31 Dec 2011
28 Dec 2011
coober pedy
(you can see other posts from this blog, go threw with mozilla firefox/google chrome)
మనిషి గాల్లో,నీటిలో,అంతరిక్షంలోనూ నేడు విహరిస్తున్నాడు.కానీ శాశ్వత నివాసం మాత్రం భూమి పైనే.మరి భూమి లోపల ఇళ్లు కట్టుకొని జీవించడం సాధ్యమేనా?ఈ ప్రశ్నకు కచ్చితంగా అవుననే సమాధానమిస్తున్నారు కూబర్పెడి భూగర్భ పట్టణ వాసులు.నార్తరన్ సౌత్ ఆస్ట్రేలియాలో ఏకంగా ఓ పట్టణమే భూమి అడుగున నిర్మితమయింది.బహుశా ప్రపంచంలోనే ప్రస్తుతం ఇలా భూగర్భంలోగల ఏకైక పట్టణం ఇదేనేమో.ఇది ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత టూరిజం స్పాట్గా కూడా చరిత్ర సృష్టిస్తోంది.


ఉల్లాసాల వాతావరణం: కూబర్పెడిలో ఏడాది పొడవునా వాతావరణం ఆహ్లాదంగానే ఉంటుంది. అది వేసవి కాలమైనా అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెంటీగ్రేడ్ను మించదు. ఇక శీతాకాలమైనా కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెంటీగ్రేడ్కు దిగదు. అయితే ఈ భూగర్భ పట్టణంలో ఓసారి అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా, అత్యల్ప ఉష్ణోగ్రత -2 డిగ్రీలగా నమోదయినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏడాది మొత్తం తేమ శాతం కూడా సమతూకంతోనే ఉంటుందట. ఈ పట్టణంలో ఒక్క గడ్డిపోచ సైతం కనిపించదు.ఒక చెట్టు మాత్రం ఉంది. అది దుక్క ఇనుముతో తయారైనది,ఓ కొండ కొనపై ఇక్కడ కూబర్పెడి పట్టణం ఉందన్న సంకేత సూచికగా అది నిలిచి ఉంది.
వరల్డ్ అండర్గ్రౌండ్ చర్చ్లు:బ్లెస్డ్ కింగ్ చాపెల్(క్రాకౌ,పోలెండ్);కెటకోంబ్ అండర్గ్రౌండ్ చర్చ్(రోమ్,ఇటలీ);సెయింట్ కింగ్స్ చాపెల్;జిపాక్విర్(కొలంబియా,యూఎస్);చర్ఛ్ ఆఫ్ సెయింట్ జాన్(పిక్చరెస్క్యూ,ఫ్రాన్స్).
27 Dec 2011
kangaroo



భాష పేరే ఈ జీవి నామం:ఆస్ట్రేలియాలోని ఓ ప్రాంత భాషైన `గూగు యిమితర` పేరే కంగారూలకు స్థిరపడింది.తొలుత గుంగూరు,తర్వాత కంగూరూ అనంతరం కంగూరూ ఆపై ఇప్పటి పేరు కంగారూగా వీటికి పేరు వచ్చింది.ఈ పదానికి `ఐడోంట్ అండర్స్టాండ్ యూ` అని అర్థం అట.ఇవి 50వేల ఏళ్ల క్రితమే అవతరించాయట.డింగోస్ అయితే అయిదు వేల ఏళ్ల క్రితమే జన్మించినట్లు తెలుస్తోంది.కంగారూల మాంసం చాలా శ్రేష్టమైంది.కొవ్వు శాతం చాలా తక్కువ.కంగారూల మాంసం తినడం ద్వారా బీపీ బాగా తగ్గుతుందట.దాంతో పాటు చర్మం కోసం కూడా వేటగాళ్ల వీటినే లక్ష్యంగా చేసుకుని వేటాడుతుండడంతో అటవీ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది.జెనస్ మెక్రోప్స్,రెడ్ కంగారూ,అంటిలోపైన్,ఈస్ట్రన్ గ్రే,వెస్ట్రన్ గ్రే కంగారూల్లో ప్రధాన రకాలు.స్మాలర్ మైక్రోపాడ్స్ జాతి కంగారూలు ఆస్ట్రేలియాలోనే కాకుండా న్యూగునియాలోనూ కనిపిస్తాయి.

23 Dec 2011
vatican city
![]() |
happy christmas |
పాపులను క్షమించి,బాధల్ని దిగమింగి,శాంతికి ప్రతీకగా నిలిచిన మహనీయుడే ఏసు.నాడు,నేడు,ఏనాడూ ఏసుప్రభువు ఆచరించిన మార్గమే యావత్ మానవాళికి అనుసరణీయం.హిందువులకు తిరుమల,ముస్లింలకు మక్కా ఎలాగో క్రైస్తవులకు వాటికన్ సిటీ అంతే పవిత్రం.అందుకే ప్రపంచ వారసత్వ సంపద స్థలిగా 1997లో యునెస్కో గుర్తింపునకు నోచుకుంది.వరల్డ్లోనే అతి చిన్నదేశమని దీనికి పేరు.కేవలం 0.2 చదరపు మైళ్ల విస్తీర్ణం.వెయ్యిలోపు జనాభా.ఇది ఇటలీ(రోమ్)లో అంతర్భాగం అయినా స్వయంపాలనా యుక్త ప్రాంతం.
vatican city masterpieces:సెయింట్ పీటర్స్ బాసిలిక,సిస్టిన్ చాపెల్,వాటికన్ మ్యూజియమ్స్,అపోస్టోలిక్ ప్యాలెస్(పోప్ నివాసిత ప్రాంతం),ఇంకా వందల కొద్దీ శిల్పాలు,చిత్రరాజాలు కొలువుదీరిన వేదిక.


క్రిస్మస్ సంబరాలు:క్రైస్తవుల పుణ్యక్షేత్రమైన వాటికన్ సిటీలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటుతాయి.1982 నుంచి ఇక్కడ క్రిస్మస్ ట్రీని నెలకొల్పుతున్నారు.ఈ వేడుక పోప్ జాన్పాల్-2 హయాంలోనే తొలిసారిగా ప్రారంభమయింది.ముఖ్యంగా బుధవారాల్లో ఇక్కడకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.వారిలో కొత్తగా పెళ్లైన జంటలే ఎక్కువ.అయితే అన్ని రోజుల్లో పోప్ దర్శనభాగ్యం మాత్రం లభించదు.క్రిస్మస్ వేడుక నాడే పోప్ అభిభాషణ యావత్ ప్రపంచ జనావళికి అందుతుంది.
----------------------------------------------------------------------------------------------------------------
* తెలుగు చిత్ర రంగ ప్రముఖులు త్రిపురనేని మహారథి కన్నుమూశారు.
* ఏపీలో విజయా డైరీ వీటా పేరిట విటమిన్ పాలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
* ఇరాక్(బాగ్దాద్)బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.60 మంది ప్రాణాలు కోల్పోయారు.
* సింగపూర్,ఆస్ట్రేలియాల తరహాలో భారత్లోనూ ప్లాస్టిక్ కరెన్సీని అమల్లోకి తెచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది.
19 Dec 2011
bull fight

స్పెయిన్ బుల్ఫైట్స్: ఈ బుల్ఫైట్స్ 711ఎ.డి నుంచే స్పెయిన్లో జరుగుతున్నాయి.కింగ్ అల్ఫాన్సో-8 రాజ్యాధికారిన్ని చేపట్టిన సందర్భంగా తొలిసారిగా ప్రారంభమయిందీ క్రీడ.ఏడాదిలో మార్చి నుంచి అక్టోబర్ వరకు స్పెయిన్లోని వివిధ రీజియన్లలో పలుచోట్ల ఈ బుల్ఫైట్లు జరుగుతుంటాయి.కొన్నిచోట్ల ఏడాదిలో దాదాపు 10 లక్షల మంది వరకు ఈ బుల్ఫైట్లను తిలకిస్తూ ఆనందిస్తుంటారు.దేశంలో ఏటా 20వేలకు పైగా ఎద్దులు సుమారు మూడు కోట్ల మంది సాక్షిగా ప్రాణాలు వదులుతున్నట్లు ఓ అంచనా.స్పానిష్ స్టయిల్ బుల్ఫైట్కు కొరిడ డిటోర్స్(రన్నింగ్ ఆఫ్ బుల్స్)గాను లాఫీఎస్టా(ది ఫెస్టివల్()గా పేర్లున్నాయి.ఈ సంప్రదాయ క్రీడలో ముగ్గురు టోరోస్( (మెటడోర్లు)చెరో రెండు ఎద్దులతో పోరాడతారు.ఒక్కో టోరో చెరో రెండు ఎద్దులతో తలపడతారు.ఒక్కో టోరోకు ఆరుగురు చొప్పున సహాయకులు ఈ పోరాటంలో తోడ్పడతారు.350కుపైగా కేజీల బరువుతో నాల్గు నుంచి ఆరేళ్ల వయసు గల ఎద్దు కదనరంగంలోకి దూకుతుంది.టోరోకు సహకరించేందుకు ఇద్దరు పికడోర్స్ (అశ్వ యోధులు),ముగ్గురు బాండెరిల్లెర్స్,ఒక మొజోడిఎస్పాడస్((( )(ఖడ్గధారులు)బరిలోకి దిగుతారు.
కత్తితో కడతేరుస్తారు:ప్రస్తుత ఆధునిక క్రీడలో రింగ్లో ఉన్న ఎద్దుపైకి గుర్రాలపై వచ్చిన యోధులు,బుల్ ఫైటర్లు,కత్తితో బుల్ను గాయపరిచే మరో వ్యక్తి మూడు దశల్లో ముప్పేట దాడి చేస్తారు.నగారా మోగ్గానే రింగ్లోకి ఎద్దుతో సహా అందరూ వస్తారు.పోటీ నిర్వాహక అధ్యక్షుడికి అభివాదం చేసి రకరకాలుగా బుల్ను కవ్వించి నృత్యాలు చేసి ఆటను మొదలు పెడతారు.పోటీ ప్రారంభంలోనే ఎద్దును బాగా రెచ్చగొట్టి వ్యూహాన్ని అమలు చేస్తారు.అప్పుడు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన ఎద్దు రింగ్ అంతా పోటీదారులను పరుగులు పెట్టేలా తరుముతుంది.ఆ సమయంలో గుర్రాలను సైతం కుమ్మేసేందుకు ఎద్దు ప్రయత్నిస్తుంది.1930 వరకు ఉన్న నిబంధనల ప్రకారం గుర్రాలపై రక్షకులు లేకపోవడంతో అంతకుముందు వరకు పలు పోటీల్లో వందల కొద్దీ గుర్రాలు సైతం ఎద్దు కొమ్ములకు బలయ్యేవి.ఈ క్రీడలో రెచ్చిపోయిన ఎద్దులు రింగ్ లోపలే కాకుండా స్టేడియం గ్యాలరీల్లోకి దూసుకొచ్చినప్పుడు ప్రేక్షకులు కూడా గాయపడ్డ ఘటనలు ఎన్నో ఉన్నాయి.2010 ఆగస్టులో నార్తరన్ స్పెయిన్ లొఫల్లాలో జరిగిన ఇలాంటే ఘటనలోనే పదేళ్ల బాలుడు సహా మొత్తం 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నిషేధాస్త్రం..:స్టేడియంలో ప్రేక్షకులు ఉత్కంఠతో ఉల్లాసంగా గడుపుతుంటే రింగ్లోని ఎద్దు మాత్రం రోషంతోనే రొప్పుతూ ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటుంది.అప్పుడు ఎర్రటి గుడ్డను దాని కళ్లెదుట ఊపుతూ మళ్లీ రెచ్చగొడతారు.నిజానికి బుల్స్ కలర్ బ్లైండెడ్.అవి రంగుల్ని గుర్తించలేవు.బరిలో ఎద్దును బాగా అలసిపోయే వరకు ఆ విధంగా ఆడించి పరుగులు పెట్టించి గాయపరిచి అది రక్తమోడుతూ నేలకూలాక పదునైన పెద్ద కత్తితో నరికేస్తారు.బాగా గాయపడి రింగ్లో రక్తం ధారకడుతున్నా ఇంకా కదనానికి కాలుదువ్వే ఎద్దును నిర్వాహక అధ్యక్షుడు విజేతగా ప్రకటించే అవకాశమూ ఉంది.అప్పుడు మాత్రమే ఆ బుల్ మళ్లీ ప్రాణాలతో రింగ్ బయటకు రాగల్గుతుంది.
ఇదో ఆటవిక క్రీడ అంటూ దీర్ఘకాలంగా జంతు ప్రేమికులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు.ఒక్క స్పెయిన్లోనే కాదు ఈ వికృత క్రీడ పోర్చుగల్,లాటిన్ అమెరికా దేశాలైన అమెరికా,పెరూ,కొలంబియా,వెనెజువెలా,ఈక్వెడర్ల్లోనూ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది.భారత్లోని తమిళనాడు(మదురై)లో జల్లికట్టు పేరిట ఈ బుల్ఫైట్ను సంప్రదాయ క్రీడగా ఆచరిస్తున్నారు.అయితే సంక్రాంతి సంబరంగా గ్రామాల్లో జరిగే ఈ బుల్ఫైట్లో ఎద్దుతో నిరాయుధులు మాత్రమే తలపడతారు.ఎద్దుకు ఏ హాని తలపెట్టరు,దాన్ని చంపరు.ప్రస్తుతం ఆయా దేశాల్లో ఈ వికృత క్రీడను నిషేధించారు.1991లో స్పెయిన్లో ఈ బుల్ఫైట్ను తొలుత నిషేధించిన రీజియన్ కెనరీ ఐలాండ్.2012 నుంచి కెటలోనియా రీజియన్లో కూడా ఈ క్రీడపై నిషేధం అమల్లోకి రానుంది.
-------------------------------------------------------------------------------------------------------------
*భారతరత్న అవార్డుల జాబితాలోకి కళలు,సాహిత్యం,సేవా,ఇతర రంగాలతోపాటు క్రీడా రంగాన్ని చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మొరదాబాద్ ప్రస్తుత ఎంపీ(కాంగ్రెస్) ప్రముఖ క్రికెటర్ అజరుద్దీన్ స్వాగతించారు.భారతరత్న అవార్డును హాకీ దిగ్గజం లెజెండ్ ధ్యాన్చంద్,మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్లకు ఇవ్వాలని ఆయన కోరారు.గతంలోనే భారతరత్న గానకోకిల లతామంగేష్కర్ ఈ అవార్డును సచిన్కు ప్రదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.మేజర్ ధ్యాన్చంద్ జన్మించిన ఆగస్టు 29వ తేదీనే ఆయన సంస్మరణార్థం భారత్లో జాతీయక్రీడా దినోత్సవం జరుగుతోంది.
*మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొన్న వాసుకి సుంకవల్లి నిర్వహించిన షోలో ఎ.పి సమాచారశాఖ మంత్రి డి.కె.అరుణ ఓ అనాథ బాలికతో కలిసి ర్యాంప్వాక్ చేశారు.2003లో రాజస్థాన్ అప్పటి సి.ఎం వసుంధర రాజే సింధియా కూడా ఓ కార్యక్రమానికి హాజరై ర్యాంప్వాక్లో పాల్గొన్నారు.
16 Dec 2011
eiffel tower
ఐరన్ ఐకాన్:ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుండే 324 మీటర్ల ఎత్తుగల ఈ ఐఫెల్ టవర్ 20వేల పెద్ద ఇనుప దిమ్మెలు,30 లక్షల రివెట్లతో నిర్మితమయింది.ఆరేడేళ్లకోసారి ఈ నిర్మాణానికి తుప్పు పట్టకుండా ఉండేందుకు పెయింట్ వేస్తుంటారు.అందుకు అయిదు టన్నులకు పైగా పెయింట్ను వినియోగిస్తారు.ఈ టవర్ శిఖరం నుంచి చూస్తే పారిస్లోని ప్రతి అంగుళం అందం కనిపిస్తుంది.సంధ్యవేళ మిరుమిట్లను వెదజల్లే దీపపు కాంతులతో ఐఫెల్ టవర్ దేదీప్యమానంగా వెలిగిపోతూ సందర్శకుల మదిని దోచుకుంటుంది.న్యూయార్క్లో క్రిస్లెర్ బిల్డింగ్ నిర్మితమయ్యే వరకు అంటే 1930 వరకు ఐఫెల్ టవరే ప్రపంచపు మానవ నిర్మిత కట్టడాలన్నింటిలోకెల్లా అతి ఎత్తైయినది.41 ఏళ్ల పాటు ఆ హోదాను నిలుపుకుంది.1957లో ఫ్రాన్స్లో మిలౌవయుడక్ట్ నిర్మాణమయ్యే వరకు దేశంలో ఎత్తైన కట్టడాల్లో ప్రథమ స్థానంలో ఉంది.తొలుత ఈ టవర్ను 20 ఏళ్ల అనంతరం తొలగించాలనుకున్నా మొదటి ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి సంకేతంగా దీన్ని యథావిధిగా కొనసాగించాలని ఫ్రెంచ్ పాలకులు నిర్ణయించారు.యూరప్కొచ్చే పర్యాటకులు దాదాపు అందరూ పారిస్ను సందర్శిస్తుంటారు.వారు ఐఫెల్ టవర్ను ఎక్కితేనే తమ పర్యటన పరిపూర్ణమయినట్లుగా భావిస్తారు.ఇక్కడ షాపింగ్,సెనె నదిలో విహారాన్ని తమ జీవితకాలంపాటు మధురానుభూతిగా తలుస్తుంటారు.
సందర్శించిన ప్రముఖులు:లియొనిడ్ బ్రెజ్నెవ్,మైఖెల్ గోర్బొచేవ్, ఫెడల్ కాస్ట్రో,బిల్ క్లింటన్,వాస్టాక్ హెవల్ తదితరులు ఈ టవర్ను సందర్శించారు.

పారిస్ సైట్ సీయింగ్ ఎట్రాక్షన్స్:నొటర్ డ్యామ్ కేథెడ్రల్,అర్కెడ్ ట్రమ్పే,బాసిలిక్ డుస్ర్కె కొయర్,బాస్టిల్లె,చాంప్స్ క్లిసీస్,కాంకర్డ్ స్క్వేర్,సేక్రెడ్ హార్ట్ మాంట్ మార్టె,సెయింట్ చాప్ల్,ది ఇన్వాల్డెస్,పాలిస్ గార్నియర్,కన్సియర్ గెరీ,చాటియన్ డివొర్సెల్స్.
14 Dec 2011
venice

నీటిపై అందాల ఇళ్లు:వెనిస్ నగరానికి వెనిజియా అనే పేరూ ఉంది.118 దీవుల సముదాయమిది.అయిదో శతాబ్దంలోనే రూపుదిద్దుకున్న నగరం.ఈ వెనిస్ ముఖద్వారం వరకే రోడ్డు,రైలు,విమానాశ్రయ సౌకర్యాలు ఉంటాయి.వెనిస్ నుంచి దీవుల్లోకి ప్రయాణించేందుకు వాటర్ టాక్సీలే ఉపయోగపడతాయి.ఇళ్లు,హోటళ్లు,షాపింగ్ మాల్స్,వర్తక,వాణిజ్య కార్యకలాపాల సముదాయాలు తదితరాలన్నీ నీళ్లపై నిర్మించిన కట్టడాల్లోనే జరుగుతాయి.అక్కడక్కడ నేల కనిపించినా మొత్తం నీళ్లే పరుచుకుని ఉంటాయి.అడ్రియాటిక్ సముద్ర తీర జలాలు,పొ,పేవ్ నదీ జలాల ప్రవాహంపై ఏర్పాటయిన అత్యంత విలాసవంతమైన నగరమే వెనిస్.ప్రకృతి అందానికే నిర్వచనంగా తేలుతున్న ఈ నగరానికి రోడ్డుమార్గం మాత్రం లేదు.అయితేనేం ఎటు చూసినా కళాత్మకత ఉట్టిపడే కట్టడాలే.వ్యాపార,వాణిజ్యాల జోరు అనంతమే ఇక్కడ.మూడు లక్షల జనాభా ఈ కదలాడే నగరంపై జీవిస్తున్నారు.అయితే తరుచు వీరికి వరదల బెడదే.ముఖ్యంగా 1966లో వచ్చిన వరదలు వీరికి వీడని పీడ కలనే మిగిల్చాయి.ఆ ఏడాది నీటి మట్టం 1.94 మీటర్ల మేర పెరగడంతో పలు చారిత్రక కట్టడాలు సైతం దెబ్బతిన్నాయి.గడిచిన శతాబ్దం నాటికే ఈ తీర నగర ప్రాంతం 23 సెంటీమీటర్ల మేర కుంగిపోయిందట.ఈ నగరం నీట మునగడానికి ఇక ఎంతో కాలం పట్టదని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు.స్పందించిన ఇటలీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని 2003లో ఎం.ఎస్.ఇ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.పొటెత్తే సముద్ర జలాలు ఈ నగరాన్ని తనలో కలిపేసుకోకుండా పటిష్టమైన బేరియర్స్ను ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ముగింపు దశకు వచ్చింది.


13 Dec 2011
veerudu
క్రికెట్..ఇదో మేనియా. నేడు ప్రపంచ జనాభాలో దాదాపు మూడొంతుల మందిని ఊర్రూతలూగించే ఏకైక క్రీడ.అన్ని ఖండాల్లోను క్రమక్రమంగా శరవేగంగా ప్రాచుర్యం పొందుతోందనడం అతిశయోక్తి కాదు.ఇంగ్లండ్లో రూపుదిద్దుకుందీ ఆట.1877లోనే ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగ్గా 1973లో ఈ రెండు జట్లే తొలి వన్డే పోటీలోనూ తలపడ్డాయి.భారత జట్టు 1937లో టెస్టుల్లో,1974లో వన్డేల్లో అరంగేట్రం చేసింది.ప్రస్తుతం 20-20 మ్యాచ్ల హవా కొనసాగుతున్నా టెస్టులు,వన్డేల ప్రాధాన్యం యథావిధిగా సాగుతోంది.టెస్టులకు కొంత ఆదరణ తగ్గినా ఇప్పటికీ రంజుగా సాగే మ్యాచ్లకు కొదవ లేదు.ఆ క్రమంలోనే రికార్డుల షరా మామూలే.క్రికెట్ అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాయి.అందులో భాగమే ఇటీవల డాషింగ్ రేసర్ వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు 219ను వెస్టిండీస్పై నెలకొల్పాడు. టెస్టులో ట్రిపుల్ వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడయ్యాడు.ప్రత్యర్థి జట్టు ఏదైనా బౌలర్ ఎవరైనా అది టెస్టయినా వన్డే అయినా అసలు క్రికెట్లో ఏ ఫార్మాట్ అయినా `వీరు`డిది అదే దూకుడే..ఒక్కటే బాదుడు.అదే అతని రోల్మోడల్ సచిన్ నెలకొల్పిన వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ రికార్డును ఏడాది తిరగకముందే అందుకునేలా చేసింది.

ఎవర్గ్రీన్ రికార్డు:ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్మన్ సర్ డాన్ బ్రాడ్మన్ కేవలం 52 టెస్టులాడి సగటున 99.94 పరుగులను సాధించారు.
క్వాడ్రపుల్ సెంచరీ: టెస్టులో 400* రికార్డును సాధించిన ఏకైక ఆటగాడు వెస్టిండీస్కు చెందిన బ్రియన్లారా.2004లో ఇంగ్లండ్పై నమోదు చేశాడు.
టెస్టుల్లో తొలి 10వేల పరుగులు: సునీల్ గవాస్కర్
వన్డేల్లో తొలి 10వేల పరుగులు: సచిన్టెండుల్కర్
వన్డేల్లో తొలి డబుల్ సెంచీరీ: సచిన్టెండుల్కర్
టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీల హీరోలు: డాన్ బ్రాడ్మన్,వీరేంద్ర సెహ్వాగ్,క్రిస్గిల్,బ్రియన్లారా
ఓవర్లో ఆరు సిక్స్లు: 2007 వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ హెర్షలీ గిబ్స్ కొట్టాడు.
ఇదే ఫీట్ను భారత్ ఆటగాడు యువరాజ్సింగ్ 20-20 మ్యాచ్లో సాధించాడు.తొలుత కౌంటీల్లో ఈ ఘనతను వెస్టిండీస్కు చెందిన సర్గ్యారీ సోబర్స్ సొంతం చేసుకున్నారు.రంజీల్లో భారత్కే చెందిన రవిశాస్త్రి కూడా ఓవర్లోని ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను కొట్టాడు.
వన్డే గ్రేట్ ఇన్నింగ్స్:
*వీరేంద్ర సెహ్వాగ్,భారత్(219)-2011(వెస్టిండీస్పై)
*సచిన్ టెండుల్కర్,భారత్ (200*)-2010(దక్షిణాఫ్రికాపై)
*చార్లెస్ కొవెంట్రి,జింబాబ్వే (194*)-2009(బంగ్లాదేశ్పై)
*సయ్యద్ అన్వర్,పాకిస్థాన్ (194)-1997(ఇండియాపై)
*వివ్ రిచర్డ్స్,వెస్టిండీస్ (189*)-1984 (ఇంగ్లండ్పై)
*సనత్ జయసూర్య,శ్రీలంక (189)-2000(ఇండియాపై)
*గ్యారీకిరిస్టెన్,దక్షిణాఫ్రికా (188*)-1996(యూఏఈపై)
*సచిన్ టెండుల్కర్,భారత్ (186*)-1999(న్యూజిలాండ్పై)
*షేన్వాట్సన్,ఆస్ట్రేలియా(185*)-2011(బంగ్లాదేశ్పై)
*ధోని,భారత్(183*)-2005(శ్రీలంకపై)
వన్డేల్లో తొలి గ్రేట్ ఇన్నింగ్స్ మాత్రం నిస్సందేహంగా డేర్డెవిల్ కపిల్దే.1983లో జింబాబ్వేపై అసలు సిసలైన కెప్టెన్సీ ఇన్నింగ్స్ను ఆయన ఆడాడు.ఇంగ్లండ్లో జరుగుతున్న మూడో ప్రపంచ(ప్రుడెన్షియల్)కప్లో 17 పరుగులకే భారత్ జట్టు అయిదు వికెట్లను కోల్పోగా కపిల్దేవ్ విరుచుకుపడి 175* పరుగులు చేసి మ్యాచ్ను గెలిపించాడు.అదే అప్పటి వరకు వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు.ఫలితంగా అండర్డాగ్ పొజిషన్లో బరిలో దిగిన భారత్ క్రికెట్లో అప్పటికి అమేయశక్తి అనదగ్గ వెస్టిండీస్ను ఓడించి వరల్డ్ కప్ను సాధించగల్గింది. ఆ తర్వాత మళ్లీ 28 ఏళ్లకు ధోని సారథ్యంలో భారతజట్టు రెండోసారి ప్రపంచకప్ను గెలుచుకుంది.అంతకు ముందు కూడా ధోని కెప్టెన్సీలోనే భారత్ జట్టు తొలి 20-20 వరల్డ్కప్ను సాధించడం తెలిసిందే.
_______________________________________________________________
* ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఎవరెస్టు (8848 అడుగులు)ను తొలిసారిగా అధిరోహించిన వారు: ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే
* అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడు:యూరిగగారిన్
* చంద్రుడిపై అడుగిడిన ప్రథముడు:నీల్ ఆర్మ్స్ట్రాంగ్
11 Dec 2011
swan
ప్రకృతిలో ప్రతి ప్రాణి ఏదో ఒక శక్తిని కల్గినదే.అందుకే ఈ ఆధునిక కాలంలోనూ మనిషి జంతువులపై ఆధారపడుతున్నాడు.ముఖ్యంగా పాతిపెట్టిన బాంబులు ఇతర పేలుడు పదార్థాలను కనుగొనేందుకు ఇప్పటికీ స్నిఫర్ డాగ్లను భద్రతా దళాలు వినియోగిస్తున్నాయి.అంతేందుకు ప్రకృతి విలయాల్ని మనుషుల కంటే ఎంతోముందుగా పసిగట్టి జంతువులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ప్రయత్నించడం మనకు తెలిసిందే.ముఖ్యంగా భూకంపాలు,తుపాన్లు,సునామీలు సంభవించనున్న సమయాల్లో పక్షులు,ఇతర మూగజీవాల అసహజ ప్రవర్తనలు ఆ కోవలోనివే.ఆ తరహా ఆపదలు జరిగిన తర్వాత ఆ జీవాల ప్రవర్తనను గుర్తు చేసుకున్నాకే మనకు ఈ విషయం బోధపడింది.అలాగే పాలను నీళ్లను వేరు చేసే హంస జాతి పక్షులు ఒకప్పుడు భారత్లో ఉండేవట.ఇప్పుడు మచ్చుకు కూడా ఆ హంసలు ప్రపంచంలో ఏమూలా లేవు.



-------------------------------------------------------------------------------------------------------------
*సహజకవి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎం.ఎస్.రెడ్డి(87)అనారోగ్యంతో హైదరాబాద్లోని తన స్వగృహంలో క(పె)న్నుమూశారు.తన ఇంటిపేరు మల్లెమాలనే కలం పేరుగా చేసుకుని ఆయన ఎన్నో కవితలల్లారు,పలు రచనలు చేశారు.సినిమాల్లో పాటలను రాశారు.హెచ్.ఎం.టి.వి సీఈఓ, ప్రఖ్యాత సంపాదకులు కె.రామచంద్రమూర్తికిచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎం.ఎస్.రెడ్డి ఏకలవ్యుడికి విలువిద్యాభ్యాసంలో గురువులేనట్లే కవిత్వంలో తనకు గురువు ఎవ్వరూ లేరని చెప్పారు.కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఓ సభలో మల్లెమాల కవిత్వానికి ఆశ్చర్యపోయి `ఎక్కడున్నావయ్యా మహాకవి ఇన్నాళ్లు` అనడమే తనకు గర్వకారణమైన ప్రశంసని ఎం.ఎస్.రెడ్డి తెలిపారు.
5 Dec 2011
babaji
http://royalloyal007.blogspot.in/2012/09/t-hunts-down-d.html
శరీరం అశాశ్వతం..ఆత్మ శాశ్వతం..ఇది సర్వుల విశ్వాసం.జన్మించిన వారికి మరణం తప్పదు.మరణించిన వారికి జననం తప్పదు అనేది గీతాసారం.అయితే చిరంజీవులు ఉండరా?హనుమంతుడు చిరంజీవి..హిమాలయాల్లో ఇంకా తపస్సులో నిమగ్నమై ఉన్నాడన్నది పురాణాల ఆధారంగా హిందువుల్లో అత్యధిక సంఖ్యాకుల నమ్మిక.నమ్మకం మనిషికో ఆయుధం.ఇతరులకు భంగకరం కానంతవరకు,అది మూఢ నమ్మకంగా పెడదారి పట్టనంతకాలం ఎవరైనా ఆచరించవచ్చు.ఆ కోవలోనే ఇప్పటికీ రెండువేల ఏళ్లగా మహావతార బాబాజీ సజీవంగా విరాజిల్లుతున్నట్లు భావించేవారు ఉన్నారు.ఏ విశ్వాసమైనా మతాసారమైనా ఒక్కటే మంచిని పెంచడం,శాంతిని స్థాపించడమే.సృష్టి ఉన్నప్పటి నుంచి సైన్స్ ఉంది.సాధన,శోధన అనే క్రమంలో అది కొనసాగుతూనే ఉంది.సూర్యచంద్రాదులున్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది.నిన్నటి సిద్ధాంతం రేపటిరోజున తప్పుకావచ్చు.నిన్నటి పరిశోధనలు నేటికి నిజంగా చలామణి అవ్వొచ్చు.భవిష్యత్లో మరో శోధన ఇదే కచ్చితం అంటూ నిరూపించవచ్చు.అయితే ఏదీ పరిపూర్ణం కాదు.సైన్స్ పరిభ్రమణంలో అవన్నీ దశలు.అందుకే ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు,వైద్యాచార్యులు సైతం మిస్టరీలను కొట్టివేయడం లేదు.అద్భుతాలను కాదంటూ బల్లగుద్దడం లేదు.ప్రపంచంలో మొత్తం మానవాళి ఇంకా పాత,కొత్త విషయాలను తెలుసుకొనే ప్రయత్నంలోనే ముందుకు వెళ్తోంది.
బాబాజీ:భారతదేశానికి పెట్టని కోటయిన హిమాలయాల్లో రెండువేల ఏళ్లగా జీవిస్తున్న యోగి ఈ మహావతార బాబాజీ.నిత్య యవ్వనుడు.చిరంజీవి.మహాకాయ బాబాజీగానూ భక్తులు పిలుచుకుంటారు.`క్రియా యోగ`ప్రదాత.మెడలో రుద్రాక్షలు,ఒళ్లంతా పులిమినట్లు కన్పించే బూడిద,నుదుటిన కుంకుమబొట్టు..ఆకర్షణీయమైన ముఖవర్చస్సు,వెలుగులు విరజిమ్మే నేత్రాలతో పద్మాసన ముద్రలో దర్శనమిస్తారని హిమాలయ సాణువులకు వెళ్లే సాధువులు,రుషులు,పరమ భక్తులు విశ్వసిస్తుంటారు.బద్రీనాథ్కు ఎగువున గల శిఖరాల్లో బాబాజీని ఆర్తిగా స్మరిస్తే ఆ దివ్య పురుషుడు దర్శనం లభిస్తుందట.మనకు దగ్గర్లోనే ఆ స్వామి కొలువున్నట్లు అనిపిస్తుంది.ఎంత నడిచినా ఆ యోగి దరికి మాత్రం చేరలేమట.ఇంతకు ముందు మనకు కనిపించినంతటి దూరంలోనే ఉండి బాబాజీ ఆశీర్వదిస్తున్నట్లు భావన కల్లుతుందట.ఈ విశ్వాసం తరతరాలుగా వేల ఏళ్లుగా హిమాలయ శిఖరాల్లో సంచరించే సాధువులు,బాబాలు,యోగుల్లో ఉంది.ఇప్పటికీ చాలామంది భక్తులు నమ్ముతారు.సౌత్ ఇండియా సూపర్స్టార్ రజనీకాంత్ బాబాజీ ఉనికిని బలంగా నమ్మే వారిలో ఒకరు.ఎంతగానంటే ఏడాదికో రెండేళ్లకోసారి ఆయన దాదాపు ఆరునెలలు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు.ఎక్కడుంటారంటే నెలల తరబడి హిమాలయాల్లోనే బాబాజీ ధ్యానంలోనే గడుపుతారు.ఆ బాబాజీ పేరు మీద ఏకంగా ఆయన బాబా అనే సినిమాను కూడా చిత్రీకరించారు.
యోగా-చిరంజీవి: యోగా సాధన ఆరోగ్యదాయకం.తద్వారా జీవన ప్రమాణం పెరిగే అవకాశముంది.హిమాలయాల్లో స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ఆశ్రమ జీవనం గడపడం,సంజీవిని తరహా ఔషధ మొక్కలు,వనమూలికలు,పండ్లు,కందమూలాలతో కూడిన ఆహారం తమను చిరంజీవుల్ని చేస్తుందంటారు యోగులు.స్థిరచిత్తం,స్థితప్రజ్ఞతలు కూడా వారి జీవనానికి వరాలే.అందుకే వందల ఏళ్లు జీవించే బాబాలు,యోగినులకెందరికో హిమాలయాలు వేదిక.పరమహంస యోగానంద తన `యోగి`అనే పుస్తకంలో బాబాజీ గురించి పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు.క్రియా యోగాలయాన్ని నిర్వహిస్తున్న కెనడాకు చెందిన మార్షల్ గోవిందన్ కూడా తను రాసిన పలు పుస్తకాల్లో ఎన్నో అద్భుత,కొత్త విషయాల్ని పేర్కొన్నారు.ఆరోగ్యపరిరక్షణకు యోగా చక్కని వనరు.ఆయుర్వేదం భారత్కు చెందిన ప్రాచీన వైద్యవిధానం.ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నివారిణి.ప్రపంచవ్యాప్తంగా రోగపీడితులకు అమృత తుల్యంగా మన్ననలు పొందుతోంది.ఇక హిమాలయాల్లో వనమూలికలకు కొదవుండదని అందుకే అక్కడ యోగులు చిరంజీవులుగా ఉండడం సాధ్యమేనని వివిధ సదస్సుల్లో సదస్స్యులు అభిప్రాయపడ్డారు.బాబాజీ ప్రభావం ఆదిశంకరాచార్య,కబీర్,షిర్డీసాయిబాబా,గజానన మహరాజ్,స్వామి సమర్తా తదితరులపైన ఉందని కాలిఫోర్నియాలో జరిగిన ఓ అధ్యాత్మిక సదస్సులో కొందరు తమ భావనగా పేర్కొన్నారు.మహాత్మాగాంధీ,పండిట్ జవహర్లాల్ నెహ్రూ తదితర ప్రముఖులెందరికో వైద్యం చేసిన డాక్టర్ రామ్బోస్లే(బొంబాయి)బాబాజీకి పరమభక్తులు.విదేశాల్లో జరిగిన 160కు పైగా సదస్సుల్లో పాల్గొన్న ఆయన బాబాజీకి సంబంధించి తనకు గల అనేక అనుభూతుల్ని వివిధ వేదికలపై పంచుకున్నారు.బాబాజీ అద్వితీయమైన మహాపురుషుడిగా పలు పత్రాలు,పుస్తకాల్లో పేర్కొన్నారు.
-------------------------------------------------------------------------------
* జీవన ప్రమాణం:భారత్లో జీవనప్రమాణం 64 ఏళ్లు.
(మనిషి నూరేళ్లు జీవిస్తాడంటారు.వందేళ్లకు పైగా బతికిన వాళ్లు,ప్రస్తుతం బతుకుతున్న వాళ్లు ప్రపంచం నలుమూలలా ఇప్పటికీ కొందరున్నారు.అలాగే భారత్లో కూడా ఉన్నారు.)
శరీరం అశాశ్వతం..ఆత్మ శాశ్వతం..ఇది సర్వుల విశ్వాసం.జన్మించిన వారికి మరణం తప్పదు.మరణించిన వారికి జననం తప్పదు అనేది గీతాసారం.అయితే చిరంజీవులు ఉండరా?హనుమంతుడు చిరంజీవి..హిమాలయాల్లో ఇంకా తపస్సులో నిమగ్నమై ఉన్నాడన్నది పురాణాల ఆధారంగా హిందువుల్లో అత్యధిక సంఖ్యాకుల నమ్మిక.నమ్మకం మనిషికో ఆయుధం.ఇతరులకు భంగకరం కానంతవరకు,అది మూఢ నమ్మకంగా పెడదారి పట్టనంతకాలం ఎవరైనా ఆచరించవచ్చు.ఆ కోవలోనే ఇప్పటికీ రెండువేల ఏళ్లగా మహావతార బాబాజీ సజీవంగా విరాజిల్లుతున్నట్లు భావించేవారు ఉన్నారు.ఏ విశ్వాసమైనా మతాసారమైనా ఒక్కటే మంచిని పెంచడం,శాంతిని స్థాపించడమే.సృష్టి ఉన్నప్పటి నుంచి సైన్స్ ఉంది.సాధన,శోధన అనే క్రమంలో అది కొనసాగుతూనే ఉంది.సూర్యచంద్రాదులున్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది.నిన్నటి సిద్ధాంతం రేపటిరోజున తప్పుకావచ్చు.నిన్నటి పరిశోధనలు నేటికి నిజంగా చలామణి అవ్వొచ్చు.భవిష్యత్లో మరో శోధన ఇదే కచ్చితం అంటూ నిరూపించవచ్చు.అయితే ఏదీ పరిపూర్ణం కాదు.సైన్స్ పరిభ్రమణంలో అవన్నీ దశలు.అందుకే ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు,వైద్యాచార్యులు సైతం మిస్టరీలను కొట్టివేయడం లేదు.అద్భుతాలను కాదంటూ బల్లగుద్దడం లేదు.ప్రపంచంలో మొత్తం మానవాళి ఇంకా పాత,కొత్త విషయాలను తెలుసుకొనే ప్రయత్నంలోనే ముందుకు వెళ్తోంది.

యోగా-చిరంజీవి: యోగా సాధన ఆరోగ్యదాయకం.తద్వారా జీవన ప్రమాణం పెరిగే అవకాశముంది.హిమాలయాల్లో స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ఆశ్రమ జీవనం గడపడం,సంజీవిని తరహా ఔషధ మొక్కలు,వనమూలికలు,పండ్లు,కందమూలాలతో కూడిన ఆహారం తమను చిరంజీవుల్ని చేస్తుందంటారు యోగులు.స్థిరచిత్తం,స్థితప్రజ్ఞతలు కూడా వారి జీవనానికి వరాలే.అందుకే వందల ఏళ్లు జీవించే బాబాలు,యోగినులకెందరికో హిమాలయాలు వేదిక.పరమహంస యోగానంద తన `యోగి`అనే పుస్తకంలో బాబాజీ గురించి పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు.క్రియా యోగాలయాన్ని నిర్వహిస్తున్న కెనడాకు చెందిన మార్షల్ గోవిందన్ కూడా తను రాసిన పలు పుస్తకాల్లో ఎన్నో అద్భుత,కొత్త విషయాల్ని పేర్కొన్నారు.ఆరోగ్యపరిరక్షణకు యోగా చక్కని వనరు.ఆయుర్వేదం భారత్కు చెందిన ప్రాచీన వైద్యవిధానం.ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నివారిణి.ప్రపంచవ్యాప్తంగా రోగపీడితులకు అమృత తుల్యంగా మన్ననలు పొందుతోంది.ఇక హిమాలయాల్లో వనమూలికలకు కొదవుండదని అందుకే అక్కడ యోగులు చిరంజీవులుగా ఉండడం సాధ్యమేనని వివిధ సదస్సుల్లో సదస్స్యులు అభిప్రాయపడ్డారు.బాబాజీ ప్రభావం ఆదిశంకరాచార్య,కబీర్,షిర్డీసాయిబాబా,గజానన మహరాజ్,స్వామి సమర్తా తదితరులపైన ఉందని కాలిఫోర్నియాలో జరిగిన ఓ అధ్యాత్మిక సదస్సులో కొందరు తమ భావనగా పేర్కొన్నారు.మహాత్మాగాంధీ,పండిట్ జవహర్లాల్ నెహ్రూ తదితర ప్రముఖులెందరికో వైద్యం చేసిన డాక్టర్ రామ్బోస్లే(బొంబాయి)బాబాజీకి పరమభక్తులు.విదేశాల్లో జరిగిన 160కు పైగా సదస్సుల్లో పాల్గొన్న ఆయన బాబాజీకి సంబంధించి తనకు గల అనేక అనుభూతుల్ని వివిధ వేదికలపై పంచుకున్నారు.బాబాజీ అద్వితీయమైన మహాపురుషుడిగా పలు పత్రాలు,పుస్తకాల్లో పేర్కొన్నారు.
-------------------------------------------------------------------------------
* జీవన ప్రమాణం:భారత్లో జీవనప్రమాణం 64 ఏళ్లు.
(మనిషి నూరేళ్లు జీవిస్తాడంటారు.వందేళ్లకు పైగా బతికిన వాళ్లు,ప్రస్తుతం బతుకుతున్న వాళ్లు ప్రపంచం నలుమూలలా ఇప్పటికీ కొందరున్నారు.అలాగే భారత్లో కూడా ఉన్నారు.)
2 Dec 2011
big frog

నిద్ర పోని జీవి:బుల్ప్రాగ్ అస్సలు నిద్రే పోదు.ఇలాంటి జీవి భూమ్మీద బహు అరుదేనని చెప్పాలి.చేపలు కళ్లు తెరుచుకొనే నిద్రపోతాయి.వాటికి కనుపాపలు కూడా ఉండవు.కేవలం ఒక్కరోజే జీవించే కొన్ని కీటకాలకు కూడా నిద్ర,విశ్రాంతి తదితరాల అవసరం ఎలాగూ లేదు.వేల్స్,డాల్ఫిన్స్ల్లోని మెదడులో సగభాగం మాత్రమే నిద్రపోతుంది.మిగిలిన సగభాగం ఊపిరి తీసుకొనే క్రమంలో నిమగ్నమవుతుంది.ఇక రోజులో ఏకధాటిగా 20మైళ్లు ఈదగల సామర్థ్యం ఉన్న ఏనుగుల నిద్రా సమయం కేవలం నాలుగ్గంటలే.అదీ దఫదఫాలుగానే నిద్రపోతాయి.నత్తలయితే ఒకసారి నిద్రకు ఉపక్రమిస్తే నాల్గేళ్ల వరకు కూడా అదే విశ్రాంతి దశలో ఉండిపోగలవు.సల్మన్,పైక్,గోల్డ్ఫిష్,యాంగర్ ఫిష్ తదితర చేపలకు కూడా నిద్రంటనే తెలీదట.ఆ కోవలోకే వస్తుంది ఈ బుల్ఫ్రాగ్.ఇవి పరిమాణంలోనూ చాలా పెద్దవి.జీవితకాలం కూడా ఎక్కువే.అలాగే వీటి బరువును కూడా మనం ఊహించలేం.ఆఫ్రికన్ బుల్ఫ్రాగ్ అయితే ఏకంగా 45 ఏళ్లు జీవించగలదట.మిగిలిన ప్రపంచ దేశాల్లోని ఈ జాతి కప్పలు 8నుంచి10ఏళ్లు కొన్నయితే 16ఏళ్ల వరకు బతుకుతాయి.వీటి బరువు కూడా రెండు కేజీల పైమాటే.ఈ కప్పల్లో తల భాగం చాలా పెద్దగా ఉంటుంది.ఇవి 4నుంచి6 అంగుళాల సైజులో ఉంటాయి.ఆడకప్పలయితే మగవాటికన్నా సైజులో ఇంకా పెద్దగా ఉంటాయి.ఇవి 8నుంచి10 అంగుళాల వరకు కూడా పెరుగుతాయి.ఎక్కువగా నీటి మడుగుల్లో నివసించే ఈ కప్పలు ఒడ్డున గుడ్లు పెడతాయి.అదీ వేసవి ఆరంభానికి కాస్త ముందు.వేడి వాతావరణాన్ని అంటే 25నుంచి28 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిని ఇష్టపడతాయి.వీటి కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది.వర్షాకాలంలో రాత్రి వేళల్లో ఒకచోటు నుంచి మరోచోటుకి సంచరిస్తాయి.అమెరికా,కెనడాల్లో ఇవి లేత ఆకుపచ్చ,లేత బూడిద రంగుల్లో కనిపిస్తాయి.ఆఫ్రికాలో అయితే ఇవి ఆలివ్గ్రీన్ రంగులో ఉంటాయి.మగవి లేత పసుపురంగు,నారింజ రంగుతో మరీ సొగసరిగా ఆకర్షిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
పాములూ ఆహారమే: ఎలుకలు,పిచ్చుకలు,పాము పిల్లలు,చేపలు వంటివి దొరికితే ఈ బుల్ఫ్రాగ్లు వదిలిపెట్టవు.ఇక మిడతలు,వానపాములు,తొండలు,కీచురాళ్లు,పేడపురుగులు,ఇతర కీటకాల్ని ఆబగా లాగించేస్తాయివి.అందుకే ఈ కప్పల్ని తినే మనుషుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.వీటి కాళ్లకు భలేగిరాకీ.ఆ రుచే వేరంటారు మాంసాహార ప్రియులు.ఎక్కువగా చైనా,జపాన్ల్లో కప్పల మాంసాహార ప్రియులు అత్యధికంగా ఉన్నారు.యూరప్,ఇతర పాశ్చాత్య దేశాల్లో ఏటా నాలుగు టన్నుల మేర కప్పలను భోంచేసేస్తున్నారట.ఎగుమతి చేసే దేశాల్లో ఇండోనేసియాది ప్రథమ స్థానం.అమెరికా,కెనడాల్లో ఊపిరిపోసుకున్న ఈ బుల్ఫ్రాగ్స్ జాతిని ఆ దేశాలు దక్షిణకొరియా,వెస్ట్రన్ యూరప్,బ్రెజిల్,కొలంబియా,ఆస్ట్రేలియాలకు పరిచయం చేసి వృద్ధి చేశాయి.కానీ వీటిని ప్రపంచవ్యాప్తంగా వివిధ పాఠశాలలు,కళాశాలల్లో ప్రయోగాలకు వినియోగిస్తుండడం,శాస్త్రవేత్తలూ ఇంకా వీటిపై అనేక పరిశోధనలు సాగిస్తుండడం, మరోపక్క వీటి మాంసం రుచికి పరితపించే జనం పెరిగిపోవడంతో ఈ బుల్ఫ్రాగ్ జాతి ఉనికికే ప్రమాదం ఏర్పడింది.మందుల తయారీకి ముఖ్యంగా యాంటీబయోటిక్స్ ఉత్పత్తికి వీటిని వినియోగిస్తుంటారు.
-------------------------------------------------------------------------------------------------------------
INDIA

*National animal:టైగర్
*National bird:నెమలి
*National reptile:త్రాచుపాము
*National icon:కోతి
*National marine animal:డాల్ఫిన్స్
*National heritage animal:ఏనుగు
---------------------------------------------------------------------------
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
An amazing flying display by Boeing during the Paris Air Show 2015. It was a great performance, i.e vertical Take Off. This Boeing 787 i...
-
A ceasefire has come into force in the Gaza Strip after Egypt brokered an agreement between Israel and Hamas to halt 11 days of conflict. Th...
-
https://www.dgoodz.com/user/582/vomms/newest/ https://payhip.com/Wisdomrays/ Cricket Australia's Twitter account had a cheeky ...