌.అందుకేనేమో ప్ర‌పంచంలోనే ఎక్కువ మంది ప‌ర్యాట‌కుల‌తో కిట‌కిట‌లాడే న‌గ‌రాల జాబితాలో చోటు ద‌క్కించుకుందిది.
నీటిపై అందాల ఇళ్లు:వెనిస్ న‌గరానికి వెనిజియా అనే పేరూ ఉంది.118 దీవుల స‌ముదాయ‌మిది.అయిదో శ‌తాబ్దంలోనే రూపుదిద్దుకున్న న‌గ‌రం.ఈ వెనిస్ ముఖ‌ద్వారం వ‌ర‌కే రోడ్డు,రైలు,విమానాశ్ర‌య సౌక‌ర్యాలు ఉంటాయి.వెనిస్ నుంచి దీవుల్లోకి ప్ర‌యాణించేందుకు వాట‌ర్ టాక్సీలే ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ఇళ్లు,హోట‌ళ్లు,షాపింగ్ మాల్స్‌,వ‌ర్త‌క‌,వాణిజ్య కార్య‌క‌లాపాల స‌ముదాయాలు త‌దిత‌రాల‌న్నీ నీళ్ల‌పై నిర్మించిన క‌ట్ట‌డాల్లోనే జ‌రుగుతాయి.అక్క‌డ‌క్క‌డ నేల క‌నిపించినా మొత్తం నీళ్లే ప‌రుచుకుని ఉంటాయి.అడ్రియాటిక్ స‌ముద్ర తీర జ‌లాలు,పొ,పేవ్ న‌దీ జ‌లాల ప్ర‌వాహంపై ఏర్పాట‌యిన అత్యంత విలాసవంత‌మైన న‌గ‌రమే వెనిస్‌.ప్ర‌కృతి అందానికే నిర్వ‌చ‌నంగా తేలుతున్న ఈ న‌గ‌రానికి రోడ్డుమార్గం మాత్రం లేదు.అయితేనేం ఎటు చూసినా క‌ళాత్మ‌క‌త ఉట్టిప‌డే క‌ట్ట‌డాలే.వ్యాపార‌,వాణిజ్యాల జోరు అనంత‌మే ఇక్క‌డ‌.మూడు ల‌క్ష‌ల జ‌నాభా ఈ క‌ద‌లాడే న‌గ‌రంపై జీవిస్తున్నారు.అయితే త‌రుచు వీరికి వ‌ర‌ద‌ల బెడ‌దే.ముఖ్యంగా 1966లో వ‌చ్చిన వ‌ర‌ద‌లు వీరికి వీడ‌ని పీడ క‌ల‌నే మిగిల్చాయి.ఆ ఏడాది నీటి మ‌ట్టం 1.94 మీట‌ర్ల మేర పెర‌గ‌డంతో ప‌లు చారిత్ర‌క క‌ట్ట‌డాలు సైతం దెబ్బ‌తిన్నాయి.గ‌డిచిన శ‌తాబ్దం నాటికే ఈ తీర న‌గ‌ర ప్రాంతం 23 సెంటీమీట‌ర్ల మేర కుంగిపోయింద‌ట‌.ఈ న‌గ‌రం నీట మున‌గ‌డానికి ఇక ఎంతో కాలం ప‌ట్ట‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు చాలాకాలంగా హెచ్చ‌రిస్తూనే ఉన్నారు.స్పందించిన ఇట‌లీ ప్ర‌ధాని సిల్వియో బెర్లుస్కోని 2003లో ఎం.ఎస్‌.ఇ ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న చేశారు.పొటెత్తే స‌ముద్ర జ‌లాలు ఈ న‌గ‌రాన్ని త‌న‌లో క‌లిపేసుకోకుండా ప‌టిష్ట‌మైన బేరియ‌ర్స్‌ను ఏర్పాటు చేయ‌డ‌మే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్టు ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది.
క‌ద‌లాడే క‌ట్ట‌డాలు:నీటిపై తేలియాడే ఇళ్లు.. అందులో జ‌నం నివాసం.. ర‌ద్దీగా సాగే వ్యాపార‌,వాణిజ్య కార్య‌క‌లాపాలు.. ప‌ర్యాట‌కుల‌తో సంద‌డి..ఎలా ఇదంతా..? అదే మరీ మాన‌వ‌మేధ సృష్టించిన సంభ్ర‌మం.మెరైన్ ఇంజ‌నీరింగ్ నైపుణ్యం మ‌న‌ముందు ఈ వాస్త‌వాన్ని అందంగా ఆవిష్క‌రించింది.నీటిలో చాలా లోతు వ‌ర‌కు తేలియాడే పైపుల‌ను అమ‌రుస్తారు. ఈ పైపుల‌ను ఒక‌దానికొక‌టి అనుసంధానించి బేస్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తారు. దానిపై క‌ట్ట‌డాల‌ను నిర్మిస్తారు. దాదాపు ఇళ్ల‌న్నింటిని క‌ల‌ప‌తోనే తీర్చిదిద్దుతారు. చూడ్డానికి ఇవి అచ్చం కాంక్రీట్ భ‌వ‌నాల‌నే త‌ల‌పిస్తాయి. మూడు మీట‌ర్ల మేర నీటి ప్ర‌వాహం పెరిగినా ఈ ఇళ్లు ఒరిగిపోవ‌డం లేదా కొట్టుకుపోవ‌డ‌మో జ‌ర‌గ‌దు. ఇళ్లు క‌ద‌లాడ‌తాయి,కానీ లోప‌ల వ‌స్తు సామ‌గ్రికి గానీ జ‌నానికి గాని ఏ మాత్రం కుదుపు ఏర్ప‌డ‌క‌పోవ‌డం విశేషం. స‌ముద్ర ఆట‌పోట్ల ప్ర‌భావం,న‌దుల వ‌ర‌ద‌లు తాకిడి లేకుండా అనేక బేరియ‌ర్ ప్రాజెక్టులను వెనిస్ పాల‌కులు శ‌తాబ్దాల నాడే నిర్మించారు.
క‌ళ‌ల‌కు పుట్టిల్లు : సంగీతంతో స‌మ్మిళిత‌మైంది..క‌ళ‌ల‌కు పుట్టినిల్లు వెనిస్ అని ఘంటాప‌థంగా చెప్పొచ్చు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత వెనిస్ ఫిలిం ఫెస్టివ‌ల్‌నే అందుకు ఉదాహ‌ర‌ణ‌.అంటానియో వివ‌ల్డి జ‌న్మించిందిక్క‌డే.యూర‌ప్‌లోనే ప్ర‌ధాన వాణిజ్య కేంద్రాల్లోను వెనిస్ ఒక‌టి.ఫ్యాష‌న్ ప్ర‌పంచంలోనూ ఈ న‌గ‌రం ఇప్పుడు ముందంజ‌లోనే ఉంది.ఏటా ఇక్క‌డ‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కులు 30 ల‌క్ష‌ల పైమాటే.వెనిస్‌,టెర‌ఫెర్మా,ఫ్రెజియని,మ‌ర్గెరా,పౌడ,ట్రెవిస్ జ‌లావాసాల్లోనే జ‌నం ఉంటున్నారు.ఈ ప్రాంతాల‌న్నీ వెనిస్ న‌గ‌ర పాలిక కింద‌కే వ‌స్తాయి.ఇట‌లీలోని ఈ న‌గ‌రం స్వ‌యంప్ర‌తిప‌త్తి గ‌ల‌ది.మేయ‌ర్ గిర్గియో ఒర్సోని 2010 డిసెంబ‌ర్‌లో అధికారానికి వ‌చ్చారు.మ‌రో 45 మంది స‌భ్యులున్నారు.వీరంద‌రూ గ్రేట్ కౌన్సిల్ కింద‌కు వ‌స్తారు.వీరంద‌రూ సెనెట్‌కు 200 నుంచి 300 మంది ప్ర‌తినిధుల్ని,ఇత‌ర అధికార గ‌ణాన్ని నియ‌మిస్తారు.ప‌ర్యాట‌కులు,స్థానికులు 117 కెనాల్స్ ద్వారా ఇక్క‌డ గ‌ల వివిధ ద్వీపాల‌కు చేరుకుంటుంటారు.330 నౌక‌లు రాక‌పోక‌లు సాగిస్తుంటాయి.3300 మంది సెయిల‌ర్లున్నారు.ఈ వాట‌ర్ సిటీలో వాట‌ర్ టాక్సీలే ప్ర‌ధాన వాహ‌నాలు.ప్ర‌తి ప్రాంతంలో కెనాల్స్‌,వంతెన‌లే ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.ఇందులో పేరొందింది రియ‌ల్టో బ్రిడ్జి.ఇది 14వ శ‌తాబ్దంలోనే నిర్మిత‌మ‌యింది.ఈ ప్రాంతం షాపింగ్‌కు,బొటెక్స్‌కు ప్ర‌సిద్ధి.వెనిస్‌లో భాష వెనెటియ‌న్‌.ప్ర‌ధాన‌మ‌తం రోమ‌న్ కేథ‌లిక్‌.హిందూ,ముస్లిం,బౌద్ధ మ‌తాల‌కు చెందిన వారు నివ‌సిస్తున్నారు.జ‌న‌వ‌రిలో ఉష్ణోగ్ర‌త 2.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది.ఆ త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతాయి.జులై నుంచి ఏడాది చివ‌ర వ‌ర‌కు 22.7 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటాయి.వెనిస్ న‌గ‌ర ముఖ‌ద్వారం వ‌ద్ద మార్కోపోలో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు ఉంది.ఇక్క‌డ నుంచి వెనిస్ ప్ర‌ధాన ద్వీపానికి మార్గం ఉంది.ట్రెవిసోలోగ‌ల విమానాశ్ర‌యం నుంచి వెనిస్‌కు 30 మైళ్ల దూరం. 

13 Dec 2011

veerudu



క్రికెట్..ఇదో  మేనియా. నేడు ప్ర‌పంచ జ‌నాభాలో దాదాపు మూడొంతుల మందిని ఊర్రూత‌లూగించే ఏకైక క్రీడ‌.అన్ని ఖండాల్లోను క్ర‌మ‌క్ర‌మంగా శ‌ర‌వేగంగా ప్రాచుర్యం పొందుతోంద‌న‌డం అతిశ‌యోక్తి కాదు.ఇంగ్లండ్‌లో రూపుదిద్దుకుందీ ఆట‌.1877లోనే ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ్గా 1973లో ఈ రెండు జ‌ట్లే తొలి వ‌న్డే పోటీలోనూ త‌ల‌ప‌డ్డాయి.భార‌త జట్టు 1937లో టెస్టుల్లో,1974లో  వ‌న్డేల్లో అరంగేట్రం చేసింది.ప్ర‌స్తుతం 20-20 మ్యాచ్‌ల హ‌వా కొన‌సాగుతున్నా టెస్టులు,వ‌న్డేల ప్రాధాన్యం య‌థావిధిగా సాగుతోంది.టెస్టుల‌కు కొంత ఆద‌ర‌ణ త‌గ్గినా ఇప్ప‌టికీ రంజుగా సాగే మ్యాచ్‌ల‌కు కొద‌వ లేదు.ఆ క్ర‌మంలోనే రికార్డుల ష‌రా మామూలే.క్రికెట్ అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి.అందులో భాగ‌మే ఇటీవ‌ల డాషింగ్ రేస‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగుల రికార్డు 219ను వెస్టిండీస్‌పై నెల‌కొల్పాడు. టెస్టులో ట్రిపుల్ వ‌న్డేలో డ‌బుల్ సెంచ‌రీ సాధించిన ఏకైక ఆట‌గాడ‌య్యాడు.ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఏదైనా బౌల‌ర్ ఎవ‌రైనా అది టెస్ట‌యినా వ‌న్డే అయినా అస‌లు క్రికెట్‌లో ఏ ఫార్మాట్ అయినా `వీరు`డిది అదే దూకుడే..ఒక్క‌టే బాదుడు.అదే అత‌ని రోల్‌మోడ‌ల్ స‌చిన్ నెల‌కొల్పిన వ‌న్డేల్లో తొలి డ‌బుల్ సెంచ‌రీ రికార్డును ఏడాది తిర‌గ‌క‌ముందే అందుకునేలా చేసింది.
*టెస్టు హోదా పొందిన దేశాలు: ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, భార‌త్‌, పాకిస్థాన్‌, శ్రీ‌లంక‌, జింబాబ్వే, బంగ్లాదేశ్‌. 
ఎవ‌ర్‌గ్రీన్ రికార్డు:ఆస్ట్రేలియాకు చెందిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బ్యాట్స్‌మ‌న్ స‌ర్ డాన్ బ్రాడ్‌మ‌న్ కేవ‌లం 52 టెస్టులాడి స‌గ‌టున 99.94 ప‌రుగుల‌ను సాధించారు.
క్వాడ్ర‌పుల్ సెంచ‌రీ: టెస్టులో 400* రికార్డును సాధించిన ఏకైక ఆట‌గాడు వెస్టిండీస్‌కు చెందిన బ్రియ‌న్‌లారా.2004లో ఇంగ్లండ్‌పై న‌మోదు చేశాడు.
టెస్టుల్లో తొలి 10వేల ప‌రుగులు: సునీల్ గ‌వాస్క‌ర్‌
వ‌న్డేల్లో తొలి 10వేల ప‌రుగులు: స‌చిన్‌టెండుల్క‌ర్‌
వ‌న్డేల్లో తొలి డ‌బుల్ సెంచీరీ: స‌చిన్‌టెండుల్క‌ర్‌
టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీల హీరోలు: డాన్ బ్రాడ్‌మ‌న్‌,వీరేంద్ర సెహ్వాగ్‌,క్రిస్‌గిల్,బ్రియ‌న్‌లారా
ఓవ‌ర్‌లో ఆరు సిక్స్‌లు: 2007 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్‌మ‌న్ హెర్ష‌లీ గిబ్స్ కొట్టాడు.
ఇదే ఫీట్‌ను భార‌త్ ఆట‌గాడు యువ‌రాజ్‌సింగ్ 20-20 మ్యాచ్‌లో సాధించాడు.తొలుత కౌంటీల్లో ఈ ఘ‌న‌త‌ను వెస్టిండీస్‌కు చెందిన స‌ర్‌గ్యారీ సోబ‌ర్స్ సొంతం చేసుకున్నారు.రంజీల్లో భార‌త్‌కే చెందిన ర‌విశాస్త్రి కూడా ఓవ‌ర్లోని ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్ల‌ను కొట్టాడు.
వ‌న్డే గ్రేట్ ఇన్నింగ్స్‌: 
*వీరేంద్ర సెహ్వాగ్‌,భార‌త్‌(219)-2011(వెస్టిండీస్‌పై)
*స‌చిన్ టెండుల్క‌ర్‌,భార‌త్ (200*)-2010(ద‌క్షిణాఫ్రికాపై)
*చార్లెస్ కొవెంట్రి,జింబాబ్వే (194*)-2009(బంగ్లాదేశ్‌పై)
*స‌య్య‌ద్ అన్వ‌ర్‌,పాకిస్థాన్ (194)-1997(ఇండియాపై)
*వివ్ రిచ‌ర్డ్స్‌,వెస్టిండీస్ (189*)-1984 (ఇంగ్లండ్‌పై)
*స‌నత్ జ‌య‌సూర్య,శ్రీ‌లంక (189)-2000(ఇండియాపై)
*గ్యారీకిరిస్టెన్‌,ద‌క్షిణాఫ్రికా (188*)-1996(యూఏఈపై)
*స‌చిన్ టెండుల్క‌ర్‌,భార‌త్ (186*)-1999(న్యూజిలాండ్‌పై)
*షేన్‌వాట్స‌న్,ఆస్ట్రేలియా(185*)-2011(బంగ్లాదేశ్‌పై)
*ధోని,భార‌త్‌(183*)-2005(శ్రీ‌లంక‌పై)
వ‌న్డేల్లో తొలి గ్రేట్ ఇన్నింగ్స్ మాత్రం నిస్సందేహంగా డేర్‌డెవిల్ క‌పిల్‌దే.1983లో జింబాబ్వేపై అస‌లు సిస‌లైన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ను ఆయన ఆడాడు.ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న మూడో ప్ర‌పంచ‌(ప్రుడెన్షియ‌ల్‌)క‌ప్‌లో 17 పరుగుల‌కే భార‌త్ జ‌ట్టు  అయిదు వికెట్ల‌ను కోల్పోగా క‌పిల్‌దేవ్ విరుచుకుప‌డి 175* ప‌రుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు.అదే అప్ప‌టి వ‌ర‌కు వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగుల రికార్డు.ఫ‌లితంగా అండ‌ర్‌డాగ్ పొజిష‌న్‌లో బ‌రిలో దిగిన భార‌త్ క్రికెట్‌లో అప్ప‌టికి అమేయ‌శ‌క్తి అన‌ద‌గ్గ వెస్టిండీస్‌ను ఓడించి వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సాధించ‌గ‌ల్గింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ 28 ఏళ్ల‌కు ధోని సార‌థ్యంలో భార‌త‌జ‌ట్టు రెండోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలుచుకుంది.అంత‌కు ముందు కూడా ధోని కెప్టెన్సీలోనే భార‌త్ జ‌ట్టు తొలి 20-20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను సాధించ‌డం తెలిసిందే.
_______________________________________________________________
* ప్ర‌పంచంలో అతి ఎత్తైన శిఖ‌రం ఎవ‌రెస్టు (8848 అడుగులు)ను తొలిసారిగా అధిరోహించిన వారు:                    ఎడ్మండ్ హిల్ల‌రీ, టెన్జింగ్ నార్గే
* అంత‌రిక్షంలోకి వెళ్లిన తొలి మాన‌వుడు:యూరిగగారిన్
* చంద్రుడిపై అడుగిడిన ప్ర‌థ‌ముడు:నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌

Popular Posts

Wisdomrays